పార్వతి తనయా | - | Sakshi
Sakshi News home page

పార్వతి తనయా

Aug 21 2025 7:06 AM | Updated on Aug 21 2025 7:06 AM

పార్వతి తనయా

పార్వతి తనయా

● మట్టి వినాయకులకు పెరుగుతున్న ప్రాధాన్యత ● విభిన్న ఆకృతుల్లో దర్శనమిస్తున్న లంబోదరుడు ● ఉపాధి పొందుతున్న పలువురు కళాకారులు

పర్యావరణహితాయ..

ఆదిలాబాద్‌: వినాయక నవరాత్రి ఉత్సవాలకు గణనాథుని ప్రతిమలు సిద్ధమవుతున్నాయి. జిల్లా కేంద్రం వ్యాప్తంగా మట్టి ప్రతిమలు రూపుదిద్దుకుంటున్నాయి. ఎంతోమంది కళాకారులకు ఉపాధి అందిస్తున్నాయి. వైవిధ్యమైన రూపాల్లో పార్వతి తనయున్ని పర్యావరణహితంగా ప్రతిష్టించేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మట్టి వినాయక ప్రతిమలను నిలబెట్టేందుకు యువత, ఉత్సవ సమితి సభ్యులు ప్రాధాన్యతనిస్తుండడం విశేషం. పీఓపీ విగ్రహాలు తక్కువ సమయంలో పూర్తవుతాయి. మట్టి ప్రతిమల తయారీకి 10 నుంచి 20 రోజులు పడుతుంది. అయినప్పటికీ నిర్వాహకులు వైవిధ్యమైన రూపాల్లో మట్టి వినాయకున్ని కొలువుదీర్చేందుకు ఆర్డర్లు ఇస్తుండడం గమనార్హం. దీంతో కళాకారులకు చేతినిండా పని దొరుకుతోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణ సైతం సాధ్యమవుతుండడంతో పర్యావరణ ప్రేమికుల నుంచి సైతం హర్షం వ్యక్తం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement