breaking news
Raju Weds Rambai Movie
-
రూ. 99కే సినిమా.. కొత్త ప్రయోగం!
ఓటీటీ కారణంగా జనాలు థియేటర్స్ రావడం తగ్గించారు. దానికి తోడు సినిమా టికెట్ల రేట్లు కూడా భారీగా ఉండడంతో సామాన్యుడు థియేటర్స్కి దూరం అయ్యాడు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప..ప్రేక్షకులు థియేటర్స్కి రావడం లేదు. ఈ క్రమంలో కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. టికెట్ ధరలను రూ. 99కే తగ్గించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు 'మోగ్లీ 2025'తో మరింత బలపడుతోంది.రాంబాయికి కలిసొచ్చిన 99నవంబర్ 20న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి తొలి రోజు నుంచే టికెట్ ధరలను రూ. 99కి తగ్గించారు. మల్టీఫెక్స్లలోనూ రూ. 105కే సినిమాను ప్రదర్శించారు. దీంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా..టికెట్ ధర తగ్గడంతో చాలా మంది సినిమా చూసేందుకు థియేటర్స్కి వెళ్లారు. ఫలితంగా సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి.రాంబాయి బాటలో మోగ్లీ..రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి టికెట్ల రేట్లు తగ్గించడంతో మంచి ఫలితం వచ్చింది. దీంతో మోగ్లీ చిత్ర నిర్మాతలు కూడా అదే ఫాలో అయ్యారు. సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ రోజు (డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలను 99 రూపాయలుగా నిర్ణయించారు. పేరుకు చిన్న సినిమానే కానీ బాగానే ఖర్చు చేశారు. అయినా కూడా టికెట్ రేట్ని 99 రూపాయలకే నిర్ణయించడం శుభపరిణామం. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ సినిమాలకు ఇది ఓ కేస్ స్టడీ లాంటింది. పెద్ద సినిమాలకు ఎలాగో టికెట్ల రేట్లను భారీగా పెంచేస్తున్నారు.. కనీసం చిన్న సినిమాలకు అయినా తగ్గిస్తే..సామాన్యుడు థియేటర్కి వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే పైరసీపై ఆసక్తి!కోవిడ్ తర్వాత ఓటీటీ వాడకం బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చొని సినిమా చూసేందుకు జనాలు అలవాటు పడ్డారు. డిజిటల్ సబ్స్క్రిప్షన్ రూ. 300-500 మధ్య ఉంటుంది. అందులో అనేక సినిమాలు, వెబ్ సిరీస్లు అందుబాటులో ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకులు కొత్త సినిమాలను థియేటర్స్లో చూడాలని కోరుకుంటారు. కానీ ధరలు భారీగా పెంచడంతో థియేటర్స్కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. సినిమా టికెట్ ధర మల్టీప్లెక్స్లలో రూ. 200-500 ఉంటుంది. ఫ్యామిలీతో ఒక్క సినిమాకు వెళ్తే రూ. 1000-2000 ఖర్చు అవుతుంది. ఇది సామ్యాడికి భారమే. అందుకే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. సీపీఐ నారాయణ చెప్పినట్లు టికెట్ల రేట్లు తగ్గించకపోతే ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుడుతూనే ఉంటారు. అప్పుడు విమర్శించి..ఇప్పుడు ఫాలో అవుతున్నారుఅందుబాటు ధరలకే టికెట్లను అందిస్తే.. సామాన్యులు కూడా థియేటర్స్కి వస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్లను తగ్గించారు. మల్టీప్లెక్స్లలో గరిష్టం రూ. 250, సింగిల్ స్క్రీన్లలో రూ. 20-100 మధ్య ఉండేలా ధరలను ఖరారు చేశారు. సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే రూ. 50, రూ. 150 కోట్లు దాటితే రూ. 100 పెంచుకునేందుకు గతంలో జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు కొంతమంది నిర్మాతలు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇండస్ట్రీని నష్టం కగించే నిర్ణయం అంటూ ఆయనపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలనే అప్లై చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లను తగ్గించే ప్రయత్నం చేసింది. టికెట్ ధరలు రూ. 200కి మాత్రమే పరిమితం చేయాలంటూ సెప్టెంబర్లో ఆదేశాలు జారీ చేస్తే.. మల్టీప్లెక్స్ అసోసియేషన్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. -
టాలీవుడ్ నవంబర్ రివ్యూ.. 35లో మూడు మాత్రమేనా?
టాలీవుడ్లో ఓ సెంటిమెంట్ ఉంది. నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్దగా ఆడవని నమ్ముతారు. అందుకే ఈ నెలలో పెద్ద చిత్రాలేవి విడుదల కావు. గతేడాది అయితే అన్ని చిన్న చిత్రాలతో నవంబర్ నెల గడిచిపోయింది. కానీ ఈ ఏడాది మాత్రం ఒకటి రెండు బడా చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. దాంతో పాటు స్టార్ హీరోల హిట్ చిత్రాలు కూడా రీరిలీజ్ అయ్యాయి. మరి వాటిలో ఏవి హిట్ అయ్యాయి? ఏవి అపజయాన్ని మూటగట్టుకున్నాయి? ఓ లుక్కేద్దాం.సెంటిమెంట్ ప్రకారమే.. ఈ ఏడాది నవంబర్ కూడా భారీ ఫ్లాప్తో ప్రారంభం అయింది. మంచి అంచనాలతో నవంబర్ 1న విడుదలైన రవితేజ ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు కన్నెత్తి చూడలేదు.ఇక ఆ తర్వాతి వారం ది గర్ల్ఫ్రెండ్, జటాధర, ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో చిత్రంలో పాటు మరో ఐదారు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో ది గర్ల్ఫ్రెండ్ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇక జటాధర మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ మాత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. మిగిలిన చిత్రాలన్ని ఒక్కరోజుతోనే థియేటర్స్ నుంచి బయటకు వచ్చేశాయి.ఇక రెండోవారం(నవంబర్ 14) కాంత, జిగ్రీస్, సంతాన ప్రాప్తిరస్తు, గతవైభవంతో పాటు మరో నాలుగైదు సినిమాలొచ్చాయి. వాటిల్లో ఏ ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ టాక్ని సంపాదించుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చన కాంత.. తొలి రోజు మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అయితే రెండో రోజు నుంచి మెల్లిగా పికప్ అవుతుందని ఆశించినా.. ప్రేక్షకులు మాత్రం ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తిరస్కరించారు. మిగిలినవన్నీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. అయితే ఇదే వారం రీరిలీజ్ అయిన శివ మాత్రం మంచి కలెక్షన్స్ని రాబట్టుకుంది.ఇక నవంబర్ 21న అల్లరి నరేశ్ ‘12 ఏ రైల్వేకాలనీ’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, పాంచ్ మినార్తో పాటు మొత్తం 21 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. ఉన్నంతలో రాజు వెడ్స్ రాంబాయి మంచి విజయం సాధించింది. అల్లరి నరేశ్ 12 ఏ రైల్వేకాలనీ చిత్రం అయితే ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ని మూటగట్టుకొని..కనీస ఓపెనింగ్స్ రాబట్టుకోలేకపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘కొదమసింహం’తో పాటు కార్తి ‘ఆవారా’ చిత్రం కూడా ఈ వారంలోనే రీరిలీజ్ అయింది. ఈ రెండింటిని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.ఇక నవంబర్ చివరివారంలో రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలుకా’తో, కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆంధ్రకింగ్ తాలుకా చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టుకోలేకపోయింది. రెండో రోజు నుంచి పుంజుకుంటుందని ఆశించినా.. అదీ జరగలేదు. రివాల్వర్ రీటా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మొత్తంగా నవంబర్ నెలలో 35పైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తే..వాటిలో ‘ది గర్ల్ఫ్రెండ్’, ‘ది గ్రేట్ ఫ్రీవెడ్డింగ్ షో’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రమే కాస్త అలరించాయి. రీరిలీజ్లలో శివ చిత్రం మంచి కలెక్షన్స్ని రాబట్టుకుంది. మిగిలిన చిత్రాలేవి ఆకట్టుకోలేకపోయాయి. డిసెంబర్లో అయిన టాలీవుడ్కి బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందో చూడాలి. -
సిద్ధుకి వుమనైజర్ ప్రశ్న.. నేనెందుకు బాధపడతా: చైతన్య జొన్నల గడ్డ
‘తెలుసు కదా’ సినిమా ప్రెస్మీట్లో సిద్ధు జొన్నలగడ్డని ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఆ మధ్య వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సినిమాల్లో మీ పాత్ర ఉన్నట్లుగా..బయట కూడా మీరు వుమనైజరా? అని సదరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై సిద్ధు కూడా స్పందించాడు ‘మైకు ఉంది కదా అలా మాట్లాడటం సరికాదు’ అంటూ ఘాటుగానే సమాధానం చెప్పాడు. తాజాగా ఈ ఇష్యూపై సిద్ధు జొన్నలగడ్డ అన్నయ్య చైతన్య జొన్నలగడ్డ స్పందించాడు.ఆయన కీలక పాత్రలో నటించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ.. ‘మహిళా జర్నలిస్ట్ అడిగిన ఉమనైజర్ ప్రశ్నకు సంబంధించిన వీడియో చూశాను. దీనిపై నేను మాట్లాడనుకోలేదు. ఎందుకంటే నా తమ్ముడు వుమనైజర్ కాదన్న సంగతి నాతో పాటు అందరికి తెలిసిందే. అలాంటప్పుడు ఎందుకు బాధపడతాం. ఒకవేళ నా తమ్ముడు నిజంగానే వుమనైజర్ అయి..ఇప్పుడు బయటపడితే బాధపడేవాళ్లం. అంతేకానీ ఆమె అడిగిందని బాధపడాల్సిన అవసరం లేదు. మా తమ్ముడు దీనిపై స్పందించాడు కానీ.. నేను అయితే అసలు రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. మా వాడికి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి.. అపార్థం చేసుకునే అవకాశం ఉందని లెటర్ రాశాడు. అలా ఎందుకు రాశాడో కూడా నాకు వివరించాడు. కానీ మా వాడిని అలాంటి ప్రశ్న అడిగితే నేను ఎందుకు ఫీల్ అవుతా? మనం అలాంటివాళ్లం కాదని తెలిసిన తర్వాత బాధపడడం ఎందుకు?’ అని చైతన్య చెప్పుకొచ్చాడు. ఇక ఇంట్లో సిద్ధుతో ఎలా ఉంటారని యాంకర్ అడిగిన ప్రశ్నకు ‘మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంది. పెద్దగా మాట్లాడుకోం. సినిమాల గురించి ఇంట్లో తక్కువగా మాట్లాడతాం. అసలు నేను అయితే సినిమాలే చూడను. ఈ మధ్యే సినిమాలు చూడడం స్టార్ట్ చేశా. సిధ్దు సినిమాలన్నీ చూస్తాను. కెరీర్ ప్రారంభంలో కొన్ని సలహాలు ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదు’ అని చెప్పాడు. ఇద్దరు కలిసి ఎప్పుడు నటిస్తారని అడిగిన ప్రశ్నకు.. ఒక నటుడిగా తనతో కలిసి నటించే అవకాశం వస్తే చేస్తా కానీ..బ్రదర్స్ కదా..ఓ సినిమా చేయాలనే ఉద్దేశంతో సినిమా మాత్రం చేయలేం’ అని క్లారిటీ ఇచ్చేశాడు. -
హిట్టు మూవీ.. ఫ్రీగా చూసేయండి.. థియేటర్ల లిస్ట్ ఇదే!
రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai Movie).. చాలామంది ఈ సినిమా మీద మనసు పారేసుకున్నారు. జనాలను అంత బాగా మెప్పిస్తోందీ చిత్రం. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఘన విజయాన్ని సాధించింది. తమ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం చిత్రయూనిట్ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. మహిళందరికీ ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఫ్రీ టికెట్ తీసుకోండిఈ విషయాన్ని నిర్మాత వేణు ఊడుగుల సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఏ థియేటర్కు అయినా వెళ్లండి. కౌంటర్ దగ్గరకు వెళ్లి ఫ్రీ టికెట్ తీసుకోండి.. ఉచితంగా సినిమా చూడండి.. ఈ ఆఫర్ కేవలం మహిళలకు మాత్రమే అని ట్వీట్ చేశాడు. మరో ట్వీట్లో ఏరియా.. అక్కడున్న థియేటర్ల వివరాలను సైతం పొందుపరిచాడు. ఆ లిస్ట్ కింద చూసేయండి..థియేటర్ల లిస్ట్విశాఖపట్నం: శ్రీ కన్య, జగదాంబవిజయనగరం: కృష్ణరాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్కాకినాడ: పద్మప్రియ కాంప్లెక్స్శ్రీకాకుళం: సూర్య మహల్తణుకు: శ్రీ వెంకటేశ్వరఏలూరు: అంబిక కాంప్లెక్స్విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్గుంటూరు: బాలీవుడ్ఒంగోలు: గోపిమచిలీపట్నం: సిరి కృష్ణనెల్లూరు: సిరి మల్టీప్లెక్స్కావలి: లత 2 షోస్, మానస 2 షోస్చిత్తూరు: గురునాథ్తిరుపతి: జయ శ్యామ్కర్నూలు: ఆనంద్నంద్యాల: నిధికడప: రవిరాయచోటి: సాయిఅనంతపురం: ఎస్వీ సినీ మాక్స్హిందూపూర్: గురునాథ్సినిమాఈ ఆఫర్ ఈరోజు (నవంబర్ 27న) మాత్రమే వర్తిస్తుంది. సినిమా విషయానికి వస్తే.. అఖిల్, తేజస్విని జంటగా నటించిన మూవీయే రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నవంబర్ 21న విడుదల చేశారు. ఈ చిత్రం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.చదవండి: సాయిలు సవాల్ విని భయమేసింది: దర్శకుడు బాబీ -
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సాయిలు సవాల్ విని భయమేసింది
‘‘నిజాయితీగా కష్టపడి పని చేస్తే దేవుడు తప్పకుండా విజయాన్ని అందిస్తాడు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీమ్కి కూడా అలాంటి విజయాన్ని అందించాడు. ఈ యంగ్ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. వేణు ఊడుగుల దగ్గర ఉన్న కథలు మన ఇండస్ట్రీకి చాలా అవసరం’’ అని హీరో శ్రీ విష్ణు చెప్పారు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్కి శ్రీ విష్ణు, డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమాతో ఇలా టీమ్ అంతా ఎమోషనల్గా కనెక్ట్ కావడం ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. వేణు ఊడుగులని చూస్తుంటే నాకూ ప్రొడ్యూసర్ కావాలని ఉంది. డైరెక్టర్ సాయిలు అమీర్పేట (ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే అమీర్ పేట్లో అర్ధనగ్నంగా నిలబడతానని సాయిలు పేర్కొన్నారు) సవాల్ చేసినప్పుడు సాటి డైరెక్టర్గా భయమేసింది. కానీ తను బాక్సాఫీస్ బద్దలు కొట్టే సక్సెస్ ఇచ్చాడు’’ అని తెలిపారు. ‘‘రాజు వెడ్స్ రాంబాయి’ని నా జీవితంలో మర్చిపోలేను’’ అన్నారు సాయిలు కంపాటి. ‘‘మా సినిమా ప్రివ్యూ చూసిన కొందరు ఒక్క షో కూడా ఆడదన్నారు. కానీ, ప్రేక్షకులు మా చిత్రాన్ని గుండెల్లో పెట్టుకున్నారు’’ అని వేణు ఊడుగుల చెప్పారు. నిర్మాతలు రాహుల్ మోపిదేవి, వంశీ నందిపాటి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ, కంటెంట్ హెడ్ నితిన్, పాటల రచయిత మిట్టపల్లి సురేందర్, నటీనటులు అనితా చౌదరి, శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి తదితరులు మాట్లాడారు. -
ఇంతకన్నా అవమానం ఉంటుందా?: నిర్మాత ఎమోషనల్
ఒక్క షో ఆడదన్నారు.. ఈరోజు జనం మా సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు దర్శకనిర్మాత వేణు ఊడుగుల. ఈయన రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai Movie). అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు. మంగళవారం నాడు సినిమా సక్సెస్ మీట్ జరగ్గా ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణుతో పాటు దర్శకుడు బాబీ, రచయితలు కోన వెంకట్, బివిఎస్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దొంగల్లా పరిగెట్టారుఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. సినిమాను కొంతమందికి చూపించాం. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లాంటి పెద్దమనిషిని పిలిచాం. వాళ్లతోపాటు ఓ ఐదుగురు చెప్పా పెట్టకుండా వచ్చారు. వారిని మేము పిలవనేలేదు. ఇంటర్వెల్ అవగానే సడన్గా లేచి వెళ్లిపోయారు. దొంగల్లాగా పరిగెడుతున్నారు. వాళ్లు నాక్కూడా పరిచయం ఉన్నవాళ్లే! థియేటర్లో అంతమంది ఎదుట అలా వెళ్లిపోతుంటే వారి మూడ్ చెడిపోదా? ఒక ఫిలింమేకర్కు ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా అవమానం ఇంకేదైనా ఉంటుందా? అదసలు మర్యాదగా ఉందా?గుండెల్లో పెట్టుకున్నారుమావాళ్లేమన్నారంటే.. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, పోనివ్వండి అన్నారు. వెళ్లిపోయాక రెండుమూడు రోజులు నెగెటివ్ ప్రచారం చేశారు. వాడు డైరెక్టరే కాదు, సినిమా తీయడమే రాలేదు. అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు. కానీ, ఈరోజు జనాలు సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు. సినిమా హిట్టయిందన్న బలుపుతో ఇదంతా చెప్పడం లేదు. సినిమాకు కనీస మర్యాద ఇవ్వాలని చెప్తున్నాను అంతే! ఎవరు ప్రివ్యూకి పిలిచినా వెళ్లండి, కానీ మధ్యలో వచ్చేయకండి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం -
నటికి లవ్ లెటర్ రాశా: శివాజీ రాజా
చిన్న సినిమాగా వచ్చిన "రాజు వెడ్స్ రాంబాయి" మూవీ (Raju Weds Rambai Movie)కి మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సీనియర్ నటుడు శివాజీ రాజా ఓ సరదా విషయాన్ని బయటపెట్టాడు.ప్రేమలేఖశివాజీ రాజా మాట్లాడుతూ.. అనిత చౌదరి, నేను చాలా సినిమాలు చేశాం. మురారి సమయంలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. దర్శకుడు కృష్ణవంశీ ఖాళీగా కూర్చోకుండా ఓ లవ్ లెటర్ రాయమన్నాడు. అచ్చ తెలుగు భాషలో, పశ్చిమ గోదావరి యాసలో అనితకు ప్రేమలేఖ రాశా.. ఆమె ఒక్కతే చదువుకోవచ్చుగా! ఆస్పత్రిలో ఉండగా నా భార్యకు..యూనిట్ అందరికీ ఇచ్చింది. నాకు యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో ఉంటే అక్కడికి వచ్చి నా భార్యకు లవ్లెటర్ చూపించింది అని గుర్తు చేసుకున్నాడు. గతంలో ఎన్నో సినిమాల్లో జంటగా నటించిన శివాజీ రాజా- అనిత.. రాజు వెడ్స్ రాంబాయి మూవీలో భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. అనిత.. గోల్మాల్, సంతోషం, నువ్వే నువ్వే, ఉయ్యాల జంపాల, వరుడు, మన్మథుడు, తులసీదళం వంటి పలు సినిమాల్లో నటించింది. అలాగే పలు సీరియల్స్ చేసింది.సినిమాశివాజీ రాజా.. ప్రేమంటే ఇదేరా, పెళ్లి సందడి, మావిచిగురు, నిన్నే ప్రేమిస్తా, మురారి, నరసింహనాయుడు, నీ స్నేహం, వర్షం, మొగుడ్స్ పెళ్లాంస్ ఇలా అనేక సినిమాలు చేశాడు. బుల్లితెరపై అమృతం సీరియల్లో యాక్ట్ చేశాడు. అలాగే మరికొన్ని ధారావాహికల్లోనూ మెప్పించాడు.చదవండి: అమ్మను అవమానించారు: మృణాల్ ఠాకూర్ -
‘రాజు వెడ్స్ రాంబాయి’ కలెక్షన్స్ ఎంతంటే?
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం .. తొలిరోజే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 4 రోజుల్లో ఈ సినిమాకు 9.08 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజును మించిన వసూళ్లు మూడో రోజు, మూడో రోజును మించి నాలుగో రోజు ఈ చిత్రానికి కలెక్షన్లు దక్కాయి. వీక్ డేస్ లోనూ "రాజు వెడ్స్ రాంబాయి" బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ అవుతుండటం విశేషం."రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. -
ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ప్రోడక్షన్స్పై సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వర రావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేశారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘రాజు వెడ్స్ రాంబాయి’ పెద్ద విజయాన్ని సాధిస్తోంది. ఇప్పటిదాకా రూ. 7.28 కోట్ల రూపాయల వసూళ్లు రాగా, కేవలం నైజాం నుంచే రూ. 5 కోట్ల 2లక్షలు వసూలయ్యాయి. ఏపీలో మొదటి రెండు రోజులు వసూళ్లు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మూడో రోజు నుంచి పుంజుకున్నాయి. ఐ–బొమ్మ క్లోజ్ కావడం వల్ల మా సినిమా కలెక్షన్స్ పెరిగాయి.అలాగే టికెట్ ధర రూ. 99 పెట్టడం మాకు ప్లస్ అయ్యింది. ఈ రేటుకు మొదట్లో కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు 70 శాతం మంది ఈ రేటుకు అంగీకారానికి వచ్చారు’’ అని చెప్పారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘రాజు వెడ్స్ రాంబాయి’ చూస్తూ అమ్మాయిలు ఎమోషనల్‡అవుతున్నారు. మా పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాన్నిస్తుందని ఆశిస్తున్నాం. ఐ–బొమ్మలో పైరసీ మూవీస్ని ఎక్కువగా బీ, సీ సెంటర్స్ వాళ్లే చూస్తారు. ఇప్పుడా సైట్ క్లోజ్ కావడం వల్ల వాళ్లు థియేటర్స్కు రావడం పెరిగింది. టికెట్ రేట్ రూ.99 గా ఫిక్స్ చేసుకోకుంటే సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేసుకోవాల్సిందే.. పరిస్థితులు అలా మారాయి’’ అన్నారు. -
రాజు వెడ్స్ రాంబాయి.. బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్!
ఈ రోజుల్లో కంటెంట్ కింగ్ అనే మాట అక్షరాల నిజమవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్దపెద్ద స్టార్స్ ఉంటేనే మార్కెట్ ఉంటుందనే భ్రమలోనుంచి బయటికి రావాల్సిందే. చిన్న సినిమా అయినా సరే.. జనాలకు కనెక్ట్ అయితే కాసుల వర్షం కురిపించడం ఖాయమే. అదే నిజం చేస్తోంది ఇటీవలే విడుదలైన తెలుగు సినిమా. అదేనండి రూరల్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి.ఈనెల 21న థియేటర్లలోకి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా దూసుకెళ్తోంది. సినిమా రిలీజ్కు ముందే తన కథపై నమ్మకంతో డైరెక్టర్ ఛాలెంజ్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. మొదటి రోజే ఈ మూవీకి దాదాపు కోటిన్నర కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్ కలిసి రావడంతో కేవలం మూడు రోజుల్లోనే రూ.7.28 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఒక్క నైజాంలోనే రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కేవలం మౌత్టాక్తోనే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా.. ఈ మూవీలో తేజస్వి రావు, అఖిల్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతు సాయిలు కాంపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు.ఈ మూవీ కథేంటంటే..'రాజు వెడ్స్ రాంబాయి' విషయానికొస్తే.. 2010లో ఖమ్మం దగ్గర ఓ పల్లెటూరిలో జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) పెళ్లిళ్లకు బ్యాండ్ కొడుతుంటాడు. అదే ఊరిలో ఉండే రాంబాయిని(తేజస్వి రావు)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా రాజు ప్రేమలో పడిపోతుంది. కానీ తనకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలనేది రాంబాయి తండ్రి వెంకన్న(చెతన్య జొన్నలగడ్డ) పట్టుదల. ఇంతలోనే రాజు-రాంబాయి ప్రేమ విషయం ఊరంతా తెలిసిపోతుంది. దీంతో వీళ్లిద్దరూ ఊరి వదిలి పారిపోవాలనుకుంటారు. తర్వాత ఏమైంది? చివరకు ప్రేమలో విజయం సాధించారా లేదా అనేదే మిగతా స్టోరీ. -
అందుకే సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పుకోవట్లేదు : చైతన్య జొన్నలగడ్డ
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా, చైతన్య జొన్నలగడ్డ కీ రోల్ చేసిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్లో సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. శనివారం చైతన్య జొన్నలగడ్డ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బబుల్గమ్, హిట్ 3’ వంటి చిత్రాల్లో నటించాను కానీ చాలామందికి తెలియదు. ఇప్పుడు ‘రాజు వెడ్స్ రాంబాయి’లో నేను చేసిన వెంకన్న పాత్రకు, సినిమాకూ మంచి స్పందన లభిస్తుండటం హ్యాపీ. నేను లీడ్ రోల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా రావాల్సింది. ఆ సినిమా పనుల్లో ఉన్న నాకు దివ్యాంగుడు వెంకన్న రోల్ చేసే చాన్స్ వచ్చింది. ఈ పాత్ర కోసం చీకట్లో కుంటడం ప్రాక్టీస్ చేశాను. హీరో సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పి, తన పేరు ఉపయోగించుకోవాలనుకోలేదు. ఏ సపోర్ట్ లేకుండా నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే సిద్ధును మా సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్ కు పిలవడం లేదు.‘రాజు వెడ్స్ రాంబాయి’లో నా నటనను మెచ్చుకుంటూ సిద్ధు మెసేజ్ చేశాడు. ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. పవన్ డైరెక్షన్లోనే రాజశేఖర్గారు హీరోగా చేస్తున్న ‘మగాడు’ సినిమాలో నటించాను’’ అన్నారు. అవకాశం వస్తే సిద్ధుతో కలిసి నటిస్తా’ అని అన్నారు. . -
21న థియేటర్లలో 21 సినిమాలు రిలీజ్.. ఏది హిట్? ఏది ఫట్?
'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు'.. టాలీవుడ్ నిర్మాతలు పదేపదే చెప్పే మాట. ప్రతిదానికి ప్రేక్షకుడినే నిందిస్తుంటారు తప్పితే తప్పు ఎక్కడ జరుగుతుందో చూసుకోరు. ఎందుకంటే ప్రేక్షకుడు అంటే అంత అలుసు. ఈ వారమే తీసుకుందాం. ఏకంగా 21 సినిమాలు థియేటర్లలో రిలీజైతే వీటిలో తెలుగు చిత్రాలు 16 ఉన్నాయి. పోనీ వీటిలో ఏమైనా బాగున్నాయా అంటే లేదు! ఉన్నంతలో ఒక్కదానికే పాజిటివ్ టాక్ వచ్చింది. మరి మిగతా వాటి సంగతేంటి? వాటి గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: 'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్)చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పడే కష్టం ఒకటే. ఎందుకంటే ఒక మూవీ తీయాలంటే వందలాది మంది కష్టపడాలి. కష్టపడితే సరిపోదు దాన్ని ప్రేక్షకుడి వరకు చేరేలా చూడాలి. కానీ టాలీవుడ్లో కొందరి తీరు చూస్తుంటే జాలేస్తుంది. ఈ వారమే తీసుకోండి. 20కి పైగా మూవీస్ థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో తెలుగువి కూడా చాలానే ఉన్నాయి. కానీ ప్రేక్షకులకు రెండు మూడింటివి తప్పితే మిగతా వాటి పేర్లు కూడా తెలీదు. కనీసం తెలిసేలా చేయనప్పుడు రిలీజ్ చేయడం ఎందుకనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న.ఈ వారం వచ్చిన వాటిలో కాస్తోకూస్తో పబ్లిసిటీతో వచ్చినవి మూడో నాలుగు సినిమాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 'రాజు వెడ్స్ రాంబాయి'కి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. ఉన్నంతలో దీన్ని చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మిగతా వాటి విషయానికొస్తే అల్లరి నరేశ్ హీరోగా చేసిన '12ఏ రైల్వే కాలనీ' మూవీని థ్రిల్లర్ జానర్లో తీశారు. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయేలా కనిపిస్తుంది. ప్రియదర్శి 'ప్రేమంటే' కూడా రిలీజ్కి ముందు ఇదో ప్రేమకథ అన్నట్లు ప్రచారం చేశారు. తీరాచూస్తే ఇదో దొంగలైన భార్యభర్త కథ. దీని కంటెంట్ కూడా అంతంత మాత్రమే ఉంది. ఇది కూడా నిలబడటం కష్టమే.(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)ఈ మూడు కాకుండా రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ఓ కామెడీ మూవీ. అసలు ఇదొకటి వచ్చిన సంగతి కూడా జనాలకు తెలియదు. వీటితో పాటు కలివనం, శ్రీమతి 21 ఎఫ్, జనతా బార్, ఇట్లు మీ ఎదవ, క్షమాపణ గాధ, మఫ్టీ పోలీస్, హ్యాపీ జర్నీ, ఫేస్ టూ ఫియర్ లెస్, ప్రేమలో రెండోసారి, డ్యూయల్, కొదమ సింహం రీ రిలీజ్, ఆవారా రీ రిలీజ్.. ఇలా బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. వీటిలో ఒక్కటైనా హిట్ అయిందా అంటే లేదు. అసలు ఇవి రిలీజ్ అయ్యాయనే సంగతి కూడా ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయారు.చిన్నదా పెద్దదా అనే సంగతి పక్కనబెడితే.. ఇంతా కష్టపడి ఓ సినిమా తీసి, దాన్ని పోటీలో రిలీజ్ చేయడం అవసరమా? లేదంటే ఖాళీగా ఉండే వారంలో విడుదల చేయడం మంచిదా అనేది నిర్మాతలే ఆలోచించుకోవాలి. అలా చేస్తే ఒకరో ఇద్దరో ప్రేక్షకులైనా మీ చిత్రాలకు వస్తారు. చిన్న చిత్రాలు తీసే నిర్మాతలందరూ ఈ విషయంలో కాస్త దృష్టి పెట్టాలి. ఏదో తీశామా, థియేటర్లలో రిలీజ్ చేశామా అని వదిలేయకుండా కాస్త కంటెంట్పై కూడా దృష్టి పెడితే మంచిది. అలానే సరైన తేదీన రిలీజ్ కూడా ముఖ్యమే. ఇలాంటివేం చేయకుండా ప్రేక్షకుల్ని నిందించడం మాత్రం సరికాదు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!) -
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం సక్సెస్మీట్ (ఫొటోలు)
-
తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)
-
మరోసారి విజయం సాధించాం: బన్నీ వాసు
‘‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటున్నారు. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు బాగా చేరువ చేయడానికి ప్రయత్నించాం. కంటెంట్ను జడ్జ్ చేయడంలో మేమంతా మరోసారి విజయం సాధించాం’’ అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాసు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు.వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేసిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్మీట్లో సాయిలు కంపాటి మాట్లాడుతూ– ‘‘మా మూవీ సక్సెస్ కావడంతో మాటలు రావడం లేదు’’ అని చెప్పారు. ‘‘ప్రతి ప్రేమ జంట, ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు డా.నాగేశ్వరరావు. ‘‘ఈ స్టోరీ ప్రేక్షకులకు నచ్చుతుందన్న మా నమ్మకం నిజమైంది’’ అని రాహుల్ మోపిదేవి పేర్కొన్నారు.‘‘నా పదేళ్ల కష్టానికి ఈ చిత్రంతో ఫలితం దక్కింది’’ అన్నారు అఖిల్ రాజ్. ‘‘మా మూవీ ఎమోషనల్గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు’’ అని వేణు ఊడుగుల చెప్పారు. ‘‘ప్రేక్షకాదరణ, ప్రేమ ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు చేసే ఎనర్జీని అందిస్తోంది’’ అన్నారు వంశీ నందిపాటి. సురేష్ బొబ్బిలి, చైతన్య జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
సారీ చెప్పిన 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్
ఈ రోజు (నవంబరు 21) థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో కాస్త ఎడ్జ్ తీసుకున్న సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. హీరోహీరోయిన్లు, దర్శకుడు అందరూ కొత్తవాళ్లే. అయినా సరే ఓ షాకింగ్ ప్రేమకథని ప్రెజెంట్ చేశారు. అందుకు తగ్గట్లే మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సరే ఈ సంగతి కాసేపు పక్కనబెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాస్త ఆవేశానికి లోనైన డైరెక్టర్.. పెద్ద ఛాలెంజ్ చేశాడు. దానిపై ట్రోలింగ్ జరిగేసరికి ఇప్పుడు సారీ చెప్పేశాడు.(ఇదీ చదవండి: ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ)సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్న 'రాజు వెడ్స్ రాంబాయి' దర్శకుడు సాయిలు కాంపాటి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్ వస్తే అమీర్పేట్లో చొక్కా తీసి తిరుగుతా అని అన్నాడు. కానీ ఈ వ్యాఖ్యలపై ట్రోలింగ్ కాస్త గట్టిగానే వచ్చింది. సినిమా బాగుంటే సరే గానీ ఇంత పెద్ద స్టేట్మెంట్స్ అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి. దీంతో ఇప్పుడు రియలైజ్ అయ్యాడు.ఈ రోజు మధ్యాహ్నం సక్సెస్ మీట్ జరగ్గా ఇందులో మాట్లాడిన డైరెక్టర్ సాయిలు.. 'కొత్త డైరెక్టర్లకు మాట్లాడటం రాదు. దయచేసి క్షమించండి అన్న. అమీర్పేట్లో సాయంత్రం వచ్చి బ్యాండ్ కొడతా అన్నా' అని తన వ్యాఖ్యలని సవరించుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. అఖిల్ రాజ్, తేజస్వి రావు ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఖమ్మంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: మనసు దోచేస్తున్న 'రాంబాయి'.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)"Konni Years Nunchi Padina Kashtaniki Ee Phalitham Chushaka Maatalu Raatledu"Watch Director #SaailuKampati speech @ #RajuWedsRambai Gratitude Meet💥▶️ https://t.co/e7rE9F4qCpEvent By @shreyasgroup ✌️#RajuWedsRambai #RajuWedsRambaiGratitudeMeet@etvwin @venuudugulafilm… pic.twitter.com/xtHCdo2KWG— Shreyas Media (@shreyasgroup) November 21, 2025 -
మనసు దోచేస్తున్న 'రాంబాయి'.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఈ వారం డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాగా.. వాటిలో మూడు సినిమాలు మాత్రమే కొద్దోగొప్పో బజ్తో ఉన్నట్లు కనిపించాయి. ఇప్పుడు వాటిలో 'రాజు వెడ్స్ రాంబాయి'కి కాస్త ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. సినిమా క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో హీరోయిన్ కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈమె ఎవరా? బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని ఆరా తీస్తున్నారు.(ఇదీ చదవండి: ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ)'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలో హీరోయిన్ అసలు పేరు తేజస్వి రావు. గతేడాది రిలీజైన 'కమిటీ కుర్రోళ్లు' సినిమాలో జ్యోతి పాత్ర చేసింది ఈమెనే. ముద్దు పెట్టుకుంటే కడుపు వచ్చేస్తాది అని ఏడిచే అమ్మాయిగా చేసింది ఈమెనే. అందులో అందులో కట్టుబొట్టు ఒకలా ఉండటంతో పాటు ఎక్కువమంది నటీనటుల ఉండటంతో ఈమెకు ఓ మాదిరి గుర్తింపు మాత్రమే వచ్చింది. ఇప్పుడీ మూవీలో హీరోయిన్గా ఆకట్టుకోవడంతో వైరల్ అయిపోయింది.ఈమె పుట్టింది గోదావరి జిల్లాలో అయినప్పటికీ.. రాంబాయిగా తెలంగాణ పిల్లగా మంచి యాక్టింగ్ చేసింది. సినిమాలో ఈమె ఇచ్చిన చిన్న ఎక్స్ప్రెషన్స్కి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అయితే కమిటీ కుర్రోళ్లు, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు చేయడానికి ముందు దాదాపు ఐదేళ్లుగా షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసింది. వీటిలో సయోని, బావమరదలు 1-2, పెళ్లి కూతురు విత్ మెనీ డౌట్స్, మినిట్స్, నిశ్చితార్థం, పెళ్లి కూతురు, కేరళ కుట్టి, లవ్ స్టోరీ ఇన్ రాజమండ్రి, మాస్ గాడి క్లాస్ పిల్ల.. ఇలా చాలా లఘు చిత్రాలు చేసింది. ఇన్నాళ్లకు టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. రాబోయే రోజుల్లో ఈమె దశ తిరిగేలా కనిపిస్తుంది.(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ) View this post on Instagram A post shared by Tejaswi. (@tej_aswiii) -
ఈ సినిమా క్లైమాక్స్ విని షాకయ్యాను: కిరణ్ అబ్బవరం
‘‘రాజు వెడ్స్ రాంబాయి’ క్లైమాక్స్ విని, షాక్ అయ్యాను. ఇలాంటి దారుణం కూడా జరిగిందా? ఇలా చేస్తారా? ఇలాంటి మనుషులు ఉంటారా? అనిపించింది. ఈ సినిమాను మిగతా వారికంటే ముందు పదిహేనేళ్లు ప్రేమకథను దాచిపెట్టిన ఆ ఊరివాళ్లు చూడాలి’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’.సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అతిథిగా హాజరయ్యారు కిరణ్ అబ్బవరం. ‘‘ఒక ఊరు నేపథ్యంలో ఈ సినిమాను రూ పొందించాం’’ అన్నారు రాహుల్ మోపిదేవి.వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మా సినిమా టిక్కట్ ధర కేవలం రూ.99 మాత్రమే ఉంటుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం ఇది’’ అని పేర్కొన్నారు. ‘‘ఉప్పెన’లో అమ్మాయి తండ్రి ఎలా ఉంటాడో చూసి ఉంటారు. ‘కోర్టు’ చిత్రంలో మంగపతిని చూశారు. ఆపాత్రలకు మించి ‘రాజు వెడ్స్ రాంబాయి’లో నేను చేసిన హీరోయిన్ తండ్రి వెంకన్నపాత్ర ఉంటుంది’’ అన్నారు చైతన్య జొన్నలగడ్డ. -
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
పదేళ్ల తర్వాత నా లైఫ్ మారబోతుంది : అఖిల్
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్లుగా ఉంటున్న నాకు సరైన బ్రేక్ రాలేదు. ఆ కష్టానికి తగిన ఫలితం ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) సినిమా తీసుకొస్తుందని నమ్ముతున్నా. ఈ సినిమా రిలీజైన రోజు నుంచి నా జీవితం మారిపోతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో నేను చేసిన రాజు పాత్ర ప్రతి అబ్బాయికి కనెక్ట్ అవుతుంది’’ అని హీరో అఖిల్ రాజ్(Akhil Raj) చెప్పారు. సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.తేజస్విని మాట్లాడుతూ– ‘‘రాంబాయి క్యారెక్టర్కు నేను సరిపోతానని ఎంపిక చేశారు. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు సాయిలుగారు సపోర్ట్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు నేను భావోద్వేగానికి గురయ్యా.ఈ చిత్రాన్ని 7 జీ బృందావన్ కాలని, ప్రేమిస్తే, బేబి, సైరత్ వంటి కల్ట్ మూవీస్ తో పోల్చుకోవచ్చు. ఆ చిత్రాల్లాగే మా సినిమా కూడా కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటుంది. ఈ నెల 21న మా మూవీ చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ఆడియెన్స్ కూడా మేము ఇలా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకుంటారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా రూపొందించినా కొంత సినిమాటిక్ లిబర్టీ కూడా మూవీలో ఉంటుంది’ అన్నారు. -
ఫ్రైడే సందడి
సినిమా లవర్స్కి ఈ ఫ్రైడే జోష్ డే. ఎందుకంటే ఒకటి కాదు... రెండు కాదు... డజను సినిమాల వరకూ విడుదల కానున్నాయి. యాక్షన్ మావీస్, కామెడీ ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ స్టోరీస్... ఇలా అన్ని రకాల సినిమాలూ వెండితెరపైకి రావడానికి రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం... చూసేయడానికి రెడీ అయిపోండి. ఈ లోపు శుక్రవారం విడుదల కానున్న సినిమాలపై ఓ లుక్కేయండి.గ్రిప్పింగ్ థ్రిల్లర్ ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాన్ని అందించడంతో పాటు.. అప్పుడప్పుడూ వారిని భయపెడుతుంటారు ‘అల్లరి’ నరేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. కామాక్షీ భాస్కర్ల హీరోయిన్గా నటించారు. ‘పొలిమేర, పొలిమేర 2’ చిత్రాల ఫేమ్ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు షో రన్నర్గా వ్యవహరించారు. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘వైవా’ హర్ష, ‘గెటప్’ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి ఇతర పాత్రలు పోషించారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘‘మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ఆత్మలు కొందరికే ఎందుకు కనిపిస్తాయి? అందరికీ ఎందుకు కనపడవు? వంటి అంశాలతోనూ రూపొందిన ఈ చిత్రంలో తర్వాత ఏం జరగబోతుందనే ఎగ్జయిట్మెంట్ ఆడియన్స్ లో ఉంటుంది.ఈ సినిమాలో నరేశ్గారి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆయనకు జోడీగా ఆరాధన అనే పాత్రలో కామాక్షీ భాస్కర్ల నటించారు. కథలో ఆమె పాత్రకి చాలాప్రాధాన్యం ఉంటుంది. భీమ్స్గారి సంగీతం, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా కూడా మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది.క్రైమ్ కామెడీ లవర్బోయ్గా యూత్ ఆడియన్స్లో తనకంటూ చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ తరుణ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘పాంచ్ మినార్’. రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్గా నటించారు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. గోవింద రాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీపై మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ‘‘క్రైౖమ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘పాంచ్ మినార్’.ఈ టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్కి మంచి స్పందన వచ్చింది. ఉద్యోగం లేని ఓ కుర్రాడు కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. అప్పుడు తనకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ప్రత్యేకించి రాజ్ తరుణ్ పాత్ర ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో నవ్వులు పూయిస్తుంది. ఈ చిత్రం క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందినప్పటికీ ఆడియన్స్ మరీ భయపడేంత వయొలెంట్గా ఉండదు. కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూస్తూ కడుపుబ్బా నవ్వుకుంటారు. శేఖర్ చంద్ర సంగీతం, ఆదిత్య జవ్వాది విజువల్స్ మా సినిమాకి అదనపు బలాలు’’ అని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ యాక్షన్ కింగ్గా ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానం సొంతం చేసుకున్నారు అర్జున్ సర్జా. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మఫ్టీ పోలీస్’. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటించారు. రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా ముఖ్య పాత్రల్లో నటించారు. జియస్సార్ ఆర్ట్స్ బ్యానర్పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ‘తీయవర్ కులై నడుంగ’ సినిమా తమిళంలో విజయవంతం అయింది.ఈ సినిమాని శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై నిర్మాత ఎ.ఎన్. బాలాజీ తెలుగులో ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఒక రచయిత హత్య నేపథ్యంలో సాగే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో చిత్రం ‘మఫ్టీ పోలీస్’. ఇటీవలి కాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి (మానసిక ఎదుగుదల) గురించి కూడా మా సినిమాలో చర్చించాం. ఈ చిత్రంలో అర్జున్ యాక్షన్, పర్సనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.అర్జున్, ఐశ్వర్యా రాజేష్లకు తెలుగునాట ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని ‘మఫ్టీ పోలీస్’ చిత్రాన్ని తెలుగులోనూ అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. శరవణన్ అభిమన్యు సంగీతం, భరత్ ఆశీనగన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. తమిళంలో విజయం సాధించినట్లే తెలుగులోనూ ‘మఫ్టీ పోలీస్’ అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఎ.ఎన్. బాలాజీ తెలిపారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ చక్కని గుర్తింపు సొంతం చేసుకున్న ప్రియదర్శి హీరోగా నటించిన మరో వినోదాత్మక చిత్రం ‘ప్రేమంటే’. ఈ సినిమా ద్వారా నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు. ఈ మూవీలో ఆనంది హీరోయిన్గా నటించగా, యాంకర్ సుమ కనకాల ముఖ్యమైన పాత్ర పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో ఎస్వీసీ ఎల్ఎల్పీ, స్పిరిట్ మీడియా బ్యానర్స్పై పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న ఆడియన్స్ ముందుకొస్తోంది.‘‘రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘ప్రేమంటే’. కొత్తగా పెళ్లయిన జంట జీవితంలోని ప్రేమ, గొడవలు, సరదాలు, సంతోషాలు, వినోదం, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తూ అందరికీ కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్. కానిస్టేబుల్ క్యారెక్టర్లో సుమ కనకాల తన సిగ్నేచర్ మార్క్తో అలరిస్తారు. ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.విశ్వనాథ్ రెడ్డి లైవ్లీ విజువల్స్ అందించారు. లియాన్ జేమ్స్ బ్యాగ్గ్రౌండ్ స్కోర్ ఫన్ని మరింత ఎలివేట్ చేసింది. ఎడిటర్ రాఘవేంద్ర తిరున్,ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ మూలే, డైలాగ్ రైటర్స్ కార్తిక్ తుపురాణి, రాజ్కుమార్ అందరూ ది బెస్ట్ వర్క్ ఇచ్చారు.ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్లో ఉన్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. వాస్తవ ఘటనలతో... అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ‘‘2004లో పల్లెటూరులో జరిగిన వాస్తవ ఘటనలతో రూపొందిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’.ఇది పరువు హత్యకు సంబంధించిన కథ అయినప్పటికీ ఫిక్షనల్ యాడ్ చేసి, తెరకెక్కించాం. ఈ కథలో ప్రేమికులకు ఏం జరిగింది అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రతి ప్రేమలో బాధ, కోపం, సంతోషం ఉంటాయి. నిజమైన ప్రేమలో ఉన్న ప్రేమికులు ఒకరి కోసం మరొకరు ఎంత బలంగా నిలబడతారు అనేది ఈ మూవీ కథ. చాలా ఇంటెన్స్ స్టోరీ ఇది. ప్రత్యేకించి ఈ సినిమా పతాక సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అఖిల్, తేజస్విని అద్భుతంగా నటించారు. ఈ సినిమా చూశాక నిజంగా ప్రేమించుకున్న వాళ్లు తమ ప్రేమ కోసం ఎంతవరకు వెళ్తారు? అనేది ప్రేక్షకులు తెలుసుకుంటారు. సురేష్ బొబ్బిలి సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ’’ అని చిత్రబృందం తెలిపింది.వృక్షో రక్షతి రక్షితః రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, నాగదుర్గ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘కలివి వనం’. రాజ్ నరేంద్ర దర్శకత్వం వహించారు. ఏఆర్ప్రొడక్షన్స్ పై మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. ‘‘వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన అరుదైన సినిమా ‘కలివి వనం’. వర్షం ఆకాశం నుంచి వస్తుందని పిల్లలకు చెబుతాం.కాదు చెట్ల వల్లే వర్షం వస్తుందని నేర్పించాలి. అప్పుడే చెట్ల విలువ బాల్యం నుంచి పిల్లలు తెలుసుకుంటారు. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య, తన 70 ఎకరాల సొంత భూమిలో మొక్కలు నాటి అడవిగా మార్చిన దుష్చర్ల సత్యనారాయణగార్ల స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా. ‘కలివి వనం’ పిల్లల జీవిత శైలిలో ఒక పాఠ్య భాగంలాగా, పెద్దబాల శిక్షలో ఒక పేజీలాగా వాళ్ల మైండ్లో ఉండిపోతుంది. ఇలాంటి సినిమాని పిల్లలు తప్పకుండా చూడాలి. మదీన్ ఎస్.కె. సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది.యూత్ఫుల్ ఎంటర్టైనర్ త్రినాథ్ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ద్వారా తెలుగమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ ఇతర పాత్రలు పోషించారు. సంజీవనిప్రొడక్షన్స్ బ్యానర్పై బళ్లారి శంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘పూర్తిస్థాయి వినోదాత్మకంగా, యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’.మా సినిమాకి కథే హీరో. ఇది ఒక తండ్రీ కొడుకుల కథ, తండ్రీ కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ. ఈ సినిమా 100శాతం ప్రేక్షకులను నవ్విస్తుంది. మా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్స్కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి కుర్రాడు తమని తాము హీరో పాత్రలో ఊహించుకుంటారు. ఆర్పీ పట్నాయక్గారి సంగీతం మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. జగదీష్ చీకటివిజువల్స్ ఆకట్టుకుంటాయి’’ అన్నారు మేకర్స్.చెన్నై నేపథ్యంలో... ‘డాడా’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న కెవిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మాస్క్’. దర్శకుడు వెట్రిమారన్ మెంటార్గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ద్వారా విక్రమన్ అశోక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘తడాఖా, సైంధవ్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆండ్రియా జెరెమియా ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మించారు. రుహానీ శర్మ, చార్లీ, రమేష్ తిలక్, కల్లూరి విను, అర్చన చాందోక్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 21న ఆడియన్స్ ముందుకొస్తోంది.‘‘పూర్తిగా చెన్నై నేపథ్యంలో సాగే డార్క్ కామెడీ చిత్రం ‘మాస్క్’. ఆండ్రియా తమిళంలో అటు హీరోయిన్గా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో నెగటివ్ రోల్లో కనిపించడంతో పాటు నిర్మించడం విశేషం. కెవిన్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. జి.ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం, ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం ఈ సినిమాని మరో ఎత్తుకు తీసుకెళతాయి. మా మూవీ టీజర్, ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది. మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా సరికొత్త అనుభూతి పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.నిజ జీవిత కథతో....కేథలిక్ మత సోదరి, సామాజిక కార్యకర్త, సీనియర్ రాణి మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన మలయాళ చిత్రం ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్’. విన్సీ అలోషియస్ లీడ్ రోల్లో నటించారు. షైసన్ పి.ఔసేఫ్ దర్శకత్వం వహించారు. ట్రై లైట్ క్రియేషన్స్ పై సాండ్రా డిసౌజా రాణా నిర్మించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాదు.. 2024 ఆస్కార్కి నామినేట్ అయింది కూడా. ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ ద్వారా ఈ నెల 21న తెలుగులో విడుదల చేస్తున్నారు.‘‘సీనియర్ రాణి మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్’ రూపొందిందింది. ఆమె పేదల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేశారు. అదేవిధంగా అణగారిన వర్గాల కోసం, మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారామె. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను కూడా మా సినిమాలో చూపిస్తున్నాం. క్షమాపణ అనేది గొప్పది. ఒకరిని క్షమిస్తేనే శాంతి ఉంటుంది. ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా తెలుగు వారికి కూడా నచ్చుతుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు.వినోదాల ప్రయాణం హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ జంటగా నటించిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్ కొండ నిర్మించారు. దువ్వాసి మోహన్, సంజయ్ రాయచూర, ఆనంద్ భారతి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 21న రిలీజ్ కానుంది. ‘‘వినోదం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న ఘటనలపై ఆలోచింపజే సేలా ఈ సినిమా ఉంటుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతులమీదుగా విడుదల చేసిన మా సినిమా ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ కథ విన్న తర్వాతనే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి అంగీకరించాను. ఇలాంటి సినిమా చేసిన చైతన్య కొండాని అభినందిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలో అలజడులు, దానిమీద సామాజిక బాధ్యత ఉన్న డైరెక్టర్, మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు కలసి ఇలాంటి సినిమాలు తీయడం అభినందనీయం. హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఇలాంటి సినిమాలకు నేను సహకరిస్తాను’ అంటూ బండి సంజయ్గారు చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది. చైతన్య రాజ్ సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అరుణ్ కుమార్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయి’’ అంటూ దర్శక– నిర్మాతలు తెలిపారు.జనతా బార్లో... రాయ్ లక్ష్మీ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘జనతా బార్’. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. అశ్వథ్ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ పతాకపంపై రమణ మొగిలి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. ‘‘కుస్తీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జనతా బార్’. మహిళలప్రాధాన్యతను చాటి చెప్పే కథగా ఈ మూవీ ఉంటుంది.బార్ గర్ల్గా తన ప్రయాణం మొదలు పెట్టిన ఓ అమ్మాయి కుస్తీ పోటీల్లో ఎలా రాణించింది? ఈ ప్రయాణంలో సమాజం నుంచి ఆమె ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొంది? వంటి అంశాలతో మా సినిమా సరికొత్తగా ఉండబోతోంది. అలాగే ఈ మంచి సందేశం కూడా ఉంది. హీరో శ్రీకాంత్ చేతులమీదుగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఓ రకంగా ఈ సినిమా రాయ్ లక్ష్మీకి తెలుగులో హీరోయిన్ గా రీ ఎంట్రీలాంటిది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ‘జనతా బార్’ ఎలాంటి ప్రమోషన్స్ కార్యక్రమాలు చేయకపోవడంతో విడుదల వాయిదా పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రేమలో రెండోసారిరమణ సాకే, వనిత గౌడ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. సత్య మార్క దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘జబర్దస్త్’ శ్రీను, ‘జబర్దస్త్’ ఫణి, బాబీ, రాణి ఇతర పాత్రలు పోషించారు. సాకే రామయ్య సమర్పణలో సిద్ధ క్రియేషన్ బ్యానర్లో సాకే నీరజ లక్ష్మి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్ కానుంది. ‘‘ప్రేమ నేపథ్యంలో తీసిన సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. అదే నేపథ్యంలో రూపొందిన మా సినిమా కథ కూడా నేటి యువతీ యువకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రస్తుత ట్రెండ్కి తగట్టు సత్య మార్కగారు ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ప్రేమతో పాటు భావోద్వేగాలు, సెంటిమెంట్ వంటి అంశాలు అలరిస్తాయి. మా చిత్ర సంగీతం, నేపథ్య సంగీతం మనసును హత్తుకునేలా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -– డేరంగుల జగన్ మోహన్ -
నిర్మాతలపై గౌరవం ఇంకా పెరిగింది: వేణు ఊడుగుల
‘‘ఏదైనా మంచి కాన్సెప్ట్, పర్పస్ ఉన్న కథ దొరికితే దాన్ని ప్రేక్షకుల ముందుకు సరైన విధంగా చేర్చాలనే ప్రయత్నంలో భాగంగా దర్శకుడిగా ఉన్న నేను ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో నిర్మాతగా మారాను. ప్రోడ్యూసర్ అయ్యాక ప్రోడక్షన్ లోని ఇబ్బందుల గురించి నాకు మరింత బాగా తెలిసింది. నిర్మాతలపై నాకున్న గౌరవం ఇంకా పెరిగింది.‘బేబి, 7జీ బృందావన కాలనీ, సైరత్, ప్రేమిస్తే..’ వంటి చిత్రాల తరహాలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.. వారిని ఆలోజింపజేసే చిత్రం ఇది’’ అని తెలిపారు దర్శక–నిర్మాత వేణు ఊడుగుల. అఖిల్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రోడక్షన్స్ పై డా. నాగేశ్వర రావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 21న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా వేణు ఊడుగుల మాట్లాడుతూ–‘‘ఖమ్మం–వరంగల్ జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ స్క్రిప్ట్ను రెడీ చేశాడు సాయిలు. ఈ చిత్రానికి నిర్మాతగా నేను న్యాయం చేయగలని భావించి, ప్రోడ్యూసర్గా మారాను. నా దర్శకత్వంలో యూవీ సంస్థలో ఓ మూవీ రానుంది’’ అని చెప్పారు. ‘‘వాస్తవ ఘటనలు జరిగిన ప్రాంతంలోనే ఈ సినిమా చిత్రీకరించాం’’ అన్నారు రాహుల్ మోపిదేవి. -
‘రాజు వెడ్స్ రాంబాయి’ అలాంటి కథే : దర్శకుడు
‘‘2004లో జరిగిన ఓ వాస్తవ ఘటన గురించి నా చిన్నప్పుడు విన్నాను. ఆ నేపథ్యంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ రాసుకున్నాను. ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు... కానీ, అలాంటిదే. ప్రేమికులకు ఏం జరిగింది? అనేది మాత్రం తెరపైనే చూడాలి’’ అని డైరెక్టర్ సాయిలు కంపాటి తెలిపారు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సాయిలు కం΄ాటి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్స్ వేణు ఊడుగుల, శ్రీకాంత్ అడ్డాలగార్ల దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. వేణు ఊడుగుల అన్నకు నేను చెప్పిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ నచ్చడంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఈటీవీ విన్ వాళ్లు కూడా మా ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా ఔట్పుట్ చూసి వేణు అన్న, బన్నీ వాసు, వంశీ నంది΄ాటిగార్లు సంతోషించారు. మా కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. అందుకే ఈ నెల 21న ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నా ఒత్తిడిగా భావించడం లేదు. నా తదుపరి సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. వేణు అన్న ఓ నిర్మాతగా ఉంటారు. ఆ ్ర΄ాజెక్ట్ని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.


