కొనసాగుతున్న చలి తీవ్రత | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న చలి తీవ్రత

Jan 9 2026 7:43 AM | Updated on Jan 9 2026 7:43 AM

కొనసాగుతున్న చలి తీవ్రత

కొనసాగుతున్న చలి తీవ్రత

చింతపల్లి: జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం పాడేరులో 4.1, పెదబయలులో 4.8 డిగ్రీలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.చింతపల్లిలో 5.0 డిగ్రీలు, హుకుంపేటలో 6.2 డిగ్రీలు, కొయ్యూరులో 9.7 డిగ్రీలు, అనంతగిరి 12.9 డిగ్రీలు నమోదైనట్టు తెలిపారు.

● పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్‌ పరిధి వై.రామవరంలో 8.0 డిగ్రీలు, మారేడుమిల్లిలో 9.7 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 11.4 డిగ్రీలు, అడ్డతీగలలో 12.8 డిగ్రీలు, గంగవరంలో 13.7 డిగ్రీలు, రంపచోడవరంలో 14.1 డిగ్రీలు, చింతూరు డివిజన్‌ చింతూరులో 12.6 డిగ్రీలు, ఎటపాకలో 13.3 డిగ్రీలు నమోదయ్యాయని ఏడీఆర్‌ పేర్కొన్నారు.

డుంబ్రిగుడ: మండలంలోని చలి తీవ్రత పెరుగుతోంది. గురువారం స్థానికులు వణికిపోయారు. చలిమంటలను ఆశ్రయించి ఉపశమనం పొందారు.

పాడేరులో 4.1 డిగ్రీల

కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement