
సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం
ఆదిలాబాద్టౌన్: కార్మికుల సమస్యల పరి ష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామ ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నా రు. సామాజిక న్యాయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కార్మికులను విడదీసే కుల, మత, రాజకీయాలకు వ్యతిరేకంగా కులవిక్ష సామాజిక అంతరాలను నిర్మూలించాలన్నారు. సమానత్వం సాధించాలనే ఉద్దేశంతో సీఐటీయూ ఆధ్వర్యంలో న్యాయసాధన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆశన్న, చిన్నన్న, అగ్గిమల్ల స్వామి, పోతన్న, రమేశ్, సాయికిరణ్, నరేష్ పాల్గొన్నారు.