nuclear sites details
-
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు.. అణు శాస్త్రవేత్తలు మృతి
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తాజాగా ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టుపై విస్తృత దాడులు చేశాయి. ఇరాన్ ప్రభుత్వ అణ్వాయుధ ప్రాజెక్టుకు సంబంధించిన టెహ్రాన్లోని లక్ష్యాలపై విస్తృతమైన దాడులను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. తమ లక్ష్యాలలో ఇరాన్ దాచిపెట్టిన అణు ఆర్కైవ్ ప్రదేశం కూడా ఉందని ఐడీఎఫ్ తెలిపింది.ఇజ్రాయెల్ తమ దేశంపై జరిపిన దాడిలో టెహ్రాన్లోని షహ్రాన్ చమురు డిపోను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన సౌత్ పార్స్ క్షేత్రంలో ఉత్పత్తిని ఇరాన్ పాక్షికంగా నిలిపివేసింది. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ దాడులను ప్రారంభించిన తర్వాత జెరూసలేం- టెల్ అవీవ్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగించారు. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తికి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.ఇజ్రాయెల్ సైన్యం ‘రైజింగ్ లయన్’ ప్రారంభించి, ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఈ కొత్త దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ తాము జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కార్యక్రమానికి చెందిన జనరల్స్, సీనియర్ శాస్త్రవేత్తలు, నిపుణులు మృతిచెందారని పేర్కొంది. తాజా దాడులకు ముందు ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి మాట్లాడుతూ ఈ దాడుల్లో 78 మంది మృతిచెందారని, 320 మందికి పైగా జనం గాయపడ్డారని చెప్పారు. ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టడానికే ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఈ ముప్పు తప్పేవరకూ ఎన్ని రోజులైనా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో.. -
ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో..
టెహ్రాన్: ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లింది. దీనిని ఉపగ్రహ ఛాయా చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ విడుదల చేసింది. ఇరాన్ ప్రపంచ హెచ్చరికలను ధిక్కరించి, అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తోంది.ఇరాన్లో భారీస్థాయిలో అణు బాంబులను ఉత్పత్తి చేయగల యురేనియం నిల్వలు ఉన్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం పౌర ప్రయోజనాల కోసమేనని చెబుతోంది. తాజాగా విడుదలైన హై-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని ముఖ్య అణు కేంద్రానికి వాటిల్లిన నష్టాన్ని చూపిస్తున్నాయి. అలాగే దీనికి ముందున్న స్థితిని కూడా సరిపోల్చాయి. యూఎన్ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ ఆపరేషన్లో నటాంజ్, ఫోర్డోలోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్లోని యురేనియం తరలింపు కేంద్రంపై దాడులు జరిగాయి.ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన యూఎస్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ (ఐఎస్ఐఎస్)నివేదిక ప్రకారం అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. టెహ్రాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్లోని అణు కేంద్రంలో సమృద్ధిగా యురేనియం నిల్వలు ఉన్నాయి. అలాగే ఫోర్డోలోని అణు కేంద్రం టెహ్రాన్కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ పేర్కొంది.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ తమ పోరాటం 46 ఏళ్లుగా సాగుతున్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అని అన్నారు. ఇరాన్ విముక్తి దినం దగ్గర పడిందని, అది జరిగినప్పుడు, ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం మరోసారి వర్ధిల్లుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇరాన్ పాలనను ఇజ్రాయెల్ అనుమతించబోదన్నారు. ఇరాన్ తనదగ్గరున్న ఆయుధాలను, అణ్వాయుధాలను ఉగ్రవాదులను అందించాలని యోచిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. అదేగనుక జరిగితే అణు ఉగ్రవాదానికి తెరలేస్తుందని, అప్పుడు అది యూరప్ నగరాలకు, చివరికి అమెరికాకు ముప్పు తెచ్చిపెడుతుందని ఆయన హెచ్చరించారు.ఇది కూడా చదవండి: Air India crash: విమానంలో ‘11ఏ’ సురక్షితమా? రమేష్ని అదే కాపాడిందా? -
'అణు' వివరాలు పంచుకున్న భారత్, పాక్
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్లు గతంలో చేసుకున్న ఒప్పందాన్ని మరోసారి కొనసాగించేందుకు సిద్ధమయ్యాయి. గతంలో మాదిరిగానే ఇరు దేశాల్లో ఉన్న అణుస్థావరాల వివరాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఆదివారం దీనికి సంబంధించిన హామీ పత్రాలను ఇరు దేశాలు మార్చుకున్నాయి. ఇలా రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం జరగడం ఇది 26వసారి. తొలిసారి 1992 జనవరి 1న ఈ ఒప్పందం ప్రారంభమై గత ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లో ఉన్న అణు సౌకర్యం ఉన్న స్థావరాలపైగానీ, అణ్వాయుధాలపైగానీ దాడి చేయరాదు. దీనికి సంబంధించి తొలి అడుగు 1988లో పడింది. అదే ఏడాది డిసెంబర్ 31ని ఇరుదేశాల మధ్య సంతకాలు జరిగాయి. అయితే జనవరి 27, 1991న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా తొలి ఏడాది ఒప్పంద పత్రాల మార్పిడి 1992, జనవరి 1న జరిగింది. అప్పటి నుంచి ప్రతి జనవరి 1న ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాలు మార్చుకుంటుంటారు.