
సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి
ఆదిలాబాద్టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతూ తెలంగాణ ఔట్సో ర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. శుక్రవారం భోరజ్ మండలంలోని పూసాయికి చేరుకున్న మంత్రిని కలిశారు. ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. వేతనాలు ఏజెన్సీ ద్వారా కాకుండా కార్పొరేషన్ ద్వారా అందించాలని విన్నవించారు. ఇందులో జేఏసీ నాయకులు బండ శ్రీను, స్వామి, రవి, సంతోష్, నరేష్, ఇమ్రాన్, గోపాల్, సారయ్య తదితరులున్నారు.
‘కంది’ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన మంత్రులు
కై లాస్నగర్: జిల్లాకు విచ్చేసిన మంత్రి పొంగులేటి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క శుక్రవారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీశ్రేణులతో కలిసి ఆయన వారికి స్వాగ తం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శా లువాతో సత్కరించారు. నియోజకవర్గంలో ని పార్టీ పరిస్థితులు, చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించారు.