breaking news
Varudu Kalyani
-
చర్చకు వచ్చే దమ్ము లేదు కానీ పిచ్చి మాటలు మాట్లాడుతారా..?
-
తిరుమల ప్రతిష్టను పెంచింది వారే: వరుదు కళ్యాణి
సాక్షి, అమరావతి: తిరుమల ప్రతిష్టను పెంచింది వైఎస్సార్, వైఎస్ జగన్లేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఆమె ఇవాళ(గురువారం) అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఇంటి దైవం అంటూనే చంద్రబాబు శ్రీవారి ప్రసాదంపై నింద మోపాడంటూ.. ఆధారాలతో కూటమికి వరుదు కళ్యాణి కౌంటర్ ఇచ్చారు.టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిషన్ పార్టీ హిందూ మతాన్ని పరిరక్షిస్తామంటూనే తమ చర్యలతో కూటమి నాయకులు అడుగడుగునా హిందూ సాంప్రదాయాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కడపలోని వేంపల్లెలో నందీశ్వర ఆలయాన్ని ప్రారంభిస్తే దానిపైనే ఫేక్ వీడియాలతో తెలుగుదేశం సోషల్ మీడియా విషం కక్కింది. టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిషన్ పార్టీ అని అర్థం. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా విజయవాడలో పుష్కరాల పేరుతో 40కి పైగా ఆలయాలను కూల్చేస్తే, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిర్మించారు.చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తిరుమలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేశారు. ముఖ్యమంత్రులుగా ఉండి తిరుమల ప్రతిష్టను, స్వామి వారి వైభవాన్ని పెంచిన ఘనత తండ్రీకొడుకులు వైఎస్సార్, వైఎస్ జగన్లకే దక్కుతుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 4,111 కొత్త ఆలయాల నిర్మాణాలు మొదలు పెట్టి ఒక్కదానికి రూ.10 లక్షలు కేటాయించడం జరిగింది.అందులో 80 శాతం పనులు రామాలయాలే. రూ. 411 కోట్లతో 801 పురాతన ఆలయాల ఆధునికీకరణ పనులు చేయడం జరిగింది. దుర్గ గుడి అభివృద్ధి కోసం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వ నిధులు రూ.70 కేటాయించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దుర్గమ్మ ఆలయంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.వైఎస్ జగన్ పాలనలో శ్రీవారి వైభవంతూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీ నారాయణ స్వామి రథానికి దుండగులు నిప్పంటిస్తే కళ్యాణోత్సవం సమయానికి కొత్త రథం తయారు చేయించి ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రథాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కోసం స్వచ్ఛమైన వెన్నను సమకూర్చడం కోసం తిరుమలలోని గోశాలను విస్తరించడం వైయస్ జగన్ సీఎంగా ఉండగానే జరిగింది. చిన్నారుల్లో భక్తిభావం పెంపొందించడం కోసం గోవింద కోటి, రామ కోటి రాసే వారికి ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేయడమే కాకుండా వారికి శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది.టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలతోపాటు వేతనాలు పెంచడమే కాకుండా కారుణ్య నియామకాలు చేపట్టారు. వంశ పారంపర్య అర్చకులకు రిటైర్మంట్ లేకుండా ఓపిక ఉన్నంత వరకు స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించారు. తిరుమలలోని స్వామి వారి గర్భగుడిని సన్నిధి గొళ్లలు తెరిచే సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు. అమరావతి, చెన్నై, భువనేశ్వర్, జమ్ముకశ్మీర్, విశాఖపట్నంతోపాటు అమెరికాలో శ్రీవారి ఆలయాలను నిర్మించి స్వామి వారి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేశారు. గతంలో దివంగత వైఎస్సార్ తరహాలోనే వైఎస్ జగన్ కూడా ముఖ్యమంత్రిగా ఉండగా వేద విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవలో భక్తులందరూ దర్శించుకునేలా ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడ సేవ నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.బ్రాహ్మణుల సంక్షేమం కోసం వైఎస్ జగన్మఠాధిపతులు, ఆగమ పండితులతో ఆగస్టు 2022లో రెండో విడత ధార్మిక పరిషత్తును నియమించి నిర్ణయాధికారాలను కల్పించిన ఘనత కూడా వైఎస్ జగన్కే దక్కుతుంది. అంతేకాకుండా దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురికాకుండా వివాదాలతో కోర్టు కేసుల కారణంగా కాలయాపన జరగకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటీస్ ఇచ్చిన వారం రోజుల్లో దేవాలయ భూములు స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి కల్పించి స్వామి వారి ఆస్తులను కాపాడారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలకు వంశపారంపర్య హక్కులను స్ధానిక భక్తుల కమిటీలకు కల్పిస్తూ జీవో ఇచ్చారు.జీవో నెంబర్ 52 ద్వారా గతంలో రూ.5 వేలు వేతనాలు పొందేవారికి రూ.10 వేలు, రూ. 10 వేలు పొందేవారికి రూ.15625 ల చొప్పున వేతనాలు పెంచుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు నిర్ణయం తీసుకుంది. అర్చక సంక్షేమ ట్రస్టు ద్వారా బ్రాహ్మణులకు రూ.48 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లుగా అరర్చ సమాఖ్య నాయకులకు అవకాశం కల్పించారు. 16 ఆగమ వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతోపాటు వారికి స్టై ఫండ్ కింద రూ. 3 కోట్లు చెల్లించారు. ధూమదీప నైవేద్యాల పథకం గతంలో చంద్రబాబు హయాంలో కేవలం 1100 ఆలయాలకు మాత్రమే ఉండగా వైఎస్సార్సీపీ హయాంలో ఆ సంఖ్యను 5338 ఆలయాల్లో అమలు చేసింది.వైఎస్సార్ హయాంలోనే శ్రీవారి వైభవం పెరిగిందిఆలయాల్లో రాజకీయ నేతల జోక్యానికి తావులేకుండా దేవాదాయ శాఖలో కీలకనిర్ణయాలు తీసుకునేలా 21 మందితో ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేస్తూ 2007లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చట్ట సవరణ చేశారు. శ్రీవారి ఆలయంలో పిల్లలకు, క్యూలైన్లలో ఉండేవారికి ఉచితంగా పాలు, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి కూడా వైయస్సార్ గారే శ్రీకారం చుట్టారు. వేద విద్య, విజ్ఙానం, పరిశోధనలు ప్రోత్సహించే ఉద్దేశంతో 2006లో వైయస్సార్ గారు వేద విద్యాలయాన్ని ప్రారంభించారు. ఏడు కొండల వైభవాన్ని చాటేలా వేంకటేశ్వర భక్తి ఛానెల్ను ప్రారంభించారు.తిరుపతి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందజేయడంతోపాటు అలిపిరి వద్ద నిత్య హోమం జరిపేలా కూడా వైయస్సార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించారు. 2006లో కళ్యాణమస్తు పథకానికి రూపకల్పన చేసి మధ్యతరగతి కుటుంబాలలో వివాహం చేసుకునే ప్రతి జంటకు బంగారు మంగళ సూత్రం, వెండి మెట్టెలు, నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లి సామాగ్రి, ధార్మిక స్తోత్ర పుస్తకం, పురోహితుడు, పెళ్లి భోజనం ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. బంగారు మంగళసూత్రం, వెండి మెట్టెలు, శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించి 36 వేల నూతన జంటలకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.దళిత గిరిజన గోవిందం పేరుతో విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి శ్రీవారిని దళిత గిరిజన వాడలకు తీసుకెళ్లి దర్శన భాగ్యం కల్పించే భృహత్తర కార్యక్రమం కూడా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారే ప్రారంభించారు. మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణ ఇచ్చే సమానత్వాన్ని కూడా ఆయనే ప్రారంభించారు. హిందూ ధర్మ పరిరక్షణ, స్వామి వారి ప్రతిష్టను ఇనుమడింపజేయడం కోసం వైయస్సార్ గారు ఎంతో శ్రమించారు. కానీ చంద్రబాబు మాత్రం మా ఇంటి దైవం అంటూనే తన తప్పుడు ప్రకటనలతో ఆలయ ప్రతిష్టను మంటగలిపేశారు. -
సుప్రీంకోర్టును కూడా లెక్క చెయ్యకుండా సిగ్గులేకుండా వికృత చేష్టలు చేస్తున్నారు
-
సుబ్బారెడ్డి భార్యను మేం తీసుకొస్తాం చంద్రబాబు, లోకేష్, బిఆర్ నాయుడు.. మీ భార్యలను తీసుకురండి
-
కూటమి ఎమ్మెల్యే మహిళను గర్భవతిని చేసి ఐదు సార్లు అబార్షన్ చేయించాడు
-
ఏపీలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయి: వరుదు కల్యాణి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆమె నిలదీశారు. సీఎం సొంత జిల్లాలోనే 10 శాతం నేరాలు పెరిగాయన్న వరుదు కళ్యాణి.. హోంమంత్రి అనిత ఇంఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో మహిళలపై నేరాలు పెరిగాయని వివరించారు.‘‘గంజాయి లేదని హోంమంత్రి చెబుతున్నారు. మదనపల్లిలో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి డమ్ములో వేసి చంపేశారు. తిరుపతిలోనే డ్రగ్స్, గంజాయి పెరిగిపోయింది. 112కి ఫోన్ చేస్తే రావడానికి 25 నిమిషాలు తర్వాత స్పందిస్తున్నారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. కాపాడండని వేడుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడు. కూటమి ఎమ్మెల్యే ఓ మహిళను గర్భవతిని చేసి ఐదు సార్లు అబార్షన్ చేయించాడు. ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. ఆడపిల్లలంటే ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు. వరుదు కళ్యాణి ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పలేదు.మండలిలో మైకుల సమస్య ఏపీ శాసన మండలిలో మైకుల సమస్య ఏర్పడింది. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రుల సమాధానం చెప్పినప్పుడు మైకులు మ్యూట్లోకి వెళ్తున్నాయి. మైకుల సమస్య పరిష్కరించాలని ఛైర్మన్ దృష్టికి శానమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీసుకెళ్లారు.లా ఉంది.. కానీ ఆర్డర్ మాత్రం ఎక్కడా లేదు: భరత్ ఎమ్మెల్యే భరత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా ఉంది కానీ ఆర్డర్ మాత్రం ఎక్కడా లేదన్నారు. కొత్త చట్టాలు ఏయే రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో కేంద్రం ఓ నివేదిక ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన నివేదికలో ఏపీ 36వ స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల వేధింపులపై పెట్టిన శ్రద్ధ పోలీసింగ్పై పెట్టాలి. అలా చేస్తే రాష్ట్రం పరువైనా మిగులుతుందని భరత్ అన్నారు.టీడీపీ ఎమ్మెల్సీకి బొత్స స్ట్రాంగ్ కౌంటర్మండలిలో టీడీపీ ఎమ్మెల్సీకి బొత్స స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మండలిలో శాంతి భద్రతలపై చర్చలో సంబంధం లేని అంశాలను టీడీపీ ప్రస్తావించింది. ‘‘వైఎస్సార్ తండ్రిని ఎవరు చంపారు?. తన తండ్రిని చంపిన వారిపై వైఎస్సార్ కక్ష తీర్చుకుని ఉంటే ఈ రోజు ఇలా మాట్లాడి ఉండేవారా?. సభకు సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం సరికాదు’’ అని బొత్స మండిపడ్డారు.ఏపీలో రౌడీలు రాజ్యమేలుతున్నారు: బొమ్మి ఇజ్రాయిల్ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి చాక్లెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. గంజాయి మత్తులో మదనపల్లిలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. బాలికను చంపిన వ్యక్తి కూడా గంజాయి మత్తులో చనిపోయారని హోంమంత్రి చెబుతున్నారు. గంజాయి ఏరులై పారుతోందనడానికి ఇదే నిదర్శనం. కిందిస్థాయి నుంచిపై స్థాయి వరకూ పోలీసులు కుమ్మక్కైపోయారు. చినబాబుకి ఎంత పెదబాబుకి ఎంత అని వాటాలు పంచుకుంటున్నారు. మాజీ మంత్రుల ఇంటి పై దాడులు చేస్తే కేసుసులుండవ్. బాధితులపై మాత్రం కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నారు. మహిళల రక్షణ కోసం వైఎస్ జగన్ దిశా యాప్ను తెచ్చారు. -
జగనన్న బయట అడుగుపెడితే .. అనితకు చెంపచెళ్లుమనిపించిన వరుదు కళ్యాణి
-
Varudu: దేవుడిపై నింద వేశారు.. కర్మ ఎవరినీ వదలదు..
-
బూతులు తిట్టిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు... బాధితుడు అంబటి గారు జైల్లో ఉన్నారు
-
‘ఏపీలో నిరంకుశ పాలన సాగుతోంది’
విజయవాడ: ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి ప్రభుత్వ పాలనలో విఫలమైందన్నారు. తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ‘ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ పాలన అమలవుతోంది. తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పింది. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని కోరినందుకు అంబటి రాంబాబుపై దాడి చేశారు. చంద్రబాబు తమ వారికి ప్రభుత్వ భూములను అన్యాయంగా తక్కువ ధరకు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ విమర్శించారు. -
ఏపీ బడ్జెట్ అభూత కల్పన: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఏపీ బడ్జెట్ అంతా అంకెల గారడీ.. అప్పుల కుప్పలా ఉందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నమ్మించి మోసం చేసిన బడ్జెట్ ఇది అంటూ దుయ్యబట్టారు. నిరుద్యోగులను, మహిళల్ని, రైతుల్ని మోసం చేసిన బడ్జెట్. ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాదు.. డబుల్ చీటింగ్ సర్కార్.. ఇచ్చిన ఒక్క హామికి కూడా సరైన నిధులు కేటాయించకుండా.. వచ్చే ఏడాదికి మరో లక్ష కోట్ల అప్పుకు రెడీ అయిపోతున్నారు. కేవలం 20 నెలల్లో లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టి అసలే లేదు అంటూ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ బడ్జెట్లోనూ అదే తీరు: వరుదు కల్యాణిఎన్నికల టైంలో ఊరూరా బాండ్లు పంచారు. వాటికీ ఈ బడ్జెట్కు సంబంధం ఉందా?. మోదీ, పవన్ను పక్కన పెట్టుకొని 164 సీట్లు తెచ్చుకొని ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదు. తల్లికి వందనంలో కోతలు పెట్టారు. ఈ బడ్జెట్లో కూడా అదే తీరు. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామని నమ్మించి.. దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇపుడు బడ్జెట్లో ఆ ఊసే లేదు. 50 ఏళ్లు దాటితే పింఛన్ ఇస్తామన్నారు.. దాని ఊసు లేదు. రెండు సెంట్ల స్థలం ఇస్తామన్నారు..దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు.. ఈ మూడు బడ్జెట్లలో కేటాయింపులు లేవు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు. వీటన్నిమీద కౌన్సిల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము..మాయాబజార్ను తలపించింది: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిఈ బడ్జెట్ అంతా ఊహాగానాలే.. నాలుగో తరగతి పిల్లాడు హిస్టరీ రాసినట్లు బడ్జెట్ రాసుకొచ్చారు. బడ్జెట్ ప్రసంగమంతా మాయాబజార్ను తలపించింది. ఎన్నికల ముందు 10 లక్షల కోట్లకు పైబడి అప్పులున్నాయని బురదజల్లారు. కూటమి వచ్చిన 20 నెలల్లో చేసిన అప్పు 3.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరో లక్ష కోట్లు అప్పు చేస్తామని ముందే చెబుతున్నారు. నిరుద్యోగ భృతికి గత రెండు బడ్జెట్లలో కేటాయింపులు సున్నా. మూడో సంవత్సరం కూడా నిరుద్యోగ భృతి కేటాయింపులు సున్నా. ఆడబిడ్డ నిధికి మూడు బడ్జెట్లలో కేటాయింపులు సున్నా. 8500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటే.. కేవలం 3500 కోట్లను ఫీజు రీయింబర్స్మెంట్ కు కేటాయించారు.30 లక్షల మంది విద్యార్థులను రోడ్డున పడేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. నాడు-నేడు ద్వారా వైఎస్ జగన్ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఈ ప్రభుత్వం నాడు-నేడుకి రెండేళ్లలో చేసిన కేటాయింపులు సున్నా. ఇప్పుడు కేవలం 1500 కోట్లను నాడు నేడుకి ఇస్తామంటున్నారు...అది కూడా ఇస్తారో లేదో అనుమానమే. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఉద్యోగులు తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ కమిషన్ ఛైర్మన్ను కూడా నియమించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అసలు కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోందిఈ బడ్జెట్ పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్: కల్పలతా రెడ్డిబడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రజల ఆశలను వమ్ము చేశారు. ఆడబిడ్డ నిధి పేరుతో మోసం చేశారు. మహిళలను నిలువునా ముంచేసి.. బడ్జెట్లో మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతున్నారు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదు. బడ్జెట్ను తయారు చేసిన ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. పీఆర్సీ, ఐఆర్ గురించి కనీస ప్రస్తావన కూడా లేదు. హోంమంత్రి బడ్జెట్ పెట్టడంతో పోలీసులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. పోలీసులకు వెహికల్స్ పెట్టాం.. డ్రోన్లు పెట్టామని హోం మంత్రి చెప్పారు. హోంమంత్రి తమ బకాయిల గురించి మాట్లాడతారని పోలీసులు భావించి భంగపడ్డారు.ఈ బడ్జెట్ పనికిరాని బడ్జెట్: కుంభా రవిబాబుబడ్జెట్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ఈ బడ్జెట్ పనికిరాని బడ్జెట్. ప్రభుత్వం సంపద సృష్టికి బదులు అప్పులు సృష్టిస్తోంది. అభూత కల్పనగా బడ్జెట్ ఉంది. బడ్జెట్ అంతా అబద్ధాలతో నిండిపోయింది. ఎన్నికల సమయంలో ఏపీ అప్పులపై ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ రోజు ఏపీ అప్పు 9.47 లక్షల కోట్లని బడ్జెట్లో చెబుతున్నారు. చంద్రబాబు ఎందుకు అప్పులపై తప్పుడు ప్రచారం చేశారో సమాధానం చెప్పాలి -
నీకు చేతకాదు అని పవన్ కల్యాణే అన్నారుగా.. ఏకిపారేసిన వరుదు కళ్యాణి
-
Varudu : విశాఖ భూములను 99 పైసలకు వాళ్లకి ఎలా ఇస్తారు..?
-
ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని YSRCP డిమాండ్
-
అప్పుడు గేట్లు, గోడలు దూకి రెచ్చిపోయావ్.. గీతం భూకబ్జాపై వార్నింగ్
-
బాబు, పవన్ను వేంకటేశ్వరస్వామి క్షమించడు: ఆర్కే రోజా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని.. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడమే అందుకు తార్కాణం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని రోజా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పలువురు నేతలు శుక్రవారం పరిశీలించారు. జోగి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. ‘‘ఏకంగా మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు తెగబడ్డారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం గురించి చంద్రబాబు, పవన్ నీచంగా మాట్లాడారు. వాళ్ల పార్టీకి వాళ్లే సమాధి కట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలను ఈ ఇద్దరూ క్షమాపణలు కోరాలి. కానీ, అలాంటి వాళ్లను వేంకటేశ్వరస్వామి మాత్రం క్షమించడు’’ అని రోజా కామెంట్ చేశారు. జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ జనం జగన్ వెంటే ఉన్నారని వాళ్లు గుర్తించాలి అని రోజా అన్నారు.ఏపీలో ఇలాంటి పరిస్థితి ఎన్నాడూ చూడలేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారామె. -
అరవ శ్రీధర్ చేతి రాతలు మార్చారా, రోమాలు తీసారా? నిప్పులు చెరిగిన వరుదు కళ్యాణి
-
‘బాధితురాలినే నిందితురాలిగా చేసేందుకు కూటమి కుట్రలు’
సాక్షి, తాడేపల్లి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని వెంటనే అరెస్టు చేయాలని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తప్పు చేసిన ఎమ్మెల్యేని అరెస్టు చేసే దమ్ము చంద్రబాబుకు లేదా? అంటూ నిలదీశారు. కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, కూన రవికుమార్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. తిరుపతిలో కిరణ్ రాయల్పై కేసు నమోదు చేసే ధైర్యం కూడా ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు.‘‘అరవ శ్రీధర్ చేసిన పనితో ఆడపిల్లలకు రాష్ట్రంలో రక్షణ లేదని అర్థం అవుతుంది. జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు కీచకులుగా మారారు. పోలీసు వ్యవస్థ ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు?. కూటమి ఎమ్మెల్యేపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు.?..హోంమంత్రి అనితకు పబ్లిసిటీ, రీల్స్పై ఉన్న శ్రద్ధ మహిళ భద్రతపై లేదు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కనీసం స్పందించ లేదు. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయారు.?. ఎమ్మెల్యేపై పార్టీ కమిటీ వేయడం ఏంటి? పోలీసుల విచారణ వుండదా?. మంత్రి సంధ్యారాణి కొడుకు పేకాట అడుగుతూ దొరికిపోయారు’’ అంటూ వరుదు కల్యాణి మండిపడ్డారు. -
‘జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను సస్పెండ్ చేయాలి’
సాక్షి,తాడేపల్లి: మహిళపై దారుణానికి ఒడిగట్టిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేదు. మహిళలపై బరి తెగించి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. మహిళల జీవితాలతో అడుకుంటున్నారు. తప్పు చేస్తే శిక్షిస్తారనే భయం లేకుండా పోయింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడు.అతనిపై ఇంకా ఎందుకు కేసులు పెట్టలేదు?. తప్పుడు పనులు చేసే వారికే ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రాప్తాడులో పద్నాలు మంది టీడీపీ కార్యకర్తలు లైంగిక దాడి చేస్తే కేసు లేదు. కిరణ్ రాయల్ అనే జనసేన నేత లక్ష్మి అనే మహిళ జీవితాన్ని రోడ్డున పడేశాడు. కోట వినూత మీద టీడీపీ ఎమ్మెల్యే స్పై చేస్తే చర్యలు లేవు. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస రావు వలన మహిళా వీఆర్వోపై దాడి చేసినా చర్యలు లేవు.ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళకు ఐదుసార్లు అబార్షన్ చేయించాడు. లొంగక పోతే ఆమె కొడుకుని చంపుతానని బెదిరించాడు. పవన్ కళ్యాణ్ కనీసం ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా?. మహిళపై చేయి వేస్తే అదే చివరి రోజు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు?. మహిళా హోంమంత్రి అనితకు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కనపడటం లేదా?. మంత్రి సంధ్యారాణి పీఏ మహిళను అన్యాయం చేస్తే తిరిగి బాధితురాలి మీదే కేసు పెట్టారుఅధికారమదంతో ఉన్న ఇలాంటి వారి వల్ల మహిళలకు రక్షణ ఉంటుందా?. అసలు రాష్ట్రంలో మహళా కమిషన్ ఏం చేస్తోంది?. సుమోటోగా ఎందుకు కేసు పెట్టలేదు?.బలహీనతలు ఉంటే బయటకు రానీయవద్దని ప్రకటన చేసిన పార్టీ జనసేన. తప్పులు చేయవద్దని చెప్పకుండా వీడియోలు బయటకు రానీయవద్దన్న ఏకైక పార్టీ జనసేన’అని మండి పడ్డారు. -
చూశావా మీ ఎమ్మెల్యే రాసలీలలు తాటతీస్తా.. అంటావ్..!
-
Varudu: బట్టలు విప్పి రికార్డింగ్ డాన్సులు వెయ్యండన్న వారిని ఎందుకు నడిరోడ్డుపై నడిపించలేదు..
-
కొబ్బరి కాయ కొట్టడం తప్ప.. నువ్వు చేసిందేమీ లేదు బాబూ
-
నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.
-
రక్షించాల్సిన పాలకులు.. భక్షిస్తున్నారు: వరుదు కల్యాణి
సాక్షి, తాడేపల్లి: ఈ ఏడాది (2025)లో కూటమి ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. మహిళలు, చిన్నారుల పాలిట చీకటి సంవత్సరంగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రక్షించాల్సిన పాలకులే భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం షాపులు, బెల్టు షాపులు నెలకొల్పి మహిళల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ పనితీరు అట్టడుగుకు పడిపోయింది.‘‘కేంద్ర హోంశాఖ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం మారలేదు. డీజీపీ స్థాయి వ్యక్తి మాటలు వింటుంటే పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ జిల్లాలో 213 శాతం గంజాయి, డ్రగ్స్ కేసులు పెరిగాయి. నెల్లూరులో గంజాయికి వ్యతిరేకంగా పని చేస్తున్న కమ్యూనిస్టు నాయకుడు పెంచలయ్యను హత్య చేశారు. 1,450 మందిపై లైంగిక దాడులు జరిగాయి. 5 వేల మందిపై వేధింపులు జరిగాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేదు’’ అంటూ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మహిళలకు ఇచ్చిన ఏ హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మూడు పార్టీలు కలిసి మూడు చెరువుల నీళ్లు తాగించారు. కూటమి పాలనలో మహిళలు, చిన్నారులు తీవ్రంగా అన్యాయానికి గురయ్యారు. ఏ వర్గానికీ ప్రభుత్వం మేలు చేయలేదు. దోపిడీలో బంగ్లాదేశ్కు బాబుగా, శ్రీలంకకు చెల్లిగా మార్చారు. ఆవకాయ ఫెస్టివల్కి డబ్బులు ఉంటాయిగానీ, ఆడబిడ్డ పథకం అమలు చేయడానికి డబ్బుల్లేవా?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు.‘‘మహిళలంటే సామాన్య మహిళలే కాదు, దేవతలను కూడా అవమానం చేశారు. దుర్గమ్మ ఆలయానికి కరెంటు కట్ చేసి అవమానం చేశారు. అనిత, సంధ్య, సవిత.. ఈ ముగ్గురికే న్యాయం జరిగింది. పేరుకే మంత్రులు, కానీ జగన్ని దూషించటానికే పని చేస్తున్నారు. హోంమంత్రి అనిత రౌడీలకు పెరోల్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. సంధ్యారాణి పీఏ ఒక మహిళను వేధిస్తే తిరిగి బాధితురాలి మీదనే కేసు పెట్టించారు. మంత్రి సవిత కుట్టు మిషన్ల స్కాం చేసి సంపద సృష్టించుకునే పనిలో ఉన్నారు. తప్పులు చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వం లోనే చూస్తున్నాం..సింహాచలం ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే వారిపైనే కేసులు పెట్టటం అన్యాయం. జల్సా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లో జనసేన, టీడీపీ కార్యకర్తలు అవాంఛనీయ శక్తులుగా వ్యవహరించారు. జగన్, అల్లు అర్జున్లను కించపరిచే మాస్కులు వేసుకుని వ్యవహరించారు’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు. -
‘అన్ని గుర్తు పెట్టుకుంటాం.. రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేక పోయారని.. జంతుబలి అంటూ నానాయాగీ చేశారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన జంతుబలి కనపడలేదా?. చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలి కనపడలేదా?’’ అంటూ నిలదీశారు.‘‘మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతిదీ మేము గుర్తు పెట్టుకుంటాం. అధికారంలోకి రాగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం.. గుర్తు పెట్టుకోండి. హోంమంత్రి అనిత అసమర్థ మంత్రి. పోలీసు వ్యవస్థను దేశంలోనే 36వ స్థానానికి తీసుకెళ్లారు. అదీ హోంమంత్రి పనితీరు. మమ్మల్ని దూషించే ముందు పోలీసు శాఖను సరి చేయండి. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టటం కాదు’’ అని వరుదు కళ్యాణి హితవు పలికారు.‘‘మీకు దమ్ముంటే మీ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోండి. మహిళను వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ని అరెస్టు చేయండి. రప్పారప్పా అనే సినిమా డైలాగ్ కూడా వినలేక పోతున్నారు. మరి బాలకృష్ణ సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయో చూడండి. టీడీపీ సోషల్ మీడియా సైకోల్లాగా వ్యవహరిస్తోంది. గీతాంజలి అనే తెనాలి యువతి ఆత్మహత్య చేసుకునే వరకు టీడీపీ సోషల్ మీడియా చేసింది. కదిరి ఘటనలోని అజయ్ దేవ మా కార్యకర్త కాదని తెలియగానే హోంమంత్రి అనిత పడుతున్న పాట్లు మాకు అర్థం అయింది. జగన్ని తిట్టటానికే అనిత పదవిలో ఉన్నారు..చంద్రబాబు తన తల్లి, చెల్లెలకు ఏ మాత్రం ఆస్తి ఇచ్చారో అనిత తెలుసుకుంటే మంచిది. హైదరాబాదులో రాజభవనం కట్టి కనీసం తల్లి, చెల్లెల్ని పిలవని వ్యక్తి చంద్రబాబు. హోంమంత్రి అనిత ఆ విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే మంచిది. ఎమర్జెన్సీ కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వమే ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పెట్టే అక్రమ కేసులకు మావాళ్లు భయపడరు’’ అని వరుదు కల్యాణి తేల్చి చెప్పారు. -
టీడీపీకి తొత్తులుగా ఏపీ పోలీసులు: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అధికార టీడీపీకి ఏపీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మంత్రి సంధ్యా రాణి పీఏ సతీష్.. మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ వ్యవహారంలో బాధితురాలిపై తిరిగి కేసు పెట్టారు.. మంత్రి డైరెక్షన్లోనే ఆమెపై కేసు నమోదు చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని మంత్రి, సతీష్ ఇలా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళను, మరొక మహిళా మంత్రి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం. టీడీపీ తొత్తుల్లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మంత్రి పీఏ మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా?.బాధితురాలి దగ్గర సతీష్ డబ్బులు తీసుకోవడం నిజం కాదా?. ఇప్పటికైనా సతీష్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. ఇంతా జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు?. హోం మంత్రిగా అనిత విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు
-
Varudu Kalyani: ఆంధ్రా కింగ్ తాలూకా ఫంక్షన్ లో డైలాగులు కొట్టడం కాదు
-
మంత్రి PA వ్యవహారం.. లోకేష్, పవన్ పై వరుదు కళ్యాణి ఫైర్..
-
టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖ: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిందని, ఇందుకు మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ చేసిన నిర్వాకమే నిదర్శనమని వైఎస్సార్ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. సంధ్యారాణి పీఏ సతీష్ ఒక మహిళను పక్కలోకి రావాలని వేధించాడని, ఆమె నుంచి ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు.బాధితురాలు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఆమెను మిగతా టీడీపీ నేతల పక్కన పడుకోమంటున్నాడని, ఆమెను వేధించిన పీఏకు మంత్రి సంధ్యారాణి కొమ్ము కాస్తున్నారని కళ్యాణి ఆరోపించారు. మంత్రి పీఏపై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. కాగా బాధితురాలు మంత్రి లోకేష్ కు సతీష్పై ఫిర్యాదు చేసిందని, అయినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. పీఏ కు సపోర్ట్ చేసిన మంత్రి సంధ్యారాణిని వెంటనే బర్త్ రఫ్ చేయాలని కల్యాణి డిమాండ్ చేశారు. మంత్రి పీఏ మహిళలను వేధిస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మహిళా రక్షణ అనేది కేవలం మాటలకే పరిమితమా? ఒక మహిళను మంత్రి పీఏ వేధింపులకు గురి చేస్తుంటే, హోం మంత్రి అనిత ఏం చేస్తున్నారని కల్యాణి నిలదీశారు. వెంటనే మంత్రి పీఏ సతీష్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మధుసూదన్ తల్లిదండ్రులపై దాడి -
Varudu Kalyani: నాలుగు సార్లు సీఎంగా చేశావ్ ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా చంద్రబాబు..
-
Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత
-
నువ్వు 100 జన్మలెత్తినా జగన్ స్థాయిని చేరుకోలేవు
-
Varudu Kalyani: మెడలో తెలుగుదేశం పార్టీ కార్డు వేసుకొని మరీ అమ్మకాలు
-
Kalyani: వాడి మొహానికి తాత అంట.. తుని మైనర్ బాలిక ఘటన పై స్ట్రాంగ్ రియాక్షన్
-
Varudu : సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా
-
భయపెడితే భయపడే వాడు ఎవడు లేడిక్కడ... YSRCP ఎమ్మెల్సీలు సంచలన కామెంట్స్
-
Varudu: బెల్టు షాపులను తొలగించి నకిలీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్
-
సిట్ అనేది చంద్రబాబు జోబులోని సంస్థ
-
Kalyani : మంత్రి కొల్లు రవీంద్రకు సవాల్ మీకు ధైర్యం ఉంటే
-
‘కల్తీ మద్యం కుంభకోణంలో ఉన్న పెద్దలంతా బయటకు రావాలి’
విశాఖ: కల్తీ మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఏపీలో కల్తీ మద్యం ఘటనలే దేశంలో అతి పెద్ద కుంభకోణం అని ఆమె పేర్కొన్నారు. ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీ) విశాఖలో ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ.. ‘ ఈ కుంభకోణం లో ఉన్న పెద్దలు అందరూ బయటికి రావాలి. టిడిపికి నిజంగా సంబంధం లేకపోతే ఎందుకు సిబిఐ విచారణకు వెనకాడుతున్నారు. సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలోనే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. కల్తీ మద్యానికి సూత్రధారులు పాత్ర దారులు టిడిపి నేతలు. నాణ్యమైన విద్య వైద్య ఆంధ్రప్రదేశ్గా వైఎస్ జగన్ మార్చితే.. కల్తీ మధ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని చంద్రబాబు మార్చారు. కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పాలిస్తున్నారు. కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా టిడిపి నేతలు మార్చుకున్నారు. ఊరూరా కల్తీ మద్యానికి టిడిపి నేతలు పాల్పడుతున్నారు. నారావారి పాలన కల్తీ సారా పాలనగా మారింది. కల్తీ మద్యానికి ఎంతోమంది బలయ్యారు.. నకిలీ మద్యం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై లేదు. ప్రతి మూడు బాటిల్లో ఒకటి కల్తీ మద్యమే’ అని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరపాలి: ఎంపీ మిథున్రెడ్డి -
Varudu: అనిత నీకు దమ్ము, ధైర్యం ఉంటే... నర్సీపట్నం రా.. కాలేజీ చూపిస్తాం
-
ప్రభుత్వం, టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట: వరుదు కళ్యాణి
-
Varudu Kalyani: జగనన్న కట్టించిన హాస్పిటల్ లో... నీ కళ్ళు చెక్ చేపించుకో...
-
నాటి ప్రగల్భాలు ఏమయ్యాయి పవన్!
కర్నూలు(టౌన్): సుగాలి ప్రీతి హత్యాచారం కేసుపై గత ఎన్నికలకు ముందు ఊగిపోతూ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడరేమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలులోని వాసవీ గార్డెన్స్లో ఉన్న సుగాలీ ప్రీతి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రీతి తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.అనంతరం వరుదు కళ్యాణి మాట్లాడుతూ 2017 ఆగస్టులో ప్రీతి హత్యాచారం జరిగితే ఆ తర్వాత రెండేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏంచేశారని ప్రశి్నంచారు. ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఈ కేసును రాజకీయంగా వాడుకున్నారని, అధికారంలోకి వస్తే దోషుల తాట తీస్తామని, వదిలి పెట్టే ప్రసక్తి లేదని ఊగిపోతూ ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు అపాయింట్మెంటు కూడా ఇవ్వకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ లా అండ్ ఆర్డర్ తన చేతిలో లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు సర్కారు విఫలం ‘‘రాష్ట్రంలో రోజూ 70 నుంచి 80 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. చంద్రబాబు సర్కారు మహిళల రక్షణలో విఫలమైంది. హోంమంత్రిగా మహిళ ఉన్నా.. అబలలకు రక్షణ లేదు. అసలు హోంమంత్రి అనిత పనిచేస్తున్నారా? టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలే మహిళలను లైంగికంగా వేధిస్తున్నా చర్యలు లేవు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలని, కేసును సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రీతి తల్లి వీల్చైర్ యాత్రకు అనుమతి కోరితే ఈ ప్రభుత్వం ఎందుకివ్వడం లేదు? రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిన లోకేశ్.. సుగాలి ప్రీతి కేసుపై ఎందుకు స్పందించడం లేదు.?’’ అని కళ్యాణి ప్రశ్నించారు. జగనన్న వల్లే బాధిత కుటుంబానికి న్యాయం ‘‘2019లో జగనన్న సీఎం అయిన తరువాత సుగాలి ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఇంట్లో ఒకరికి ఉద్యో గం, రూ.8 లక్షల నగదు అందజేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి సర్కారు ప్రీతి కేసులో న్యాయం చేయాలి. ప్రీతి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.’’ అని కళ్యాణి చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు విజయ మనోహారి, గాజుల శ్వేతారెడ్డి, కల్లా నాగవేణి రెడ్డి, మంగమ్మ, భారతి పాల్గొన్నారు. -
ఆడబిడ్డ ఏడుపు మీకు కనిపించట్లేదా ? సుగాలి ప్రీతి కేసుపై ఎక్కడ?
-
జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి
సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ వాడుకున్నారు. పవన్ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని!


