-
సుదీర్ఘ అంతరిక్షయాత్ర చేసి సురక్షితంగా భూమికి
మాస్కో: నాసాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, రోస్కోస్మొస్కు చెందిన మరో శాస్త్రవేత్త సుదీర్ఘ అంతరిక్ష యాత్రను ముగించుకుని క్షేమంగా భూమికి చేరారు. వీరు ప్రయాణించిన స్పేస్క్రాఫ్ట్ సోయుజ్ ఎంఎస్-23 కజకిస్తాన్లోని జెజ్కజ్గాన్ నగరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. రోస్కోస్మొస్ వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ నాసా వ్యోమగామి ఫ్రాన్సిస్ రూబియో సెప్టెంబర్ 21, 2022లో సోయుజ్ ఎంఎస్-23 స్పేస్క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. వ్యోమగాములు క్షేమంగా భూమి మీదకు చేరిన విషయాన్ని రోస్కోస్మొస్, నాసా సంస్థలు ధృవీకరించాయి. రష్యా వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజుల 21 గంటల 22 నిముషాలు గడిపినట్లు ప్రకటించగా నాసా తమ వ్యోమగామి ఫ్రాన్సిస్కో రూబియో 371 రోజుల పాటు అంతరిక్షంలో గడిపినట్లు ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. వాస్తవానికి వీరు ఆరు నెలల క్రితమే భూమికి చేరుకోవాల్సి ఉండగా చిన్న ఉల్క తాకిడికి స్పేస్క్రాఫ్ట్లో లీక్ చోటుచేసుకోవడంతో అది సాధ్యపడలేదు. సిబ్బంది లేకుండా మాస్కో మరో రాకెట్ పంపడంతో దానిలో ముగ్గురు వ్యోమగాములు తిరుగుప్రయాణమయ్యారు. సెప్టెంబర్ 27, 2023కి భూమికి చేరుకొని కజకిస్తాన్లో క్షేమంగా ల్యాండ్ అయ్యారు. #SoyuzMS23Landing@roscosmos cosmonauts and commander of the Soyuz-MS23 spaceship 👨🏻🚀Sergey Prokopyev is out from the spacecraft. pic.twitter.com/vHbeOpSBr4 — The Space Pirate🥷🏻👨🏻🚀 💫🪐🚀 (@TheSpacePirateX) September 27, 2023 🇺🇸🇸🇻 | El astronauta Frank Rubio, estadounidense de origen salvadoreño, se vio obligado a quedarse en órbita debido a una falla en su nave. Ahora, tras 371 días y 5.963 vueltas alrededor de la Tierra, su nave ha aterrizado y reunirá con su familia. pic.twitter.com/VezH1FHdV4 — El Salvador Avanza (@SvAvanza) September 27, 2023 ఇది కూడా చదవండి: USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు -
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
అంతరిక్షంలో వ్యామోగాముల నివాసమైన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు భారీ ప్రమాదం తప్పింది. రష్యా కొత్తగా పంపిన రష్యన్ రీసెర్చ్ "నౌకా మాడ్యూల్" అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) డాక్ చేసిన కొన్ని గంటల తర్వాత అనుకోకుండా మండటంతో కొద్దిసేపు ఐఎస్ఎస్ పై నియంత్రణ కోల్పోయినట్లు నాసా అధికారులు తెలిపారు. ఇలా మండటం వల్ల అది కక్ష్య నుంచి 45 నిమిషాలపాటు కొద్దికొద్దిగా చలించింది. ఈ సంఘటన వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని నాసా తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఏడుగురు వ్యోమగాములకు ఎటువంటి ప్రమాదం లేదని నాసా, రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ ఆర్ఐఎ తెలిపింది. నాసా బోయింగ్ కొత్త సీఎస్ టి-100 స్టార్ లైనర్ క్యాప్సూల్ నేడు(జూలై 30) ఐఎస్ఎస్ తో కనెక్ట్ కావాల్సి ఉండేది. కానీ, ఈ సమస్య వల్ల ఆ ప్రయోగాన్ని ఆగస్టు 3 వరకు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. 25 టన్నుల "నౌకా" అనే కొత్త మాడ్యూల్ ను రష్యా కజకిస్తాన్ లోని బైకనూర్ నుంచి లాంచ్ చేసింది. అది నిన్న(జూలై 29)న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానితో అనుసంధానం అయ్యే సమయంలో అందులో స్వయం చాలక వ్యవస్థ పనిచేయక పోవడంతో రష్యాకు చెందిన ఒలేగ్ నోవిట్స్కీ వ్యోమగామి ఆ ప్రక్రియను మాన్యూవల్ గా చేపట్టారు. మొత్తం ఈ ప్రక్రియ పూర్తయిన 3 గంటల తర్వాత నౌకా మాడ్యూల్ జెట్ థ్రస్టర్లు ఒక్కసారిగా మండటంతో అది అదుపు తప్పింది. కొద్ది సేపటి వరకు భూమితో ఐఎస్ఎస్ కు సంబంధాలు తెగిపోయాయి. అప్పటికే ఐఎస్ఎస్ భ్రమణం సెకనుకు అర డిగ్రీ చొప్పున మారింది. అలాగే, మరో 12 నిమిషాలు కనుక జరిగి ఉంటే పూర్తి వ్యతిరేక దిశలో వచ్చేది అని శాస్త్రవేత్తలు చెప్పారు. టగ్ ఆఫ్ వార్ అయితే, కక్ష్యలో ఉన్న ప్లాట్ ఫామ్ లోని మరో మాడ్యూల్ థ్రస్టర్లను యాక్టివేట్ చేయడం ద్వారా నాసా బృందాలు స్పేస్ స్టేషన్ ఓరియెంటేషన్ ను పునరుద్ధరించగలిగినట్లు అధికారులు తెలిపారు. అంతరిక్ష కేంద్రంపై నియంత్రణను తిరిగి పొందడానికి రెండు మాడ్యూల్స్ మధ్య జరిగిన పోరాటాన్ని "టగ్ ఆఫ్ వార్"గా నాసా అభివర్ణించింది. అంతరాయం సమయంలో సిబ్బందితో కమ్యూనికేషన్ రెండుసార్లు అనేక నిమిషాలపాటు కోల్పోయినట్లు, "సిబ్బందికి ఏ సమయంలోనూ ప్రమాదం జరగలేదు" అని మోంటాల్బానో తెలిపారు. వ్యోమగాములకు అక్కడి నుంచి రక్షించాల్సిన అవసరం వచ్చి ఉంటే, ఐఎస్ఎస్ అవుట్ పోస్ట్ వద్ద ఉన్న స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సూల్ ను "లైఫ్ బోట్"గా రూపొందించినట్లు నాసా వాణిజ్య సిబ్బంది కార్యక్రమం మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెప్పారు -
ఛాలెంజ్ నెగ్గిన నాసా.. ‘స్పేస్’లో మిరపకాయలు?
అంతరిక్షంలో నివాస యోగ్యత గురించి పరిశోధనలు-ప్రయోగాలు ఎన్నేళ్లు సాగుతాయో చెప్పడం కష్టంగా ఉంది. అయితే విశ్వంలోని కొన్ని మర్మాలను చేధించడం, అక్కడి వాతావరణం గురించి తెలుసుకునే ప్రయోగాలు మాత్రం సజావుగానే సాగుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మరో అడుగు ముందుకు వేసింది. స్పేస్ వాతావరణంలో మిరకాయల్ని పండించే ప్రయత్నంలో సగం విజయం సాధించింది. 15,000 వేలకోట్ల అమెరికన్ డాలర్ల ఖర్చుతో ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు కలిసి ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మిరపకాయల్ని పండిస్తోంది నాసా. మెక్సికన్ రకానికి చెందిన మేలైన హట్చ్ రకపు మిరప గింజలు ఈ జూన్లో స్పేస్ ఎక్స్ కమర్షియల్ సర్వీస్ ద్వారా స్పేస్ స్టేషన్కు చేరుకున్నాయి. నాసా ఆస్ట్రోనాట్ షేన్ కిమ్బ్రాగ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నాడు. కిచెన్ ఓవెన్ సైజులో ఉండే ‘సైన్స్ క్యారియర్’ అనే డివైజ్లో వీటిని పండిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవి పూర్తిస్థాయిలో ఎదగడానికి నాలుగు నెలలలోపు టైం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాసా దీన్నొక సుదీర్ఘమైన, సంక్లిష్టమైన పరిశోధనగా అభివర్ణించుకుంటోంది. వ్యోమగాములకు ఆహార కొరత తీర్చే చర్యల్లో భాగంగానే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇదే రీతిలో పూలు, దుంపల కోసం ప్రయత్నించారు కూడా. అయితే జీరోగ్రావిటీ ల్యాబ్లో మిరపకాయల్ని పండించడం వీలుకాదని సైంటిస్టులు నాసాతో ఛాలెంజ్ చేశారు. ఈ తరుణంలో ఛాలెంజింగ్గా తీసుకున్న నాసా.. సత్పలితాన్ని రాబట్టింది. సాధారణంగా స్పేస్ ప్రయాణంలో వ్యోమగాములు వాసన, రుచి సామర్థ్యం కోల్పోతారు. ఆ టైంలో వాళ్లు ‘స్పైసీ’ ఫుడ్కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ తరుణంలో ఈ ప్రయోగం ఫలితానిచ్చేదేనని నాసా అభిప్రాయపడుతోంది. 🌶️ Chile peppers are spicing up the @Space_Station! Recently, @astro_kimbrough added water to NASA’s Plant Habitat-04 experiment. In less than 4⃣ months, @NASA_Astronauts will pick their first harvest. Follow along as these space peppers kick up the heat: https://t.co/KpCVpd850U pic.twitter.com/KS3qvRoz22 — NASA's Kennedy Space Center (@NASAKennedy) July 14, 2021 -
మానవ అంతరిక్ష పరిశోధనలో కొత్త శకం
వాషింగ్టన్ : ‘స్పేస్ ఎక్స్’ అంతరిక్ష సంస్థ మరోసారి మానవసహిత రాకేట్ను దిగ్విజయంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఆదివారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు ప్రయాణమైంది. స్పేస్ ఎక్స్, నాసాలు సంయుక్తంగా చేపట్టిన తొలి మానవసహిత ఆపరేషనల్ మిషన్ ఇదే. అమెరికాకు చెందిన వ్యోమగాములు మైకెల్ హాప్కిన్స్, విక్టర్ గ్లోవర్, శనాన్ వాకర్, జపాన్కు చెందిన సోచి నగూచీలు ఈ మిషన్లో భాగమయ్యారు. ఆదివారం రాత్రి 7:27 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి రాకేట్ ఐఎస్ఎస్కి బయలుదేరింది. అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ ఈ ప్రయోగాన్ని కొనియాడారు. ( త్వరలో ఫైజర్ కరోనా టీకా సరఫరా ) సోమవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ మన తెలివి, సంకల్ప బలం ద్వారా సాధించిన విజ్ఞాన శక్తికి ఇది నిదర్శనం.. ఎంతో గొప్పది’’ అని పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా దీనిపై స్పందించారు ‘‘అమెరికా మానవ అంతరిక్ష పరిశోధనలో కొత్త శకం’’ అని అన్నారు. కాగా, గత మే నెలలో స్పేస్ ఎక్స్కు చెందిన ఓ రాకేట్ ఇద్దరు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాంటి నష్టం లేకుండా ఆగస్టు నెలలో క్షేమంగా భూమిపైకి చేరింది. -
ఐఎస్ఎస్ చేరుకున్న స్పేస్ఎక్స్ క్రూడ్రాగన్ వ్యోమనౌక
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement