-
TS IAS Officers Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 26 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంవో సెక్రటరీగా చంద్ర శేఖర్ రెడ్డి(IFS)ని నియమించింది. బదిలీ అయిన వారిలో సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాబాద్, నల్గొండ, గద్వాల కలెక్టర్లు ఉన్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్పై కూడా బదిలీ వేటు పడింది. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మిత.. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్థానచలనం పొందారు. ► రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శశాంక నియామకం ►నల్గొండ కలెక్టర్గా దాసరి హరిచందన. ►మహబూబాబాద్ కలెక్టర్గా అద్వైత్ కుమార్. ►సంగారెడ్డి కలెక్టర్గా వల్లూరు క్రాంతి. ►గద్వాల కలెక్టర్గా బీఎం సంతోష్ ►సీఎం ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు ►నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జ ►మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్గా మహేష్ ధత్ ఎక్కా.. ►పురావస్తు శాఖ డైరెక్టర్గా భారతీ హోళికేరి ►మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా డీ దివ్య నియామకం ►టీఏస్ డైరీ కార్పొరేషన్ ఎండీగా చిట్టెం లక్ష్మి ►ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్. ► ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ ►కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యా . ►మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎంఎం ఖానమ్. ►సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ. ►జీహెచ్ఎంసీ జోనల్ కమిషర్గా అభిలాష అభినవ్. ►హైదరాబాద్ లోకల్ బాడిస్ అడిషనల్ కలెక్టర్గా ఖదిరావన్. ►బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్ర వెంకటేష్ నియామకం. ►పంచాయతీరాజ్, ఆర్డీ కార్యదర్శిగా సందీప్ కుమార్ సల్తానియా. ►పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్. ►GAD పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రఘునందన్ రావు నియామకం. ►ఆయుష్ డైరెక్టర్గా ఎం ప్రశాంతి. ►ఫైనాన్స్, ప్లానింగ్ స్పెషల్ సెక్రటరీగా కృష్ణ భాస్కర్. ►TSMSIDC ఎండీగా కర్ణన్. ►రిజిష్టర్ అండ్ కో - ఆ సొసైటీ డైరెక్టర్ హరిత. ఇక ఫైనాన్స్ సెక్రెటరీగా చేసిన రామకృష్ణ రావుకు ఎలాంటి పోస్ట్ కేటాయించలేదు ప్రభుత్వం. -
కొత్త సర్కార్ ప్లాన్!.. కేంద్ర సర్వీసులకు స్మితా.. రాష్ట్రానికి ఆమ్రపాలి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంలో కొత్త టీమ్పై ఫోకస్ పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇక, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. కాగా, తెలంగాణలో త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్లో మూడు కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇక, ఆయా శాఖల్లో పలువురు అధికారుల జాబితా కూడా సిద్దమైనట్టు తెలుస్తోంది. శాఖల సమీక్షలు పూర్తి కాగానే బదిలీలు ఉంటాయన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం ఉంటుందనే చర్చ మొదలైంది. మరోవైపు.. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లేందుకు స్మితా సబర్వాల్ దరఖాస్తు పెట్టుకున్నట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం ఆమె.. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితా సబర్వాల్ ఏ సమీక్షకు హాజరు కాకపోవడం గమనార్హం. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. తాజాగా స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన 23 ఏళ్ల కేరీర్ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఫొటోను షేర్ చేశారు. కొత్త ఛాలెంజ్కు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. Some pics remind us how far we have come.. through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will! Thanks to all your love ♥️, ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYv — Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023 ఇదిలా ఉండగా.. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి.. మహిళా ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు సీఎం ఆఫీసుకు గుడ్ బై చెప్పాలనుకుంటే మరొకరు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తుండగా.. ఇటు కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి.. రేవంత్ రెడ్డి టీమ్లో జాయిన్ కానున్నారు అనే చర్చ జరుగుతోంది. దీంతో, ఈ ఐఏఎస్ల అంశం ఆసక్తికరంగా మారింది. -
మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం సందర్భంగా భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడారు. శాఖల వారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులతో మాట్లాడి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసే బాధ్యతను తన కార్యదర్శి స్మితా సభర్వాల్ కు సీఎం అప్పగించారు. తమ పట్ల సీఎం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకు మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. -
మే 15 నాటికి ‘మేడిగడ్డ’ పూర్తి చేయాలి
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్, కాంట్రాక్టర్ల ప్రతినిధులను ఆదేశించారు. శనివారం ఆమె మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. బ్యారేజీలో మొత్తం 85 గేట్లకు గాను 61 గేట్ల నిర్మాణం, బిగింపు పనులు పూర్తి చేశామని, మిగతావి జరుగుతున్నాయని తెలిపారు. మహారాష్ట్రకు ఆవలి వైపున బ్యారేజీ పనులకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేసి పనులు మే 15 వరకు ఎట్టి పరిస్ధితుల్లో పూర్తి చేసి ఖరీఫ్ నాటికి నీరందించాలని స్మితాసబర్వాల్ ఆదేశించారు. అక్కడి నుంచి ఆమె కన్నెపల్లిలోని మేడిగడ్డ పంపుహౌస్కు చేరుకున్నారు. పంపుహౌస్లో 11 మోటార్లకు 7 మోటార్ల బిగింపు పూర్తయిందని, మిగతావి మేలో పూర్తి చేయనున్నట్లు మెగా కంపెనీ డైరెక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. గ్రావిటీ కాల్వలో మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, ఇంజనీర్లను ఆమె ఆదే శించారు. ఆమె వెంట కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ దేశ్పాండే, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఈఈ రమణారెడ్డి, డీఈఈలు సూర్యప్రకాశ్, ప్రకాశ్ తదితరులు ఉన్నారు. -
15 రోజుల్లో మిషన్ భగీరథ నీరు అందిస్తాం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్లు... అయితే ఏంటి?
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
రైతు రుణమాఫీ ఊసేది..?
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్
ప్రారంభమైన హోం ఓటింగ్
No Headline
No Headline
కూలీల కనీస వేతనం పెంచాలి
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement