● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయమైన లోతట్టుప్రాంతాలు ● నీటమునిగిన పంటలు, కాలనీలు ● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ● స్తంభించిన జనజీవనం | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయమైన లోతట్టుప్రాంతాలు ● నీటమునిగిన పంటలు, కాలనీలు ● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ● స్తంభించిన జనజీవనం

Aug 17 2025 6:46 AM | Updated on Aug 17 2025 6:46 AM

● జిల

● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయ

● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయమైన లోతట్టుప్రాంతాలు ● నీటమునిగిన పంటలు, కాలనీలు ● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ● స్తంభించిన జనజీవనం ● ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌లో రోడ్డు కోత కు గురైంది. ప్రమాదం జరుగకుండా అధికారులు అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు. ● ఇచ్చోడ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ వెంటనే అక్కడికి చేరుకుని విద్యార్థులను మూడో అంతస్తులోకి పంపించారు. ● కడెం వాగు ఉధృతికి బజార్‌హత్నూర్‌ మండలలోని మాడగుడ సమీపంలోని పంట పొలాలు నీ ట మునిగాయి. అనుకుంట, చాంద గ్రామాల్లోని చేలల్లో వరద కారణంగా పత్తి పంట పూర్తిగా ధ్వంసమైంది. ● ఉట్నూర్‌–ఆదిలాబాద్‌ మార్గంలో ఉన్న వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. మండలంలోని నాగాపూ ర్‌ సమీపంలోని బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించడంతో సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

వాగులో కొట్టుకుపోతున్న వాహనం

కైలాస్‌నగర్‌: జిల్లాలో వర్షం దంచికొట్టింది. శనివా రం వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు కుండపోతగా కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లా యి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల కాలనీలు నీట మునగగా.. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరడంతో జలకళ సంతరించుకున్నా యి. లోలెవల్‌ వంతెనలపై వరద ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలి చిపోయా యి. పలుచోట్ల పంట చేలు ముంపునకు గురయ్యా యి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించింది.

పలు కాలనీలు జలమయం

జిల్లాకేంద్రంలోని సుభాష్‌నగర్‌, దుర్గానగర్‌, గ్రీన్‌సిటీ, కృష్ణానగర్‌లోని లోలెవల్‌ వంతెనలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జీఎస్‌ ఎస్టేట్‌లోకి వర్షపునీరు చేరి చిన్నపాటి చెరువును తలపించింది. భాగ్యనగర్‌, మహాలక్ష్మివాడ కాలనీల్లోకి వర్షపునీరు చెరడంతో సామగ్రి అంతా తడిసిపోయింది. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుర్గానగర్‌ వాగు ఉ ప్పొంగి ప్రవహించడంతో కోజాకాలనీలో ఓ కారు వరదలో కొట్టుకుపోయింది. తాంసి మండలంలో ని హస్నాపూర్‌, బోథ్‌ మండలంలోని సాయినగర్‌ కాలనీ, బేలలోని పాతబస్తీ, ఇందిరానగర్‌కాలనీలను వరద ముంచెత్తింది.

● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయ1
1/4

● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయ

● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయ2
2/4

● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయ

● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయ3
3/4

● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయ

● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయ4
4/4

● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement