ఆహ్వానించి అవమానపరిచారు | - | Sakshi
Sakshi News home page

ఆహ్వానించి అవమానపరిచారు

Apr 25 2025 8:04 AM | Updated on Apr 25 2025 8:04 AM

ఆహ్వానించి అవమానపరిచారు

ఆహ్వానించి అవమానపరిచారు

రాజవొమ్మంగి: జల్‌జీవన్‌ మిషన్‌ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించి అవమానపరచారని, మండలంలోని వాతంగి పంచాయతీ సర్పంచ్‌ భీంరెడ్డి శుభలక్ష్మి వాపోయారు. వాతంగి పంచాయతీ పెదగర్రంగిలో రూ.14 లక్షలతో చేపట్టనున్న జేజేఎం పథకం పనులను ఎమ్మెల్యే శిరిషాదేవి శంకుస్థాపన చేశారు. కాగా ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 4 గంటలకు హాజరుకావాలని సర్పంచ్‌, వైస్‌ ఎంపీపీలను అధికారులు ఆహ్వానించారు. ఆ గ్రామానికి మేము 3.30 నిమిషాలకే వెళ్లామని, అయితే అప్పటికే అధికారులు, ఎమ్మెల్యే కార్యక్రమాలు ముగించుకొని వెళ్లిపోయారని సర్పంచ్‌ శుభలక్ష్మి, వైస్‌ ఎంపీపీ రాజేశ్వరి విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఆహ్వానించి, తమను కించపరిచారన్నారు. దీనిపై కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement