
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
దండేపల్లి: మండలంలోని ముత్యంపేట సమీపంలో గురువారం రాత్రి బొలెరో –ఆటో ఢీకొన్న ఘటనలో కొర్విచెల్మ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొట్టె చంద్రయ్య(49) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై తహసీనొద్దీన్ కథనం ప్రకారం.. చంద్రయ్య తన ఆటోతో లక్సెట్టిపేట నుంచి ప్రయాణికుడిని ఎక్కించుకుని కొర్విచెల్మకు వస్తుండగా, మార్గమధ్యలో ముత్యంపేట సమీపంలో జన్నారంవైపు నుంచి లక్సెట్టిపేట వైపు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ చంద్రయ్యకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న రాజుకు కాలు విరిగింది. అజాగ్రత్తగా అతివేగంతో బొలెరోను నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని చంద్రయ్య తల్లి కొట్టె బుచ్చవ్వ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
బిల్డింగ్పై నుంచి పడి మహిళ మృతి
పెంచికల్పేట్: మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన సముద్రాల రుక్మిణీ (75) ప్రమాదవశాత్తు బిల్డింగ్పై నుంచి పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం బానేశ్ అనే యువకుడి సహాయంతో ఇంటిపైన ఉన్న పిల్లర్కు జెండా కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కాగజ్నగర్ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందింది. కాగా మృతురాలి కుటుంబసభ్యులు మాజీ జెడ్పీటీసీ సముద్రాల సరిత రాజన్నను పలువురు పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు.
మంచంపై నుంచి పడి వ్యక్తి..
లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధి అంగడిబజార్కు చెందిన నౌసర్ అలీ (42) అనే వ్యక్తి మంచంపై నుంచి కింద పడి మృతి చెందినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నౌసర్ అలీ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. శుక్రవారం ఉదయం లేచి చూసే సరికి మంచంపై నుంచి కింద పడి ఉన్నాడు. నుదిటిపై రక్తపు గాయాలు ఉండగా కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నుదిటికి బలమైన గాయం కావడంతోనే నౌసర్ అలీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన భార్య నూర్జన్ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి