
డీఎస్పీ జిల్లా కార్యవర్గం ఎన్నిక
ఆదిలాబాద్రూరల్: ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) జిల్లా కార్యవర్గాన్ని ఆ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అగ్గిమల్ల గణేశ్, ఉపాధ్యక్షులుగా సీటీ వెంకటేశ్, సుష్మా, ప్రధాన కార్యదర్శిగా చిట్యాల శ్రీనివాస్, కోశాధికారిగా మంజూషా, కార్యదర్శిగా గంగన్న, సోషల్ మీడియా ఇన్చార్జీగా ముదాం పవన్, కార్యవర్గ సభ్యులుగా గణేశ్, రాజేశ్వర్, నవీన్, శ్రీకాంత్, శేఖర్, అరవింద్, నరేశ్, గంగన్న, రాజన్న, సంతోష్, అనిల్, రవి, తిరుపతి, ప్రతాప్ ఎన్నికయ్యారు.
ఈవీఎంల గోదాం తనిఖీ
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల ఈవీఎంలను భద్రపర్చిన గోడౌన్ను కలెక్టర్ రాజర్షి షా శనివారం పరిశీలించారు. ప్రతీ నెల తనిఖీలో భాగంగా గోడౌన్ను సందర్శించి స్ట్రాంగ్రూం భద్రతను పర్యవేక్షించారు. అనంతరం అక్కడి రిజిస్టర్లో సంతకం చేశారు. ఆ యన వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పంచపూల తదితరులున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఆదిలాబాద్రూరల్: 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎంపికై న విద్యార్థులకు ఇంటర్, ఎప్సెట్ కార్పొరేట్ విద్య అందించేందుకు గాను జిల్లాలోని ఆయా ప్రైవేట్ జూనియర్ కళా శాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దళితాభివృద్ధిశాఖ అధికారి సునీత కుమా రి ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి గల ప్రి న్సిపాళ్లు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం సంబంధిత పత్రాలను కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. కళాశాల అనుమతి ధ్రు వీకరణ పత్రం, వసతులు, బిల్డింగ్ ప్లాన్, అగ్ని మాపక భద్రత, గడిచిన ఐదేళ్లలో సాధించిన ఉత్తీర్ణత శాతం, కోర్సుల వివరాల సమాచారం కూడా అందజేయాలని పేర్కొన్నారు.