breaking news
Viksit Bharat
-
‘జీ రామ్ జీ’కి జై
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవికా మిషన్–గ్రామీణ(జీ రామ్ జీ) బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. తొలుత లోక్సభలో విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిల్లు ప్రతులను చించేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మోదీ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని, గాం«దీజీ ఆశయాలు, ఆదర్శాలను నీరుగారుస్తోందని మండిపడ్డారు.పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఏమిటని నిలదీశారు. గాం«దీజీ వారసత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. జీ రామ్ జీ బిల్లుపై లోక్సభలో దాదాపు 8 గంటలపాటు చర్చ జరిగింది. విపక్ష సభ్యులు తమ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఈ చర్చకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సమాధానమిచ్చారు. ఉపాధి హమీ పథకంలో అవినీతి జరుగుతోందని, లోపాలను సరిచేయడానికే బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా పథకంలో మార్పులు చేస్తున్నామని, స్థిరాస్తులను సృష్టించడం, గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడం పథకం ఉద్దేశమని వివరించారు. గాం«దీజీ ఆదర్శాలను మోదీ ప్రభుత్వం పాటిస్తోందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు సాధించడానికి ఎన్నో ప్రథకాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసం గాంధీజీ పేరు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాముడి పేరుపై ఎందుకంత అసహనం? విస్తృతమైన సంప్రదింపుల తర్వాతే జీ రామ్ జీ బిల్లును రూపొందించామని శివరాజ్సింగ్ చౌహాన్ స్పష్టంచేశారు. గ్రామీణ ఉపాధికి ప్రభుత్వం దాదాపు రూ.11 లక్షల కోట్లు ఖర్చు చేయనుందని చెప్పారు. ఈ నిధులను నీటి సంరక్షణ, గ్రామీణ, జీవనోపాధి సంబంధిత మౌలిక సదుపాయాలు, ప్రతికూల వాతావరణ సమస్యలను పరిష్కరించే పనుల కోసం వెచ్చించబోతున్నట్లు వెల్లడించారు.అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సభలో బిల్లు ప్రతులను చించివేసి దుర్మార్గుల్లా ప్రవర్తించారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని గూండాయిజంగా మారుస్తారా? అని ప్రశ్నించారు. బిల్లుకు జీ రామ్ జీ అని పేరు పెడితే తప్పేమిటని ప్రశ్నించారు. పేరుపై రాద్ధాంతం అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షాలు కేవలం పేరును పట్టుకొని వేలాడుతున్నాయని, తాము మాత్రం పనిపై దృష్టి పెట్టామని స్పష్టంచేశారు. రాముడి పేరు వినిపిస్తే ఎందుకంత అసహనం? అని నిలదీశారు. విపక్షాల నిరసన ర్యాలీ జీ రామ్ జీ బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలకు పంపించాలని లోక్సభలో కాంగ్రెస్ సభ్యుడు కె.సి.వేణుగోపాల్ కోరారు. స్పీకర్ ఓం బిర్లా అందుకు అంగీకరించలేదు. దీనిపై మాట్లాడేందుకు అన్ని పారీ్టల సభ్యులకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష సభ్యులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రేరణ స్థలంలోని గాం«దీజీ విగ్రహం నుంచి మకరద్వారా వరకూ నడిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం హత్య చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. రాజ్యసభలో బిల్లు.. జీ రామ్ జీ బిల్లును కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లును ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. సమగ్ర పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. బిల్లులో సవరణలు సూచించడానికి తగినంత సమయం ఇవ్వాలని కోరారు. సుదీర్ఘ చర్చ తర్వాత మూజువాణి ఓటుతో అర్ధరాత్రి దాటాక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. పార్లమెంట్లో...→ ప్రతి పక్షాల తీవ్ర నిరసనల మధ్య ‘జీ రామ్ జీ’ బిల్లు లోక్సభలో మూజువాణి ఓటుతో గట్టెక్కింది. → సభలో ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించివేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. → అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. → రాజ్యసభలో అర్ధరాత్రి దాటాక జీరామ్జీ బిల్లు ఆమోదం పొందింది. → అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం కల్పిచడానికి ఉద్దేశిచిన ‘శాంతి’ బిల్లుకు పార్లమెంట్ జై కొట్టింది. బుధవారం లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభలో ఓకే అయ్యింది.→ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ‘సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్లు’ను ప్రవేశపెట్టారు. → స్వల్ప చర్చ అనంతరం ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. -
ఉన్నత విద్యకు ఒకే నియంత్రణ వ్యవస్థ
న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి ఒకే నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) వంటి సంస్థల స్థానంలో ఏకైక వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఈసీఐ) బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు పేరును ‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షణ్ బిల్లు’గా మార్చారు. సింగిల్ హైయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని నూతన జాతీయ విద్యా విధానంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జన గణన, పంటలకు కనీస మద్దతు ధర, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కాలం చెల్లిన చట్టాల రద్దు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. మూడు ప్రధాన బాధ్యతలు ఉన్నత విద్య నియంత్రణను ఒకే ఒక్క వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించడం ముఖ్యమైన సంస్కరణ అని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవస్థకు మూడు ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారు. రెగ్యులేషన్, అక్రెడిటేషన్, ప్రమాణాలు నిర్దేశించడం. విద్యా సంస్థలకు నిధులు కేటాయించే అధికారం మాత్రం ఉండదని తెలుస్తోంది. నిధుల బాధ్యత ప్రభుత్వానిదే. అలాగే వైద్య, న్యాయ కళాశాలలు ఈ సింగిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ పరిధిలోకి వచ్చే అవకాశం లేనట్లు సమాచారం. హెచ్ఈసీఐ ముసాయిదా బిల్లు ఇప్పటికే సిద్ధమైంది. ‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షణ్ బిల్లు’ పార్లమెంట్లో ఆమోదం పొందితే ఈ కమిషన్ సాకారం కానుంది. ‘ఉపాధి’ పని దినాలు ఇకపై 125 రోజులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన’గా మార్చడానికి ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద పనిదినాల సంఖ్యను ఏటా 100 నుంచి 125కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కూలీలకు ప్రతి సంవత్సరం కనీసం 125 పని దినాలు కల్పించాల్సి ఉంటుంది. జన గణనకు రూ.11,718 కోట్లు దేశవ్యాప్తంగా జన గణన కోసం రూ.11,718 కోట్లు కేటాయించడానికి మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. ఈసారి డిజిటల్ రూపంలో జన గణన నిర్వహించబోతున్నారు. దాదాపు 30 లక్షల మంది ఎన్యుమరేటర్లు ఈ క్రతువులో పాల్గొంటారు. జన గణనతోపాటు కుల గణన నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. రెండు దశలో కులగణన నిర్వహిస్తారు. మొదటి దశలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపడతారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి జన గణన ప్రారంభిస్తారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే జమ్మూకశీ్మర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మాత్రం 2026 సెప్టెంబర్లోనే జన గణన ప్రారంభమవుతుంది. ప్రజల డేటా సేకరణ కోసం మొబైల్ యాప్ను ఉపయోగించబోతున్నారు. ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటి డిజిటల్ సెన్సెస్ అని చెప్పొచ్చు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐలు దేశంలో బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్డీఐ) అనుమతించే బీమా చట్టాల(సవరణ) బిల్లు–2025ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పెద్దపీట వేయడం ద్వారా దేశంలో బీమా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచబోతున్నారు బొగ్గు గనుల వేలానికి ‘కోల్సేతు’ పారిశ్రామిక అవసరాల కోసం బొగ్గు గనుల వేలం, ఎగుమతులకు అనుమతులు ఇచ్చే విషయంలో ‘కోల్సేతు’ వేదిక ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేలంలో పారదర్శకతతోపాటు వనరుల సది్వనియోగానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ వినియోగదారులు బొగ్గు కావాలంటే ‘కోల్సేతు’ ద్వారా వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. తవ్విన బొగ్గులో 50 శాతాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. మిగతా 50 శాతం ఇక్కడే ఉపయోగించాలి. ఎండు కొబ్బరికి మరో రూ.445 మిల్లింగ్ చేసిన ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను కేంద్ర మంత్రివర్గం క్వింటాల్కు మరో రూ.445 పెంచింది. దీంతో 2026 సీజన్లో క్వింటాల్ ధర రూ.12,027కు చేరింది. ఇక మిల్లింగ్ చేయని ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాల్కు మరో రూ.400 పెంచింది. ఈ రకం కొబ్బరికి క్వింటాల్ ధర రూ.12,500కు చేరుకుంది. కొబ్బరి రైతులను ప్రోత్సహించడానికి, వారికి మరింత ఆదాయం దక్కేలా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 71 చట్టాలు రద్దు కాలం చెల్లిపోయిన 71 చట్టాల రద్దు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇందులో 65 చట్టాలు సవరణ చట్టాలు, ఆరు అసలైన చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 1,562 పాత చట్టాలను రద్దు చేసింది. ప్రతిపాదిత రిపీల్ అండ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే.. రద్దయిన చట్టాల సంఖ్య 1,633కు చేరుకోనుంది. -
బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు విజయవంతం
భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు మరియు బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.వికసిత్ భారత్ 2047(Viksit Bharat@2047)దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది.ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి రాము అబ్బగాని అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు "దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని ,ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు. -
మోదీ రిటైర్మెంట్ అప్పుడే.. రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ(75) ఇంకెంత కాలం రాజకీయాల్లో కొనసాగుతారు? అనే సూటి ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. బీజేపీలో ఒక వయసు దాటాక సీనియర్లను పక్కన పెడుతుండడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. అయితే.. మోదీ(Modi Retirement) విషయంలో మాత్రం బీజేపీ, దాని మాతృ సంస్థ ఆరెస్సెస్ ఆ పనిని ఎందుకు చేయకపోతున్నాయంటూ ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు మోదీ సైతం తన రిటైర్మెంట్పై ఏనాడూ పెదవి విప్పింది లేదు. ఈ తరుణంలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం లేకపోలేదు.ఆఫ్రికా దేశం మొరాకోలో పర్యటించిన తొలి భారత రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ తరుణంలో ఆ పర్యటనలో ఉన్న ఆయన.. ఓ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. ఆ సమయంలో మోదీ భారత ప్రధానిగా ఇంకెంత కాలం రాజకీయాల్లో కొనసాగుతారు? అని రాజ్నాథ్ సింగ్ను యాంకర్ ప్రశ్నించింది. దానికి ఆయన బదులిస్తూ.. ‘‘2029, 2034, 2039, ఆపై 2044లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థి అని, 2047లో వికసిత్ భారత్(Viksit Bharat 2047) లక్ష్యాన్ని సాధించిన తర్వాతే విరమణ తీసుకుంటారు’’ అని బదులిచ్చారు. మోదీ ఒక వ్యక్తి మాత్రమే కాదు భారత అభివృద్ధి లక్ష్యానికి ప్రతీక. ఆయన నాయకత్వంలో భారత్ శాంతి, శక్తి.. ఈ రెండింటికీ ప్రతినిధిగా మారింది. ఆయన సారథ్యంలోనే.. భారత తయారీ సామర్థ్యం ప్రపంచ స్థాయికి చేరింది. వికసిత్ భారత్ను మోదీ వ్యక్తిగత లక్ష్యంగా తీసుకున్నారు. కాబట్టి ఆయన సాధించేవరకు నాయకత్వం వదలబోరు. 2047లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తవుతుంది. వికసిత్ బారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. అప్పుడే ఆయన రిటైర్ అవుతారు అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. తద్వారా.. మోదీ విషయంలో బీజేపీ అసాధారణ మినహాయింపులు ఇచ్చిందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించారాయన. 🚨 BIG STATEMENT 🚨RM Rajnath Singh: “PM Narendra Modi will be BJP’s PM candidate in 2029, 2034, 2039 & even 2044.” 🎯“He will retire only after achieving the goal of a Viksit Bharat by 2047.” 🇮🇳 pic.twitter.com/f2xHicpnzB— Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2025మొరాకా పర్యటనలో ఉన్న రాజ్నాథ్ సింగ్.. ఆఫ్రికా ఖండంలోనే భారత్ తరఫున మొదటి రక్షణ తయారీ కేంద్రం ప్రారంభించారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మొరాక్ పేరిట.. ఇరు దేశాల మధ్య రక్షణ పరిశ్రమ, శిక్షణ, సాంకేతిక మార్పిడి అంశాల్లో ఎంవోయూ కుదిరింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్-మహమ్మద్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కలిపి ఈ కేంద్రాన్ని రూపొందించాయి. దీని ద్వారా ఏటా 100 యుద్ధ వాహనాలను(WhAP 8x8) తయారు చేయబోతున్నారు.ఇదీ చదవండి: రాజకీయాలు వదిలేశాక ఆ పని చేస్తా-అమిత్ షా


