-
విస్తరణ బాటలో డన్జో4బిజినెస్
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ డెలివరీ సేవల సంస్థ డన్జోలో లాజిస్టిక్స్ విభాగమైన డన్జో4బిజినెస్ (డీ4బీ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే 12–18 నెలల్లో 10–15 నగరాల్లో ప్రవేశించనున్నట్లు డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి తెలిపారు. ప్రస్తుతం తాము 10 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డన్జో ద్వారా నిత్యావసరాల డెలివరీలకు వచ్చే ఆర్డర్లతో పాటు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్ఫాంపై వచ్చే ఆర్డర్లను కూడా అందిస్తున్నట్లు సూరి చెప్పారు. చివరి అంచె వరకు ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఓఎన్డీసీ యూజర్లకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నుంచి అత్యధికంగా ఆర్డర్లు వస్తున్నాయని సూరి చెప్పారు. 70,000 మంది డెలివరీ పార్ట్నర్లతో కలిసి డీ4బీ పనిచేస్తోంది. యూజర్లు ఎక్కువగా నిత్యావసరాలు, ఆహార ఉత్పత్తులు, ఔషధాలకు ఆర్డరు ఇస్తున్నారని సూరి చెప్పారు. సగటున ఆర్డరు పరిమాణం రూ. 200–4,000 వరకు ఉంటోందని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై రవాణా చేయగలిగే అన్ని రకాల ఉత్పత్తులను డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. -
విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్! గతి స్టూడెంట్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరుకు రవాణా కంపెనీ గతి తాజాగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ను పరిచయం చేసింది. చదువుల కోసం ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) దేశంలో ఎక్కడికైనా 20 కిలోల ప్రత్యేక బాక్స్ను రవాణా చేస్తే.. ఉపరితల రవాణా ద్వారా అయితే రూ.825, వాయు మార్గం ద్వారా రూ.2,100 చార్జీ చేస్తారు. దేశవ్యాప్తంగా 735 జిల్లాల్లోని 19,800 పిన్కోడ్స్లో ఈ సేవలను వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు సామాన్ల తరలింపు ఇబ్బందులను లేకుండా చూడటమే తమ ఉద్దేశమని పేర్కొంది. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) దీంతోపాటు విద్యార్థుల కోసం గతి సంస్థ మరికొన్న సదుపాయాలు కల్పిస్తోంది. సామాన్ల ప్రత్యేక ప్యాకేజింగ్, ఆదివారం, సెలవు రోజుల్లో కూడా పికప్, డెలివరీ, ఉచిత డోర్స్టెప్ పికప్, డెలివరీ, వాతావరణ ప్రూఫ్ కంటైనర్ వాహనాల ద్వారా రవాణా, ఆన్లైన్, ఎస్ఎంఎస్ ట్రాకింగ్ సిస్టమ్, ఈమెయిల్ అప్డేట్, 24/7 కస్టమర్ సపోర్ట్ వంటి సేవలు అందిస్తోంది. -
మహీంద్రా లాజిస్టిక్స్ వేర్హౌస్ షురూ
హైదరాబాద్: దేశీయంగా సమీకృత లాజిస్టిక్స్ సర్వీసులందించే మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్(ఎంఎల్ఎల్) స్థానికంగా నెట్ జీరో సౌకర్యానికి తెరతీసింది. బహుళ ఖాతాదారుల సామర్థ్యాలు, పునరుత్పాదక ఇంధనం, వనరుల పరిరక్షణసహా పర్యావరణ అనుకూల(గ్రీన్ కవర్) వేర్హౌసింగ్ ఆర్కిటెక్చర్తో దీనిని ఏర్పాటు చేసింది. ఈ అత్యాధునిక వేర్హౌస్ సిద్దిపేట జిల్లా ములుగు మండలం, బండమైలారం గ్రామంలోని అరుణ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద నెలకొంది. కంపెనీకిగల దేశవ్యాప్త మల్టీ యూజర్ సోలార్ విద్యుత్ సౌకర్యాలలో భాగమైన ఈ కేంద్రం కస్టమర్ల తయారీ, ఫుల్ఫిల్మెంట్ ఇన్బౌండ్ కార్యక్రమాలకు వీలు కల్పించనుంది. ఈ-కామర్స్ కస్టమర్లకు మద్దతివ్వనుంది. (లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!) ఈ నూతన కేంద్రం 100శాతం సౌర, బ్యాటరీ స్టోర్డ్ శక్తితో పనిచేస్తుంది. అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ను గ్రిడ్కు అందజేస్తుంది. ఎలక్ట్రిక్ కార్గో వాహనాలకు చార్జింగ్ సౌకర్యాలనూ కల్పించనుంది. ఎంఎల్ఎల్ 350 మందికి పైగా ఇక్కడ ఉపాధి అవకాశాలను కల్పించింది. అధిక డిమాండ్ సమయంలో థర్డ్ పార్టీ అసోసియేట్లు ఈ సంఖ్యకు మూడింతలు అధికంగా ఉపాధి కల్పించే అవకాశమున్నట్లు కంపెనీ పేర్కొంది.(పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే! ) -
ఫెస్టివ్ సీజన్: గుడ్న్యూస్ 75 వేల ఉద్యోగాలు
ముంబై: సరుకు రవాణా సేవల్లో ఉన్న డెలివరీ (Delhivery) సీజనల్ ఉద్యోగాల కోసం వచ్చే ఒకటిన్నర నెలలో 75,000 మందిని నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందులో కాంట్రాక్ట్ కంపెనీ తరఫున డెలివరీ గేట్వేస్, గిడ్డంగులు, డెలివరీ విభాగాల్లో 10,000 మంది ఉంటారు. పండుగ సీజన్లో పార్సెల్, ఎక్స్ప్రెస్ పార్ట్–ట్రక్ లోడ్ వ్యాపారం రెండింటిలోనూ ఆశించిన అధిక డిమాండ్ను చేరుకోవడం లక్ష్యంగా కొత్త వారిని చేర్చుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లో పార్ట్-ట్రక్లోడ్ సామర్థ్యాన్ని 50 శాతం విస్తరించేందుకు వ్యక్తిగత బైకర్లు, స్థానిక రిటైలర్లు, వ్యాపార భాగస్వాములు, రవాణాదారులను నియమించుకోవడం ద్వారా భాగస్వామ్య కార్యక్రమాలను రెట్టింపు చేస్తామని కంపెనీ తెలిపింది. (PAN India 5G: కీలక విషయాలు వెల్లడించిన టెలికాం మంత్రి) అధిక కస్టమర్ డిమాండ్ నేపథ్యంలో పాన్-ఇండియాలో పార్శిల్ సార్టింగ్ సామర్థ్యాన్ని రోజుకు 1.5మిలియన్ షిప్మెంట్లు లక్క్ష్యంగా పెట్టుకున్నామని డెలివరీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అజిత్ పాయ్ అన్నారు. (jobmarket: ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?) -
సుమారు మూడేళ్ల నిరీక్షణ..! సింపుల్గా రూ. 5.67 కోట్లను వెనకేశారు..!
స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్పై పట్టు సాధించాలేగానీ కాసుల వర్షానే కురిపిస్తాయి. పెద్దపెద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేసే బదులుగా పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే భారీ లాభాలను అందిస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తుంటారు. తాజాగా మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ఐనా ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ కంపెనీ మూడేళ్లలో భారీ లాభాలను తెచ్చిపెట్టింది. గత రెండేళ్లలో పలు కంపెనీల షేర్లు తమ వాటాదారులకు భారీ లాభాలనే అందించాయి. పెన్నీ స్టాక్ నుంచి మల్టీబ్యాగర్ స్టాక్గా ఎదిగిన వాటిలో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ షేర్లు కూడా ఒకటి. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో 2019 మార్చిలో లిస్టింగ్ అయ్యింది. ఆ సమయంలో స్టాక్ ధర రూ. 0.35పైసలుగా ఉంది. గత మూడు ఏళ్లలో స్టాక్ విలువ 567 సార్లు పెరిగింది. ప్రస్తుతం ఈ స్టాక్ షేర్ ధర రూ. 198. 45 చేరింది. మూడేళ్ల క్రితం ఈ పెన్నీ స్టాక్లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే...లక్షకు రూ. 5.67 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. షేర్ హోల్డర్లకు దాదాపు 10,176 శాతం రాబడిని అందించింది. సుమారు మూడేళ్ల పాటు నిరీక్షించిన షేర్ హోల్లర్లకు ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ కాసుల వర్షానే కురిపించింది. ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ లాజిస్టిక్ కంపెనీగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్ సేవలను అందిస్తోంది. వేర్హౌసింగ్, పంపిణీ, సరుకు రవాణా, కస్టమ్స్ బ్రోకింగ్, కార్గో, కన్సాలిడేషన్, మల్టీమోడల్ రవాణా , వంటి సేవలను ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ అందిస్తుంది. చదవండి: కళ్లుచెదిరే లాభం.. 6 నెలల్లో లక్షకు రూ.30 లక్షలు!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement