‘ఓపెన్‌’ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌’ పరీక్షలు ప్రారంభం

Apr 21 2025 7:52 AM | Updated on Apr 21 2025 7:52 AM

‘ఓపెన్‌’ పరీక్షలు ప్రారంభం

‘ఓపెన్‌’ పరీక్షలు ప్రారంభం

ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉట్నూర్‌లో టెన్త్‌, ఇంటర్‌ కేంద్రాలు ఒక్కోటి చొప్పున, అలాగే జిల్లా కేంద్రంలో టెన్త్‌ రెండు, ఇంటర్‌ ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. ఉదయం నిర్వహించిన పదో తరగతి పరీక్షకు 355 మందికి గాను 328 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఇంటర్‌ పరీక్షలకు 380 మందికి గాను 52 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పదో తరగతి పరీక్షకు 13 మందికి గాను నలుగురు హాజరు కాగా, తొమ్మిది మంది గైర్హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షలకు ఇద్దరికి గాను ఇద్దరు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషన్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ అశోక్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement