● కలెక్టరేట్‌ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

● కలెక్టరేట్‌ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

Apr 22 2025 12:14 AM | Updated on Apr 22 2025 12:14 AM

● కలెక్టరేట్‌ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

● కలెక్టరేట్‌ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

‘బీఏఎస్‌’ బిల్లులు చెల్లించండి

కై లాస్‌నగర్‌: తమ పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ ఆ తల్లిదండ్రులంతా సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ప్రజావాణి సమావేశ మందిరం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్‌కు సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీల కోసం అమలు చేస్తున్న బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ (బీఏఎస్‌) పథకం ద్వారా తమ పిల్లలు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నారన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తి ఉచితంగా ప్రభుత్వమే ఆ పాఠశాల ద్వారా విద్యనందజేస్తోందన్నారు. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం ఆ పాఠశాలకు బిల్లులు విడుదల చేయడం లేదన్నారు. ఫలితంగా యాజమాన్యం డబ్బుల కోసం తమను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement