సికింద్రాబాద్ : మాయమాటలు చెప్పి యువతి (16)ని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. రైల్వే ఇన్స్పెక్టర్ అంబటి ఆంజనేయులు కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన యువతి కొద్దిరోజుల క్రితం బోయిన్పల్లిలో ఉండే తమ బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం తిరిగి విజయవాడ వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి.. 8వ నెంబర్ ప్లాట్ఫామ్పై రైలు కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెను తనతో తీసుకెళ్లేందుకు యత్నించాడు.
అతని కుతంత్రం గ్రహించిన ఆ యువతి తాను రానని చెప్పింది. దీంతో అతను చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించగా.. కేకలు వేసింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పి.పరంజ్యోతి(62) అని తేలింది. రైల్వేపోలీసులు అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
రైల్వేస్టేషన్లో యువతి అపహరణకు యత్నం
Published Thu, Feb 27 2014 10:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement