ఆపరేషన్‌ సిందూర్‌ భారతీయుల మనోభావాలకు ప్రతీక | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సిందూర్‌ భారతీయుల మనోభావాలకు ప్రతీక

May 17 2025 6:04 AM | Updated on May 17 2025 6:04 AM

ఆపరేషన్‌ సిందూర్‌ భారతీయుల మనోభావాలకు ప్రతీక

ఆపరేషన్‌ సిందూర్‌ భారతీయుల మనోభావాలకు ప్రతీక

రంపచోడవరం: పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతి చర్యగా ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ సత్తా చాటిన నేపథ్యంలో శుక్రవారం రంపచోడవరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ చోళ్ల బొజ్జిరెడ్డి మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు ప్రతీక అన్నారు.

ఇదీ సైన్యం సాధించిన ఘన విజయమన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగి గోవిందరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈక బుల్లికొండలదొర, కారం సీతారామన్నదొర, గుడ్ల అంక శ్రీనివాసరెడ్డి, కేఎల్‌ ఎన్‌ గురుప్రసాద్‌, కుంజం వెంకటేశ్వర్లుదొర, కంగల శ్రీనివాసరావు, గౌస్‌ మొహిద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డి

రంపచోడవరంలో ఘనంగా తిరంగా ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement