
పిల్లల కథల పుస్తకం ఆవిష్కరణ
కై లాస్నగర్: పిల్లలతో కథలు రాయించడంతో పాటు స్వయంగా కథల పుస్తకం రాయడం అ భినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోరెడ్డి అశోక్ రాసిన ‘స్ఫూర్తి పిల్లల కథలు’ అనే పుస్తకాన్ని శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులోని కథలు పిల్ల ల్లో నైతిక పరివర్తనకు, వ్యక్తిగత మార్పునకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో డీఈవో ఏ.శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, సంక్షేమ అధికారి మిల్కా, సెక్టోరియల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.