కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
● అరకువ్యాలీలో 6.4 డిగ్రీల నమోదు
● చింతపల్లి ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్
ఆళ్ల అప్పలస్వామి వెల్లడి
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రత కొనసాగుతోంది.శనివారం అరకువ్యాలీలో 6.4 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి హుకుంపేటలో 7.2 డిగ్రీలు, పాడేరులో 7.7 డిగ్రీలు, పెదబయలులో 7.9 డిగ్రీలు, జి.మాడుగులలో 9.6 డిగ్రీలు, కొయ్యూరులో 12.5 డిగ్రీలు, అనంతగిరిలో14.3 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
● పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 10.2 డిగ్రీలు, మారేడుమిల్లిలో 9.7డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.4 డిగ్రీలు, అడ్డతీగలలో 14.9 డిగ్రీలు, రంపచోడవరంలో 15.3 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 14.3 డిగ్రీలు, ఎటపాకలో 14.9 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. మంచుతెరలు ఉదయం 9 గంటల వరకు వీడటం లేదు. శీతల గాలులు కొనసాగుతున్నాయి.


