
విద్యార్థి దశ నుంచేఉన్నత లక్ష్యాలు
చింతపల్లి: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ అన్నారు. చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 17 వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. కశాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.విజయభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సబ్కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థి దశలోనే మంచి లక్ష్యాలను, అలవాట్లను నిర్దేశించుకోవాలన్నారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసపాత్రుడు, అధ్యాపకులు లీలాపావని, కెజియారాణి, సంతోషిణి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.