తలమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 21 సీసీ కెమెరాలను ఎస్పీ అఖి ల్ మహాజన్ గురువారం ప్రారంభించారు. గ్రా మంలోని ఆదర్శ యువ రైతులను శాలువాలతో సన్మానించి బహుమతులు ప్రదానం చేశా రు. ఉగాదిని పురస్కరించుకుని స్థానిక రామాలయంలో పూజలు చేశారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పండు గ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో ఆది లాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై రాధిక, అగ్రికల్చర్ ఏడీ నర్సయ్య, సర్పంచ్ ఎల్మా నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ అగ్గిమల్ల గంగన్న, నాయకులు చితలపెల్లి దేవరెడ్డి, గణేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


