శ్రావణమాసంలో శుక్లపక్షాన వచ్చే రెండో శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో పవిత్రంగా ఆచరిస్తారు. ఈ వ్రతం నోచుకోవడం ద్వారా సకల సౌభాగ్యాలు, అష్టై శ్వర్యాలు సిద్ధిస్తాయి.
– శ్రీకాంత్ రామానుజ దాస్,
అర్చకుడు, కుంటాల
సౌభాగ్యాలకు ప్రతీక
సిరి సంపదలు, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలిచే వరలక్ష్మీ వ్రతాన్ని కొన్నేళ్ల నుంచి చేస్తున్నా. మహాలక్ష్మీ అమ్మవారిని కొలిస్తే అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలుగుతాయి. ఈ మాసం ఎంతో ప్రవిత్రమైనది. మాసమంతా మహిళలు దేవుని లీలాగానంలో ఉండి దేవుని అనుగ్రహం పొందాలి.
– సున్వబాయి, కెరమెరి


