-
బాల్య వివాహం.. సినిమా స్టైల్లో విద్యార్థిని కిడ్నాప్కు యత్నం..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలంగా మారింది. దావణగెరె విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థిని కిడ్నాప్నకు గురైన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బళ్లారి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని దావణగెరె విశ్వవిద్యాలయంలో చదువుకుంటోంది. విద్యార్థిని తల్లితో పాటు మరో ఇద్దరు యువకులు సినిమా తరహాలో కళాశాల ఆవరణలో నుంచి కారులో కిడ్నాప్ చేస్తుండగా కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది అడ్డగించి రక్షించారు. వివరాల్లోకి వెళితే.. బళ్లారి జిల్లాకు చెందిన ఓ యువతికి ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు అప్పట్లో బాల్యవివాహం చేశారు. ఈనేపథ్యంలో కిడ్నాప్నకు గురైన ఆమ్మాయి ఉన్నత విద్యను అభ్యసించేందుకు విశ్వవిద్యాలయంలో చేరింది. తనకు బాల్య వివాహం చేసినప్పడు అతని గురించి తెలియదని, తనను పెళ్లి చేసుకొన్న సదరు వ్యక్తికి మంచి నడత లేకపోవడం వల్ల అతనితో కాపురం చేయడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. ఈనేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థినిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై దావణగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పిల్లలు పుట్టలేదనే బాధతో చివరికి ఇలా..
సంగారెడ్డి: పిల్లలు లేరనే బాధతో ఆరు నెలల పాపను ఎత్తుకెళ్లిన సంఘటన సంగారెడ్డిలో జరిగింది. చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడిని 24గంటల్లో పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు డీఎస్పీ రమేష్ కుమార్ శనివారం వెల్లడించారు. మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన దంపతులు వల్లేపు రాజు, యేసుమని తమ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి చెకప్ కోసం తరచూ వస్తుండేవారు. శుక్రవారం ఆస్పత్రికి వచ్చిన వారు రాత్రి పాత బస్టాండ్ సమీపంలోని గంజి మైదాకు వెళ్లి అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో నిద్రించారు. ఆ పక్కనే గద్దైపె పట్టణానికి చెందిన మన్నే అనిల్, అతని స్నేహితుడు శ్రీశైలం మద్యం సేవిస్తున్నారు. అయితే అనిల్కు పెళ్లయ్యి ఏడేళ్లవుతున్నా పిల్లలు లేరనే బాధతో పక్కనే నిద్రిస్తున్న చిన్నారి రూపని తన స్నేహితుడి సహాయంతో ఎత్తుకెళ్లాడు. తెల్లారి నిద్రలేచే సరికి పాప కనిపించకపోవడంతో దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకొని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్కు తరలించగా, అతని స్నేహితుడు శ్రీశైలం పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. కిడ్నాప్ కేసును చాకచక్యంగా ఛేదించిన పట్టణ సీఐ శ్రీధర్రెడ్డి, రూరల్ సీఐ సుధీర్ కుమార్, ఇన్స్పెక్టర్ మహేష్లను అభినందించారు. అలాగే మరో ముగ్గురు కానిస్టేబుళ్లు శాఖీర్, మల్లారెడ్డి, శేఖర్కు నగదు పురస్కారం అందజేశారు. -
పోలీసులమంటూ కిడ్నాప్లు
కృష్ణరాజపురం: డబ్బున్న వారిని చూసి కిడ్నాప్ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఘరానా ముఠాను బెంగళూరు బ్యాటరాయనపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్కు చెందిన ప్రసాద్, మహారాష్ట్రకు చెందిన సిద్దార్థ, నాగురావు, కిరణ్, బానుదాస్. వీరు పోలీస్ అధికారులమని చెప్పుకుంటూ ధనవంతులను అపహరించే దందాకు పాల్పడుతున్నారు. శివారెడ్డిని కిడ్నాప్ చేసి.. వివరాలు.. ఇటీవల ఈ ముఠా శివారెడ్డి అనే రియల్టర్ను కిడ్నాప్ చేసి డబ్బు వసూలు చేయడంతో బాధితుడు బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి ఇటీవల నిందితులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని క్లబ్లో ఉండగా అరెస్టు చేశారు. శివారెడ్డి, అతని స్నేహితురాలు పనిమీద హైదరాబాద్కు వెళ్ళిన సమయంలో హరీష్ ద్వారా వీరు పరిచయం అయ్యారు. తరువాత బెంగళూరులో భూమి కొనాలని వచ్చి శివారెడ్డిని పిలిపించి కిడ్నాప్ చేశారు. వసంతకు ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇస్తేనే శివారెడ్డిని వదిలివేస్తామన్నారు. దీంతో వసంత రూ. 11 లక్షలు తీసుకెళ్లి ఈ ముఠాకు ఇవ్వగా అతన్ని విడిచిపెట్టారు. తరువాత బాధితులు వచ్చి బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు. హరీష్ పరారీలో ఉన్నాడు. ఈ ముఠా బెంగళూరు, హైదరాబాద్లలో పలు నేరాలకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. (చదవండి: బంజారాహిల్స్లో కారు బీభత్సం... నడిరోడ్డుపై పల్టీ కొట్టి..) -
అర్ధరాత్రి ప్రేమ జంట కిడ్నాప్యత్నం
సాక్షి, మచిలీపట్నం: ఆదివారం రాత్రి 11 గంటలు దాటింది.. కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్.. ఓ యువజంట బస్టాండ్ టేబుల్పై కూర్చుంది. నలుగురు వ్యక్తులు మెరుపు వేగంతో వచ్చి ఆ జంటను చుట్టుముట్టారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే బలవంతంగా ఈడ్చు కుంటూ విజయవాడ బస్సు ఎక్కించారు. మాట్లాడకుండా వారి నోరు నొక్కేశారు. ఇంతలో తన స్నేహితుడిని బస్సు ఎక్కించేందుకు బస్టాండ్కు వచ్చిన మచిలీపట్నం పీఆర్వో జాకబ్ ఆ జంటకు ఏ ఆపద వచ్చిందోనని బస్సును ఆపే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో ‘సాక్షి’రిపోర్టర్కు సమాచారం ఇచ్చారు. తర్వాత ఫోన్లో పోలీసులకు చెప్పడంతో నైట్ పెట్రోలింగ్ చేస్తున్న పామర్రు పోలీసులు సినీ ఫక్కీలో బస్సును వెంబడించారు. ఆ జంటతో పాటు వార్ని బలవంతంగా తీసుకెళ్తున్న ఆ నలుగురు వ్యక్తులను బస్సు నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఆరా తీయగా, వారు తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం ప్రాంతానికి చెందిన వారని గుర్తించారు. నాలుగు రోజుల క్రితం పారిపోయి బందరు ప్రాంతానికి వచ్చారు. ఎక్కడా ఆశ్రమం దొరక్కపోవడంతో రాత్రి పూట బస్టాండ్లో తలదాచుకునే వారని పోలీసుల విచారణలో గుర్తించారు. ప్రేమికులను తీసుకెళ్లేందుకు వచ్చిన వారిని మందలించారు. కొత్తగూడెం పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఆ రాష్ట్రానికి ప్రత్యేక వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
దారుణం : కిడ్నాప్ను అడ్డుకున్నారు.. కానీ
కోల్కతా : వివాహ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబంపై దాడిచేసిన దుండగులు మహిళను ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అయితే, కుటుంబ పెద్ద అప్రమత్తంగా వ్యవహరించి ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కోల్కతాలోని టాంగ్రా ప్రాంతంలోని క్రిస్టోఫర్ రోడ్డులో జరిగింది. వివరాలు.. గోపాల్ ప్రమాణిక్ (55) తన కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం ఓ పెళ్లికి హాజరయ్యాడు. వేడుక పూర్తయ్యాక రాత్రి 11:45 గంటల సమయంలో వారంతా ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఆయన కోడలు (28) మిగతా కుటుంబ సభ్యులు ముందు నడుస్తుండగా.. ప్రమాణిక్ వారిని అనుసరిస్తున్నాడు. ఈక్రమంలో అంబులెన్స్లో దూసుకొచ్చిన కొందరు దుండగులు ప్రమాణిక్ కోడలిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఆమెను బలవంతంగా కారులో ఎక్కిస్తుండగా.. అప్రమత్తమైన ప్రమాణిక్ వాహనానికి అడ్డుగా నిలిచాడు. అంతలోనే కుటుంబసభ్యులు కూడా డ్రైవర్ను డోర్లో నుంచి పట్టుకున్నారు. దీంతో ఇక పట్టుబడ్డామని గ్రహించిన దుండగులు సదరు మహిళను వదిలేసి.. ఒక్కసారిగా కారును ముందుకు పోనిచ్చారు. ప్రమాణిక్ను ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రగాయాలైన ప్రమాణిక్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement