
ఆరోగ్యవంత సమాజానికి కృషి●
● ఎంపీ గోడం నగేశ్ ● సూపర్ స్పెషాలిటీలో గ్యాస్ట్రోలజీ సేవలు ప్రారంభం
ఆదిలాబాద్టౌన్: ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గ్యాస్ట్రోలజీ సేవలను ఎమ్మెల్యే శంకర్తో కలిసి సోమవారం ప్రా రంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల ఆరోగ్యంపై ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో సూపర్స్పెషాలిటీ ఆస్ప త్రి నిర్మించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ట్రామా కేర్ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. అలా గే ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకోసం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, సత్యనారాయణ,ఆర్ఎంఓ చంపత్రావు పాల్గొన్నారు.