-
భార్య సమ్మతి లేకుంటే.. బలాత్కారమే!
బెంగళూరు: తాళి కట్టినంత మాత్రాన, అర్ధాంగిగా స్వీకరించినంత మాత్రాన అమ్మాయిపై సర్వహక్కులు తమవేననే భావన భారత పితృస్వామ్య వ్యవస్థలో బలంగా వేళ్లూనుకుపోయింది. ఇది సరికాదని, స్త్రీ సమ్మతి లేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకుంటే.. దాన్ని మానభంగంగానే పరిగణించాలని కర్ణాటక హైకోర్టు బుధవారం విస్పష్టంగా పేర్కొంది. మారిటల్ రేప్ను నేరంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటూ పరోక్షంగా దేశంలో అత్యంత ముఖ్యమైన, కీలకమైన చర్చకు తెరతీసింది. ఇష్టం లేకున్నా కోరిక తీర్చుకున్నాడని ఓ మహిళ పెట్టిన కేసును కొట్టివేయాలని ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ ఎం.నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం అందుకు తిరస్కరించింది. వైవాహిక బంధం భర్తకు ప్రత్యేక అధికారాలు, పెత్తనం ఏమీ కట్టబెట్టదని.. స్ట్రీకి ఇష్టం లేని సంభోగం కచ్చితంగా రేప్ కిందకే వస్తుందని, భర్త అయినంత మాత్రాన దీనికేమీ మినహాయింపు ఉండదని అభిప్రాయపడింది. చారిత్రక చర్చకు తెరలేపింది. కూతురిని కూడా భర్త లైంగికంగా వేధించాడని సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో.. అతనిపై బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద కూడా కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా అదేశించింది. లైంగిక వాంఛలకు పెళ్లి లైసెన్స్ కాదు! సతీమణి ఇష్టానిష్టాలకు విలువనివ్వకుండా... ఎప్పుడు పడితే అప్పుడు వాంఛలు తీర్చుకోవడానికి పెళ్లి అనేది ఒక లైసెన్స్ కాదని జస్టిస్ నాగప్రసన్న పేర్కొన్నారు. పాశ్చాత్యదేశాల్లో మహిళ సమ్మతి లేకుండా సంభోగానికి పాల్పడితే దాన్ని చట్టపరంగా నేరంగానే పరిగణిస్తున్నారు. అయితే భారత్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం, పితృస్వామ్య వ్యవస్థ భావనలు బలంగా వేళ్లూనుకొని ఉండటం, సామాజిక కట్టుబాట్లు, ఆచారవ్యవహారాల పేరిట.. కేంద్ర ప్రభుత్వాలు చాన్నాళ్లుగా ఈ అంశం జోలికి (మారిటల్ రేప్ను నేరంగా మార్చే చట్ట సవరణకు) పోవడం లేదు. భార్యాభర్తలు అనే దానితో సంబంధం లేకుండా.. అమ్మాయి సమ్మతి లేకుండా లైంగిక దాడికి పాల్పడితే అది కచ్చితంగా నేరమే అవుతుందని జస్టిస్ నాగప్రసన్న బుధవారం అభిప్రాయపడ్డారు. బలత్కారమనేది స్త్రీల మానసిక స్థితిపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, వారికి భయకంపితులను చేస్తుందని పేర్కొన్నారు. అమ్మాయిని బలవంతంగా అనుభవించడం నేరమైనపుడు అది జీవిత భాగస్వామి అయినా సరే నేరంగానే చూడాలన్నారు. ‘తరతరాలుగా పురుషుడు భర్త అనే ముసుగులో.. మహిళలను తన సొంత ఆస్తిగా చూస్తున్నాడు. భార్యలు తమ చెప్పుచేతల్లో ఉండాలనుకునే బూజుపట్టిన ఆలోచనలు, సంప్రదాయాలను సమూలంగా తుడిచిపెట్టాల్సిందే. భర్తకు రేప్ నుంచి మినహాయింపునిస్తున్న భారత నేర స్మృతిలోని (ఐపీసీ) 375 సెక్షన్ ఏమాత్రం ప్రగతిశీల ఆలోచన కాదు. నా దృష్టిలో అది తిరోగమన భావన. అర్ధాంగిగా స్వీకరించిన మహిళ శరీరం, ఆలోచనలపై తమకు సంపూర్ణ హక్కులు దఖలు పడ్డాయనే భావన.. కచ్చితంగా తిరోగమన ఆలోచనే. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమనే భావనకు ఇది తూట్లు పొడుస్తుంది. అందువల్లే చాలాదేశాలు మారిటల్ రేప్ను నేరంగా చేశాయి. యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలోని 50 రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలోని మూడు ఫ్రావిన్సులు, న్యూజిలాండ్, కెనడా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్... తదితర దేశాలు మారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తున్నాయని జస్టిస్ నాగప్రసన్న ఎత్తిచూపారు. భారత్లోనూ అసంఖ్యాక స్త్రీల మౌనరోదనను గుర్తించి చట్టసభల సభ్యులు ఈ మేరకు మారిటల్ రేప్ చట్టంలో మార్పులు తేవాలని అభిప్రాయపడ్డారు. -
థానేలో బాలికపై అత్యాచారం..!
థానే: 15 ఏళ్ల బాలికపై సుత్తితో దాడి చేసి, అత్యాచారంచేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఘటన జరిగిందని, ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో ఉన్నాడని పోలీసులు ఆదివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి షిర్డీ నుంచి తన మిత్రులు ఇద్దరితో కలసి బాధిత బాలిక ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యంలో ఉల్హాస్నగర్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడు శ్రీకాంత్ గైక్వాడ్ (30) వారిని అడ్డగించాడు. బాలికపై సుత్తితో దాడి చేశాడు. తోడుగా ఉన్న మిత్రులను కూడా బెదిరించాడు. అనంతరం బాలికను రైల్వే స్టేషన్ పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తప్పించుకోవాలని చూడగా మళ్లీ సుత్తితో దాడి చేశాడు. అయితే శనివారం ఉదయం అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే కల్యాణ్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని శనివారం రాత్రి అరెస్టు చేశారు. బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
‘పోక్సో’ చట్టం కింద అది నేరం కాదు
నాగపూర్: శరీరానికి శరీరం తాకకుండా బట్టలపైనుంచే బాలిక శరీర భాగాలను నొక్కినా ‘పోక్సో’ చట్టం కింద దాన్ని లైంగిక వేధింపులుగా పరిగణించలేమంటూ జనవరి 19న తీర్పునిచ్చి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం జడ్జి జస్టిస్ పుష్పా గణేడివాలా మరోసారి వార్తల్లోకెక్కారు. నిందితుడు ఐదేళ్ల బాలిక చేతులను బంధించి, తన ప్యాంట్ జిప్ విప్పినా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం కింద లైంగిక వేధింపులుగా నిర్ధారించలేమని జస్టిస్ పుష్పా గణేడివాలా జనవరి 15న ఇచ్చిన తీర్పు తాజాగా బయటికొచ్చింది. కామ వాంఛతో శరీరానికి శరీరం తాకిస్తేనే(స్కిన్ టు స్కిన్ కాంటాక్టు) ఈ చట్టం కింద లైంగిక వేధింపులుగా గుర్తిస్తామని జడ్జి పేర్కొన్నారు. నిందితుడికి కేసు నుంచి విముక్తి కలిగించారు. అసలేం జరిగింది? 2018 ఫిబ్రవరి 12న మహారాష్ట్రలో లిబ్నస్ కుజూర్ అనే 50 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల చిన్నారి ఒంటరిగా ఉన్నపుడు ఇంట్లోకొచ్చి బాలిక చేతులను బంధించాడు. తన ప్యాంట్ జిప్ విప్పాడు. ఇంతలో ఆమె తల్లి రావడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసువేశారు. నేరం నిరూపణ కావడంతో సెషన్స్ కోర్టు 2020 అక్టోబర్లో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ లిబ్నస్ కుజూర్ బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ను ఆశ్రయించాడు. అతడు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పుష్పా గణేడివాలా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం 2021 జనవరి 15న విచారణ జరిపింది. బాలిక పట్ల శారీరక వాంఛతోనే నిందితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించాడన్న ప్రాసిక్యూషన్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇక్కడ శరీరానికి శరీరం తాకలేదు కాబట్టి పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులు కాదని స్పష్టం చేశారు. -
బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: శరీరానికి శరీరం తాకకుండా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ ‘పోక్సో’ చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణించలేమని తేల్చిచెబుతూ కేసులో నిందితుడికి విముక్తి కలిగిస్తూ బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వానికి, నిందితుడికి నోటీసు జారీ చేసింది. రెండు వారాల్లోగా ప్రతిస్పందించాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం జనవరి 19న ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్కు సూచించింది. నాగపూర్ ధర్మాసనం తీర్పును సవాలు చేస్తూ ‘యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎస్.ఎ.బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ హాజరై నాగపూర్ ధర్మాసనం తీర్పు వివరాలను తెలియజేశారు. గతంలో ఏ కోర్టు కూడా ఇలాంటి తీర్పు ఇవ్వలేదని, ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
చర్మాన్ని చర్మం తాకలేదు గనుక..
చిన్నారుల రక్షణ చట్టం ‘పోక్సో’. తగని విధంగా వారిని తాకితే మూడేళ్ల జైలు! అతడు తాకాడు. తగని విధంగానే తాకాడు. కానీ అతడు దోషి కాదని తీర్పొచ్చింది! స్కిన్–టు–స్కిన్ తాకలేదు కనుక..‘పోక్సో’ కింద శిక్షించలేమని ‘వస్త్ర’ భాష్యం! సమాజం దిగ్భ్రాంతి చెందింది. చట్టానికి గ్రిప్ లేదా? న్యాయానికి నిజంగానే చూపులేదా? పేరొద్దు. ముప్పై తొమ్మిదేళ్ల అతను అందాం. పేరు చెబితే ఆ పేరు గల వాళ్లందరికి తలవంపులుగా ఉండొచ్చు. ఇక ఆ పన్నెండేళ్ల బాలిక పేరు కూడా చట్ట ప్రకారం బయటికి తెలియడానికి లేదు. అతను నిందితుడు. ఆ చిన్నారి బాధితురాలు. 2016 డిసెంబర్లో ఓ రోజు అతడు తినేందుకు ఏదో తాయిలం ఇస్తానని ఆశపెట్టి ఆ బాలిక ను తన ఇంటికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లాక తలుపేసి, బాలిక ఛాతీని నొక్కాడు. ఒంటి మీది బట్టలు కూడా తీయబోయాడు. బాలిక పెద్దగా అరిచింది. పెద్దవాళ్లకు తెలిసింది. అతడికి నాలుగు తగిలించి పోలీసులకు అప్పగించారు. అతడిపై ‘పోక్సో’ కేసు నమోదైంది. పోక్సో అంటే ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్’! కఠినమైన చట్టం. లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం 2012లో ఈ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం దోషికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ కేసులో దోషికి కూడా కింది కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్ 354 కేసు కింద కూడా అతడిపై మరో కేసు నమోదైంది. ఈ సెక్షన్ ప్రకారం మహిళపై లైంగిక అకృత్యానికి పాల్పడితే కనీసం రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధిస్తారు. ఈ రెండు కేసులపై అతడు నాలుగేళ్లు గా బాంబే హైకోర్టులో ‘న్యాయం’ కోసం పోరాడుతున్నాడు! చివరికి ఈ జనవరి 19న తీర్పు వెలువడింది. తీర్పేంటి? బాంబే హైకోర్టులో తీర్పు కోసం ఈ కేసు నాగపూర్ బెంచ్ పైకి వచ్చింది. సింగిల్ జడ్జి బెంచి అది. ఆ రోజు బెంచిపై జస్టిస్ పుష్పా గనేడివాలా ఉన్నారు. మహిళా జడ్జి! కింది కోర్టు విధించిన శిక్షను తన తీర్పులో ఆమె సమర్థించబోతున్నారనే బాలిక వైపు వాళ్లు అనుకున్నారు. కానీ తీర్పు దోషికి అనుకూలంగా వచ్చింది! ‘‘అతడు దోషే కానీ, అతడు చేసిన నేరం ‘పోక్సో’ పరిధిలోకి రాదు కనుక, ఆ చట్టం నుంచి మినహాయించి, ఐపీసీ సెక్షన్ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా పరిగణించడం జరిగింది’’ అని జస్టిస్ పుష్ప తీర్పు ఇచ్చారు! అంటే.. చిన్నారికి రక్షణ కల్పించే చట్టం కింద అతడికి శిక్ష పడదు. ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు మాత్రమే పడుతుంది. ‘‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో నేరం అవదు. చర్మాన్ని చర్మం తాకాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు’’ అని జస్టిస్ పుష్ప తన తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. చిన్నారుల ఒంటిని తాకకూడని చోట తాకడం, చిన్నారుల చేత తగని చోట ఒంటిని తాకించుకోవడం మాత్రమే పోక్సో చట్టం కింద నేరం అవుతాయి కనుక, అతడు ఆ పని చేయలేదు కనుక ఆ ప్రత్యేక చట్టం ప్రకారం అతడు నిర్దోషే అని జస్టిస్ పుష్ప తీర్పునకు ముగింపు ఇచ్చారు. తీర్పులో తప్పేంటి? తీర్పు తీర్పే. అందులో తప్పొప్పులను ఎంచేందుకు ఉండదు. పైకోర్టుకు వెళ్లడం తప్ప! అయితే ఈ కేసుపై స్పందించకుండా మాత్రం ఎవరూ ఉండలేకపోతున్నారు. స్కిన్–టు–స్కిన్ కాంటాక్టు లేదు కనుక ‘పోక్సో’ చట్టం ప్రకారం చిన్నారి ఛాతీని ప్రెస్ చేయడం నేరం అవదన్న జస్టిస్ పుష్ప పరిశీలనను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘అలాగైతే మరి స్కిన్–టు–స్కిన్ తాకక పోయినా, దుస్తుల పైనుంచి తాకినా నేరమేనని పోక్సో చట్టంలో చేర్చండి’ అని అడుగుతున్నవాళ్లూ ఉన్నారు. మరికొందరు ఇంకొంచెం సూక్ష్మంగా ముందుకు వెళ్లి, మరింత తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పునకు అర్థమేంటి! ఇలాంటి ఒక నీతిబాహ్యమైన చర్యను, మానసిక రుగ్మతను, హీనత్వాన్నీ ఒక మామూలు విషయంగా చూసేందుకు మనం అలవాటు పడబోతున్నామా?! – ప్రియాంక చతుర్వేది, రాజ్యసభ సభ్యురాలు తీర్పును గురించిన వార్తను చదివాక ఎలా స్పందించాలో తెలీక మాటల్ని వెతుక్కున్నాను. గాట్ ఇట్ నౌ. హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్డే. (ఆవేదనగా, ఆవేశంగా..) – తాప్సీ, బాలీవుడ్ నటి ఈ తీర్పు ఫేక్ న్యూస్ అని ఎవరైనా చెప్పండి ప్లీజ్. – రితేశ్ దేశ్ముఖ్, టెలివిజన్ పర్సనాలిటీ బాంబే హైకోర్టులో సింగిల్ బెంచ్ వచ్చిన తీర్పుపై తక్షణం ‘లెటర్స్ పేటెంట్ అప్పీల్’ను ఫైల్ చేయండి. – కనూంగో, ఛైర్మన్, నేషనల్ కమిషన్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ (మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement