
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
రాజవొమ్మంగి: స్థానిక గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కేంద్రంగా ఆదివారం జరిగిన గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతగా సాగింది. వివిధ మండలాల నుంచి 237 మంది హాజరై పరీక్ష రాసినట్లు ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. గురుకులంలో 6వ తరగతిలో ప్రవేశానికి, మరి కొన్ని బ్యాగ్లాగ్ సీట్ల భర్తీ కోసం 309 మంది దరఖాస్తు చేసుకోగా 72 మంది గైర్హాజరయ్యారన్నారు.
ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష
రంపచోడవరం: రంపచోడవరంలో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షలు ముగిసినట్లు డీడీ రుక్మాంగాధయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీడీ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆరో సెంటర్ల్లో పరీక్షలు నిర్వహించగా 1500 మంది విద్యార్థులకు 1193 మంది హాజరైనట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 307 మంది గైర్హాజరైనట్టు చెప్పారు.
అడ్డతీగల: గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్షకు 87 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు అడ్డతీగల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీపాద రామకృష్ణ తెలిపారు. ఐదో తరగతిలో రెగ్యులర్ అడ్మిషన్లతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ నిమిత్తం ఆదివారం ప్రవేశ పరీక్షకు 355 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉందన్నారు. కానీ 268 మంది విద్యార్థులు పరీక్ష రాశారన్నారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకు అల్పాహారం, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు.

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష