తాంసి: మా తాతలు, తండ్రులు స్వాతంత్య్రం కోసం ఎంతో పోరాడారు. మేము మాత్రం పొట్ట కూటి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. మా కుటుంబానికి పెద్ద ఉద్యమ చరిత్ర ఉంది. ఉద్యమ సమయంలో నిర్మల్లోని కుభీర్లో గణష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మా నాన్న స్వామి రామానందతీర్థ్ వారితో ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశం కోసం ఉద్యమాన్ని చేస్తున్నామని మా నాన్న గంగారం సింగ్ తెలిపేవారు. నిజాంకు వ్యతిరేకంగా సైతం పోరాడి నాందేడ్ జైలులో మూడు నెలలపాటు ఉన్నారు. సమరయోధుల కుటుంబాలకు సాగుభూమితో ఇళ్లను ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతియేటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం రోజున సన్మానించి గౌరవిస్తే బాగుంటుంది.
ఠాకూర్ రాంసింగ్, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సంక్షేమ సంఘం
జిల్లా అధ్యక్షుడు


