
షర్మిలకు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సత్కారం
సాక్షి,పాడేరు: పాడేరులోని అక్షర ప్రైవేట్ స్కూల్కు చెందిన జనపరెడ్డి షర్మిల 580 మార్కులతో జిల్లాలో నాల్గవ స్థానంలో నిలవడంతో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అభినందించారు.తన క్యాంపు కార్యాలయంలో షర్మిలకు దుశ్శాలువా కప్పి సత్కరించారు.అక్షర పాఠశాల యాజమాన్యంతో పాటు విద్యార్థిని తండ్రి జనపరెడ్డి శ్రీనులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో డి.గొందూరు సర్పంచ్ సీదరి రాంబాబు,వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్,ఎస్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణలు పాల్గొన్నారు.