
ప్రతీ కూలీకి ఉపాధి కల్పించాలి
తలమడుగు: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్కార్డు కలిగిన ప్రతీ కూలీకి ఉపాధి పనులు కల్పించాలని డీఆర్డీఏ ఏపీడీ రవీందర్ రాథోడ్ అన్నారు. మండలంలోని కప్పరిదేవి, ఝరి, డోర్లీ, గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. వేసవి నేపథ్యంలో పని ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బంది లేకుండా నీడ, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలన్నారు. అనంతరం ఝరి గ్రామ సమీపంలో చేపడుతున్న చెక్ డ్యాం పనులను పరిశీలించారు. ఆయన వెంట ఈజీ ఎస్ ఏపీవో మేఘమాల, ఈసీ ప్రవీణ్రావ్, టెక్నికల్ అధికారి మల్లేశ్, ఉపాధి సిబ్బంది స్వామి తదితరులు ఉన్నారు.