-
సంక్రాంతి సినిమాల గొడవ.. ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏం చూడాలనేది ప్రేక్షకులు డిసైడ్ అవుతారు. ప్రతిసారి ఇదే జరిగేది. కానీ ఈసారి మాత్రం అంతకు మించి అనేలా పరిస్థితి తయారైంది. కొందరు నిర్మాతలు కావాలనే కొన్ని సినిమాల్ని తొక్కేస్తున్నారని సోషల్ మీడియాలో నానా హంగామా నడించింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇక లాభం లేదనుకుని స్వయంగా ఫిల్మ్ ఛాంబర్ ఈ గొడవపై స్పందించింది. కీలక ప్రకటన రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) 'సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు థియేటర్ల వివాదాలపై తెలుగు చిత్రాలకి సంబంధించి మా మూడు సంస్థలు 15 రోజుల క్రితం ఓ మీటింగ్ పెట్టి సంక్రాంతి బరిలో ఉన్న ఐదుగురు ప్రొడ్యూసర్లని పిలిచి గ్రౌండ్ రియాలిటీ వివరించి సహకరించమని కోరాం. సంక్రాంతి బరిలో ప్రతి ఏటా సినిమాల పోటీ ఉంటుంది. అలానే ఈసారి ఐదు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. హనుమాన్, ఈగల్, సైంధవ్, గుంటూరు కారం, నా సామి రంగ. ఛాంబర్ వినతిని మన్నించి సంక్రాంతి బరి నుంచి 'ఈగల్' రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9కి మార్చారు' 'సంక్రాంతి అంటే సినిమాల మధ్య మంచి పోటీ వాతావరణం ఉంటుంది. తెలుగు సినిమాకి సంబంధించి మా మూడు సంస్థలు కలిపి ఏ హీరోకి ప్రొడ్యూసర్ కి దర్శకుడు కి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నడిపిస్తున్నాం. కానీ కొన్ని సైట్ల వాళ్లు ఫ్యాన్స్, హీరోలు, ప్రొడ్యూసర్ల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజాన్ని తెలుసుకుని వార్తలని రాయాల్సిందిగా కోరుతున్నాం. ఇకనుంచి సోషల్ మీడియా, ఇతర మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టే రాతలు రాస్తే మాత్రం తగిన చర్యలు తీసుకుంటాం' అని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటనలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
హోరాహోరీగా సాగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.. ఓటేసింది వీళ్లే (ఫోటోలు)
-
జులై 30న తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్
-
విశ్వక్ సేన్- అర్జున్ వివాదం..యంగ్ హీరోపై చర్యలు తప్పవా?
యంగ్ హీరో విశ్వక్సేన్- యాక్షన్ కింగ్ అర్జున్ల మధ్య వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. తన కూతుర్ని టాలీవుడ్కు పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా గ్రాండ్గా జరిగింది. అర్జున్ డైరెక్షన్లో రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇలాంటి సమయంలో విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అర్జున్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్కి సమయానికి రాకుండా ఇబ్బందులు పెట్టాడని, విశ్వక్ కమిట్మెంట్ లేని యాక్టర్ అంటూ అర్జున్ దుయ్యబట్టారు. 'షూటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు రాలేను అని మెసేజ్ పెడతాడు. అయినా సరే అతనికి నచ్చినట్లే క్యాన్సిల్ చేశాం. కానీ ప్రతిసారి షూటింగ్ వస్తానని చెప్పి డుమ్మా కొడతాడు. అతని వళ్ల సీనియర్ హీరోల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో టీమ్ వర్క్ ప్రధానం. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయిలో ఉంది. ఇప్పటివరకు తాను ఏ యాక్టర్, టెక్నీషియన్కు చేయలేనన్ని కాల్స్ విశ్వక్కి చేశాను. రెమ్యూనరేషన్ కింద అడ్వాన్స్ కూడా ఇచ్చాను, అయినప్పటికీ విశ్వక్ ఇలా షూటింగ్ ఎగ్గొట్టడం సమంజసం కాదు. ఈ విషయంపై ప్రొడ్యూసర్ గిల్ట్కు ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో 100కోట్లు వచ్చినా విశ్వక్తో సినిమా చేసేది లేదు' అంటూ అర్జున్ తెగేసి చెప్పారు. ఈ క్రమంలో గతంలో ఇలా అగ్రిమెంట్ కమిట్మెంట్ అయ్యాక అనుకోని పరిస్థిత్లులో దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తే ప్రొడ్యూసర్ గిల్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో బిగ్బాస్ ఫేమ్ అలీరెజా, నిర్మాతలకు విభేదాలు వస్తే.. ప్రొడ్యూసర్ గిల్డ్ అతన్ని రెండేళ్లు బ్యాన్ చేసింది. ‘బిగ్బాస్ ఆఫర్ వచ్చిన సమయంలో ఓ సినిమా విషయంలో చిన్న మిస్టేక్ చేశా. నిర్మాతలు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశారు. దీంతో నన్ను రెండేళ్ల పాటు బ్యాన్ చేశారు’ అని అలీ రెజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సమయానికి షూటింగ్కి రావట్లేదంటూ ప్రకాశ్ రాజ్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కొన్నాళ్ల పాటు బ్యాన్ చేసింది. తర్వాత ప్రకాశ్ రాజ్ వచ్చి వివరణ ఇవ్వడంతో నిషేధం ఎత్తేశారు. వీరితో పాటు పలువురు నటీనటులు ఇచ్చిన కమిట్మెంట్ను బ్రేక్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్లపై ప్రొడ్యూసర్ గిల్ట్ చర్యలు తీసుకుంది. మరి విశ్వక్సేన్ను కూడా కొన్నాళ్లపాటు బ్యాన్ చేస్తారా? అతడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అర్జున్ మాత్రం గొడవ పెట్టుకోవడానికి మీడియా ముందుకు రాలేదని, మరో నిర్మాతకు ఇలాంటి సమస్యలు రావొద్దనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయబోతున్నానని తెలిపాడు. -
సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల మండలి కీలక ప్రకటన
సినీ కార్మికుల వేతనాల పెంపుకు చలన చిత్ర నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మికుల డిమాండ్ మేరకు వేతనాలను 30 శాతం పెంచుతున్నట్లు తాజాగా ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి, ఫలిం ఫెడరేషన్ సంయుక్తంగా అధికారిక ప్రకటన ఇచ్చింది. పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చాయి. ఇక ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అనేది ఫిలిం చాంబర్, ఫెడరేషన్ కలిసి నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఈ తాజా వేతనాల పెంపు సవరణ అనేది 01-07-2022 నుంచి 30-06-2025 వరకు అమలవుందని నిర్మతల మండలి స్పష్టం చేసింది. కాగా ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిం ఫెడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటిసులు ఇచ్చింది. అంతేకాదు తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది. Telugu Film Industry PRESS NOTE#TFPC #TELUGUFILMPRODUCERSCOUNCIL #TFCC #TFI pic.twitter.com/7XBs9feYkp — Telugu Film Producers Council (@tfpcin) September 15, 2022 చదవండి: అషురెడ్డి బర్త్డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రవి ప్రసాద్ మృతి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement