అరకులో పడిపోయిన ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు రోజులుగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో చలితీవ్రత అధికమై మన్యవాసులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం అరకువ్యాలీలో 4.3 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి చింతపల్లిలో 4.5 డిగ్రీలు, జి.మాడుగులలో 4.7 డిగ్రీలు, పాడేరులో 5.0 డిగ్రీలు, పెదబయలులో 5.2 డిగ్రీలు, హుకుంపేటలో 5.7 డిగ్రీలు, కొయ్యూరులో 9.1 డిగ్రీలు, అనంతగిరిలో 12.9 డిగ్రీలు నమోదైనట్లు తెలిపారు.
పోలవరం జిల్లాలో...
రంపచోడవరం డివిజన్ పరిధి వై.రామవరంలో 8.1 డిగ్రీలు, మారేడుమిల్లిలో 8.6 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 10.6 డిగ్రీలు, అడ్డతీగలలో 11.5 డిగ్రీలు, రంపచోడవరంలో 12.1 డిగ్రీలు, గంగవరంలో 13.6 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 11.7 డిగ్రీలు, ఎటపాకలో 12.0 డిగ్రీలు నమోదైనట్లు ఏడీఆర్ తెలిపారు.
● గడిచిన మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా శీతల గాలులు విజృంభిస్తున్నాయి, చలితీవ్రతతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నుంచి చలికి భయపడి ఇళ్లకే పరమితమవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటేవరకు మంచు తెరలు వీడటం లేదు.
పెదబయలు: మండలంలో నాలుగు రోజుల నుంచి చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలులు వీస్తున్నాయి. మంచుతెరలు రహదారులను కమ్మేయడంతో హెడ్లైట్ల వెలుగులో వాహనచోదకులు రాకపోకలు సాగిస్తున్నారు.
అరకులో పడిపోయిన ఉష్ణోగ్రతలు


