ఆదివాసీలపై దమనకాండను ఆపాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీలపై దమనకాండను ఆపాలి

Apr 28 2025 12:14 AM | Updated on Apr 28 2025 12:14 AM

ఆదివాసీలపై దమనకాండను ఆపాలి

ఆదివాసీలపై దమనకాండను ఆపాలి

ఆదిలాబాద్‌రూరల్‌: అమాయక ఆదివాసీలపై ప్రభుత్వాలు చేపడుతున్న దమనకాండను వెంటనే నిలిపివేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం నుంచి కుమురంభీంచౌక్‌ వరకు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీ అమాయకులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి శాంతి చర్చలు జరిపించాలన్నారు. ఇందులో వివిధ సంఘాల నాయకులు గోడం గణేశ్‌, సాజిద్‌ఖాన్‌, మల్లేశ్‌, శంకర్‌, సచిన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement