నాన్జింగ్ (చైనా): టీఏసీ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాకేత్-జీవన్ నెదున్చెజియాన్ (భారత్) జంట 6-1, 6-2తో జోర్డాన్ థాంప్సన్-ఆండ్రూ విటింగ్టన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది.
46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సాకేత్ ద్వయం ఐదు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సింగిల్స్ విభాగంలో మాత్రం సాకేత్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. డానియల్ ఎన్గుయెన్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్లో సాకేత్ 6-7 (6/8), 6-7 (3/7)తో ఓటమి చవిచూశాడు. మరోవైపు అమెరికాలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్ టోర్నీలో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జంట కూడా సెమీస్కు చేరింది. క్వార్టర్స్లో దివిజ్-రాజా 6-3, 7-5తో ఫెర్నాండెజ్-నికొలస్ జారీ (అమెరికా)లపై నెగ్గారు.
డబుల్స్ సెమీస్లో సాకేత్ జంట
Published Sat, Apr 23 2016 12:56 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
- Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
- ఏడాదిన్నరలో నాలుగోసారి..
- సెల్ఫోన్తో హై బీపీ!
Advertisement