-
హీరో నుంచి హీరో వస్తాడు
దిలీప్ కుమార్ను చూసి సినిమా హీరో అవుదామనుకుని హీరోలు అయినవారు ధర్మేంద్ర, మనోజ్ కుమార్. తెలుగులో చిరంజీవిని చూసి హీరో అవుదామనుకుని అయిన శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావ్ షారూక్ ఖాన్ను చూసి తాను హీరోనయ్యానని చెప్పుకున్నాడు. రాజ్ కుమార్ రావు ఇటీవల ఓటిటి ప్లాట్ఫామ్స్పై డ్రిల్ టీచర్ పాత్రలో ‘ఛలాంగ్’ సినిమాతో ముందుకు వచ్చాడు. కాని ఆ సినిమా అనుకున్నంత రెస్పాన్స్ పొందలేదు. దీని తర్వాత అతను నటించిన ‘వైట్ టైగర్’ విడుదలైంది. అరవింద్ అడిగ నవల ‘వైట్ టైగర్’ ఆధారంగా అమెరికా ప్రేక్షకుల కోసం ఇంగ్లిష్లో తీసిన ఈ సినిమాను హిందీలో డబ్ చేసి జనవరి 13న థియేటర్లలో విడుదల చేశారు. గతంలో వచ్చిన స్లమ్డాగ్ మిలియనీర్ సినిమాలో ఉండే కొన్ని నెగెటివ్ అంశాలకు ‘వైట్ టైగర్’ సరైన సమాధానం చెప్పిందన్న ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు జనవరి 22న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. రాజ్కుమార్ రావు గుర్గావ్ నుంచి వచ్చిన నటుడు. ‘నేను షారూక్ ఖాన్ సినిమాలను చూసే నటుడవుదామనుకున్నాను. ఆయన సినిమా రంగంలో పని చేస్తుండగా ఆయనతో పాటు నేను కూడా పని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నీ దగ్గర కష్టపడే స్వభావం ఉంటే సక్సెస్ కావచ్చన్న దానికి షారూక్ జీవితమే ఉదాహరణ. నేను కూడా ఆయనలాగే కష్టపడ్డాను’ అని చెప్పాడు రాజ్కుమార్ రావ్. ‘స్త్రీ’ తర్వాత రాజ్కుమార్ రావ్కు గట్టి హిట్ తగల్లేదు. ప్రస్తుతం అతను ‘బధాయీ దో’ సినిమాలో నటిస్తున్నాడు. -
జపాన్ వెళ్లిన స్త్రీ
రాజ్కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రల్లో అమర్ కౌశిక్ తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ‘స్త్రీ’. రాజ్, డీకే ఈ చిత్రకథను అందించారు. 2018లో బాలీవుడ్లో వచ్చిన పెద్ద హిట్స్లో ఈ సినిమా కూడా ఉంది. 100 కోట్ల పైగా కలెక్షన్లను సాధించింది. తాజాగా ‘స్త్రీ’ జపాన్ వరకూ వెళ్లింది. ఈ సినిమా సోమవారం జపాన్లో విడుదలయింది. ‘జపాన్లోనూ స్త్రీ అందరి మనసుల్ని దోచేస్తుంది’ అని పేర్కొన్నారు శ్రద్ధా కపూర్. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని సమాచారం. -
‘రాగానే రోజ్వాటర్తో ముఖం కడిగేవాడిని’
ముంబై : ఒకానొక సమయంలో కనీసం ఒక పూట భోజనానికి కూడా తన దగ్గర డబ్బులేని రోజులు ఉన్నాయని బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావ్ అన్నాడు. బ్యాంకు అకౌంట్లో కేవలం 18 రూపాయలు మాత్రమే కలిగి ఉన్న తాను.. ప్రేక్షకుల అభిమానం వల్ల ఈరోజు బీ-టౌన్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నానన్నాడు. 2010లో లవ్ సెక్స్ దోఖా సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రాజ్కుమార్ విలక్షణ పాత్రలు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా వంటి టాప్ హీరోయిన్లకు జోడీగా నటించి కీలక నటుడిగా ఎదిగాడు. ఈ క్రమంలో పింక్విల్లా వెబ్సైట్తో మాట్లాడిన రాజ్కుమార్ చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం గురించి చెప్పుకొచ్చాడు. ‘ నేను దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. మా కుటుంబం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. స్కూలు ఫీజు కట్టేందుకు కూడా మా దగ్గర డబ్బులు లేవు. రెండేళ్లపాటు నా టీచర్లే నా ఫీజు చెల్లించారు. సిటీకి వచ్చిన కొత్తలో నేను ఓ చిన్న ఇంట్లో ఉండేవాడిని. నా వంతుగా రూ. 7వేలు కట్టాలి. నెలరోజుల పాటు సిటీలో గడపాలంటే కనీసం రూ. 15 నుంచి 20 వేల రూపాయలు అవసరమయ్యేవి. అలాంటి సమయంలో ఒకానొక రోజు నా బ్యాంకు అకౌంట్లో 18 రూపాయలు మాత్రమే ఉన్నాయని నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడేం చేయాలో అర్థం కాలేదు. నటన మీద ఉన్న ఆసక్తితో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యాను. అప్పుడు కనీసం సరైన బట్టలు కొనుక్కునేందుకు కూడా నా దగ్గర డబ్బులేదు. నా స్నేహితుడి ఇంట్లో ఉంటూ అడిషన్స్ కోసం తిరిగీ తిరిగీ ముఖాలు వాడిపోయేవి. రాగానే రోజ్ వాటర్తో ముఖం కడుక్కుని.. పర్లేదు మనం కూడా బాగానే ఉన్నాం అని సంబరపడిపోయేవాళ్లం. ఇలా నా ప్రయత్నాలు కొనసాగుతుండగా 2010లో సినిమా అవకాశం వచ్చింది అని రాజ్కుమార్ పేర్కొన్నాడు. -
‘జడ్జిమెంటల్ హై క్యా’ ట్రైలర్ వచ్చేసింది!
ముంబై: కంగనా రనౌత్, రాజ్కుమార్ రావు మరోసారి తెరపైన మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఐదేళ్ల కిందట క్వీన్ సినిమాతో అలరించిన ఈ జోడీ.. తాజాగా ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమాతో ప్రేక్షకులను పలుకరించబోతోంది. ‘సైజ్ జీరో’ వంటి తెలుగు చిత్రాలను తెరకెక్కించిన ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఒక మర్డర్ మిస్టరీలో నిందితులుగా ఈ సినిమాలో కంగనా, రాజ్కుమార్ బాబీ, కేశవ్ పాత్రల్లో కనిపించనున్నారు. సంక్లిష్టమైన, ఒకింత మతిస్థిమితంలేని బాబీ పాత్రను కంగనా అద్భుతంగా పోషించినట్టు సినిమా ట్రైలర్ను బట్టి అర్థమవుతోంది. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ ఆద్యంతం ఉత్కంఠ రేపేలా ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు మొదట ‘మెంటల్ హై క్యా’ టైటిల్ పెట్టినప్పటికీ.. ఇండియన్ మెంటల్ హెల్త్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సినిమా టైటిల్ను మార్చిన సంగతి తెలిసిందే. -
నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు
సినీ పరిశ్రమకున్న క్రేజ్ చాలా ప్రత్యేకమైనది. ఆ తళుకుబెళుకులకు అలవాటు పడిన వారు సాధరణ జీవితం గడపలేరు. అవకాశాలు తగ్గిపోతే డిప్రెషన్లోకి వెళ్లడం.. నేరాలకు పాల్పడటం.. ఆఖరుకి ప్రాణాలు తీసుకోవడం వంటి సంఘటనలను చూస్తూనే ఉంటాం. కానీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తి నేడు.. సెక్యూరిటీ గార్డుగా అనామక జీవితం గడుపుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ స్టోరి పలువురు ప్రముఖుల దృష్టిని ఆకర్షించడమే కాక అభినందనలు కూడా అందుకుంటుంది. వివరాలు.. ‘బ్లాక్ ఫ్రైడే’, ‘గులాల్’, ‘పాటియాల హౌస్’ వంటి పలు చిత్రాల్లో నటించిన సావి సిద్ధు ప్రస్తుతం అవకాశాలు లేక సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి.. సెక్యూరిటీ గార్డుగా చేరాల్సి వచ్చిన పరిస్థితుల గురించి ఓ వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ‘12 గంటల ఈ ఉద్యోగం చాలా కష్టమైనది. చాలా మెకానికల్ జాబ్. బస్సు టికెట్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. ఇక సినిమా టికెట్ కొనడం అనేది నా జీవితంలో ఓ కలగా మారింది. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు’ అంటూ సావి వీడియోలో తన కష్టాల గురించి తెలిపారు. ఆన్లైన్లో ట్రెండ్ అవుతోన్న ఈ వీడియో రాజ్కుమార్ రావ్, అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖుల దృష్టికి వచ్చింది. దాంతో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసినందుకు సదరు యూ ట్యూబ్ చానెల్కి కృతజ్ఞతలు తెలపడమే కాక సావి ఎంచుకున్న మార్గం ఎందరికో ఆదర్శంగా నిలిచిందంటూ రాజ్ కుమార్ ట్వీట్ చేశారు. అంతేకాక తన పరిచయస్తులకు సావి గురించి చెప్పి అవకాశాలు ఇప్పిస్తానని తెలిపాడు. ఇక ఈ వీడియో గురించి అనురాగ్ కశ్యప్ ‘నేను సావి సిద్ధును గౌరవిస్తాను. అవకాశాలు రాని వారు చాలా మంది తాగుతూ.. ఇతర మార్గాల్లో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కానీ సావి మాత్రం గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. బతకడం కోసం ఆయన ఎన్నుకున్న మార్గం చాలా ఉత్తమైనది. డబ్బులిచ్చి ఆయన స్వాభిమానాన్ని దెబ్బ తీయకూడదు. వారికి సాయం చేయాలనుకుంటే డబ్బు చెల్లించి వారి కళను ఆస్వాదించండి’ అంటూ ట్వీట్ చేశారు. There are so many actors out there who don’t have work. I respect Savi Siddhu as an actor and have cast him thrice when he earned the role. I respect him that he chose to live his life with dignity and picked a job unlike so many entitled out of work actors who have either — Anurag Kashyap (@anuragkashyap72) March 19, 2019
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement