-
ఐదు నెలల క్రితమే పెళ్లి.. ఇంతలోనే నవ్యశ్రీ..
శివమొగ్గ: వివాహమైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. శివమొగ్గ నగరం అశ్వత నగరలోని 5 క్రాస్లో ఈ ఘటన జరిగింది. మృతురాలిని నవ్యశ్రీ (23)గా గుర్తించారు. నవ్యశ్రీకి ఐదు నెలల క్రితమే ఆకాశ్ అనే యువకుడితో పెళ్లయింది. శనివారం సాయంత్రం ఇంటి వద్ద తులసి పూజ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. అయితే, ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో కారు షెడ్లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సమస్యల కారణంగానే నవ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని నవ్యశ్రీ కుటుంబీకులు అనుమానిస్తున్నారు. దీంతో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వినోబా నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
డెంటిస్ట్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి
సాక్షి, బెంగళూరు: బనశంకరిలో చిన్నారి కూతురితో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దంత వైద్యురాలు శైమా ఉదంతం వెనుక కుటుంబ కలహాలు ఉన్నట్లు తేలింది. ఆమెను పుట్టింటివారు రానివ్వకపోవడమే కారణమని బయట పడింది. కొడగు జిల్లా విరాజపేటకు చెందిన శైమా బీడీఎస్ చదువుతూ, సహచరుడు నారాయణ్ను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఆమె పుట్టింటికి వెళ్లలేదు. దీంతో కొన్నాళ్లకు శైమా తల్లి దిగులుచెంది విరాజపేటలో ఆత్మహత్య చేసుకుంది. ఈ పరిణామాలతో పుట్టింటివారు శైమాను తమ ఇళ్లకు రానివ్వలేదు. ఆమె నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లినప్పటికీ ఎవరూ సరిగా మాట్లాడలేదు. ఈ పరిణామాలతో విరక్తి చెంది కూతురికి ఉరివేసి, తానూ ప్రాణాలు తీసుకుందని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (కాలేజ్ డేస్లో లవ్ ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే ఇలా ఎందుకు?) -
కాలేజ్ డేస్లో లవ్.. ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే ఇలా..?
బనశంకరి: బెంగళూరులో సుష్మా అనే దంతవైద్యురాలు తన కూతురికి మానసిక వైకల్యమని పాపను నాలుగో అంతస్తు నుంచి విసిరివేసి, తాను దూకేందుకు యత్నించడం తెలిసిందే. ఈ ఘటనలో పాప మరణించింది. అంతలోనే మరో దంతవైద్యురాలు, ఆమె కూతురు విగతజీవులుగా కనిపించారు. బనశంకరి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. బనశంకరి పోలీసులు చేరుకుని పరిశీలించారు. దంత వైద్యురాలు శైమా (39), కుమార్తె ఆరాధన (10) ఇంట్లో చనిపోయి ఉన్నారు. వివరాలు.. వీరు కావేరినగరలో నివాసం ఉంటున్నారు. ఆరాధన నాలుగో తరగతి చదువుతోంది. రెండురోజుల క్రితమే ప్రాణాలు పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. తల్లీకూతురు ఉరికి వేలాడుతున్నట్లు గుర్తించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెది కొడగు, ఆయనది కోలారు కొడగు విరాజపేటేకు చెందిన శైమా పదేళ్ల క్రితం దంతవైద్య కోర్సు చదివేటప్పుడు కోలారు ప్రాంతానికి చెందిన నారాయణ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇరుకుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. భర్త సైతం డాక్టరు కాగా ఇంటి సమీపంలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. వారి మరణాలకు కచ్చితమైన కారణం తెలియరాలేదు. మృతురాలి సోదరుడు ఆ్రస్టేలియాలో ఉండగా సోమవారం నగరానికి చేరుకుని బనశంకరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీరు మరణించి రెండురోజులైనా భర్త ఆ విషయాన్ని గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
Hyderabad: కూకట్పల్లిలో విషాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం కావడంలేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్లో విజయ లక్ష్మి(26) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. అయితే, తనకు పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా.. వివాహం మాత్రం కావడంలేదని జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందతూ విజయ లక్ష్మి గురువారం మృతి చెందింది. ఇది కూడా చదవండి: ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..? -
కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు! చక్కగా ముస్తాబై భర్తకోసం ఎదురు చూస్తుంటే..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకాలనీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.. పిల్లలతో కలసి ఇంట్లో అంతా సిద్ధం చేసుకుని, ముస్తాబై తన భర్త కోసం ఎదురుచూస్తోంది. తీరా తన భర్త పూటూగా మద్యం సేవించి.. కనీసం నిలబడలేని స్థితిలో ఇంటికి రావడాన్ని చూసి తీవ్ర మనస్తాపానికి గురైంది. క్షణికావేశంలో తనతో పాటు పిల్లలకు ఎలుకల మందు తినిపించి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితికి వెళ్లిన తల్లి, పిల్లలను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి కొంత మెరుగు పడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా, ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశ అడియాస.. కొత్తపేట పోతిన అప్పలస్వామి వీధికి చెందిన డెక్కటి దుర్గ(38)కు ఇరవై ఏళ్ల కిందట నరసింహ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. నరసింహ గోనె సంచులు కుట్టే పనులు చేస్తుండగా.. దుర్గ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. పెద్ద కుమార్తె శకుంతల లయోలా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇక చిన్న కుమార్తె గజలక్ష్మి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో 31వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో నరసింహ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. కుటుంబం మొత్తం కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుండగా, నరసింహ మద్యం సేవించి ఇంటికి రావడంతో మనస్తాపానికి గురయ్యారు. భార్య, భర్తల్దిదరికి చిన్న పాటి వివాదం జరిగింది. అనంతరం నరసింహ నిద్రకు ఉపక్రమించాడు. పక్కింటి వ్యక్తి సమాచారంతో.. నరసింహ ఇంటి పక్కనే నివాసం ఉండే రెడ్డి అనే వ్యక్తి ఆ ఇంట్లో అప్పటి వరకూ గొడవ జరగడాన్ని గమనించాడు. కొంతసేపటి తర్వాత ఇంటి తలుపులు బార్లా తెరచి ఉండటాన్ని చూసి.. ఇంట్లోకి వెళ్లాడు. దుర్గ, ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి.. భవానీపురంలో ఉండే దుర్గ అన్నయ్య నాగరాజుకు ఫోన్ చేశాడు. మీ చెల్లెలు, ఇద్దరు మేనకోడళ్లు అపస్మారకంగా పడి ఉన్నారని చెప్పాడు. దీంతో వెంటనే చెల్లెలు వద్దకు వచ్చిన నాగరాజు వెంటనే ముగ్గురిని ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అరటి పండులో ఎలుకల మందు.. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని దుర్గ తన అన్నయ్యకు చెప్పింది. ఇంట్లో ఉన్న ఎలుకల మందును తాను, ఇద్దరు పిల్లలు కలిసి అరటి పండులో పెట్టుకుని తిన్నామని వివరించింది. అనంతరం చికిత్స పొందుతూ దుర్గ శనివారం రాత్రి మృతి చెందింది. ఘటనపై ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు దుర్గ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: మృతదేహాన్ని చూసి జీర్ణించుకోలేక గుండెపోటుతో అక్కడికక్కడే..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement