-
డబుల్స్లోనూ నిరాశే
క్రాల్జివో (సెర్బియా): విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్లో భారత జంట ఓడిపోయింది. డేవిస్కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్లో రోహన్ బోపన్న–సాకేత్ మైనేని జోడీ 6–7 (5/7), 2–6, 6–7 (4/7)తో నికోలా మిలోజెవిచ్–డానిలో పెట్రోవిచ్ (సెర్బియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ఆతిథ్య సెర్బియా జట్టు 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్లు నామమాత్రం కానున్నాయి. రెండు గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో భారత జోడీ కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకుంది. మూడో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉండి సెట్ పాయింట్ కూడా సంపాదించిన భారత జంట దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెట్ పాయింట్ను కాపాడుకోవడంతోపాటు సెర్బియా ద్వయం సాకేత్ సర్వీస్ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత రెండు జంటలు తమ సర్వీస్ను నిలబెట్టుకోవడంతో మూడో సెట్లో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్లో సెర్బియా జోడీ పైచేయి సాధించడంతో భారత్కు ఓటమి తప్పలేదు. సెర్బియా చేతిలో ఓడినప్పటికీ వచ్చే ఏడాది కొత్త పద్ధతిలో, కొత్త నిబంధనలతో 18 జట్ల మధ్య నిర్వహించనున్న డేవిస్ కప్ ఫైనల్స్ ఈవెంట్కు భారత్ అర్హత సాధించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో 24 జట్ల మధ్య ఇంటా, బయటా పద్ధతిలో క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది. క్వాలిఫయింగ్ టోర్నీలో నెగ్గిన 12 జట్లు నవంబర్లో జరిగే ఫైనల్స్కు అర్హత పొందుతాయి. ఈ సీజన్లో సెమీస్కు చేరిన నాలుగు జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. మరో రెండు జట్లకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వైల్డ్ కార్డు ఇస్తుంది. -
ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో సాకేత్ శుభారంభం
గాయం కారణంగా ఆరు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న భారత టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని పునరాగమనంలో సత్తా చాటుకున్నాడు. కజకిస్తాన్లోని అస్తానాలో జరుగుతున్న ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో సాకేత్ 6–3, 7–6 (7/4)తో గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్)పై గెలిచాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్స్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. -
సాకేత్ పరాజయం
పుణే: కేపీఐటీ-ఎమ్ఎస్ఎల్టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి భారత నంబర్వన్ ఆటగాడు సాకేత్ మైనేని నిష్క్రమించాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్కే చెందిన ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ 6-7, 6-2, 6-0తో మూడో సీడ్ సాకేత్పై విజయం సాధించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్ను టైబ్రేక్ ద్వారా గెలుచుకున్న అనంతరం సాకేత్ కుడి భుజం గాయంతో బాధపడుతూనే మ్యాచ్ను కొనసాగించాడు. పేస్ జంట నిష్క్రమణ మరో వైపు డబుల్స్లో లియాండర్ పేస్-రామ్కుమార్ జోడి క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. ఫ్రాన్సకు చెందిన స్విస్ ల్యూకా-హ్యూగో నైస్ ద్వయం 2-6, 6-3, 10-4 తేడాతో రెండో సీడ్ పేస్ జంటపై విజయం సాధించింది. ఈ పరాజయంతో పేస్ 2016 సీజన్ను ముగించాడు. భారత్కే చెందిన టాప్ సీడ్ పూరవ్ రాజా-దివిజ్ శరణ్ జోడి సెమీస్కి చేరింది. -
రెండో రౌండ్లో సాకేత్ మైనేని
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో సాకేత్ 6-3, 7-5తో అల్బానో ఒలివిట్టి (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. తదుపరి మ్యాచ్లో సాకేత్ అమెరికాకు చెందిన మిచెల్ క్రూజర్తో తలపడతాడు. మరో భారత ఆటగాడు రామ్కుమార్... అలెస్సాండ్రో గియాన్నెసీ (ఇటలీ)తో తలపడనున్నాడు. -
భళా... భారత్
* రెండు సింగిల్స్లో రామ్కుమార్, సాకేత్ విజయం * కొరియాపై 2-0తో ఆధిక్యం * డేవిస్ కప్ మ్యాచ్ చండీగఢ్: సొంతగడ్డపై భారత టెన్నిస్ యువ ఆటగాళ్లు రామ్కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని ఆకట్టుకున్నారు. దక్షిణ కొరియాతో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ మ్యాచ్లో తొలి రోజు భారత్కు 2-0తో ఆధిక్యాన్ని అందించారు. రెండు మ్యాచ్ల్లో కొరియా ఆటగాళ్లు ఓటమి అంచుల్లో ఉన్న దశలో గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం. డేవిస్ కప్లో తొలిసారి బరిలోకి దిగిన 21 ఏళ్ల రామ్కుమార్ 6-3, 2-6, 6-3, 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సియోంగ్ చాన్ హాంగ్కు తొడ కండరాలు పట్టేశాయి. నొప్పిని భరించలేక సియోంగ్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో చైర్ అంపైర్ రామ్కుమార్ను విజేతగా ప్రకటించారు. యోంగ్కు లిమ్తో జరిగిన రెండో మ్యాచ్లో సాకేత్ 6-1, 3-6, 6-4, 3-6, 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో కొరియా ప్లేయర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. కెరీర్లో తొలిసారి ఐదు సెట్ల మ్యాచ్ను ఆడిన సాకేత్ విజయం ఖాయం కాగానే ఆనందంతో తన జెర్సీని విప్పి గాల్లోకి విసిరేసి సంబరం చేసుకున్నాడు. మిగతా సహచరులు సాకేత్ను భుజాలపైకి ఎత్తుకొని అతణ్ని అభినందించారు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్లో లియాండర్ పేస్-రోహన్ బోపన్న ద్వయం హాంగ్ చుంగ్-యున్సియోంగ్ చుంగ్ జోడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్లోనూ భారత్ గెలిస్తే 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంటుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement