నిర్వహణ మరిచిన సర్కారు
వేసవిలో ఎండుతున్న చెట్లు
వృథా అవుతున్న ప్రజాధనం
విరిగిన కొమ్మలు, ఎండిన చెట్లతో కనిపిస్తున్న ఈ చిత్రం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డైట్ కళాశాల ఆవరణలోగల పట్టణ ప్రకృతి వనానిది. పచ్చదనం ఆనవాళ్లే లేకుండా పోయి ఇది కళావిహీనంగా కనిపిస్తోంది. చెట్లు ఎండకుండా నీరందించాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో దీని నిర్వహణను మరిచారు.
ప్రజలకు అందని ఆహ్లాదం
ఆదిలాబాద్ పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో పట్టణ ప్రకృతి వనాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు ఉపాధిహామీ నిధులు మంజూరు చే సింది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 49 వా ర్డుల పరిధిలో అధికారులు 40 ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. మొక్కలను నాటడం నుంచి కంచె ఏర్పాటు వరకు ఒక్కోదానికి విస్తీర్ణానికి అనుగుణంగా రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకు వెచ్చించారు.
రికార్డుల ప్రకారం 40 ప్రకృతి వనాలకు నిధులు ఖర్చు చేసినప్పటికీ పదికి మించి ఏర్పాటు చేయలేదనే ఆరోపణలున్నాయి. మిగతా చోట్ల బోర్డులు ఏర్పాటు చేసి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు న్నాయి. పట్టణంలోని పలు వార్డుల్లో పట్టణ ప్రకృతి వనమనే బోర్డు కనిపించినా అక్కడ అలాంటి ఆనవాళ్లే కనిపించని పరిస్థితి ఉంది.
అగ్గి పడితే అంతా బుగ్గే..
ఒకటి, రెండు పట్టణ ప్రకృతి వనాలను మినహా యిస్తే పట్టణంలోని మెజార్టీ వార్డుల్లో నిర్వహణ లో పంతో ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ప్రకృతి వనాల ను ఏళ్ల తరబడి శుభ్రం చేయడం లేదు. అందులో అస్తవ్యస్తంగా అల్లుకుపోయిన చెట్ల కొమ్మలు, తీగలు తొలగించడం లేదు. ఎండలకు రాలిపోయిన ఆ కులు, కొమ్మలను తీసివేయకపోడంతో అవి కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి.
మండుతున్న ఎండలకు చిన్నపాటి నిప్పురవ్వ పడినా పెద్దపెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అదే జరిగి తే ప్రకృతి వనాలన్నీ బుగ్గిపాలై ప్రజాధనం వృథా అవుతుందనే అభిప్రాయం సమీప కాలనీవాసుల నుంచి వ్యక్తమవుతోంది. మున్సిపల్ అధికారులు ఇప్పటికై నా నిర్లక్ష్యాన్ని వీడి ప్రకృతివనాల్లోని చెట్లకు నీరందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఆదిలాబాద్ పట్టణ వివరాలు
పట్టణంలోని వార్డులు : 49
కుటుంబాల సంఖ్య : 48,393
పట్టణ జనాభా : 2.10 లక్షలు
ప్రకృతివనాల సంఖ్య : 40
బోర్డులకే పరిమితమైనవి : 28
ఒక్కోదానికి వెచ్చించిన నిధులు :
రూ.3లక్షల నుంచి రూ.10లక్షలు
నిర్వహణ బాధ్యత ఎస్హెచ్జీలకే..
పట్టణ ప్రకృతి వనాలను సంరక్షించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాం. వాటి నిర్వహణ బాధ్యతలు పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. మున్సిపల్ ప్రత్యేకాఽధికారి అనుమతి తీసుకున్న అనంతరం సంఘాలకు ప్రకృతి వనాలను కేటాయిస్తాం. ఇందుకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులూ విడుదలయ్యే అవకాశముంది. ఆ దిశగా ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించి పట్టణ ప్రకృతి వనాలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం.
– పేరిరాజు, మున్సిపల్ ఇంజినీర్, ఆదిలాబాద్