అ | - | Sakshi
Sakshi News home page

Apr 24 2025 8:21 AM | Updated on Apr 24 2025 8:21 AM

అ

ట్టడుగున
ల్లూరి
2025 48 %

టెన్త్‌ విద్యార్థులు

టెన్త్‌లో దారుణంగా ఫలితాలు

గత ఏడాది 90.95 శాతంతో

9వ స్థానం

ఈ ఏడాది 48 శాతంతో

రాష్ట్రంలోనే చివరిస్థానం

సగానికి తగ్గిన ఉత్తీర్ణత

11,472 మందికి 5,465 మంది మాత్రమే పాస్‌

6007 మంది ఫెయిల్‌

ఉత్తీర్ణులైన వారిలో బాలికలే అధికం

దిగజారిన ఫలితాలతో

తల్లిదండ్రుల ఆవేదన

సాక్షి,పాడేరు: జిల్లాలో టెన్త్‌ ఫలితాలు దారుణంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశ కలిగించింది. గత ఏడాది కంటే ఫలితాలు సగానికి తగ్గాయి. 48 శాతంతో రాష్ట్రంలో చిట్టచివరి 26 స్థానంలో జిల్లా నిలిచింది. దీంతో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఉసూరుమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 258 అన్ని యాజమాన్య పాఠశాలల పరిధిలో 11,472 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయగా, కేవలం 5,465 మంది మాత్రమే పాసై 48 శాతం ఉత్తీర్ణత సాధించారు. 6007మంది విదార్థులు ఫెయిలయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలికలే అధికంగా ఉన్నారు. 5,292 మంది బాలురకు 2,330 మంది పాస్‌ అయ్యారు. 6,180 మంది బాలికలకు 3,135 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 10,823 మంది పరీక్షలు రాయగా, 9,843 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.95 శాతం ఫలితాలతో రాష్ట్రంలో 9వ స్థానంలో జిల్లా నిలిచింది. ఈ ఏడాది టెన్త్‌ ఫలితాల్లో ఆఖరు స్థానంలో ఉండడం ఆందోళన కలిగించింది. పలు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు,ఆశ్రమ పాఠశాలలు, గుత్తులపుట్టులోని సూపర్‌ ఫిప్టీ,ఇతర ప్రైవేట్‌ పాఠశాలల్లో టెన్త్‌ ఫలితాలు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి.

జిల్లా టాపర్‌ ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థిని

590 మార్కులతో కూనవరం మండలం టేకులబోరు మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన అరవ మాధవి మొదటి స్థానంలో నిలవగా, నెల్లిపాక జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కాదులూరి లాస్యంత్‌ 582 మార్కులతో 2వస్థానం, పాడేరులోని అక్షర పాఠశాలకు చెందిన శెట్టి నవదీపిక 580మార్కులతో 3వస్థానం, ఇదే పాఠశాలకు చెందిన జనపరెడ్డి షర్మిల 580 మార్కులతో 4వస్థానం, చింతపల్లి సెయింట్‌ ఆన్స్‌ ఇంగ్లిషు మీడియం ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన బి.జానకీరామరాజు 578 మార్కులతో 5వస్థానం, గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాల సూపర్‌ ఫిప్టీ విద్యార్థిని కొట్నా గంగాభవాని 577మార్కులతో 6వస్థానం, అడ్డతీగల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన యట్ల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 576మార్కులతో 7వస్థానం, పాడేరులోని మోదమాంబ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన రాంశెట్టి మధుబాబు 576మార్కులతో 8వస్థానం, ఇదే పాఠశాలకు చెందిన కిముడు లక్ష్మీప్రసన్న 574 మార్కులతో 9వస్థానం, రంపచోడవరం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన చింతకాయల దుర్గాభవానీ 571 మార్కులతో 10వ స్థానంలో నిలిచారు. టాప్‌ టెన్‌లో నిలిచిన విద్యార్థులతో పాటు టెన్త్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరినీ కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌, డీఈవో పి.బ్రహ్మాజీరావు,ఇతర అధికారులు అభినందించారు.

2024 90.95 %

ఐదు పాఠశాలల్లోసున్నా ఫలితాలు..

సాక్షి,పాడేరు: జిల్లాలో ఐదు పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ పాస్‌ కాలేదు. జీకే వీధి మండలంలోని దారకొండ, జర్రెల, అప్పర్‌ సీలేరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, డుంబ్రిగుడ కేజీబీవీ, మాచ్‌ఖండ్‌ ప్రాజెక్ట్స్‌ సంగడ హైస్కూల్‌లో ఒక్కరు కూడా పాస్‌ కాకపోవడంతో సున్న ఫలితాలు వచ్చాయి.

2023

61.41 %

అత్యల్ప

ఫలితాలు..

జిల్లాలో పలు పాఠశాలలు అత్యల్ప ఫలితాలతో చతికిలపడ్డాయి. నాలుగు పాఠశాల్లో ఒక్కొక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. జి.మాడుగుల మండలం బందవీధి ఆశ్రమ పాఠశాలలో 66 మందికి 65 మందీ ఫెయిల్‌ అయ్యారు జీకే వీధి మండలంలోని పెదవలస ఆశ్రమ పాఠశాలలో 31 మందికి 30 మంది, గూడెం ఆశ్రమ పాఠశాలలో 35 మందికి 34, అరకులోయ మండలం బస్కిలో 25 మందికి 24, జి.మాడుగుల మండలం నుర్మతిలో 38 మందికి 36, జి.మాడుగుల కేజీబీవీలో 37 మందికి 35, అనంతగిరి మండలంలోని బొర్రా ఆశ్రమ పాఠశాలలో 43 మందికి 40,శివలింగపురంలో 42 మందికి 39, హుకుంపేట మండలంలోని జి.బొడ్డాపుట్టులో 29 మందికి 27, చింతపల్లి మండలంలోని లంబసింగి ఆశ్రమ పాఠశాలలో 42 మందికి 39 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.

అ1
1/4

అ2
2/4

అ3
3/4

అ4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement