
● కలెక్టరేట్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
‘బీఏఎస్’ బిల్లులు చెల్లించండి●
కై లాస్నగర్: తమ పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ ఆ తల్లిదండ్రులంతా సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ప్రజావాణి సమావేశ మందిరం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్కు సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీల కోసం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకం ద్వారా తమ పిల్లలు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తి ఉచితంగా ప్రభుత్వమే ఆ పాఠశాల ద్వారా విద్యనందజేస్తోందన్నారు. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం ఆ పాఠశాలకు బిల్లులు విడుదల చేయడం లేదన్నారు. ఫలితంగా యాజమాన్యం డబ్బుల కోసం తమను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.