-
ఆగస్టు 25, 26న ‘ఇండియా’ కూటమి సమావేశం
న్యూఢిల్లీ: 26 పార్టిలతో కూడిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 25, 26న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనుంది. ఈ భేటీకి శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(శరద్ పవార్) ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. విపక్షాల తొలి సమావేశం బిహార్ రాజధాని పాటా్నలో, రెండో సమావేశం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగే మూడో సమావేశంలో ప్రధానంగా సీట్ల పంపకంపై విపక్ష నాయకులు చర్చించనున్నట్లు సమాచారం. -
ఇరు‘సేన’లకూ నోటీసులు.. వారంలోగా బదులివ్వాలి: స్పీకర్
ముంబై: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో శివసేన షిండే వర్గానికి చెందిన 40 మంది, యూబీటీ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చినట్టు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ శనివారం వెల్లడించారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లకు ఏడు రోజుల్లోగా బదులివ్వాల్సిందిగా కోరినట్టు వివరించారు. వీరిలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, యూబీటీ వర్గం నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే తదితరులున్నారు. గతేడాది శివసేనలో చీలిక అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎంబీటీ వర్గానికి చెందిన రుతుజా లాట్కేకు నోటీసులు ఇవ్వలేదు. శివసేన నియమావళి తాలూకు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందుకున్నట్టు, షిండేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ త్వరలో మొదలవుతుందని స్పీకర్ శుక్రవారం వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. అయితే తమకింకా ఎలాంటి నోటీసులూ రాలేదని సేన ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి సంజయ్ షిర్సత్ తెలిపారు. షిండే వర్గంపై తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై వేగవంతంగా విచారణ జరిపేలా స్పీకర్ను నిర్దేశాలు జారీ చేయాలంటూ కొద్ది రోజుల క్రితం సేన (యూబీటీ) వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ‘గత రెండు నెలలుగా ఈ విషయంలో స్పీకర్ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది’ అని యూబీటీ నేత అర్వింద్ సావంత్ చెప్పారు. ఇదీ చదవండి: అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణం -
మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా?
ముంబై: బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన తండ్రిని అవమానించిన వారితో చేతులు కలపడం ఆయనను అవమానించడమేనని అన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అధికార బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలిపిన విపక్షాలు బీహార్లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మెహబూబా మఫ్టీ పక్కన కూర్చుని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఒకప్పుడు పీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే మెహబూబా మఫ్టీ విషయమై మమ్మల్ని ఎగతాళి చేసిన మీరు ఆమెతో చేతులు కలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. వారు "మోదీ హటావో" నినాదంతో కలిసినట్లు చెబుతున్నారు గానీ వాస్తవానికి "పరివార్ బచావో(మమ్మల్ని కాపాడండి)" అనే నినాదంతో వెళ్లి ఉంటే బాగుండేదన్నారు. ఈ విపక్షాల సమావేశం వలన మాకు గానీ బీజేపీ ప్రభుత్వానికి గానీ కలిగే నష్టమేమీ లేదని ఇదే ప్రయత్నం వీళ్ళు 2019లో కూడా చేశారని, ప్రజలు వాస్తవాలను గ్రహించి మళ్ళీ మోదీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు. ఇక ఇదే సమావేశంలో లాలూతో కలిసి ఉద్దవ్ థాక్రే చేతులు కలపడమంటే అది తన తండ్రిని అవమానించడమేనని తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ నేత చిత్రా కిషోర్ వాఘ్. గతంలో ఓసారి మీ నాన్నను ఉద్దేశించి లాలూ మాట్లాడుతూ.. థాక్రే మూలాలు బీహార్లోని ఉన్నాయని నోరుపారేసుకున్నారు. ఆరోజు మీ నాన్న ఏమన్నారో చూసి బుద్ధి తెచ్చుకోండని ఒక వీడియోని పోస్ట్ చేశారు. వీడియోలో బాల్ థాక్రే స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. देखिए उद्धव जी, आपके पिता वंदनीय बाला साहेब ठाकरे जी का ये वीडियो... सुनिए बाला साहेब जी ने लालू प्रसाद यादव को क्या कहा. ये व्हिडीओ देखकर आप समझ जाएंगे कि आपने बाला साहेब ठाकरे जी के विचारों को कैसे मिट्टी में मिला दिया…@OfficeofUT बाला साहेब की भाषा में कहें तो 'लालू के… pic.twitter.com/a85OzVCi70 — Chitra Kishor Wagh (@ChitraKWagh) June 23, 2023 ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం.. -
‘ఇదే అసలైన పార్టీ.. ఈయనే అసలైన నాయకుడు’
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన(UBT) ఎమ్మెల్సీ మనీషా కయాండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. రెండ్రోజుల క్రితమే శిశిర్ షిండే ఉద్ధవ్ థాక్రే పార్టీని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. అంతలోనే మనీషా కయాండే పార్టీని వీడటంతో శివసేన(UBT) ఆత్మరక్షణలో పడింది. శివసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ మనీషా ఉద్ధవ్ థాక్రేపైనా ఆ పార్టీ నేతలు సంజయ్ రౌత్, సుష్మా అంధారేలపైనా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన పార్టీనే అసలైనదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తోందని అభినందించారు. గత ఏడాది కాలంగా నాయకులంతా ఒక్కొక్కరుగా ఉద్ధవ్ పార్టీని విడిచిపోతుంటే వారంతా ఎందుకు వెళ్లిపోతున్నారన్న ఆత్మపరిశీలన చేసుకుంటారని ఎదురు చూశానన్నారు. వారలా చేయకపోగా కాంగ్రెస్-ఎన్సీపీ ఎజెండాను ప్రచారం చేసే పనిలో ఉన్నారు. సంజయ్ రౌత్, సుష్మాపై అంధారేలైతే హిందూ దేవతలను కించపరుస్తూ కాంగ్రెస్-ఎన్సీపీ గొంతును వినిపిస్తున్నారు. ఇక ఉద్ధవ్ థాక్రే పార్టీ తాను పార్టీ వ్యతిరేక కార్కకలాపాలకు పాల్పడుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని, తానెన్నడూ అలా ప్రవర్తించలేదని, వారే మహిళల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీని వీడిపోతున్న సందర్బంగా చెత్త నుంచే విద్యుత్తు పుడుతుందన్న విషయాన్ని ఉద్ధవ్ థాక్రే మరచిపోకూడదని ఆమె గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఆమె బీజేపీ పార్టీతో తెగదెంపులు చేసుకుని మనీషా కయాండే మా పార్టీలోకి వచ్చారు. ఒక ఏడాదిలో ఆమె ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుంది. తిరిగి నామినేట్ అయ్యే అవకాశం లేకే రంగు మార్చారని అన్నారు శివసేన(UBT) నేత వినాయక్ రౌత్. ఇది కూడా చదవండి: కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్ -
'దేశానికి క్షమాపణలు చెప్పండి' ఆదిపురుష్ టీంపై మహిళా ఎంపీ ఫైర్..
ఢిల్లీ: శివ్ సేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆదిపురుష్ సినిమా టీంపై విరుచుకుపడ్డారు. హిందూ పురాణమైన రామాయణానికి తగ్గట్టుగా సినిమాలో డైలాగ్స్ లేవని ఆరోపించారు. చిత్ర బృందం దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 'డైలాగ్ రచయిత మనోజ్ముంతాషిర్, డైరెక్టర హోం రౌత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. డైలాగ్లు గౌరవప్రదంగా లేవు. ముఖ్యంగా హనుమంతుని డైలాగ్లు సరిగా లేవు. వినోదం పేరుతో హిందు దేవుళ్లపై తీసిన సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే భాషను వాడారు. మర్యాద పురుషోత్తమ రామునిపై సినిమా తీసి.. త్వరగా రిలీజ్ చేయాలని మర్యాదను మరిచారు' అని ప్రియాంక చతుర్వేది అన్నారు. మైథాలాజికల్ యాక్షన్ ఫిల్మ్ ఆదిపురుష్ శుక్రవారం రిలీజ్ అయింది. రూ.500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతీ షోలో ఓ సీటు హనుమంతుని కోసం ఉంటుందని దర్శకుడు హోం రౌత్ చెప్పారు. సినిమా బాలేదని చెప్పిన ప్రేక్షకులపై దాడులు జరిగిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలో దృశ్యాలు ఉన్నాయని దిల్లీ హైకోర్టులో ఇప్పటికే హిందూ సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఇదీ చదవండి:మనోభావాలు దెబ్బతిన్నాయ్.. ఆదిపురుష్పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement