Suryansh Shedge
-
పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదు.. వైభవ్పై సంచలన వ్యాఖ్యలు
అతి పిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో అలరిస్తూ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్.. ఏకంగా 776 పరుగులు సాధించాడు.పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించే, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టీ20 జట్టులో అతడికి స్థానం దక్కింది.ముక్కోణపు వన్డే సిరీస్లోఇక ప్రస్తుతం భారత్- ‘ఎ’ తరఫున వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. భారత్, లంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్తో ఈ ఓపెనింగ్ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. అయితే, సోమవారం శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయాడు. సూపర్ ఓవర్లో విజయం సాధించిన తర్వాత శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్, సూర్యాంశ్ షెడ్గేలను ఉద్దేశించి ఏదో అన్నాడు.దీంతో వైభవ్, సూర్యాంశ్ లంక ప్లేయర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పరస్పరం నెట్టేసుకున్నారు. లంక ఆటగాడి ఛాతీపై చేయి వేసి వైభవ్ వెనక్కి నెట్టాడు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ వేలు చూపిస్తూ బెదిరించినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026వైభవ్ ప్రవర్తనపై విమర్శలుఈ నేపథ్యంలో వైభవ్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. చిన్న వయసులో ఇంత దూకుడు పనికిరాదని.. కాస్త ఓర్పుతో ఉండాలని మాజీ క్రికెటర్లు సద్విమర్శలు చేస్తున్నారు. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు మీడియా మాజీ మేనేజర్ బ్రేన్ థామస్ మాత్రం శ్రుతిమించాడు. సూర్యవంశీతో పాటు భారత ప్రజల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదంటూ ఓవరాక్షన్‘‘సూర్యవంశీ.. అతడి చెత్త కోపానికి సంబంధించిన ఫుటేజీని ఇప్పుడే చూశాను. క్రికెట్లో యెల్లో, రెడ్ కార్డులు లేకపోవడం విచారకరం. ఒకవేళ మ్యాచ్ రిఫరీ గనుక ఈ కౌబాయ్ను తదుపరి మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తే బాగుంటుంది.అప్పుడే ఎలా ప్రవర్తించాలో అతడికి తెలిసి వస్తుంది. అయినా.. ఇండియాలోని గ్రామానికి చెందిన పిల్లాడి నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏం ఆశించగలము? శ్రీలంకలో మాదిరి అక్కడి పిల్లల పెంపకం అంత గొప్పగా ఏమీ ఉండదు.హేయ్ సూర్యవంశీ నువ్వు గనుక సంతోషంగా లేకుంటే.. ఇండియాలో నిన్ను పొగుడుతూ నెత్తికెక్కించుకునే వాళ్ల దగ్గరికి వెళ్లిపో. మీ ఇంటికి పో. ఇది జెంటిల్మెన్ గేమ్’’ అంటూ బ్రేన్ థామస్ పరుష పదజాలంతో వైభవ్ను కించపరిచాడు. దీంతో భారత నెటిజన్లు సైతం థామస్కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ‘స్పెల్లింగ్ సరిగా రాయడం రాని నువ్వు చదువు గురించి మాట్లాడుతున్నావా? 15 ఏళ్ల పిల్లాడిపై ఇంత విషం చిమ్ముతావా?’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ సిరీస్లో వైభవ్ ఇప్పటికి మూడు మ్యాచ్లలో వరుసగా.. 14, 44, 21 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లు!భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అక్కసు -
IND vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులే ట్విస్టులు.. ఆఖరికి
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-‘ఎ’ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలుత అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన భారత జట్టు తాజాగా.. సోమవారం నాటి మ్యాచ్లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది.ముక్కోణపు వన్డే సిరీస్కాగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య జూన్ 9న ముక్కోణపు వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్లో శ్రీలంకపై భారత్ 8 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో అఫ్గనిస్తాన్ భారత్పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.ఇక మూడో మ్యాచ్లో శ్రీలంక అఫ్గనిస్తాన్పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నాలుగో మ్యాచ్లో భాగంగా సోమవారం భారత్- శ్రీలంక రెండోసారి తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు.. తిలక్ వర్మ సేన తొలుత బ్యాటింగ్కు దిగింది.265 పరుగులు చేసి ఆలౌట్గత మ్యాచ్లో ఆకట్టుకున్న భారత ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) ఈసారి నిరాశపరిచారు. ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈసారి 37 పరుగులకే పరిమితం కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 23 పరుగులే చేశాడు. ఆయుశ్ బదోని 15, నిశాంత్ సింధు 6, అనుకుల్ రాయ్ 8, అర్షద్ ఖాన్ 2 పరుగులు చేసి నిష్క్రమించారు.అయితే, ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే 66 బంతుల్లో 72, విప్రాజ్ నిగమ్ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి అర్ద శతకాల కారణంగా భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.పది పరుగుల పెనాల్టీశ్రీలంక బౌలర్లలో విజయకాంత్ వియస్కాంత్, మొహ్మద్ షిరాజ్ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. కెప్టెన్ సహన్ అరాచిగే, వనుజా సహన్, కుగాతస్ మతూలన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే, విప్రాజ్ నిగమ్ పరుగులు తీసే క్రమంలో రెండుసార్లు పిచ్ మధ్యభాగంలోకి వచ్చాడు. దీంతో భారత జట్టుకు పది పరుగుల పెనాల్టీ పడింది.Not every day you see 5 runs off a helmet hit😅 Watch #SLvIND in the #TalentTVCup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV 📺 #SonySportsNetwork #SonyLIV #TeamIndia pic.twitter.com/2db4eMFJpL— Sony Sports Network (@SonySportsNetwk) June 15, 2026ఫలితంగా శ్రీలంక 10/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, బౌలింగ్ సమయంలో బంతి వికెట్ కీపర్ హెల్మెట్కు తాకడంతో శ్రీలంకకు కూడా పెనాల్టీ పడింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు నిరోషన్ డిక్విల్లా (37), అవిష్క ఫెర్నాండో (22) మెరుగైన ఆరంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ విశేన్ హలంబగే (17) విఫలమయ్యాడు. కెప్టెన్ సహన్ అరాచిగే 8 పరుగులకే నిష్క్రమించగా.. అహాన్ విక్రమసింఘే 6 పరుగులు చేసి అవుటయ్యాడు.ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా వనుజా సహన్ (25) రాణించగా.. విజయకాంత్ వియస్కాంత్ 39 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు.నరాలు తెగే ఉత్కంఠఇక 47 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయగా.. విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికి సదీర సమరవిక్రమ 104 బంతుల్లో 88 పరుగుల వద్ద ఉన్నాడు.ఈ క్రమంలో 48వ ఓవర్లో ఆరు పరుగులు రాగా.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సదీర ఆచితూచి ఆడాడు. ఇలాంటి తరుణంలో యశ్ ఠాకూర్ నోబాల్తో 48వ ఓవర్ ఆఖరి బంతికి లంకకు ఫ్రీహిట్ రాగా.. గుణశేఖర ఫోర్ బాదాడు. దీంతో చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. అర్షద్ ఖాన్ బంతితో రంగంలోకి దిగాడు.తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని.. అర్షద్ రెండో బంతికి సదీర సమరవిక్రమను బౌల్డ్ చేశాడు. దీంతో 93 పరుగుల వద్ద సదీర నిష్క్రమించగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులుగా లంక విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షిరాజ్ మూడో బంతికి సింగిల్ తీయగా.. ఆ తర్వాత గుణశేఖర సైతం సింగిల్ పూర్తి చేశాడు.దీంతో రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం కాగా.. అర్షద్పై ఒత్తిడి పెరిగింది. ఐదో బంతికి షిరాజ్ సింగ్ తీయడంతో సమీకరణం ఆఖరి బంతికి రెండు పరుగులుగా మారింది. అయితే, ఆఖరి బంతికి పరుగు తీసిన గుణశేఖర రెండో పరుగు కోసం రాగా.. రనౌట్ అయ్యాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.సూపర్ ఓవర్ ముగిసిందిలా..అయితే, గుణశేఖర షాట్ ఆడినట్లు కనిపించలేదని.. బంతి ఫ్లిక్ అయి కీపర్ వైపు వెళ్లింది కాబట్టి దీనిని రన్గా పరిగణించవద్దని భారత శిబిరం కోరగా.. ప్రతికూల నిర్ణయమే వచ్చింది. ఇక ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా.. వెలుతురులేమి సమస్యగా మారింది. అయినప్పటికీ సూపర్ కోసం పట్టుపట్టగా.. ఫ్లడ్లైట్లు లేకుండానే శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగింది.భారత కెప్టెన్ తిలక్ వర్మ అర్షద్ ఖాన్ చేతికి బంతినివ్వగా.. వైడ్, నోబాల్ రూపంలో భారత్ మూల్యం చెల్లించింది. శ్రీలంక 16 పరుగులు చేసింది. అయితే, నోబ్ విషయంలో తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ మ్యాచ్ కొనసాగింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 పరుగులే చేయడంతో ఓటమి ఖరారైంది. -
IND vs SL: కొంపముంచేశాడు.. భారత్కు భారీ షాక్!
శ్రీలంక, అఫ్గనిస్తాన్లతో ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ ఇప్పటికి రెండు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. తొలుత ఆతిథ్య లంక జట్టుతో తలపడ్డ తిలక్ వర్మ సేన.. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.అఫ్గన్ చేతిలో ఓటమిఅనంతరం అఫ్గన్-‘ఎ’ జట్టుతో మ్యాచ్లో 349 పరుగుల మేర భారీ స్కోరు సాధించినప్పటికీ.. భారత జట్టుకు పరాభవం తప్పలేదు. వర్షం పదేపదే అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో అఫ్గన్ జట్టు డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.ఫలితంగా పాయింట్ల పట్టికలో అఫ్గనిస్తాన్ అగ్రస్థానానికి దూసుకుపోగా.. భారత్, శ్రీలంక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే, తర్వాతి మ్యాచ్లో అఫ్గనిస్తాన్పై గెలిచి లంక టాప్కు దూసుకెళ్లగా.. భారత్ రెండు, అఫ్గన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.మరోసారి శ్రీలంకతోఈ ట్రై సిరీస్లో భాగంగా భారత్ సోమవారం నాటి మ్యాచ్లో మరోసారి శ్రీలంకతో తలపడుతోంది. దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 37, కెప్టెన్ తిలక్ వర్మ 23 పరుగులు చేశారు. మిగతా వారిలో ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.రెండుసార్లు అదే తప్పుఅయితే, విప్రాజ్ చేసిన పొరపాటు వల్ల భారత్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. భారత్-‘ఎ’ ఇన్నింగ్స్లో 35వ, 37వ ఓవర్లలో విప్రాజ్.. సింగిల్ తీసే క్రమంలో పిచ్ మధ్యలో పరిగెత్తాడు. ఎంసీసీ నిబంధన 41.14 ప్రకారం.. ఉద్వేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ పిచ్ మధ్యలో (ప్రొటెక్టెడ్ ఏరియా)కి వచ్చి డ్యామేజ్కు కారణమయ్యే పరిస్థితి తలెత్తితే తొలుత అంపైర్ సదరు స్ట్రైకర్ను హెచ్చరిస్తాడు.ఇదే తప్పు పునరావృతం చేస్తే బ్యాటింగ్ చేసే జట్టు స్కోరులో ఐదు పరుగుల మేర కోత విధిస్తారు. అయితే, ఇక్కడ తొలుత అనుకుల్ రాయ్ కూడా ఇలాంటి తప్పిదానికే పాల్పడగా.. అంపైర్ వార్నింగ్తో వదిలేశాడు. అయితే, విప్రాజ్ ఒకటి కాకుండా.. ఏకంగా రెండుసార్లు పిచ్ మధ్యలోకి రావడంతో మొత్తంగా భారత్కు పది పరుగుల మేర నష్టం కలిగింది.పది పరుగుల నష్టంఫలితంగా శ్రీలంక తమ ఇన్నింగ్స్ను 10/0తో మొదలుపెట్టింది. అంటే విప్రాజ్ తప్పిదం వల్ల ప్రత్యర్థికి అదనంగా పది పరుగుల మేర లాభం చేకూరింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఈ ఆల్రౌండర్ చేసిన తప్పిదం దేనికి దారితీస్తుందో చూడాలి మరి!!చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ విండీస్ కైవసం -
సూర్యాన్ష్ మెరుపులు.. ఇండియా-ఏ భారీ స్కోరు
ముక్కోనఫు వన్డే సిరీస్లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో ఇండియా-ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (21) మరోసారి నిరాశపరచగా, రుతురాజ్ గైక్వాడ్ (37), కెప్టెన్ తిలక్ వర్మ (23) పర్వాలేదనిపించారు. ఒక దశలో 143 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇండియా-ఏ జట్టును సూర్యాన్ష్, విప్రజ్ ఆదుకున్నారు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో సూర్యాన్ష్, విప్రజ్ నిగమ్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు. ఈ ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్కు 104 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో విజయ్కాంత్ వియస్కాంత్ 3 వికెట్లు తీయగా, మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.చదవండి: పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్!


