త్వరితగతిన అర్జీల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన అర్జీల పరిష్కారం

Apr 24 2025 8:22 AM | Updated on Apr 24 2025 8:22 AM

త్వరి

త్వరితగతిన అర్జీల పరిష్కారం

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

చింతూరు: మారుమూల గ్రామాలకు సంబంధించిన ప్రజలు అందించిన వ్యక్తిగత దరఖాస్తులను ఆయాశాఖల అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ వివిధ శాఖలకు సంబంధించి 146 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యలకు 67 దరఖాస్తులు వచ్చినట్టు ఆయన తెలిపారు. వీటిని ఆయా శాఖల అధికారులు పరిశీలించి అర్హతలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు

పోలవరం ముంపు, వలస ఆదివాసీ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీలు బుధవారం చింతూరు ఐటీడీఏ ఎదుట ఆందోళనలు చేపట్టారు. వీఆర్‌ పురం మండలం అన్నవరం గ్రామాన్ని 41.15 కాంటూరులో చేర్చి పోలవరం పరిహారం అందచేయాలని నినాదాలు చేస్తూ గ్రామస్తులు ఐటీడీఏ ఎదుట బైఠాయించారు. అనంతరం వారు కలెక్టర్‌ను కలసి ఏటా వరదలతో ఇబ్బందులు పడుతున్నామని తమ గ్రామాన్ని ముంపులో చేర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. చింతూరు డివిజన్‌లోని వలన ఆదివాసీ గ్రామాల్లో విద్యుత్‌, రహదారి, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో వలస ఆదివాసీలు ఆందోళన నిర్వహించారు. గత 30 ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, నేటికీ తమ గ్రామాలకు రహదారి, విద్యుత్‌, తాగునీటి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.

విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి

గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో రాత్రిపూట చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం. విషసర్పాలు గ్రామంలోకి వస్తుండడంతో భయంతో గడపాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మా గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి.

– కొవ్వాసి కోసమ్మ, బలిమెల గ్రామం,

చింతూరు మండలం

రహదారి సౌకర్యం లేకఇబ్బందులు

గత 30 ఏళ్లుగా ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడతున్నాం. వర్షాకాలు అత్యవసర సమయాల్లో సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులున్నాయి. – పొడియం జోగారావు,

సోడేరుపాడు, వీఆర్‌పురం మండలం

త్వరితగతిన అర్జీల పరిష్కారం1
1/3

త్వరితగతిన అర్జీల పరిష్కారం

త్వరితగతిన అర్జీల పరిష్కారం2
2/3

త్వరితగతిన అర్జీల పరిష్కారం

త్వరితగతిన అర్జీల పరిష్కారం3
3/3

త్వరితగతిన అర్జీల పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement