breaking news
Nobel Peace Prize winner
-
శాంతి సమరం ఇంటి పాఠమే!
‘ఇంటి నుంచే మొదలు కావాలి’ అని నైతిక విలువలకు సంబంధించి చెప్పే మాట. నైతిక విలువల నుంచి సామాజిక నిబద్ధత, సాహస ప్రవృత్తి వరకు ఇంట్లో నుంచే నేర్చుకుంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా. కుటుంబ వారసత్వం, కుటుంబ బంధాలు, ఉద్యమ బంధాల గురించి ఐరన్ లేడి మరియా మాటల్లోనే..నాన్న అడుగు జాడల్లో నడవాలనుకున్నాను కానీ...రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న గొప్ప ఇంజినీర్, వ్యాపారవేత్త. దార్శనికుడు. ఎన్నో కంపెనీలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు...‘దేశభవిష్యత్, దాని శ్రేయస్సు ఒక సంస్థ అభివృద్ధి, లాభాల కంటే ఎక్కువ. కంపెనీని ఎవరైనా స్థాపించవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా సులభం. అయితే నైతిక ప్రమాణాలు ముఖ్యం’ కుటుంబ వారసత్వం అనేది నా బలం. నా పూర్వీకులు, అనేక తరాల వాళ్లు తమ మాతృదేశం కోసం ప్రతీది చేశారు. జైలు జీవితం అనుభవించారు. తరతరాల సందేశం ఒక్కటే... దేశాన్ని ప్రేమించు, బాధ్యతతో ప్రవర్తించు.దేశ చరిత్రను మా ఇల్లు చెప్పేది!నా చిన్నప్పుడు మా ఇల్లు వెనెజువెలా చరిత్రను చెప్పే ఉపాధ్యాయురాలిగా అనిపించేది. ఆ ఇల్లు దేశచరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఒక విధంగా చె΄్పాలంటే వెనెజువెలా చరిత్రతో కలిసి పెరిగాను! మా అమ్మమ్మ ప్రఖ్యాత పుస్తకం ‘వెనెజువెలా హీరోయిక’ రచయిత ఎడ్వర్డో బ్లాంకో మనవరాలు, వెనెజువెలా మొదటి అధ్యక్షుడు జోస్ ఆంటోనియో పేజ్ సహాయకురాలు. చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని. విసెంటే గోమేజ్ నియంతృత్వంలో 24 సంవత్సరాల వయసులో బ్లాంకో హత్యకు గురయ్యాడు.నన్ను టెర్రరిస్ట్ అన్నారు!నేను గెలుస్తానని మొదట్లో చాలామంది నమ్మలేదు. ‘మీరు మహిళ కదా!’ ‘మీరు ఇంజినీర్ కదా! ‘మీది బాగా డబ్బున్న కుటుంబం కదా!’....ఇలాంటి మాటలే వినిపించేవి. లాటిన్ అమెరికాలోని పితృస్వామ్య భావజాల ప్రభావం వారి మాటల్లో కనిపించేది. ఒకానొక సమయంలో నన్ను టెర్రరిస్ట్గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజ్లు అదేపనిగా రావడం మొదలయింది. నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి అనిపించింది. ఏ వ్యక్తీ అజ్ఞాతవాసంలో ఉండాలని నేను కోరుకోను. అయితే మరో కోణంలో చూస్తే మనల్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తిని సమకూర్చుకోవడానికి అజ్ఞాతవాసం అనేది ఒక అవకాశం.మాటలు మాత్రమే చాలవురాజకీయాలు, రాజకీయ నాయకులను అదేపనిగా విమర్శించడం ఒక్కటే సరిపోదు. మనవంతు కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడే సాహసికులు ఒక ప్రాంతం, దేశం అని కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు తరగని స్ఫూర్తిని ఇస్తారు. భయం చుట్టుముట్టిన సమయంఒక సభలో ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. హఠాత్తుగా నా కుమార్తె గుర్తుకు వచ్చింది. మాటలు ఆగిపోయాయి. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాను. నా కుమార్తె ఎక్కడ ఉంది? క్షేమంగా ఉందా? నేను సభల్లో ప్రభుత్వ అవినీతిపై గొంతెత్తడం వల్ల నా బిడ్డకు హాని జరుగుతుందా?... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంటికి వెళ్లి నా కుమార్తెను చూసుకునే వరకు నా మనసు మనసులో లేదు. ‘కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేస్తే రెండిటికీ న్యాయం చేయలేను’ అనిపించింది.అమ్మ మాట‘నాకు దేవుడు ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎలాంటి లోటూ లేదు. నాకు ఎంతో మంది మద్దతు ఉంది... అనుకునేవాళ్లు తమ వంతుగా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది. అమ్మానాన్నల మాటల సారాంశం ఒక్కటే... మనం వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నా సమాజ హితాన్ని మరవకూడదు. -
ప్రజాస్వామ్య గళానికి శాంతి నోబెల్
ఓస్లో: ఎవరిని వరిస్తుందా అని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతి 2025 సంవత్సరానికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో (57)కు లభించింది. ఓస్లోలో నోబెల్ కమిటీ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ‘చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నా ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య అగ్నిజ్వాలను ఆరిపోకుండా రగిలించారు. లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు’అని మచాడోను నోబెల్ కమిటీ ప్రశంసల్లో ముంచెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపిన తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాలని ఎంత బలంగా వాదించినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరాశే ఎదురయ్యింది. నిర్బంధాలను ఎదిరించి నిలిచిన నేతకమ్యూనిస్టు వెనెజువెలాలో ప్రజాస్వామ్యం కోసం మరియా కొరినా మచాడో పోరాడుతున్నారు. నికొలాస్ మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి పోరాటం చేస్తున్నారు. దీంతో ఆమెపై మధురో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించింది. ఇతర విపక్ష నేతలంతా అరెస్టులకు భయపడి దేశం విడిచి వెళ్లిపోయినా ఆమె మాత్రం సొంత దేశంలోనే ఉండి ప్రజాస్వామ్య వాదులకు స్ఫూర్తినిస్తున్నారు. గత సంవత్సరం వెనెజువెలాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు మదురోకు పోటీగా ఎన్నికల్లో నిలబడుతున్నట్లు మరియా ప్రకటించారు. కానీ, ఆ దేశ ఎన్నికల సంఘం ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. దీంతో ఆమె మరో ప్రతిపక్ష నేత ఎడ్ముండో గోంజాలెజ్కు మద్దతు పలికారు. కానీ, ఎన్నికల్లో మదురో 51.95 శాతం ఓట్లు సాధించి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మదురో వరుసగా మూడోసారి అధ్యక్షుడ య్యారు. ఆ వెంటనే ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపారు. దీంతో చాలామంది దేశం విడిచి వెళ్లిపోవటమో, అజ్ఞాతంలోకి వెళ్లటమో జరిగింది. మరియా కూడా ఏడాది కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నారు. గోంజాలెజ్ స్పెయిన్లో రాజకీయ ఆశ్రయం పొందారు. అయితే, ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గోంజాలెజ్ 67 శాతం ఓట్లు సాధించి స్పష్టమైన విజయం సాధించారని మరియా ఎన్నికల తర్వాత వాల్స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఇంజనీర్ నుంచి రాజకీయ నేతగామరియా మచాడో వెనెజువెలా రాజధాని కారకాస్లో అక్టోబర్ 7, 1967లో జన్మించారు. ఇండస్ట్రియల్ ఇంజనీర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సంవత్సరమే ఆమె రాజకీయ హక్కులు, ఎన్నికల పర్యవేక్షణ కోసం సుమటే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాని ద్వారా వెనెజువెలాలో ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్నారు. ‘బుల్లెట్ల స్థానంలో బ్యాలెట్ను ప్రోత్సహించటమే నా లక్ష్యం’అని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మచాడో వెనెజువెలా కులీన (ప్రభువర్గం) వర్గానికి చెందినవారు. వెనెజువెలా మూడో మార్వి్కజ్ ఆఫ టోరో (ఆ దేశంలో ప్రభువులకు ఇచ్చే బిరుదు) సెబాస్టియన్ జోష్ ఆంటోనియో రోడ్రిగేజ్ డెల్ టోరో యే అసానియో వారసురాలు. ఆ దేశ ప్రముఖ రచయిత, రాజకీయ నాయకుడు ఎడ్వార్డో బ్లానో ఆమెకు ముత్తాత అవుతారు. ఆమె ఆండ్రెస్ బెల్లో క్యాథలిక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చది వారు. ఇన్స్టిట్యూటో డి ఎస్టుడియోస్ సుపీరియరెస్ డి అడ్మినిస్ట్రాసియోలో మాస్టర్స్ చేశారు. ఆమెకు ముగ్గురు సంతానం. 1992లో ఈటెనా ఫౌండేషన్ను స్థాపించారు. అయితే, 2002 నుంచి సుమటే కార్యక్రమాలతో ఆమెకు దేశంలో మంచి పేరు వచ్చింది. 2011 నుంచి 2014 వరకు ఆ దేశ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా కొనసాగారు. ప్రస్తుతం ‘వెంటే వెనెజువెలా’రాజకీయ పార్టీకి సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఆ పార్టీ తరఫున ఆమె 2012లోనే అధ్యక్ష బరిలో దిగారు. కానీ, ప్రైమరీ ఎన్నికల్లోనే ఓడిపోయారు. 2023లో మరోసారి ప్రైమరీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. కానీ, ఆమె అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. గత దశాబ్ద కాలంగా అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా జరుగు తున్న ప్రజాస్వామ్య పోరాటాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు.ఒక అసాధారణ మహిళమరియా మచాడో సేవలను నోబెల్ కమిటీ గొప్పగా ప్రశంసించింది. ‘ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికాలో అసాధారణ పౌర సాహసికుల్లో మచాడో ఒకరు’అని కొనియాడింది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గొప్పగా పోరాడుతున్నారని జోర్డాన్ వాట్నీ పేర్కొన్నారు. ఓస్లోలో ఈ అవార్డు ప్రకటించిన సమయంలో వెనెజువెలాలో రాత్రి సమయం కావటంతో ఆమె ఒక గుర్తు తెలియని ప్రాంతంలో నిద్రపోతున్నారు. నోబెల్ కమిటీ సభ్యులు ఆమెకు నేరుగా ఫోన్ చేసి విషయం చెప్పగానే షాక్కు గురయ్యారు. ‘దేవుడా.. నాకు మాటలు రావటం లేదు. ఇది ఒక ఉద్యమం, మొత్తం సమాజం సాధించిన ఫలితం ఇది. నేను కేవలం ఒక వ్యక్తిని మాత్రమే. వ్యక్తిగతంగానే ఈ పురస్కారానికి నేను అర్హురాలిని కాదు’అని పేర్కొన్నారు. మచాడోకు నోబెల్ పురస్కారం రావటంపై వెనెజువెలాలోని ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకుంటుంటే, మదురో మద్దతు దారులు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ‘దేశంలో పరిస్థితిని మెరుగుపర్చటం ఎలాగో నాకు తెలియదు కానీ, నోబెల్ శాంతి పురస్కారానికి ఆమె (మచాడో) మాత్రం సంపూర్ణంగా అర్హురాలు’అని సాండ్రా మార్టినెజ్ అనే 32 ఏళ్ల మహిళ సంతోషం వ్యక్తంచేశారు. -
స్వేచ్ఛా నినాదాలతో జైలుగోడలు ప్రతిధ్వనించాయి
ఓస్లో, నార్వే: నోబెల్ శాంతి బహుమతి–2023 గ్రహీత, ఇరాన్కు చెందిన హక్కుల ఉద్యమకారిణి నర్గీస్ మహమ్మదీ తొలిసారి నోబెల్ ప్యానెల్తో మాట్లాడారు. అనారోగ్య రీత్యా బెయిలుపై ఉన్న ఆమెతో మాట్లాడినట్లు ఆ సంస్థ ఆదివారం వెల్లడించింది. ఈ మేరకు నోబెల్... సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసింది. తనకు నోబెల్ వచ్చి విషయం కూడా నేరుగా తెలియలేదని, జైలులో తనతోపాటు ఉన్న మహిళ.. పురుషుల వార్డులో ఉన్న భర్తతో ఫోన్లో మాట్లాడగా విషయం తెలిసిందని చెప్పారు. వార్త వినగానే నమ్మలేకపోయామని, ‘ఉమెన్.. లైఫ్.. ఫ్రీడమ్’నినాదాలతో జైలు ప్రతిధ్వనించిందని ఆమె గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. ఆనందంతో ఆమె ‘బెల్లా చావ్’స్వేచ్ఛాగీతాన్ని కూడా ఆలపించారు. తన ఆరోగ్య సమస్యల గురించి, ఇరాన్ రాజకీయ వాతావరణం గురించి కూడా ఆమె ప్యానెల్కు వివరించారు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా తన పిల్లలతో వీడియో కాల్లో మాట్లాడగలిగానని తెలిపారు. ఇరాన్లో మహిళలకు హిజాబ్కు, మరణశిక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గీస్.. ఎవిన్ జైల్లో ఉన్నారు. -
నోబెల్ గ్రహీత నర్గీస్ విడుదల
పారిస్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదీ బుధవారం ఇరాన్లోని టెహ్రాన్లోని ఎవిన్ కారాగారం నుంచి విడుదలయ్యారు. అనారోగ్య కారణాలరీత్యా ఆమెకు మూడు వారాలపాటు శిక్షను నిలుపుదల చేసి జైలు అధికారులు విడుదలచేశారు. తిరిగి జైలులో లొంగిపోయాక ఈ మూడువారాలు అదనంగా శిక్షాకాలంగా అనుభవించాల్సి ఉంటుంది. గత రెండేళ్లలో తొలిసారిగా తన తల్లితో ఫోన్లో మాట్లాడానని పారిస్లో ఉంటున్న నర్గీస్ కుమారుడు అలీ రహ్మానీ తెలిపారు. ఆమె జైలు నుంచి విడుదలయ్యాక 2022–2023 నిరసన ఉద్యమ నినాదం అయిన ‘మహిళల జీవితానికి స్వేచ్ఛ లభించాలి’అని నినదించారు. ‘‘ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా మానసికంగా బాగున్నారు. పోరాట పటిమ ఆమెలో అలాగే ఉంది. హిజాబ్ లేకుండా జైలు నుంచి బయటకు రాగలిగా’’అని తన తల్లి చెప్పిందని కుమారుడు రహా్మనీ వెల్లడించారు. మహిళల హక్కులకోసం ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె అలుపెరగని పోరాటం కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఇరాన్లో హిజాబ్ ధారణపై అత్యంత కఠిన చట్టాలు, ఇతర నేరాలకు మరణశిక్ష అమలును వ్యతిరేకంగా పోరాడిన నర్గీస్ను అరెస్ట్ చేసిన ఇరాన్ పోలీసులు పల సెక్షన్ల కింద దోషిగా తేల్చారు. దీంతో ఆమె 2021 నవంబర్ నుంచి ఎవిన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దశాబ్ద కాలంగా జైలు జీవితం గడుపుతున్న ఆమె కొన్నేళ్లుగా కనీసం భర్త, కవల పిల్లలను చూడలేదు. ఆమె కారాగార శిక్ష అమలును 21 రోజులు నిలుపుదల చేశారని, ఆ 21 రోజులను ఆమె తిరిగి జైలుకెళ్లాక అదనంగా శిక్షాకాలాన్ని అనుభవించాల్సి ఉంటుందని ఆమె మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బెయిలును కనీసం మూడు నెలలకు పొడిగించాలని ఆమె మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఆమె అనారోగ్యం కారణంగా వైద్యుల సలహా మేరకు ప్రాసిక్యూటర్ విడుదలకు అనుమతించారని న్యాయవాది ముస్తఫా నీలీ తెలిపారు. ఆమెకు ఉన్న కణితి ప్రాణాంతకం కాదని, అయితే ప్రతి మూడు నెలలకోసారి ఆమెకు వైద్యపరీక్షలు అవసరమని లాయర్ వెల్లడించారు. జైలులోనూ నర్గీస్ పోరాట మార్గాన్ని వీడలేదు. ఎవిన్ జైలు ఆవరణలో నిరసనలు చేపట్టారు. నిరాహార దీక్షలు చేశారు. ఇరాన్లో మహిళలపై జరుగుతున్న దారుణమైన అణచివేతను ఆమె సెప్టెంబర్లో జైలు నుంచి రాసిన లేఖలోనూ ఖండించారు. 2022–2023లో అయతుల్లా అలీ ఖమేనీ ఆధ్వర్యంలో ఇస్లామిక్ అధికారులను గద్దె దింపాలని కోరుతూ జరిగిన నిరసనలకు నర్గీస్ పూర్తి మద్దతు తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు జూన్లో ఆమెకు మరో ఏడాది జైలు శిక్ష పడింది. -
రష్యా, ఉక్రెయిన్ ‘హక్కుల’ గ్రూప్లకు నోబెల్ శాంతి బహుమతి
స్టాక్హోం : మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉక్రెయిన్, రష్యాలకు చెందిన రెండు మానవ హక్కుల గ్రూప్లతో పాటు బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీలకు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ లిబర్టీస్, బెలారస్ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీల పేర్లను నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. మానవ హక్కుల కోసం వారి విశేష కృషికి గానూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు కమిటీ పేర్కొంది. నోబెల్ శాంతి పురస్కారం లభించిన వారు తమ స్వదేశాల్లో ప్రజల కోసం పోరాటం చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. అధికార దుర్వినియోగాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ.. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు తెలిపింది. ‘యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్లు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపారు. శాంతి, ప్రజాస్వామ్యం కోసం ఎంతో కృషి చేశారు.’ అని పేర్కొంది కమిటీ. ఇప్పటికే ఈ ఏడాదికి గాను వైద్య, భౌతిక, రసాయన శాస్త్రం, సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార విజేతల పేర్లను ప్రకటించింది కమిటీ. ఇదీ చదవండి: ఫ్రెంచ్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్ -
Russia-Ukraine war: మూతబడ్డ ‘నోబెల్ శాంతి’ పత్రిక
మాస్కో: రష్యాలో ప్రముఖ స్వతంత్ర వార్తా పత్రిక నొవయ గజెటా మూతపడింది. అధికారిక ఒత్తిళ్లే ఇందుకు కారణమని సమాచారం. ఉక్రెయిన్ సంక్షోభం ముగిసేదాకా ప్రచురణ నిలిపివేస్తున్నట్టు పుతిన్ ప్రభుత్వ తీరును సునిశితంగా విమర్శించే ఈ పత్రిక ప్రకటించింది. దాని ఎడిటర్ ద్మిత్రీ మురతోవ్ 2021 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావడం విశేషం. నోబెల్ పతకాన్ని వేలం వేసి వచ్చే మొత్తాన్ని ఉక్రెయిన్ శరణార్థులకు ఇస్తానని ఆయన ఇటీవలే ప్రకటించారు. అన్నట్టూ, నొవయ గజెటా పురుడు పోసుకుంది కూడా మరో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆలోచనల్లోంచే కావడం విశేషం. 1990లో లభించిన నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ తద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఈ పత్రిక స్థాపనకు వెచ్చించారు. (క్లిక్: ఉక్రెయిన్లో రష్యా ఉక్కిరిబిక్కిరి) -
Malala Yousafzai Marriage Video: పెళ్లి చేసుకున్న మలాల.. వీడియో వైరల్
-
పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్
బ్రిటన్: బాలికల విద్య కోసం కృషి చేసిన ప్రచారకర్త, బాలికల విద్య కోసం ప్రచారకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది. తన వివాహాన్ని బ్రిటన్లోని బర్మింగ్హామ్ నగరంలో తమ ఇరు కుటుంబాల సమక్షంలో జరుపుకున్నట్లు వెల్లడించింది. (చదవండి: అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం) అంతేకాదు తన భర్తని పేరు అస్సర్ అని చెప్పింది. ఈ మేరకు తన వివాహానికి సంబంధించిన ఫోటోలను మేము జీవిత భాగస్వాములమవ్వడానికి ముడివేశాం అనే క్యాప్షన్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే మలాల పెళ్లి చేసుకున్న వ్యక్తి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చెందిన హైపెర్ఫార్మెన్స్ సెంటర్ జనరల్ మేనేజర్ అస్సర్ మాలిక్గా గుర్తించారు. గానీ దీని పై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. ఈ క్రమంలో మలాల గతంలో బ్రిటన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ప్రజలు ఎందుకు వివాహం చేసుకోవాలో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీరు మీ జీవితంలో ఒక వ్యక్తిని కలిగి ఉండాలనుకుంటే, మీరు వివాహ పత్రాలపై ఎందుకు సంతకం చేయాలి" అంటూ మాట్లాడటం గమనార్హం. (చదవండి: అపార్ట్మెంట్లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!) Today marks a precious day in my life. Asser and I tied the knot to be partners for life. We celebrated a small nikkah ceremony at home in Birmingham with our families. Please send us your prayers. We are excited to walk together for the journey ahead. 📸: @malinfezehai pic.twitter.com/SNRgm3ufWP — Malala (@Malala) November 9, 2021 -
రాజ‘నీతి’లో మార్పు రావాలి
* నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి * 18 ఏళ్లలోపు వారితో పనులను చేయించకుండా చట్టంలో మార్పులు తేవాలి * నోబెల్ అవార్డు వచ్చిందంటే నమ్మలేకపోయా * అది దేశానికి లభించిన గౌరవం..అందుకే దేశప్రజలకు అంకితమిచ్చా సాక్షి, హైదరాబాద్: దేశంలో బాల కార్మిక వ్యవస్థను సంపూర్ణంగా రూపుమాపాలంటే కఠిన చట్టాలతోపాటు రాజకీయ సంస్కృతిలో మార్పురావాలని అప్పుడే దేశం నుంచి ఈ వ్యవస్థను పారదోలగలమని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. నాయకులు రాబోయే ఎన్నికల గురించి కాకుండా రాబోయే తరం గురించి ఆలోచించాలని సూచించారు. ప్రస్తుతం అమలవుతున్న 1986 నాటి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టంలో అనేక లోపాలున్నాయని, వాటిని సవరిస్తూ తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతోపాటు సమాజం కూడా నైతిక బాధ్యత వహిస్తూ బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో కైలాశ్ సత్యార్థి మీడియాతో మాట్లాడారు. తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని ఓ మిత్రుడు చెబితే నమ్మలేకపోయానని, ఇది తనకు మాత్రమే కాదని.. దేశానికి లభించిన గౌరవంగా భావించి పురస్కారాన్ని దేశ ప్రజలకు అంకితం చేశానని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిని నిర్మూలిస్తేనే బాలల విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, పేదరిక నిర్మూలన వంటి లక్ష్యాలు సాకారమవుతాయని పేర్కొన్నారు. బాలలు కార్మికులుగా మారితే వంద శాతం విద్య సాధ్యపడదన్నారు. 14 ఏళ్ల లోపు పిల్లలతో పనులు చేయించడం.., 18 ఏళ్ల లోపు వయసు వారితో కఠినమైన పనులు చేయించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో 1988 లో తాను చేపట్టిన వరల్డ్ మార్చ్ కారణంగా 179 దేశాలు తమ చట్టాల్లో ఆ మేరకు మార్పులు చేశాయని, కానీ ఇంత వరకూ మన చట్టంలో మార్పులు తేలేకపోయామని సత్యార్థి అసంతృప్తి వ్యక్తం చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ను కూడా సవరించాలని, 18 ఏళ్ల వయోపరిమితి కొనసాగిస్తూనే హత్యలు, అత్యాచారాల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని శిక్షించేలా ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని సూచించారు. మన దేశంలో ఎంతో మంది బాలికలను వ్యవభిచార కూపంలోని దింపుతున్నారని, పసి పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని నోబెల్ గ్రహీత ఆవేదన చెందారు. బాలికలపై జరుగుతున్న ఇలాంటి దుర్మార్గాలను రూపుమాపనంత వరకూ లక్ష్మీ, దుర్గా, సరస్వతి మాతలను కొలిచే నైతిక హక్కు మనకు లేదన్నారు. బాలికల రక్షణకు ధార్మిక సంస్థలు ముందుకు రావాలని సూచించారు. తనకు నోబెల్ వచ్చాక దేశ వ్యాప్తంగా బాలల దుస్థితిపై అవగాహన పెరిగిందని, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మరింత చురుకుగా పనిచేస్తుండడం సంతోషకరంగా ఉందని అన్నారు. అయితే దేశంలో ఇంకా లక్షలాది మంది పిల్లలు పరిశ్రమలు, కర్మాగారాల్లో మగ్గుతున్నారని, వారందరికీ స్వేచ్ఛ ప్రసాదించేందుకు ప్రతి ఒక్క పౌరుడూ కృషి చేయాలని సత్యార్థి కోరారు. ప్రపంచంలో ఏ ఒక్క పిల్లవాడు కూడా తన స్వేచ్ఛను నష్టపోకూడదన్నదే తన లక్ష్యమని, దాని కోసం చివరి వరకూ పోరాడతానని సత్యార్థి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రమాకాంత్, కార్యదర్శి రాజమౌళి పాల్గొన్నారు. సమాజ హితమే లక్ష్యం కావాలి: ఐఎస్బీ స్నాతకోత్సవంలో సత్యార్థి సాక్షి, హైదరాబాద్: విద్యాధికులు సమాజ, ప్రపంచహితం కోసం కృషి చేయాలని సత్యార్థి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని, నిత్యాన్వేషిగా ఉండాలని, నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని ఈ సందర్భంగా పట్టభద్రులను కోరారు. ‘‘మీలో ఒకొక్కరూ ఓ అగ్ని కణం. ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపగల సామర్థ్యం మీ సొంతం. ఈ ప్రపంచాన్ని వెలుగులతో నింపండి’’ అని పిలుపునిచ్చారు. ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఉద్యోగం వదిలేసి, బాలల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నప్పుడు మిత్రులు తనను పిచ్చివాడన్నారని గుర్తు చేసుకున్నారు. అయినా మనసు చెప్పిన మాట వినడం వల్లే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానన్నారు. తన జీవితంలో ఎదురైన సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును చిన్న కథల రూపంలో చెప్పారు. ‘‘ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాకపోయి ఉంటే విద్యార్థుల కుటుంబసభ్యుల మధ్య కూర్చుని ఉండేవాడిని. నా కుమార్తె మేనేజ్మెంట్ పట్టాను అందుకోవడం చూస్తూ, ఆమె స్కూలుకెళ్లిన తొలి రోజున నేను రాసుకున్న కవితను గుర్తు చేసుకునేవాడిని’’ అంటూ దాన్ని చదివి వినిపించారు. ‘నా కుమార్తె తొలిసారి బడికెళ్లింది. ప్రపంచాన్ని జయించే కొత్త అస్త్రశస్త్రాలను సమకూర్చుకునేందుకు బయల్దేరింది’ అనే అర్థంతో సాగిన ఆ హిందీ కవితను అంతా ఆస్వాదించారు. సత్యార్థి తన ప్రసంగానికి ముందు పట్టభద్రులను కాకుండా చిన్నపిల్లలను పలకరించడం ఆకట్టుకుంది. ఐఎస్బీ అతి తక్కువ సమయంలోనే ప్రపంచంలోనే అగ్రశ్రేణి విద్యాసంస్థగా ఎదిగిందని సంస్థ డీన్ అజిత్ రంగనేకర్ అన్నారు. ‘‘దాదాపు ఏడు వేల మంది పూర్వ విద్యార్థుల్లో 200 మంది అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. 23 దేశాల్లో ఐఎస్బీ పూర్వ విద్యార్థులుండటం సంస్థ సామర్థ్యానికి గీటురాయి’’ అని చెప్పారు. ప్రభుత్వాల విధాన రూపకల్పన తదితరాల్లోనూ ఐఎస్బీ పాలుపంచుకుంటోందన్నారు. స్నాతకోత్సవంలో 2015 ఏడాదికి 551 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ పట్టాలు, 62 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు 2014కు పీజీపీ మ్యాక్ కోర్సు పట్టాలు అందుకున్నారు. ఐఎస్బీ బోర్డు సభ్యులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు ఆది గోద్రెజ్, రాహుల్ బజాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గాజాలోని స్కూళ్లకు మలాలా చేయూత
లండన్: గాజాలోని దెబ్బతిన్న స్కూళ్లకు పాక్ బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ చేయూతనందించారు. గత కొన్ని రోజుల క్రితం ప్రపంచ బాలల నోబెల్ అవార్డుకు (వరల్డ్ చిల్ట్రన్స్ ప్రైజ్)ఎంపికైన మలాలా.. ఆ బహుమతి ద్వారా వచ్చిన 50 వేల యూస్ డాలర్లను అక్కడి స్కూళ్లను పునరుద్ధరించేందుకు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో గాజాపై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో గాజాలో స్కూళ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. బహుమతి కింది అందే మొత్తాన్ని ఆమె బాలల సంక్షేమం కోసం వినియోగించాల్సి ఉన్నందున ఆమె గాజాలో స్కూళ్లకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నాణ్యమైన విద్యకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒకవేళ అక్కడ విద్య లేకుంటే ఎప్పటికీ శాంతి అనేది ఉండదు' అని పేర్కొంది. -
మలాలాకు అమెరికా లిబర్టీ మెడల్
వాషింగ్టన్: పాకిస్థాన్కు చెందిన బాలికా విద్య హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్జాయ్(17) ఈ ఏడాదికిగానూ అమెరికా లిబర్టీ మెడల్ను గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తులకు ఏటా ఈ అవార్డును అందిస్తారు. అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 200 ఏళ్లు పూర్తయినందుకు సూచికగా 1988లో నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. మంగళవారం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో మలాలా ఈ మెడల్ను అందుకుంది.