breaking news
sivadhar reddy
-
డీజీపీని కలిసిన మంచు మనోజ్ దంపతులు
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉందని ట్వీట్లో రాసుకొచ్చారు.మంచు మనోజ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'నేను, నా భార్య మౌనిక గౌరవనీయులైన డీజీపీ శివధర్రెడ్డిని కలిశాం. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉంది. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన ప్రయాణం క్రమశిక్షణ, ధైర్యం, నైతిక పోలీసింగ్ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.Me and my wife @BhumaMounika met Shri B. #ShivadharReddy Garu, the new @TelanganaDGP 💐Delighted to see a leader of integrity and vision take charge. His journey from the grassroots to the top reflects discipline, courage, and an unshakable commitment to ethical policing.… pic.twitter.com/0f4g3YS7FP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 17, 2025 -
తెలంగాణ ఇంటెలిజెన్స్ అధిపతిగా శివధర్ రెడ్డి!
విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ శివధర్రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శివధర్రెడ్డిని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్కు అటాచ్ చేస్తూ డీజీపీ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే విశాఖపట్నం రేంజ్ డీఐజీ సి. ఉమాపతికి నగర పోలీసుల కమిషనర్గా అదనపు బాధ్యతులు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే జూన్ 2వ తేదీన తెలంగాణ అపాయింటెడ్ డే. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పేషీలోకి తీసుకునే అధికారుల విషయంలోనూ కసరత్తు మొదలుపెట్టారు. పాలనలో తనదైన ముద్ర వేసేందుకు వీలుగా అనువైన అధికారుల ఎంపికపై కేసీఆర్ దృష్టిసారించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, ముఖ్యమంత్రి పేషీలోకి ముఖ్య కార్యదర్శి, ఇతర కార్యదర్శులు, కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్, నిఘా విభాగాధిపతి, సైబరాబాద్ కమిషనర్ తదితర కీలక పోస్టులకు సమర్థులైన అధికారుల కోసం ఆయన ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర కేడర్లో పనిచేసిన వారు, రాష్ర్టం నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లిన అధికారుల సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. అందులోభాగంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన శివధర్రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధిపతిగా నియమించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివధర్ రెడ్డిని బదిలీ చేస్తు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనే తెలంగాణ ఇంటెలిజెన్స్ అధిపతిగా నియమితులవుతున్నట్లు సమాచారం. -
పార్కింగ్ స్థలంలో నిర్మాణాలపై ఆందోళన
అల్లిపురం, న్యూస్లైన్ : జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్లో పార్కింగ్ స్థలాన్ని యథాతధంగా ఉంచాలని హోల్సేల్ విజిటబుల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రాము, కొణతాల వీర్రాజు డిమాండ్ చేశారు. కమిషనర్ శివధర్రెడ్డికి సమస్యను విన్నవించేందుకు అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వర్తకులు శనివారం పోలీసు కమిషనరేట్కు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు కొంతసేపు గేటు ముందు ఆందోళన చేశారు. మహారాణిపేట జోన్ సీఐ ఆర్.మల్లికార్జునరావు అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యాపారులను కమిషనర్ వద్దకు తీసుకువెళ్లారు. షాపుల నిర్మాణంపై హై కోర్టులో స్టే ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి ఓ వ్యక్తి నిర్మాణాలు చేపడుతున్నారని వారు కమిషనర్కు తెలిపారు. పోలీసులు అక్రమార్కులకు వత్తాసు పలకటమే కాకుండా దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం హోల్సేల్ మార్కెట్ బంద్ చేశామని, తమకు న్యాయం జరిగే వరకు మార్కెట్ తెరిచేది లేదని స్పష్టం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ను కలిసిన వారిలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అడబాల నారాయణమూర్తి, న్యాయవాది కొనతాల ప్రతాప్, పొలమర శెట్టి వెంకట సత్యనారాయణ, కోరిబిల్లి ప్రసాద్, పి.సత్తిబాబు, ఎం.రామకృష్ణ, ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు ఉన్నారు.


