ఇరాన్‌పై దాడులు ఆపాలని డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై దాడులు ఆపాలని డిమాండ్‌

Mar 4 2026 7:35 AM | Updated on Mar 4 2026 7:35 AM

అనకాపల్లి టౌన్‌: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సంయుక్త దాడులను తక్షణమే ఆపేయాలని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం జిల్లా సమితి (ఇస్కప్‌) డిమాండ్‌ చేసింది. స్థానిక శ్రామిక సదనంలో జరిగిన సమావేశంలో ప్రపంచ శాంతిని కోరుతూ యుద్ధంలో కన్నుమూసిన మానవాళికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇస్కప్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు ఎ. మాధవరావు మాట్లాడుతూ అమెరికా అనుసరించే సామ్రాజవాద, దురాక్రమణ చర్యల్లో భాగంగానే ప్రపంచంలో శాంతి లేకుండా పోతుందన్నారు. కేవలం ఆయిల్‌ నిక్షేపాల కోసమే కుంటిసాకులతో ఈ దాడులకు తెగబడ్డాయన్నారు. ఒక దేశంపై మరొక దేశం దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. కార్యక్రమంలో ఇస్కప్‌ జిల్లా నేతలు విల్లూరి పైడారావు, దాడి శివరాం, మళ్ల చక్రవర్తి, బొడ్డేడ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement