breaking news
super
-
రాబోయేది ఆషామాషీ ఎల్ నినో కాదు!
ప్రపంచ వాతావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఎల్ నినో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈసారి ఇది సాధారణ ఎల్నినో కాదని, గతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన ఘటనల్లో ఒకటిగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం కొన్ని నెలలపాటు కొనసాగితే భారత్ సహా ప్రపంచానికి ‘ట్రిపుల్ షాక్’ తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, అసాధారణ వాతావరణ మార్పులు వరుసగా ఎదురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.తాజాగా విడుదలైన నార్త్ అమెరికన్ మల్టీ-మోడల్ ఎన్సెంబుల్ (NMME) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల అంచనాల ప్రకారం.. మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సాధారణ స్థాయికంటే 2 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని నమూనాల్లో ఈ వ్యత్యాసం 5 డిగ్రీల సెల్సియస్ను కూడా దాటవచ్చని సూచిస్తున్నాయి.వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. పసిఫిక్లోని నినో-3.4 ప్రాంతంలో(మానిటరింగ్ జోన్) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 1.5 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటే దాన్ని ‘బలమైన ఎల్నినో’గా పరిగణిస్తారు. 2 డిగ్రీలకుపైగా పెరిగితే ‘సూపర్ ఎల్నినో’గా వర్గీకరిస్తారు. తాజా అంచనాల ప్రకారం 2026 చివరినాటికి ఈ స్థాయిని దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇది ఇంకా ప్రారంభ అంచనాల దశలోనే ఉన్నందున తుది ఫలితంగా పరిగణించలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే వివిధ వాతావరణ నమూనాలు ఎల్ నినో బలపడే సంకేతాలను చూపుతుండటంతో శాస్త్రవేత్తలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.ఎల్నినో ప్రభావం వల్ల భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా గాలుల ప్రసరణ విధానాలు మారిపోతాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు, సముద్ర ఉష్ణ తరంగాలు, పగడపు దిబ్బల నాశనం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే భారత్కు ఇది మరింత ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.చరిత్రను పరిశీలిస్తే బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడటం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం, వడగాల్పులు తీవ్రరూపం దాల్చడం వంటి పరిస్థితులు తరచుగా కనిపించాయి. దీంతో వ్యవసాయం, తాగునీటి వనరులు, ఆహార ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అస్తవ్యస్తత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు పెరగవచ్చు. దక్షిణ అమెరికా పశ్చిమ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంది. ట్రిపుల్ షాక్.. ఎల్ నినో బలపడితే ఒకేసారి మూడు పెద్ద స్థాయిలో ప్రభావాలు రావచ్చని సూచన:రుతుపవనాలు బలహీనపడే అవకాశంవర్షాభావం / కరువు పరిస్థితులువడగాల్పులు పెరగడంకొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో భారీ వర్షాలు/వరదలుగ్లోబల్ టెంపరేచర్లు పెరగడంసముద్ర ఉష్ణతరంగాలుపగడపు దిబ్బల (coral reefs) నష్టంకార్చిచ్చులు పెరగడం (ఆస్ట్రేలియా/ఆగ్నేయాసియా)ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా భూమి అసాధారణ వేడిని ఎదుర్కొంటున్న వేళ.. దానికి ఎల్నినో ప్రభావం తోడైతే 2027 వరకూ ప్రపంచం మరింత తీవ్రమైన వాతావరణ అస్తవ్యస్తతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
మనకు ఎల్ ని‘నో’!
సాక్షి స్పెషల్ డెస్క్ : పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన ‘సూపర్ ఎల్ నినో’పరిస్థితులు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దీనివల్ల సాధారణంగా భారతదేశంలో నైరుతి రుతుపవనా లు బలహీనపడి, వర్షాలు తగ్గిపోయి తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. కానీ ప్రస్తుతం ఆ ముప్పు తప్పే అవకాశం ఏర్పడింది. హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఒక అరుదైన వాతావరణ పరిస్థితి మనల్ని కాపాడనున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ పరిస్థితినే శాస్త్రవేత్తలు ‘పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్’ (పాజిటివ్ ఐఓడీ) లేదా ‘ఇండియన్ నినో’అని పిలుస్తున్నారు. ఏమిటీ పాజిటివ్ ఐఓడీ?: హిందూ మహాసముద్రం తూర్పు, పశ్చిమ భాగాల మధ్య ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పునే ‘ఐఓడీ’అంటారు. ఈ పరిస్థితులో పశ్చిమ భాగం (భారత్/ఆఫ్రికా వైపు) సముద్రపు నీరు సాధారణం కంటే బాగా వేడెక్కుతుంది. దీనివల్ల భారీగా తేమతో కూడిన మేఘాలు ఏర్పడతాయి. తూర్పు భాగం (ఇండోనేసియా వైపు)లో నీరు సాధారణం కంటే చల్లబడుతుంది. పసిఫిక్లోని ఎల్ నినో మన దేశానికి వచ్చే రుతుపవన గాలులను వెనక్కి లాగేస్తుంటే.. హిందూ మహాసముద్రంలోని ‘ఇండియన్ నినో’ఆ గాలులను అంతే బలంగా మన దేశం వైపు నెడుతుంది. ఫలితంగా ఎల్ నినో తెచ్చే పొడి గాలులు తటస్థంగా మారి, దేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 1997 నాటి వాతావరణ అద్భుతం!: ఇలాంటి పరిస్థితి 1997లోనూ చోటు చేసుకుంది. ఆ ఏడాది.. శతాబ్దంలోనే అత్యంత బలమైన ఎల్ నినో రావడంతో భారత్లో తీవ్ర కరువు ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. కానీ సరిగ్గా అదే సమయంలో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ‘పాజిటివ్ ఐఓడీ’... ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తిప్పికొట్టింది. ఆ ఏడాది కరువు రాకపోగా.. దేశంలో సాధారణం కంటే 2 శాతం ఎక్కువే వర్షాలు కురిశాయి. వాస్తవానికి ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ దేశంలో కరువు రావాలనేమీ లేదు. అయితే ఈ ఏడాది మనకు ‘ఇండియన్ నినో’రక్షణగా నిలవబోతున్నదన్న అంచనాలు, భారతీయ రైతాంగానికి, సాధారణ ప్రజలకు ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి. -
AI Mission Million వైపు సూపర్ AI అకాడమీ
హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యా వ్యవస్థలను ప్రభావితం చేస్తూ కొత్త యుగానికి నాంది పలుకుతున్న వేళ, ఈ సాంకేతికతను సామాన్య ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సూపర్ AI అకాడమీ మరో కీలక మైలురాయిని చేరుకుంది. సంస్థ ఇప్పటికే 25 వేల మందికి పైగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వ్యాపారవేత్తలు మరియు యువతకు AI శిక్షణ అందించి ప్రత్యేక గుర్తింపు పొందింది."AI Mission Million" పేరుతో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్న ఈ సంస్థ, 2027 ఏప్రిల్ నాటికి లక్ష మంది, 2030 నాటికి 10 లక్షల మందిని AI ద్వారా సాధికారత చేయాలని సంకల్పించింది.సూపర్ AI నెక్స్ట్జెన్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి కిరణ్ మాట్లాడుతూ, “AI అనేది ఇకపై భవిష్యత్ టెక్నాలజీ కాదు. ఇది ఇప్పటికే మన దైనందిన జీవితంలో భాగమైంది. ఈ మార్పులో తెలుగు ప్రజలు వెనుకబడకుండా, ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడం మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.సంస్థ డైరెక్టర్ నికీలు గుండా మాట్లాడుతూ, “AI విద్యను కేవలం టెక్నికల్ వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయకుండా, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. AIను అర్థం చేసుకుని ఉపయోగించగలిగితే వ్యక్తిగత అభివృద్ధి, ఉపాధి, వ్యాపార వృద్ధి వంటి అనేక అవకాశాలు తెరుచుకుంటాయి” అని పేర్కొన్నారు.మహిళా సాధికారతకు AI అండమహిళల ఆర్థిక స్వావలంబనకు AI కీలక సాధనంగా మారుతుందనే నమ్మకంతో సూపర్ AI అకాడమీ SUPER AI Women's Club కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా గృహిణులు, మహిళా వ్యాపారవేత్తలు, ఉద్యోగినులు AI ఆధారిత సేవలను అందించడం, డిజిటల్ వ్యాపారాలను ప్రారంభించడం, ఫ్రీలాన్సింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవడం వంటి అంశాల్లో శిక్షణ పొందుతున్నారు.2030 నాటికి 10 వేల మంది మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా సంస్థ వెల్లడించింది.వ్యాపార వృద్ధికి AIచిన్న, మధ్య తరహా వ్యాపారాలు AIను వినియోగించి తమ ఉత్పాదకతను పెంచుకోవడం, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించడం, అమ్మకాలను పెంచుకోవడం, కస్టమర్ సేవలను మెరుగుపరచుకోవడం వంటి అంశాలపై సూపర్ AI అకాడమీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.AI ఆధారిత మార్కెటింగ్, లీడ్ జనరేషన్, కంటెంట్ క్రియేషన్, సేల్స్ ఆటోమేషన్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి అంశాల్లో ఇప్పటికే వందలాది మంది వ్యాపారవేత్తలకు శిక్షణ అందించినట్లు సంస్థ తెలిపింది.కళాశాలల్లో AI క్లబ్లుభవిష్యత్ ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో AI Student Clubs ఏర్పాటు చేయడానికి సూపర్ AI అకాడమీ ప్రణాళిక రూపొందిస్తోంది.ఈ క్లబ్ల ద్వారా విద్యార్థులకు AI ఫండమెంటల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, AI రీసెర్చ్ టూల్స్, కెరీర్ అప్లికేషన్స్, AI ఆధారిత స్టార్టప్ అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించడం, భవిష్యత్ టెక్నాలజీ నాయకులను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు.త్వరలో AI Creator ClubAI ఆధారిత కంటెంట్ క్రియేషన్, వీడియో ప్రొడక్షన్, డిజైనింగ్, డిజిటల్ బ్రాండింగ్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, యువత మరియు క్రియేటర్ల కోసం AI Creator Club ను ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది.ఈ క్లబ్ ద్వారా సోషల్ మీడియా క్రియేటర్లు, యూట్యూబర్లు, డిజైనర్లు, మార్కెటర్లు మరియు డిజిటల్ ప్రొఫెషనల్స్కు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.1000 మంది AI కోచ్ల తయారీదేశవ్యాప్తంగా AI అవగాహనను మరింత విస్తరించేందుకు 1000 మంది AI Coaches ను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.ఉపాధ్యాయులు, ట్రైనర్లు, కన్సల్టెంట్లు, కోచ్లు AIలో నైపుణ్యం సాధించి తమ ప్రాంతాల్లో వేలాది మందికి AI విద్యను అందించేలా ఈ కార్యక్రమం రూపొందించబడుతోంది.Microsoft – Certiport భాగస్వామ్యంసూపర్ AI అకాడమీ ఇటీవల మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన Microsoft మరియు Certiport అధికారిక సర్టిఫికేషన్ భాగస్వామిగా సంస్థ ఎంపికైంది.దీంతో అంతర్జాతీయ ప్రమాణాల డిజిటల్ మరియు AI సర్టిఫికేషన్ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం లభించిందని సంస్థ పేర్కొంది.ఈ ఉద్యమం వెనుక ఉన్న ఆలోచనసూపర్ AI అకాడమీ వెనుక ఉన్న ప్రధాన ఆలోచనల్లో ఒకటి సంస్థ డైరెక్టర్ నికీలు గుండా యొక్క గత దశాబ్ద కాల అనుభవం. డిజిటల్ మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, బ్రాండింగ్, వ్యాపారాభివృద్ధి రంగాల్లో పని చేసిన ఆయన, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని వినియోగించే నైపుణ్యాల కొరత సమాజంలో ఎక్కువగా ఉందని గుర్తించారు.ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చిన్న వ్యాపారాలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు.గతంలో డిజిటల్ లిటరసీ, వ్యాపారాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్ ఎకోసిస్టమ్, యువత సాధికారత వంటి అంశాలపై వేలాది మందికి శిక్షణ ఇచ్చిన అనుభవం ప్రస్తుతం AI Mission Million రూపకల్పనకు దోహదపడిందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.AI కేవలం సాంకేతిక రంగానికే పరిమితం కాకుండా, ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే సాధనంగా మారుతుందని భావించిన నికీలు గుండా, AI విద్యను తెలుగు భాషలో అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అదే ఆలోచనతో ప్రారంభమైన కార్యక్రమాలు నేడు వేలాది మంది సభ్యులతో కూడిన కమ్యూనిటీగా ఎదిగాయి.వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, ట్రైనర్లు వంటి విభిన్న వర్గాలకు AIను చేరవేయాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ మిషన్, భవిష్యత్లో లక్షలాది మందికి ఉపయోగపడే సామాజిక ఉద్యమంగా మారుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.AI Literacy నుండి AI Leadership వరకుAI గురించి అవగాహన కల్పించడం నుంచి AI ఆధారిత వ్యాపారాలు, కెరీర్ అవకాశాలు, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి వరకు సమగ్ర ప్రయాణాన్ని రూపొందించడమే సూపర్ AI అకాడమీ లక్ష్యంగా చెబుతోంది.AI Literacy, AI Productivity, AI Entrepreneurship, AI Leadership అనే నాలుగు ప్రధాన దశల ద్వారా వ్యక్తులను అభివృద్ధి చేసి, భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయాలని సంస్థ భావిస్తోంది.25 వేల మంది మైలురాయిని దాటిన సూపర్ AI అకాడమీ, ఇప్పుడు AI Mission Million ఉద్యమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా AI విద్యా విప్లవానికి దోహదపడే దిశగా అడుగులు వేస్తోంది."AI భవిష్యత్తు కాదు... ఇది వర్తమానం. ఈ మార్పులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అనే సందేశంతో సంస్థ తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తోంది.మరిన్ని వివరాలకు Super AI Academy అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు : www.superaiacademy.comగమనిక: పైన పేర్కొన్న వివరాలు, సమాచారం పూర్తిగా నిర్వాహకులు/ ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి, సాక్షి మీడియా ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం. -
కొత్త బైక్.. హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్టెక్ 2.0 విడుదల
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, మార్కెట్లోకి సరికొత్త 'హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్ టెక్ 2.0' (Super Splendor XTEC 2.0) బైక్ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 86,500 గా నిర్ణయించారు. యువతను, రోజువారీ ప్రయాణికులను ఆకర్షించేలా రిఫ్రెష్డ్ డ్యూయల్-టోన్ గ్రాఫిక్స్, 3D ఎంబ్లమ్, స్పోర్టీ రిమ్ టేపులతో ఈ బైక్ను మరింత ప్రీమియం లుక్లో డిజైన్ చేశారు.ఇందులో అమర్చిన 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 10.7 బీహెచ్పీ పవర్, 10.6 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, i3S టెక్నాలజీల సహాయంతో ఇది లీటరుకు ఏకంగా 72 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.సాంకేతికత విషయానికి వస్తే.. ఈ బైక్లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రైడర్లు ప్రయాణంలోనే ఇన్కమింగ్ కాల్స్, SMS నోటిఫికేషన్లు, మిస్డ్ కాల్ అలర్ట్లు, ఫోన్ బ్యాటరీ స్టేటస్ను నేరుగా స్క్రీన్పైనే చూసుకోవచ్చు. వీటితో పాటు రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో-ఫ్యూయల్ ఇండికేటర్, మొబైల్ ఛార్జింగ్ కోసం 2A USB టైప్-సి పోర్ట్ను కూడా ఇందులో జతచేశారు.భద్రత, రైడింగ్ కంఫర్ట్కు ఈ సరికొత్త మోడల్లో పెద్దపీట వేశారు. సూపర్ స్ప్లెండర్ సిరీస్లోనే మొదటిసారిగా ఇందులో 'హజార్డ్ లైట్లను' ప్రవేశపెట్టారు. మెరుగైన బ్రేకింగ్ కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, హ్యాండిల్బార్పైనే ఇంజన్ కిల్ స్విచ్ను అందించారు. లాంగ్ రైడింగ్లోనూ సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా విశాలమైన సీటు, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ సస్పెన్షన్ను అమర్చారు. ప్రస్తుతం ఈ బైక్ గ్లోసీ బ్లాక్, మ్యాట్ నెక్సస్ బ్లూ సహా ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో దేశవ్యాప్తంగా ఉన్న హీరో డీలర్షిప్లలో విక్రయానికి సిద్ధంగా ఉంది. -
సూపర్వుడ్ !
వాషింగ్టన్: ఉక్కు కంటే ఏకంగా 10 రెట్లు పటిష్టమైన చెక్కను అమెరికా శాస్త్రవేత్తల బృందం విజయ వంతంగా సృష్టించింది. దీనికి సూపర్వుడ్(Superwood) అని పేరుపెట్టింది. సాధారణ కలపనే రసాయన చర్యకు గురిచేసి అత్యంత పటిష్టమైన, కఠిన కలపగా రూపాంతరం చెందించారు. మౌలిక వసతుల రంగంలో నాణ్యమైన, ఎక్కువ కాలం పాడవకుండా ఉండే మన్నికైన కలపకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో స్టీల్ను తలదన్నేలా కలపను సృష్టించి అమెరికా శాస్త్రవేత్తలు ఔరా అనిపించారు. ఈ బృందానికి ప్రఖ్యాత మెటీరియల్ సైన్స్ నిపుణుడు లియాంగ్బింగ్ హూ సారథ్యం వహించారు.ఈ పరిశోధన ఫలితాలు ప్రఖ్యాత ‘నేచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. చెట్టు కలపకు పటిష్టతను, రంగును ఇచ్చే లింగ్నిన్ అనే పదార్థాన్ని కలప నుంచి తొలగించి ఆ చెక్కకు చెక్కుచెదరని పటిష్టతను ఆయన ఆపాదించగలిగారు. ఇందుకోసం హూ బృందం వినూత్నమైన పద్ధతిని అవలంభించింది. సహజ కలప చెక్క నుంచి లింగ్నిన్, హెమీ సెల్యూలోజ్లను తొలగించేందుకు ఆ చెక్కలను తొలుత సోడియం హైడ్రాక్సైడ్, సోడియా సల్ఫేట్ ద్రావకంలో ఉడకబెట్టారు. తర్వాత అదే వేడిమీద చెక్కలను సమతల పరికరంతో గట్టిగా అదిమారు.దీంతో కలపలోని కణాల సవ్యఅమరిక ధ్వంసమై అన్నీ ఒక్కదగ్గరకు చేరిపోయాయి. దీంతో సెల్యూలోజ్ నానోకణాలు చిక్కగా ఒకే దగ్గరకు చేరి కలప ఉక్కులాగా గట్టిపడింది. ఇది ఏకంగా స్టీల్ కంటే 10 రెట్లు గట్టిగా ఉన్నట్లు పలు పరీక్షల్లో నిర్ధారణ అయింది. తేమను తట్టుకుంటూ సులువుగా విరిగిపోకుండా చెక్క మరింత దృఢత్వాన్ని సంతరించుకుంది. ఈ చెక్క బరువు సైతం సాధారణ చెక్క బరువులో ఆరోవంతే ఉండటం విశేషం. తక్కువ బరువు ఉండటంతో భూకంపాల వంటి సందర్భాల్లో ఈ చెక్కతో నిర్మించిన ఇళ్లు అంత త్వరగా కంపనాలకు గురికావు.అత్యంత తేలికగా ఉండటంతో నిర్మాణంలో ఉపయోగించడం సైతం చాలా సులువు. ఇల్లు, కార్యాలయాల ఫర్నిచర్, ఇంటీరియల్ పనుల్లో రెండు సాధారణ చెక్కలు నట్లు, బోల్ట్లతో జతచేసినప్పుడు అవి త్వరగా పాడవుతుంటాయి. ఈ సమస్యకు ఈ కొత్తతరహా కలపతో చెక్ పెట్టొచ్చని కంపెనీ చెబుతోంది. సూపర్వుడ్ పేరిట ఈ చెక్కను అమెరికాలోని మేరీల్యాండ్లోని ఫ్రెడెరిక్ ప్రాంతంలో వాణిజ్యపరంగా తయారుచేయనున్నారు. హూ సహ వ్యవస్థాపకునిగా ఉన్న ఇన్వెంట్వుడ్ అనే సంస్థ ఈ కలపను తయారుచేయనుంది.సాధారణ కలప కంటే 20 రెట్లు శక్తివంతంలియాంగ్బింగ్ హూ పదేళ్ల క్రితమే ఇలా పటిష్టమైన చెక్క కోసం ప్రయోగాలు మొదలెట్టారు. ‘‘భూమిపై అత్యధికంగా లభ్యమయ్యే సహజ పాలిమర్గా సెల్యూలోజ్ను చెప్పొచ్చు. ఇది కలపలో మెండుగా ఉంటుంది. దీని సాయంతో ఉక్కులాంటి చెక్కను తయారు చేయాలని గతంలోనే భావించా. 2017లోనే ఈ తరహా ప్రయోగం చేశా. ఇన్నాళ్లకు వాణిజ్యపర ఉత్పత్తికి సిద్దమయ్యాం’’ అని హూ చెప్పారు. -
ఓడిపోతాననే భయం.. అందుకే ఇష్టపడలేదు: సమంత (ఫొటోలు)
-
ఖఫ్లీ గోధుమలు గురించి తెలుసా..! ఎందుకు తినాలంటే..!
సంప్రదాయ ఖఫ్లీ గోధుమలు గురించి విన్నారా. ఇవి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. తప్పనిసరిగా రోజువారీ ఆహారgలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్కి పేరుగాంచిన ఈ ఖఫ్లీ గోధుమలతో కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.మన దేశంలో చాలామంది ప్రజలు రోటీలను ప్రదాన ఆహారంగా తీసుకుంటారు. ఇందులో ఉండే ఫైబర్, కార్మోహైడ్రేట్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. అందుకోసం అనుకుంటే సాధారణ గోధుమలు కంటే ఈ ఖఫ్లీ గోధుమలు మరింత మంచివని చెబుతున్నారు నిపుణులు. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితులలను తట్టుకుని మరి పెరుగే ధాన్యంగా ప్రసిద్ధిగాంచింది. మహారాష్ట్రలో ఈ రకం గోధుమలను ఎక్కువగా పండిస్తారు. ప్రయోజనాలు..ఇందులో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, ఐరన్ వంటి కొన్ని ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి సమతుల్యం చేస్తుంది. ప్రత్యేకించి టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.ముఖ్యంగా గ్లూటెన్ సెన్సిటివిటీకి మంచిది. జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నవారికి బెస్ట్ ఇది. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. దీనిలో ఉన్న ఫైబర్ కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉటాయి. అవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి..గుండె శ్రేయస్సుకి తోడ్పడతాయి.బరువు నిర్వహణలో సహాయపడుతుంది.దీనిలోని ఫైబర్ కంటెంట్ మంచి పోషకమైన గట్ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది.(చదవండి: స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!) -
మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
మహిళలు తమ కుటుంబ సంక్షేమం పట్టించుకున్నంతగా తమ వ్యక్తిగత ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. అలాగే ఇంటిల్లపాదికి ఇష్టమైనవి, ఆరోగ్యకరమైన ఆహారాలు ఓపిక తెచ్చుకుని మరీ వండిపెడతారు. తమ వద్దకు వచ్చేటప్పటికీ నాకెందుకు అనే భావన లేక త్యాగమో తెలియదు గానీ సరైన పోషకాహారం మాత్రం అస్సలు తీసుకోరు. ఇలా భావించే మహిళలు ప్రతి ఇంటిలోనూ ఉంటారు. అంతేగాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం దాదాపు 1.2 మిలియన్ల మంది బాలికలు, మహిళలు పోషకాహార లోపాలతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. దీనిపై ప్రతి స్త్రీకి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఏటా సెప్టెంబర్ 25న జాతీయ మహిళల ఆరోగ్యం, ఫిట్నెస్ దినోత్సవం పేరుతో ఓ రోజుని ఏర్పాటు చేసి మరీ చైతన్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తీసుకోవాల్సిన సూపర్ఫుడ్స్ ఏంటో సవివరంగా చూద్దామా..!.పాలకూరపాలకూరలో ఐరన్ సమృద్ధిఆ ఉంటుంది. ఇది ఋతుస్రావం కారణంగా ఎదురయ్యే రక్తహీనతను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన ఫోలేట్ను కూడా ఉంటుంది. దీనిలో విటమిన్ ఏ,సీ, కే, సీలు ఉంటాయి. అందువల్ల తప్పనిసరి మహిళలు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.పెరుగు కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉన్న పెరుగు ఎముకలను బలోపేతం చేయడానికి, కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి సహాయపడుతుంది. స్త్రీలకు, ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మోనోపాజ్ దశలో కాల్షియం తగ్గిపోతుంటుంది. దీని వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి ఇది తోడ్పడుతుంది. అంతేగాదు దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.బెర్రీలుబ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటివి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి జీర్ణక్రియ, బరువు నిర్వహణలో సహాయపడే ఫైబర్ మూలం.సాల్మన్సాల్మన్ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల పవర్హౌస్. ఇది గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మద్దతు ఇస్తుంది, వాపును తగ్గిస్తుంది. ఒమేగా -3 లు మహిళలకు అత్యంత అవసరమైనవి. ఇవి మహిళల్లో మరణానికి ప్రధాన కారణం అయిన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.పప్పుకాయధాన్యాలు మొక్కల ఆధారిత ప్రోటీన్, ఐరన్ సంబంధిత మూలం. శాఖాహారం లేదా శాకాహారి ఆహారాన్ని అనుసరించే వారికి పరిపూర్ణంగా ఉంటాయి. కాయధాన్యాలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది.అక్రోట్లనువాల్నట్లు మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా-3లతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. మహిళలకు మంచి చిరుతిండిగా పేర్కొనవచ్చుస్వీట్ పొటాటోస్వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి, దృష్టికి తోడ్పడుతుంది. ఇవి ఫైబర్, పొటాషియంతో నిండి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవన్నీ మహిళలకు పోషకమైన శక్తిని పెంచే కార్బోహైడ్రేట్లుగా పనిచేస్తాయి.చియా విత్తనాలుచియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, కాల్షియంను కూడా అందిస్తాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు, గుండె ఆరోగ్యానికి, గర్భధారణ తోపాటు వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు అత్యంత ముఖ్యమైనవి.(చదవండి: అవోకాడో వర్సెస్ ఆలివ్ ఆయిల్: ఆరోగ్యానికి ఏది మంచిది?) -
మగువల మనసు దోచే స్కర్ట్... సూపర్ స్టయిల్! (ఫోటోలు)
-
యాంటీ కేన్సర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలున్న 5 సూపర్ ఫుడ్స్ఇవే!
ప్రపంచంలో జపాన్ ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు. వంద సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు కూడా దాదాపు రెండు శాతం మంది ఇక్కడ ఉన్నారు. దీనికి కారణం జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు వారి జీవనశైలి అని చెబుతారు. ఇదే మాటలను ఉటంకిస్తూ ప్రముఖ నూట్రీషనిస్ట్ డా. సింథానీ ఎక్స్లో ఒక ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. యాంటి కేన్సర్, యాంటీ డయాబటిక్ సూపర్ఫుడ్స్ గురించి ఆయన ఈ వీడియోలో వివరించారు.షిటేక్ మష్రూమ్స్ ఇది తూర్పు ఆసియాకు చెందిన ఒక తినదగిన పుట్టగొడుగు.నాటో లేదా నానబెట్టిన సోయా బీన్స్ సీవీడ్ లేదా సముద్ర పాచి : కరిగే ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం సముద్రపు పాచిలో లభించే కొన్ని ఖనిజాలు . రక్తపోటును నియంత్రించి, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అలాగే ఫైటోకెమికల్స్ ఇందులో లభిస్తాయి. సీవీడ్ పెద్దప్రేగు , కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణలో గణనీయ పాత్ర పోషిస్తుంది. సీవీడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పరిశోధన ద్వారా తెలుస్తోంది.5 Anti-Cancer, anti-diabetic, super foods that explain Japanese longevity. pic.twitter.com/Owicj1OFsO— Barbara Oneill (@BarbaraOneillAU) June 14, 2024ఇంకా కొంజాకు కొన్యాకూ ప్రయోజనాలు, అధిక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న మాచ్చా టీ ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈ వీడియోలు తెలిపారు. -
వెడ్డింగ్ ప్లాన్ ఇలా ఉంటే అదుర్స్!
భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కన్యాదాత ఎంతో హంగు, ఆర్భాటాలతో పెళ్లి చేస్తాడు. ఒకోసారి వరుడి తరఫు వారే పెళ్లి ఖర్చులు పెట్టుకోవడం, లేదా ఖర్చును ఇద్దరూ కలిసి పంచుకోవడం... ఏ రకంగా చూసినా సరే, జీవితంలో ఒక్కసారే జరిగే సంబరం కావడంతో ఖర్చుకు ఎక్కడా వెనుకాడరు. పెళ్లి శుభలేఖ దగ్గర నుంచి.. మండపాలంకరణ వరకు, పెళ్లిబట్టల నుంచి నగల వరకు; టిఫిన్ల దగ్గర నుంచి విందు భోజనాల వరకు... ఇలా ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నదే. భారతీయులు సగటున పెళ్లికోసం చేస్తున్న ఖర్చు రూ. 5 లక్షల నుంచి రూ. కోటికి పైగా ఉంటుందన్నది ఒక అంచనా. ఇల్లలకగానే పండగా... అన్నట్లు ఉన్నదంతా వదిలించుకుని లేదా లేకపోతే అప్పులు చేసి మరీ పెళ్లి చేసిన తర్వాత ఆ జంట కాపురం కోసం మరికొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏది తక్కువైనా నవ్వుల పాలు కావడం ఖాయం. అయితే వైభవంగా పెళ్లి చేయడం వరకు తప్పేం లేదు కానీ స్తోమతకు మించి అప్పులు చేయడంలోనే అభ్యంతరం... తప్పనిసరి వాటికి ఎలాగూ ఖర్చు తప్పదు కానీ కాస్త ఆచి తూచి ప్లాన్ ప్రకారం చేస్తే పెళ్లికి అయ్యే వృథా ఖర్చును కొంత తగ్గించవచ్చు. అదెలాగో చూద్దాం... ముందస్తు ప్రణాళిక ... పెళ్లి ఎంత గ్రాండ్గా చేశాం అనే దానికన్నా ఎంత ప్రణాళికాబద్ధంగా ఆర్గనైజ్ చేశామన్నది ముఖ్యం. అనుకున్న బడ్జెట్ లోపు చేయాలంటే ఖర్చు ఎక్కడ పెట్టాలి.. ఎక్కడ తగ్గించుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇందుకోసం పెళ్లి తంతులో వివిధ ఘట్టాలకు అవసరమైన వస్తు సామగ్రిని ముందుగానే జాబితా రాసుకోవాలి. అవసరమైతే మండపం, అలంకరణ, కేటరింగ్ వంటి వాటిని ఒకరికే కాంట్రాక్ట్ ఇస్తే కొంతమేరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పర్యవేక్షణ కూడా బావుంటుంది. వస్త్రాలు, నగలు కూడా అవసరం మేరకే కొనుగోలు చేయాలి. అతిథుల జాబితా అన్నింటికన్నా ముఖ్యం... పెళ్లి అంటేనే సకుటుంబ సపరివారంతోపాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అంతా హాజరు కావాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం బంధువులకు ఒకటని, మిత్రులకు మరొకటని కార్డులు ప్రింట్ చేయిస్తుంటారు. ఇక్కడ కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందరికీ కామన్గా ఒకే ఆహ్వాన పత్రిక ఉంటే ఖర్చు తగ్గుతుంది. సేహితులకు కార్డులు కొట్టించే బదులు ఈ ఇన్విటేషన్ల ద్వారా కూడా ఆహ్వానం పంపుకోవచ్చు. అలాగే పెళ్లిలో మెహందీ అని, సంగీత్ అని, హల్దీ అనీ, రిసెప్షన్ అనీ ఇలా చాలా రకాల ఈవెంట్స్ చేస్తున్నారు. పెళ్లికూతురు దగ్గర కొన్ని, పెళ్లి కొడుకు వద్ద మరికొన్ని.. ఇద్దరిని కలిపి కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. వీటికి ఎవరెవరిని పిలవాలనే దానిపై కూడా కసరత్తు చేయాలి. అప్పుడు ఏ ఈవెంట్ కు ఎంతమంది వస్తారో అవగాహన ఉంటుంది కాబట్టి.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ముందుగా బడ్జెట్ వేసుకోండి... పెళ్లికి ముందు బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. బడ్జెట్ లేకుండా వెడ్డింగ్ ఫంక్షన్ నిర్వహిస్తే ఖర్చులు భారీగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ సిద్ధం చేసుకోవడం మొదటి పని. వివాహం అలా చేసుకోవాలని ఇలా చేసుకోవాలని చాలా కోరికలు ఉంటాయి. కానీ అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని గుర్తుంచుకోండి. ఉదాహరణకు వివాహానికి బట్టలు, ఆభరణాలు అవసరం. అలాగని ఖరీదైన బట్టలు, ఆభరణాలు అవసరం లేదు. బడ్జెట్లో వచ్చే వాటిని తీసుకోవడం ఉత్తమం. క్యాటరింగ్: పెళ్లి విందులకు డబ్బు గుడ్డిగా ఖర్చు చేస్తారు. చాలా పెళ్లిళ్ల లో ఆహారం వృథా అవడం గమనిస్తూనే ఉంటాం. వివాహ విందు మెనులో అవసరమైన ఆహార పదార్థాలను మాత్రమే చేర్చండి. లేనిపోని గొప్పల కోసం మెనూని పెంచవద్దు. హాజరయ్యే అతిథుల సంఖ్యకు అనుగుణంగా క్యాటరింగ్ సిద్ధం చేసుకోవాలి. అలంకరణ సామగ్రి పెళ్లి ఇంట్లో చాలా అలంకరణ ఉంటుంది. అవసరమైన అలంకరణ వస్తువులు మాత్రమే తీసుకోవాలి. వీటిలో పువ్వులు చాలా ముఖ్యమైనవి. వాటిని చౌకగా ఉన్న ప్రదేశాల నుంచి కొనుగోలు చేస్తే కొంత డబ్బు ఆదా అవుతుంది. హనీమూన్ ట్రిప్... పెళ్లితంతు ముగిసిన తర్వాత నూతన వధూవరుల హనీమూన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హనీమూన్ డెస్టినేషన్లుగా పేరుగాంచిన దేశాలకు ఎగిరిపోతున్నారు. ఇది కూడా బడ్జెట్ పెరగడానికి కారణం అవుతుంది. దీని బదులుగా మన దేశంలోనే అనువైన ప్రాంతాలను ఎంచుకుంటే చాలా సమయంతో పాటు ధనమూ ఆదా అవుతుంది. ఒకవేళ విదేశాలకే వెళ్లాలనుకుంటే తక్కువ ఖర్చుతో వెళ్లిరాగలిగే మలేసియా, థాయ్ల్యాండ్ వంటివి ఎంచుకుంటే సరిపోతుంది. (చదవండి: మూడ్ని మార్చి రిఫ్రెష్ అయ్యేలా చేసే సూపర్ ఫుడ్స్ ఇవే! ) -
మూడ్ని మార్చి రిఫ్రెష్ అయ్యేలా చేసే సూపర్ ఫుడ్స్ ఇవే!
శరీరంలో స్రవించే హార్మోన్లలో ఒక్కోసారి చోటు చేసుకునే కొన్ని రకాల అసమతౌల్యతల కారణంగా చాలా ఒత్తిడికి లోనవుతుండటం లేదా మూడ్ ఆఫ్ కావడం మామూలే. అయితే దాన్ని సరిచేయడానికి మందులు మింగే బదులు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాలు దృఢంగా ఉంటాయి. ఆ ఆహారాలేమిటో తెలుసుకుని, మూడ్ బాగుండనప్పుడు వాటిని తీసుకుంటే సరి! మూడ్ని మార్చే ఫుడ్ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మూడ్ పాడవుతుంది. ఏదో పోగొట్టుకున్నట్లు... వెలితిగా... ఒకలాంటి బాధగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వెంటనే మూడ్ సరవుతుంది. అవేమిటో తెలుసుకుందాం... పాలకూర.. ఐరన్ పాళ్లు అధికంగా ఉండే పాలకూర సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి పనిచేస్తుంది. అంతేకాదు, ఇందులో ఫైబర్, విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూర స్మూతీ, సూప్ లేదా పాలకూరను ఏదో ఒక రూపంలో ఆహారంలో తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మష్రూమ్స్.. మష్రూమ్స్ యాంటి డిప్రెసెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ డి మానసిక స్థితిని నియంత్రిస్తుంది. ఇది సెరటోనిన్ సంశ్లేషణ స్థాయికి సంబంధించినది. దీని కారణంగా వ్యక్తి సంతోషకరమైన భావోద్వేగాలను అనుభవించగలడు. మీ మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు, మష్రూమ్ రెసిపీని తినడం వల్ల తిరిగి మంచి మూడ్లోకి వచ్చేసే అవకాశం మెండుగా ఉంది. ప్రయోజనకరంగా ఉంటుంది. అవకాడో.. కొద్దికాలం క్రితం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ బి3 ,ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు సంతోషకరమైన హార్మోన్ అయిన సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. రోజంతా సంతోషంగా ఉండటానికి సలాడ్, శాండ్విచ్ లేదా అల్పాహారంలో అవకాడోను చేర్చవచ్చు. డ్రై ఫ్రూట్స్.. ప్రతిరోజూ కొన్ని బాదం లేదా వాల్నట్లను తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఇలా జరుగుతుంది. డార్క్ చాకొలేట్.. ఓ నివేదిక ప్రకారం డార్క్ చాకొలేట్ తినడం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయులను పెంచుతుంది. ఫలితంగా వెంటనే మూడ్ సరవుతుంది. మూడ్ బాగుండనప్పుడు ఈ ఫుడ్ ప్రయత్నించండి. (చదవండి: మాంసంతో బియ్యం తయారీ..!సరికొత్త హైబ్రిడ్ వరి వంగడం!) -
ఇండియన్ రైల్వే సూపర్ యాప్ ఎలా ఉపయోగపడుతుంది?
భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. రైలు టికెట్ బుకింగ్, రైలు ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫిర్యాదు చేయడం... ఇలా అన్ని సేవలను ఒకే చోట ప్రయాణికులకు అందించేందుకు భారతీయ రైల్వే కొత్త సూపర్ యాప్ను రూపొందిస్తోంది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే రైల్వే విభాగం అందించే అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు. ఇన్నాళ్ల మాదిరిగా ప్రయాణికులు వేర్వేరు యాప్లపై అధారపడనవసరం లేదు. ఈ యాప్ ప్రాజెక్టును రైల్వే ఐటి వింగ్, సీర్ఐఎస్ పర్యవేక్షిస్తున్నదని రైల్వే విభాగానికి చెందిన ఒక అధికారి తెలిపారు. రైల్ మదద్, యూటీఎస్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్, పోర్ట్రెయిట్, విజిలెంట్ తనిఖీ కార్యకలాపాల టీఎంఎస్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్, ఐఆర్సీటీసీ ఎయిర్ మొదలైన సేవలన్నీ కొత్త సూపర్ యాప్లో విలీనం కానున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక కోట్లాది మంది రైల్వే వినియోగదారులు ప్రత్యేక మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు. రైల్వేకు సంబంధించిన అనేక పనులు ఇక వినియోగదారులకు సులభతరం కానున్నాయి. రైల్వే విభాగానికి ఈ సూపర్ యాప్ తయారీకి దాదాపు రూ. 90 కోట్ల ఖర్చు కానుంది. మూడు సంవత్సరాలలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు అందుకున్న మొత్తం బుకింగ్లలో దాదాపు 5,60,000 బుకింగ్లు (సగానికి పైగా) ఐఆర్సీటీసీ యాప్ ద్వారా అందాయి. -
'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..
టెక్ మిలినియర్ బ్రయాన్ జాన్సన్ బయోలాజికల్ ఏజ్ రివర్స్లో భాగంగా తనే ఏజ్ని తగ్గించడం కోసం ఎంతలా డబ్బును వెచ్చించాడో తెలిసిందే. ఇప్పుడూ ఏకంగా తన రక్తంతో వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి ఏజ్ని తగ్గించే ప్రక్రియకు పూనుకున్నాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇంతకీ ఏంటా కథకమామీషు అంటే.. 45 ఏళ్ల సాఫ్ట్వేర్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఏజ్ తగ్గించుకునే ప్రయోగాలు తనకే పరిమితం చేయలేదు కాబోలు. అందుకోసం 71 ఏళ్ల తండ్రిని కూడా వదిలిపెట్టలేదు . జాన్సన్ తన తండ్రి కోసం సుమారు 1 లీటర్ ప్లాస్మా దానం చేసినట్లు తెలిపాడు. అతనికి తన శరీరంలో ఉన్న ప్లాస్మాను తీసివేసి కొడుకు రక్తంలోని ప్లాస్మాను ఎక్కించారు. దీంతో అతడి వృద్ధాప్య వయసు 25 ఏళ్లకు తగ్గింది. ఎంత పెద్దవారైతే అంత తొందరగా వృద్ధాప్యం వస్తుంది. అయితే ఎప్పుడైతే అతనికి కొడుకు జాన్సన్ ప్లాస్మా ఎక్కించారో అప్పుడే అతను 46 ఏళ్ల టైంలో వచ్చే వృద్ధాప్య వేగం వచ్చింది. ఈ చికిత్స జరిగిన నెలలు తర్వాత కూడా అతడిలో అదే తరహా వృద్ధాప్య లక్షణాలు కనిపించాయని జాన్సన్ ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. తాను ఇప్పుడు మా నాన్న "బ్లడ్ బాయ్"ని అంటూ అసలు విషయం అంతా రాసుకొచ్చాడు. ఈ ప్రక్రియలో తన తండ్రి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నాడు. అలాగే తన నుంచి పొందిన లీటరు రక్తం కంటే ఎక్కువగానే తన తండ్రిలోని సొంత ప్లాస్మాను తీసేసి ఉండొచ్చు అందువల్లే తన తండ్రిలో ఇంతలా మార్పులు వచ్చాయని అంటున్నాడు. కాగా, జాన్సన్ గత ఫిబ్రవరి ప్రాజెక్ట్ బ్లూప్రింట్లో భాగంగా తన యవ్వనాన్ని తిరిగి పొందేందుకు రోజు వందకు పైగా మందులు వేసుకుంటున్నాని, దాదాపు 30 మంది వైద్యులచే నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పైగా అందుకోసం ఏడాదికి రూ. 16 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ రివర్స్ ఏజింగ్ ప్రయోగం సఫలం అవుతుందో లేదో తెలియదు గానీ అందుకోసం వారు తీసుకుంటున్న చికిత్సలు, పడుతున్న అవస్థలు వింటుంటే వామ్మో!.. అనిపిస్తుంది కదూ. My super blood reduced my Dad’s age by 25 years My father's (70 yo) speed of aging slowed by the equivalent of 25 years after receiving 1 liter of my plasma, and has remained at that level even six months after the therapy. What does that mean? The older we get, the faster we… pic.twitter.com/s4mBMDSP8Z — Zero (@bryan_johnson) November 14, 2023 (చదవండి: వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
సూపర్ రేర్ చిరుత టోబీ పఫర్ ఫిష్: మురిసిపోతున్న ప్రకృతి ప్రేమికులు
ప్రకృతి అంటేనే మనిషికి అందని రహస్యాల పుట్ట. అప్పుడప్పుడు అద్భుతమైనవి వెలుగులోకి వచ్చి మనల్ని ఆశ్చర్యంలో ముంచుత్తుతాయి. అయితే కొన్ని అరుదైన జీవులు కూడా అంతరించిపోతున్న తరుణంలో, మారుతున్న కాలంతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైన జీవులు వెలుగులోకి రావడం విశేషం. ఆస్ట్రేలియా తీరంలో అత్యంత అరుదైన లెపార్డ్ టోబీ పఫర్ ఫిష్ దర్శనమిచ్చింది. దీంతో ప్రకృతి ప్రేమికులు సంబర పడుతున్నారు. Super Rare Leopard Toby Puffer Fish సముద్రపు లోతుల్లో సంచరిస్తున్న కోరల్ సీ మెరైన్ పార్క్లో ఈత కొడుతున్న డీప్ సీ డైవర్ దృష్టిలోచిరుతపులిని పోలిన మచ్చలున్న చిన్న తెల్ల చేప పడింది. దీన్నే లెపార్డ్ పఫర్ ఫిష్ లేదా కాంతిగాస్టర్ లెపార్డ్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా తీరంలోని గ్రేట్ బారియర్ రీఫ్లో ఈత కొడుతుండగా, ఒక డైవర్ 'అత్యంత అరుదైన' సముద్ర జీవిని చూసి ఆశ్చర్యపోయాడు టోబీ పఫర్ అందమైన ఫోటోను గ్రేట్ బారియర్ రీఫ్ మెరైన్ పార్క్ అథారిటీకి అనుబంధ సంస్థ మాస్టర్ రీఫ్ గైడ్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసింది. ఇలాంటి చేపను ఎప్పుడూ చూడలేదని సంస్థ తెలిపింది. ఇవి సాధారణంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, గ్వామ్, మైక్రోనేషియా జలాల్లో కనిపిస్తుందని, అయితే ఈ తెల్లని చేప ఆస్ట్రేలియాలో కనిపించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ప్రతిరోజూ మనల్ని ఆశ్చర్యపరిచే శక్తి సముద్రానికి ఉంది.ఇంకా కనుగొనలేని అద్భుతమైన జంతువులు సముంద్రం నిండి ఉంది. తన జీవితంలో చిన్న తెల్ల చేపను చూడటం చాలా అదృష్టం అని డైవర్ కేథరీన్ లోగాన్ పేర్కొన్నాడు. చిరుత టోబీ పఫర్ అంటే ? రాక్ ఎన్ క్రిటర్స్ ప్రకారం, ఇది అక్వేరియంలో ఎక్కువగా వాడతారు. దీని ముందు భాగంలో రెండు చారలు ఉంటాయి. ముత్యం లాంటి తెల్లటి శరీరంపై చిరుత పులికి ఉండే మచ్చల్ని పోలిన మచ్చలు ఉంటాయి. అలాగే దీన్నిపట్టుకున్నప్పుడు కొద్దిగా "పఫ్"(ఉబ్బుతాయి) అవుతాయి. దాదాపు 3 అంగుళాల పొడవు ఉంటాయి. View this post on Instagram A post shared by Master Reef Guides - Great Barrier Reef 🪸 (@masterreefguides) -
తెరపైకి మళ్లీ డబుల్ డెక్కర్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ కావటంతో, ఫెయిల్యూర్గా ముద్రపడ్డ డబుల్ డెక్కర్ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్యుపెన్సీ రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడుతూ వస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లను మళ్లీ పట్టాలెక్కించి విజయవంతం చేయాలని భావిస్తోంది. బెర్తులు ప్రవేశపెట్టి.. డబుల్ డెక్కర్ రైళ్లు కేవలం పగటి వేళ మాత్రమే తిరిగేలా రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో వాటిల్లో కేవలం చైర్ కార్ మాత్రమే ఉండేది. సాధారణ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేగంతోనే వాటిని నడిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లకు దాదాపు 11 గంటల ప్రయాణ సమయం పడుతోంది. రాత్రి వేళ కావటంతో సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణికులు పడుకుని ప్రయాణిస్తుండటంతో వారికి పగటి సమయం వృథా కావటం లేదు. కానీ, డబుల్ డెక్కర్ రైళ్లలో పగటి వేళ అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అయ్యేది. డబుల్ డెక్కర్ రైళ్లు ప్రారంభమైన కొత్తలోనే సికింద్రాబాద్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే వారు పగటి సమయం మొత్తం రైళ్లలోనే గడపటంతో ఒక రోజు మొత్తం వృథా అయినట్టుగా భావించేవారు. ఫలితంగా వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో వారం రోజుల్లోనే 14 శాతానికి చేరింది. దీంతో ఆ రెండు సర్వీసులను రైల్వే రద్దు చేసింది. ఇటీవలే వందేభారత్ రైళ్లు పట్టాలెక్కి, అదే పగటి వేళ పరుగుపెడుతున్నా కిక్కిరిసిపోతున్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 120 శాతంగా ఉంటోంది. వీటి వేగం ఎక్కువ కావటంతో, తక్కువ సమయంలోనే గమ్యం చేరుతున్నాయి. కానీ, వందేభారత్ తరహా లో అన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్ల వేగా న్ని పెంచటం సాధ్యం కాదు. దీంతో వాటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి రాత్రి వేళ తిప్పే యోచనలో రైల్వే ఉంది. ప్రయాణికులతోపాటు సరుకులు కూడా.. ఇక పైడెక్లో ప్రయాణికులు, దిగువ డెక్లో సరుకులను ఏకకాలంలో తరలించే ప్యాసింజర్ కమ్ గూడ్స్ నమూనాలో కూడా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే భావిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి డిజైన్లను రైల్వే అనుబంధం సంస్థ ఆర్డీఎస్ఓ పరిశీలిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. వెరసి డబుల్ డెక్కర్ రైళ్లకు మళ్లీ డిమాండ్ కల్పించాలని రైల్వే భావిస్తోంది. -
ప్రెగ్నెంట్గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగలరా? ఇది సాధ్యమేనా!
మహిళ ప్రెగ్నెంట్గా ఉండగానే మరోసారి ప్రెగ్నెంట్ కాగాలదా? అంటే ఔననే చెబుతోంది సైన్సు. ఏంటిది ఎలా సాధ్య? అసలు ఇలా ఎవరికైనా జరిగిందా? అని పలు సందేహాలు మొదలయ్యాయి కదా. కానీ నిజానికి ఇలాంటి అరుదైన కాసులు చాలనే జరిగాయని అంటున్నారు వైద్యులు. ఇలా గర్భవతిగా ఉండగానే మళ్లీ గర్భం దాల్చడాన్ని సూపర్ఫెటేషన్ అని పిలుస్తారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులో ఆ తల్లికి పుట్టిన పిల్లలు కవలలుగా పరిగణించినప్పటికీ వేర్వురు తేదిల్లో పుడతారట. అరుదైన కేసుల్లో ఒకేసారి పుట్టిన ఆ పిల్లల బరువు, పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయని అంటున్నారు. ఆ పిండాల పీరియాడిక్ టైం కూడా వేరుగా ఉంటుంది. ఇది ఒక ఋతుకాలంలోనే విడుదలైన రెండు గుడ్ల ఫలదీకరణాన్ని సూచిస్తుంది. నిజానికి ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడూ ఆమె అండాశయాలు గర్భాశయానికి గుడ్లు విడుదల చేయడం ఆపేస్తాయి. ఎందుకంటే హార్మోన్లు శిశువు పెరగడానికి సిద్ధంగా ఉండేలా శరీరానికి ఒక సంకేతాన్ని పంపుతాయి. అయినప్పటికీ సూపర్ఫెటేషన్ జరిగితే అండాశయాలు మరొక గుడ్డును విడుదల చేస్తాయి. అది కూడా ఫలదీకరణం చెందుతుంది. గతంలో ఇలాంటి ఘటన జరిగిన పలు కేసులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కేట్ హిల్ అనే మహిళకు ఇలానే జరిగింది. ఆమె కేవలం పది రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది. ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలు ఇద్దరు ఒకే రోజు జన్మించినప్పటికీ వారి బరువులు, పరిమాణలు భిన్నంగా ఉన్నాయి. అలాగే ఇలాంటి సూపర్ఫెటేషన్ జంతువులలో కూడా జరుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలు, కంగారులు, కుందేళ్లు, పిల్లి జాతులు, గొర్రెలు అన్ని సూపర్ఫెటేషన్కు లోబడి ఉన్నాయని పేర్కొన్నారు. చేపలు కూడా ఇదే విధమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!) -
రూ.20వేల లోపు సూపర్ స్మార్ట్ఫోన్లు..
దేశంలో రూ.20 వేల లోపే సూపర్ ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. మంచి పనితీరుతో పాటు ప్రీమియం డిజైన్, అద్భుతమైన కెమెరా ఆప్షన్లు ఉన్నాయి. గేమింగ్ ఇష్టపడేవారికి 6జీబీ ర్యామ్తో అత్యంత సామర్థ్యం గల ప్రాసెసర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. శాంసంగ్, మోటరోలా, నోకియా, షావోమీ వంటి టాప్ బ్రాండ్ల ఫోన్లు రూ.20 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: ఆర్బీఎల్ బ్యాంకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆర్బీఐ! రూ.కోట్లలో జరిమానా.. పోకో (POCO) X4 ప్రో ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్ , స్నాప్డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.67 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh షావోమీ రెడ్మీ (Xiaomi Redmi) Note 12 ధర: రూ. 17,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 4 Gen 1 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.67 అంగుళాలు కెమెరా: 48 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ (realme) 10 Pro 5G ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.72 అంగుళాలు కెమెరా: 108 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్ ఆమే... వన్ప్లస్ (OnePlus) Nord CE 2 Lite 5G ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.59 అంగుళాలు కెమెరా: 64 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్ (realme) 9 5g SE ధర: రూ. 16,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 778G ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు (16.76 సెం.మీ.) కెమెరా: 48 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! రియల్మీ (realme) 9 ధర: రూ. 16,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 680 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.4 అంగుళాలు కెమెరా: 108 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh శాంసంగ్ గెలాక్సీ A14 5G ధర: రూ. 16,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, Samsung Exynos 1330 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... ఒప్పో (OPPO) A78 5G ధర: రూ. 18,980 ప్రాసెసర్: ఆక్టా కోర్ , మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.56 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh మోటో (Moto) G73 ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 930 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.5 అంగుళాలు కెమెరా: 50 MP + 8 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh వివో (Vivo) Y56 ధర: రూ. 19,780 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh -
ఆ ఖాతాదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త!
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) డిపాజిట్ మెచ్యూరిటీలపై సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లను సురక్షితమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలుగా చూసే వారికి ఇది అద్భుతమైన వార్త. ముఖ్యంగా సీనియర్,సూపర్ సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు మేర అదనంగా ఇవ్వనుంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 13, 2022 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీ సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్లపై ఈ పెంపు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం FDలపై వడ్డీ రేట్లు నిర్దిష్ట కాలవ్యవధిని సెట్ చేసినప్పటికీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రం అన్నిరకాల డిపాజిట్లపై ఒకే రేటు అందిస్తుంది. బ్యాంకు అధికారిక వెబ్సైట్ ప్రకారం రూ. 2 కోట్ల వరకు రేటు 30 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) గా ఉంది. 60-80 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల పరిధి డిపాజాట్లపై 50 బీపీఎస్ అదనపు వడ్డీని పొందుతారు. 5 కంటే ఎక్కువ కాలానికి 80బీపీఎస్ పాయింట్ల ఎక్కువ పొందుతారు.మొత్తంగా సీనియర్ సిటిజన్లకు 6.60 శాతం, సూపర్ సీనియర్లకు 6.90 శాతం వడ్డీ రేటు పొందుతారు. రిటైర్డ్ సిబ్బంది, రిటైర్డ్ సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 180 బీపీఎస్ పాయింట్లు వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే పీఎన్బీ ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద ఉద్యోగులతో పాటు సీనియర్ సిటిజన్లు అయిన రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించే అత్యధిక వడ్డీ రేటు 100 బీపీఎస్ పాయింట్లుగా ఉంటుందని బ్యాంక్ తెలిపింది. -
పాలు, నిత్యావసరాలు @ స్విగ్గీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలందించే స్విగ్గీ తాజాగా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. గతేడాది కొనుగోలు చేసిన పాలు, నిత్యావసరాల డెలివరీ సంస్థ ’సూపర్’పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ విభాగంపై దాదాపు రూ.680 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విగ్గీ స్టోర్స్ పేరిట హైపర్ లోకల్ డెలివరీ వ్యాపారంలోకి, స్విగ్గీ డెయిలీ పేరిట సబ్స్క్రిప్షన్ ఆధారిత ఇంటి వంట డెలివరీ సేవల విభాగంలోకి స్విగ్గీ ప్రవేశించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఆరు నెలల్లో స్విగ్గీ నెలవారీ యూజర్ల సంఖ్య 10 రెట్లు పెరిగి 1,50,000 స్థాయికి చేరింది. తమ బ్రాండ్ పేరును, సొంత లాజిస్టిక్స్ నెట్వర్క్ను మరింత మెరుగ్గా ఉపయోగించుకునే ఉద్దేశంతో తాజాగా సూపర్ కార్యకలాపాలను కూడా విస్తరిస్తోంది. గతేడాది డిసెంబర్లో 1 బిలియన్ డాలర్లు సమీకరించిన స్విగ్గీ మరో 500–600 మిలియన్ డాలర్లను సమీకరించే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. రోజుకు లక్ష డెలివరీలు.. సూపర్ను స్విగ్గీ గతేడాదే కొనుగోలు చేసినప్పటికీ.. అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. 2015లో శ్రేయస్ నగ్దావనె, పునీత్ కుమార్ దీన్ని ప్రారంభించారు. స్విగ్గీ చేతుల్లోకి వచ్చాక కూడా సూపర్ వారి సారథ్యంలోనే నడుస్తోంది. ప్రస్తుతం ఈ విభాగం బెంగళూరు, ముంబై, ఢిల్లీ– ఎన్సీఆర్ సహా ఆరు నగరాల్లో రోజుకు లక్ష పైచిలుకు డెలివరీలు అందిస్తోంది. మైక్రోడెలివరీ వ్యాపార విభాగంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్న మిల్క్బాస్కెట్, డెయిలీ నింజా తదితర సంస్థలకు స్విగ్గీ సారథ్యంలోని సూపర్ ఎంత మేర పోటీనిస్తుందన్నది చూడాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. సాధారణంగా ఇలాంటి స్టార్టప్స్కి ఎక్కువగా రోజూ సగటున రూ.70–90 ఆర్డర్లిచ్చే యూజర్లు ఉంటున్నారు. పాల డెలివరీ కోసం సబ్స్క్రయిబ్ చేసుకున్నప్పటికీ ఇతర ఉత్పత్తులు కూడా కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. ‘సూపర్’ మోడల్.. వారంవారీ, నెలవారీ చందాదారులకు పాలతో పా టు బ్రెడ్డు, గుడ్లు మొదలైన వాటికి కూడా సూపర్ డెలివరీ సర్వీసులు అందిస్తోంది. సంస్థ స్థూల అమ్మకాల్లో 70 శాతం వాటా పాలది కాగా.. మిగతాది ఇతర ఉత్పత్తులది ఉంటోంది. సుమారు అరవై శాతం ఆర్డర్లు భారీ గేటెడ్ సొసైటీల నుంచి ఉంటున్నాయి. దీంతో తక్కువ వ్యయాలతో డెలివరీ సాధ్యపడుతోంది. సూపర్ పోటీ సంస్థల వ్యాపార విధానం కూడా ఇదే రకంగా ఉంది. ఈ విభాగంలో కార్యకలాపాలను టాప్ 10 నగరాలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్విగ్గీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల వారికి కూడా చేరువవుతున్నందున.. సూపర్ను కూడా ఆయా మార్కెట్లలో ప్రవేశపెట్టొచ్చని పేర్కొన్నాయి. మరోవైపు సూపర్ పోటీ సంస్థ డైలీ నింజా కూడా కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. గతేడాదే ఇది మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ నుంచి పెట్టుబడులు సమీకరించింది. రోజువరీ ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది జనవరిలో 30,000 ఉండగా.. ప్రస్తుతం 90,000కు పెరిగినట్లు సమాచారం. అటు మిల్క్బాస్కెట్ కూడా యూనిలీవర్ వెంచర్స్, కలారి క్యాపిటల్ నుంచి 26 మిలియన్ డాలర్లు సమీకరించింది. -
నమ్మలేం! ఒకప్పటి హీరోయిన్.. ఆమేనా?
'గుచ్చి గుచ్చి చంపమాకు హొయలా' అంటూ నాగార్జున సరసన 'సూపర్' సినిమాలో అలరించిన అయేషా టకియా గుర్తుందా?.. తెలుగులో 'సూపర్'తోపాటు, హిందీలో పలు సినిమాలు చేసిన ఈ భామ అప్పట్లో తన అందచందాలతో అభిమానుల్ని ఉర్రూతలూంగించింది. 2009లో ఎస్పీ లీడర్ అబు ఆజ్మీ కొడుకు ఫర్హాన్ ఆజ్మీని పెళ్లి చేసుకున్న అయేషా గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లయిన తర్వాత అడపాదడపా సోషల్ మీడియాలో ఫొటోలతో అభిమానులకు దర్శనమిచ్చిన ఈ అమ్మడు.. తాజాగా గత గురువారం ఓ వేడుకకు హాజరయింది. అక్కడ ఆమెను చూసిన వారు నమ్మలేకపోయారు. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లి అయిన అయేషా ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు స్లిమ్గా కుందనపు బొమ్మలా సినిమాల్లో అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు కాస్తా బొద్దుగా ఏమాత్రం గుర్తుపట్టనంతగా మారిపోవడంతో ఆమె అభిమానులు, బాలీవుడ్ వర్గాలు విస్తుపోయారు. అన్నట్టు మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టాలని అయేషా భావిస్తున్నది. త్వరలోనే మళ్లీ తెరపై కనిపిస్తానని, ప్రస్తుతం కథలు వింటున్నానని ఈ అమ్మడు చెప్పింది. -
అలాంటి వాటిని నా మదిలోకి రానీయను
చాలా కాలంగా చాలా రకాల గ్యాసిప్స్ను ఎదుర్కొన్న అనుష్క తాజాగా ఒక పెళ్లైన సినీ నిర్మాతను ప్రేమిస్తున్నట్లు, త్వరలో ఆయనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునో, లేక మరేదన్న సంఘటన తనను ఘాటుగా తాకిందోగానీ తను క్రింది విధంగా స్పందించారు. వదంతులకు తొలి రోజుల్లో చాలా బాధపడ్డాను. ఇంట్లో వాళ్లను అవి కష్టపెట్టాయి. ఇప్పుడు నేను చాలా పరిణితి చెందాను. నాలాంటి సెలబ్రిటీలు ఇలాంటి సత్యదూర ప్రచారాలను ఎదుర్కొవలసి ఉంటుందన్నది గ్రహించాను. ఇతరులు ఏమనుకుంటున్నారు, లోకం ఎలా చిత్రీకరిస్తోంది అంటూ జీవిస్తే ప్రశాంతత కరువవుతుంది.వదంతులకు చింతిస్తే మిగిలేది ఏడుపే. సినిమాలో వదంతులన్నవి సర్వసాధారణం. అలాంటివి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయన్న విషయాన్ని తొసిపుచ్చలేను. అయితే అది కొంత సేపే. ఆ తరువాత ఏది విధికి వచ్చేస్తాం. అయినా మనం తప్పు చేయనప్పుడు ఎందుకు బాధ పడాలి. వదంతులకు చింతిస్తూ కూర్చుంటే నిద్రేరాదు. అలాంటి వాటిని నా మదిలోకి రానీయను. అందుకే తాను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. నటిగా కూడా చాలా సంతృప్తిగా ఉన్నాను. తమిళం, తెలుగు భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. నటనా ప్రతిభను చాటుకునే పాత్రలు అమరుతున్నాయి అని అనుష్క పేర్కొన్నారు. -
తాడిపత్రిలో స్వచ్ఛభారత్ భేష్
తాడిపత్రి : తాడిపత్రి మున్సిపాలిటీలో స్వచ్ఛభారత్ అమలులో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం బాగుందని క్వాలిటీ కంట్రోల్ ఢిల్లీ బృందం ప్రశంసించింది. బృంద సభ్యులు అరవింద్, గిరిబాబు గురువారం తాడిపత్రిలోని అంబేడ్కర్ నగర్, సంజీవనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, మేనేజర్ సాయిశంకర్, డీఈఈ రఘుకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు. స్వచ్ఛభారత్ కింద మొత్తం 4,200 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. వాటిని వినియోగిస్తున్న విధానాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. రోడ్లు, పచ్చని చెట్లను చూసి ముగ్దులయ్యారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డితో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. -
పొట్టేలు గాంభీర్యం
‘మేకపోతు గాంభీర్యం’గురించి వినే ఉంటారు. కానీ ఇక్కడ ఓ గొర్రెపోతు (పొట్టేలు) దర్పం చూశారా..! ఎంచక్కా బైక్పైకి ఎక్కింది. బండి డ్రైవ్ చేస్తున్నట్టుగా కాసేపు ఫోజిచ్చింది. కొద్దిసేపు స్థానికులను తన చేష్టలతో అలరించి.. బైక్ దిగిపోయింది. ఈ దృశ్యం బయ్యారం మండలంలోని బాలాజీపేటలో బుధవారం చోటుచేసుకుంది. - బయ్యారం -
మాట్లాడే మహిళా రోబో!
శాస్త్ర సాంకేతిక రంగంలో ముందున్న చైనా పరిశోధకులు తాజా ప్రయత్నంలో భాగంగా మాట్లాడే రోబోను సృష్టించారు. రోబోలు నడవటం, పనులు చేయడం వంటివి ఎన్నో ఇంతకు ముందే చూశాం. అయితే వీటికి భిన్నంగా మాట్లాడే మరమనిషిని కనిపెట్టి మరోసారి విజయవంతమయ్యారు. అచ్చం అమ్మాయిలా ఉండే ముఖ కవళికలతోపాటు మాటలకు అనుగుణంగా కదిలే నోరు, పెదాలతో చైనా పరిశోధకులు వినూత్న సృష్టికి శ్రీకారం చుట్టారు. మరమనిషిలా కాక, సహజత్వం ఉట్టిపడేలా జియా జియా ఇప్పుడు చైనా వాసులనే కాక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణ మహిళ రూపంలో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. పెదాల కదలికలు, కళ్ళు తిప్పడంతో సహా అచ్చంగా మనిషిని పోలి ఉండటం జియా జియా ప్రత్యేకత అంటున్నారు చైనా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు. ఈ కొత్త రోబో క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా తన సేవలు అందిస్తుందని చెప్తున్నారు. ముందుగా ఫీడ్ చేస్తేనో, కీ ఇస్తేనో మాట్లాడటం కాక, ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తల ఊపడం, దగ్గరగా వచ్చిన వారిని స్పర్శించడం వంటి కొత్త విషయాలను ఈ వినూత్న రోబోలో పొందుపరిచారు. మూడు సంవత్సరాలపాటు కష్టపడి పరిశోధకులు జియా జియా కదలికలను తీర్చి దిద్దారు. రోబో సృష్టికర్త చెన్ జియోపింగ్ పలకరిస్తే చాలు.. చక్కగా సమాధానం ఇస్తున్న రోబోను చూసి మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఫోటోలతో ముంచెత్తారు. ఇదెంతో అద్భుతమంటూ అభినందనలు కురిపించారు. టెక్నాలజీని మరింత అభివృద్ధి పరచి, జియా జియా మాట్లాడటంతోపాటు, నవ్వడం, ఏడ్వటం కూడ చేసేట్లుగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారని స్టేట్ మీడియా వివరించింది. పరిశోధకులు కూడ వారి సాంకేతిక పరిమితులను అధిగమించి మాట్లాడే మహిళా రోబోలో మరిన్ని హావభావాలను కూడ పలికించేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు. -
ఎంపీలు సూపర్ పౌరులు కాదుః అశోక్ గజపతి రాజు
న్యూఢిల్లీః పాలనలో పారదర్శకత చూపించే నాయకుల్లో అశోక్ గజపతిరాజు ముందుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఆ విషయం రూఢి చేశారు. బుధవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో కూడ అదే రీతిలో స్పందించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డంలో ఏమాత్రం జంకని ఆయన... ఎయిర్ పోర్టుల్లో తమకు కొంత ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలన్న బిజెపి మెంబర్ల డిమాండ్ కు.. దీటుగా సమాధానం ఇచ్చారు. పార్లమెంట్ మెంబర్లంటే సూపర్ పౌరులు కాదని, వారు కూడ సాధారణ ప్రజలేనని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు... తేల్చి చెప్పారు. విమానాశ్రయాల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎంపీలు సూపర్ పౌరులు కాదని సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతి రాజు లోక్ సభలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో తనకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ... పార్లమెంట్ మెంబర్లు వారి వారి మంత్రి పదవులతో కొంత ప్రత్యేక గౌరవాన్ని పొందుతారని, అదే నేపథ్యంలో వారి విమాన ప్రయాణంలోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ శాఖ అన్ని సౌకర్యాలను అందిస్తుందని తెలిపారు. అయితే ఎంపీలు సూపర్ పౌరులు కాదని, విమానాశ్రయాలవద్ద తమకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలన్న బిజెపి సభ్యుల డిమాండ్ ను తిరస్కరించారు. అయితే తమ ఐడీ కార్డులను చూపించినప్పటికీ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో సిబ్బంది గుర్తు కూడ పట్టడం లేదని కొందరు సభ్యులు వాపోవడంతో... చాలా విమానాశ్రయాల్లో ఎంపీలు కమిటీ సభ్యులు అయి ఉంటారని, కాబట్టి విమానాశ్రయాల్లో వారిని గుర్తించరన్న విషయం వాస్తవం కాదని కేంద్ర మంత్రి తెలిపారు. ఎంపీలు ఐడీ కార్డులు చూపినప్పుడు అవకాశాన్ని బట్టి వారి సీట్లు హయ్యర్ క్లాస్ కు అప్ గ్రేడ్ చేయాలన్న టీఆర్ ఎస్ సభ్యుడు జితేందర్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన అశోక్ గజపతి రాజు.. టిక్కెట్ల వాణిజ్య తరగతులను బట్టి అప్ గ్రేడేషన్ జరుగుతుందని, అందులో ముందుగా అధికారులకు అవకాశం ఇస్తారు తప్పించి, ఎంపీలకు కాదన్నారు. అంతేకాక వ్యాధిగ్రస్తులు, సీనియర్ సిటిజన్లు, ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రజలకు సీట్లు మంజూరు చేసే విషయంలోకూడ కొంత మానవతా కోణంలో చూడాల్సి వస్తుందని, అందులో కూడ వాణిజ్య కోణం ఉంటుందని అన్నారు. ఎయిర్ ఇండియా తోపాటు ఇతర ఎయిర్ లైన్స్ కూడ వాణిజ్య పరిగణల ఆధారంగానే అప్ గ్రేడ్ చేసేందుకు వీలౌతుందని అశోక్ గజపతి రాజు తేల్చి చెప్పారు.


