ilaiyaraaja
-
మరో వివాదంలో గుడ్ బ్యాడ్ అగ్లీ.. లీగల్ యాక్షన్ తీసుకుంటానన్న స్టార్ హీరో తండ్రి
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.అయితే తాజాగా ఈ మూవీపై మరో వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో మూడు పాటలను ఉపయోగించడంపై నటుడు ధనుశ్ తండ్రి, చిత్రనిర్మాత కస్తూరి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పాటలను అనుమతి లేకుండా సినిమాల్లో ఉపయోగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కస్తూరి రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన చిత్రాల్లోని మూడు పాటలు - పంజు మిట్థై, ఓథా రూబా థారెన్, తూటువలై ఇలై అరాచి లాంటి పాటలు వినియోగించారని ఆరోపించారు. తన అనుమతి లేకుండా వినియోగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత తరం చిత్రనిర్మాతలు, సంగీత దర్శకులు తమ వాస్తవికతను కోల్పోయారని ఆయన విమర్శించారు.కస్తూరి రాజా మాట్లాడుతూ.. 'ఇళయరాజా, దేవా వంటి దిగ్గజాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టించాలి. కానీ ఈ రోజుల్లో సంగీత స్వరకర్తలు ఆవిష్కరణ కంటే ఉన్నవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాత ట్రాక్లను ఉపయోగించడం సమస్య కాదు. కానీ అసలు సృష్టికర్తల నుంచి అనుమతి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు. త్వరలోనే చట్టపరమైన చర్య తీసుకుంటా' అని తెలిపారు.(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్)ఇళయరాజా రూ.5 కోట్ల డిమాండ్..కాగా.. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఓథా రూబా థారెన్ పాటను ఉపయోగించారు. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇళయరాజా తన మూడు పాటలను సినిమాలో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్కు లీగల్ నోటీసులు పంపారు. రూ. కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా సినిమా నుంచి తన పాటలను తొలగించాలని కోరారు. మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా పాటలను ఉపయోగించినప్పుడు తాము ఎటువంటి తప్పు చేయలేదని చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవిశంకర్ అన్నారు. మేము సినిమాలో ఉపయోగించిన పాటలకు అవసరమైన అన్ని రకాల అనుమతి తీసుకున్నామని తెలిపారు. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో చాలా వరకు పాత పాటల్ని.. వింటేజ్ ఫీల్ కోసం ఉపయోగించారు. -
'షష్టి పూర్తి' పాటలో సందడిగా రాజేంద్ర ప్రసాద్, అర్చన
'షష్టి పూర్తి' సినిమా నుంచి క్రేజీ సాంగ్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. 'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి ఇందులో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పాట కూడా వారిద్దరి మధ్యనే తెరకెక్కించారు. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా సందడి చేయనున్నారు. ఇప్పటికే మంచి లవ్ ట్రాక్తో పాటు చక్కటి మెలోడీనిచ్చే పాటలు ఈ మూవీ నుంచి విడుదలయ్యాయి. తాజాగా 'షష్టి పూర్తి' కార్యక్రమం తంతు గురించి మరో పాటను పంచుకున్నారు. సంగీతం ఇళయరాజా అందించారు. మే 30న ఈ చిత్రం విడుదల కానుంది. -
'షష్టిపూర్తి' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అది తెలిసిన రోజు సంగీతం మానేస్తాను: ఇళయరాజా
‘‘నాకు ఎంత సంగీతం తెలుసన్నది ముఖ్యం కాదు... సంగీతమే నా గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తోందో తెలియదు. ఆ సంగతి తెలిసిన మరుక్షణం సంగీతం మానేస్తాను’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా, రాజేంద్రప్రసాద్, అర్చన ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర సంగీతదర్శకుడు ఇళయరాజా(Ilaiyaraaja) టీజర్ రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ–‘‘షష్టిపూర్తి’ ద్వారా కొత్తవాళ్లు తొలి ప్రయత్నం చేశారు. వారిని ప్రోత్సహించాలని ఇక్కడకి వచ్చాను. ఈ సినిమాకి, పని చేసిన అందరికీ దేవుడు ఆశీస్సులు అందించాలి’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం..’ అనే పాట రాశాను. ఇళయరాజాగారి సంగీతానికి పాడాలనుకున్నా ఆ అవకాశం రాలేదు. కానీ, ఆయన సంగీతానికి పాట రాసే అవకాశం వచ్చింది. ఇదొక రకంగా నా జీవితానికి సంబంధించినదే. ఇళయరాజాపై నాకున్న అభిమాన భావానికి సంబంధించిన పాటని అనుకోండి’’ అని అన్నారు. రాజేందప్రసాద్( Rajendra Prasad) మాట్లాడుతూ– ‘‘ఇళయరాజా సంగీతం వల్లే ‘లేడీస్ టైలర్’ సినిమా హిట్టయింది. మళ్లీ ఇన్నేళ్లకు నా సినిమాకి ఆయన సంగీతాన్ని అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. రజనీకాంత్, కమల్హాసన్తో పాటు ఎంతోమందిని తన సంగీతంతో స్టార్లుగా ఇళయరాజా నిలబెట్టారు.’ అని అన్నారు. ‘‘ఇంత గొప్పవారు మా సినిమాకి పని చేయడం సంతోషంగా ఉంది’’ అని పవన్ ప్రభ, రూపేష్ అన్నారు. కాగా ఇళయరాజాకి భారతరత్న ఇవ్వాలన్న ఆకాంక్షను పలువురు ఈ వేదికపై వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ రామ్, కళా దర్శకుడు తోట తరణి, గీత రచయిత చైతన్య ప్రసాద్ మాట్లాడారు. -
'భవతారిణి చివరి కోరిక ఇదే'.. జయంతి రోజున ఇళయ రాజా ఎమోషనల్
వెండితెరపై సంగీత విద్వాంసుడిగా ఇళయరాజా (Ilayaraja) గొప్ప పేరు సాధించారు. 1976లో అన్నకిలి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పలు భాషల్లో 1500 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అంతే కాదు దాదాపు 7 వేలకు పైగా పాటలు రాసిన ఘనత ఆయనదే. ఇప్పటికీ ఆయన సంగీతానికి ఫిదా అవ్వాల్సిందే. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కుమార్తె భవతారిణి సింగర్గా రాణించారు. తమిళంతో పాటు తెలుగు చిత్రాలకు సైతం తన గాత్రం అందించారు. అయితే గతేడాదిలో ఆమె క్యాన్సర్తో కన్నుమూశారు.అయితే ఈ ఏడాది భవతారిణి (Bhavatharini) జయంతి సందర్భంగా ఆమె తండ్రి ఇళయరాజా ఎమోషనల్ అయ్యారు. ఆల్-గర్ల్స్ ఆర్కెస్ట్రా పేరుతో ఈవెంట్ను నిర్వహించాలన్నది తన కుమార్తె చివరి కోరిక అని ఇళయ రాజా వెల్లడించారు. తాను మరణించే ముందు తనను చివరి కోరిక కోరిందని ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి ఇళయరాజాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కుమారుడు కార్తీక్ రాజా, సోదరుడు గంగై అమరెన్, దర్శకుడు వెంకట్ ప్రభు కూడా హాజరయ్యారు. తన జయంతి రోజు ఫిబ్రవరి 12న స్మరించుకోవడానికి ఒక ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తానని కూడా ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఇళయరాజా మాట్లాడుతూ.. "బాలికలతో ఒక పెద్ద ఆర్కెస్ట్రాను ప్రారంభించాలనుకుంటున్నానని భవతారిణి నాకు చెప్పింది. అదే ఆమె చివరి కోరిక కూడా. రెండు రోజుల క్రితమే నేను మలేషియాలో ఉన్నప్పుడు నా ముందు ప్రదర్శన ఇచ్చిన యువతులతో కూడిన అనేక బృందాలను కలిశాను. వారిని చూసినప్పుడు నాకు భవతారిణి చివరి కోరిక గుర్తుకు వచ్చింది. అందుకే తన పేరుతో ఒక ఆర్కెస్ట్రాను ప్రారంభించబోతున్నా. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు ఆర్కెస్ట్రాలో భాగమవుతారు" వెల్లడించారు.అనంతరం మాట్లాడుతూ.." ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శన ఇచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సరైన సమయంలోనే ఈ విషయంపై ప్రకటన చేస్తాను. యువతులు ఆర్కెస్ట్రాలో భాగం కావడానికి నమోదు చేసుకుని ఆడిషన్ ఇవ్వవచ్చు. ఆర్కెస్ట్రా భవతారి వారసత్వాన్ని నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహాన్ని వ్యాపింపజేయాలని నేను కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకట్ ప్రభు, భవతారిణి అన్నయ్య కార్తీక్ రాజా తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ ప్రభు భవతారిణిని గుర్తు చేసుకున్నారు. అప్పడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నా.. పుట్టినరోజు శుభాకాంక్షలు తంగచి అంటూ ఎమోషనల్ నోట్ రాశారు. కాగా.. జాతీయ అవార్డు గెలుచుకున్న నేపథ్య గాయని, స్వరకర్త భవతారిణి . ఆమె తమిళ చిత్రం భారతిలోని మయిల్ పోలా పొన్ను ఒన్ను పాట ద్వారా ఫేమ్ పొందింది. క్యాన్సర్తో పోరాడిన తర్వాత భవతారిణి జనవరి 25, 2024న 47 ఏళ్ల వయసులోనే మరణించింది. భవతారిణికి ఇద్దరు సోదరులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా ఉన్నారు. Can’t believe it’s one year already 💔 💔 💔 happy bday thangachi #bhavatharini https://t.co/YSBPUWPQlE— venkat prabhu (@vp_offl) February 12, 2025 -
ఇళయరాజా బయోపిక్ కు బ్రేక్ పడిందా ?
-
నా మాటలు కొందరికి కడుపు మంటగా ఉన్నాయి: ఇళయరాజా
సంగీత జ్ఞానిగా ఇళయరాజా(Ilayaraja) ఎంతో పేరు సాధించారు. ఆయన సంగీత ప్రయాణంలో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు. 1976లో అన్నకిలి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పలు భాషల్లో 1500 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అదేవిధంగా 7 వేలకు పైగా పాటలు రాసిన ఘనత ఆయనదే.. ఇప్పటి తరం వారు కూడా ఆయన సంగీతానికి ఫిదా అవుతారు. మైమరిచి ఆయన పాటలు వింటారు. 35 రోజుల్లో సింపోనిని రూపొందించవచ్చని నిరూపించిన సంగీత జ్ఞాని ఇళయరాజా. అయితే ఈయనపై వివాదాలు లేవని చెప్పలేం. ఇటీవల ఇళయరాజా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ... 'నేను సంగీతాన్ని అందించిన పలు పాటల ద్వారా వెస్ట్రన్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేసి మీకు నేర్పించాను. సంగీత దర్శకులు మొజార్ట్, పోతోవన్ బంటి పేర్లు మీకందరికీ ఎలా తెలుసు ? వారి గురించి మీకు చెప్పింది ఎవరు? నేనే వారిని మీకు పరిచయం చేశాను. ఒక సంగీత అభిమానికి పలు విధాలుగా ప్రపంచ సంగీతాన్ని నా పాటల ద్వారా పరిచయం చేశాను. నేను సింపోనిని రూపొందించాను. అంటే నాకు సంగీతం అంటే అంత ఆసక్తి అని మీరు తెలుసుకోవాలి. ఇలా అనడం కొందరికి కడుపు మంట కావచ్చు.అయితే నా సంగీతం అందరి జీవితాల్లోనూ ఉంటుంది. అలాగని మీరు అడగ్గానే సంగీతాన్ని అందిస్తే నేను శరవణ భవనం (హోటల్) అవుతాను. నా సంగీతాన్ని విని చిన్న బిడ్డ తిరిగి ప్రాణం పోసుకుంది. ఒక ఏనుగుల గుంపు నా పాటలు వినడానికి వచ్చాయి. ఇవన్నీ చెబితే నాకు గర్వం, పొగరు అంటారు. అయినా గర్వం నాకు గాక వేరే వారికి ఎందుకు వస్తుంది? నిజమే నాకు పొగరు ఎక్కువే. ప్రపంచంలోనే ఎవరు చేయలేని దానిని నేను చేశాను. అలాంటప్పుడు నాకేగా పొగరు ఉండాలి. ప్రతిభ ఉన్నవారికే గర్వం ఉంటుంది.' అని ఇళయరాజా పేర్కొన్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ప్రముఖ నిర్మాణ సంస్థకు ఇళయరాజా నోటీసులు.. అసలేం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ప్రముఖ సంగీ త దర్శకుడు ఇళయరాజా వ్యవహారం వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. తాను సంగీతం అందించిన పాటలకు చెందిన సర్వహక్కులు తనవే అన్నట్లు ఆయన వ్యవహార ధోరణిని తప్పుబడుతున్నారు. తాజాగా నటుడు రజనీకాంత్ చిత్ర నిర్మాతకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. దీనికి రజనీకాంత్ ఎలా స్పందించారో తెలుసా?రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చి త్రం వేట్టైయాన్. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో రజనీకాంత్ తాను 151వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సీన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు ఇంతకు ముందే తెలిపారు. కాగా దీనికి కూలీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశా రు.కాగా ఇందులో డిస్కో డిస్కో అనే పాట చోటు చేసుకుంటుందట. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఈ పాటకు ఇంతకు ముందు రజినీకాంత్ హీరోగా నటించిన తంగమగన్ చిత్రానికి తాను రూపొందించిన వావా పక్కమ్ వా పాట ట్యూన్నే మార్చి రూపొందించారని.. అందుకు తన అనుమతి తీసుకోలేదని ఇళయరాజా సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు పంపారు. కాగా వేట్టైయాన్ చిత్రం కోసం ముంబాయి వెళ్లిన రజనీకాంత్ శనివారం చెన్నైకు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఇళయరాజా నోటీసుల వ్యవహారం గురించి పాత్రికేయులు రజనీకాంత్ను ప్రశ్నించగా.. అది చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజాకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు. -
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
సంగీత ప్రపంచంలో ఇళయరాజాకు ప్రత్యకమైన స్థానం ఉంది. ఎందరో యువ సంగీత దర్శకులకు ఆయన ఒక ఆదర్శం. తన సంగీతంతో మూడు తరాల ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయన సొంతం. అయితే, ఇళయరాజా తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి పెద్ద దుమారాన్నే క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్ 'కూలీ' సినిమా మేకర్స్కు ఆయన నోటీసులు పంపడం కూడా ఒకటి అని చెప్పవచ్చు.ఇళయరాజా సంగీతం అందించిన పాటలను ఎవరైనా ఉపయోగించుకుంటే వారికి కాపీరైట్, రాయల్టీ వంటి విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ తరచుగా కోర్టు నోటీసులు ఆయన పంపడం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి స్టార్ సింగర్కు కూడా ఆయన గతంలో నోటీసులు పంపారు. మ్యూజికల్ కన్సర్ట్స్లో తన పాటలు వాడుకుంటున్నారని బాలుకు నోటీసులు పంపడం అప్పట్లో చాలా వివాదాస్పదం అయింది. తన పాటలతో ఉన్న ఒప్పందం గడువు ముగిసినా కూడా ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలు ఇప్పటికీ కూడా ఉపయోగించుకుంటున్నాయని కొద్దిరోజుల క్రితం నోటీసులు పంపారు.తాజాగా ఇదిలా ఉంటే.. రజనీకాంత్ సినిమా 'కూలి' మేకర్స్కు కూడా ఇళయరాజా కోర్టు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్లో ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన సంగీతం అందించిన 'తంగమగన్' సినిమా నుంచి ఒక పాటను ఉపయోగించారట. 'వా వా పక్కం వా' అనే సాంగ్ 'కూలి' టీజర్ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది. తన అనుమతి లేకుండా సాంగ్ను ఎలా ఉపయోగిస్తారని ఆయన నోటీసులు పంపారు. కూలీ టీజర్లో సాంగ్ను తొలగించాలని కోరారు. ఈ విషయంపై సన్ పిక్చర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇళయరాజా పాటల హక్కులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం కోర్టు ఒక సూచనను వెళ్లడించింది. ఒక పాట రూపొందేందుకు సాహిత్యం, గాయకుడు సహా చాలామంది అవసరమని, సాహిత్యం లేనిదే పాట లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం సంగీతం అందించారని ఒక్కరికే ఆ హక్కులు దక్కవని చెప్పిన కోర్టు ఫైనల్ తీర్పును త్వరలో వెళ్లడిస్తామని పేర్కొంది. -
ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, సింగర్ భవతారిణి(47) కన్నుమూశారు. కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూనే ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శ్రీలంకలోనే మరణించినట్లు సమాచారం. ఆమె భౌతిక కాయాన్ని రేపటిలోగా చెన్నైకి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. భవతారిణి ‘భారతి’లోని ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు సాధించారు. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా కూడా ఉన్నారు. భవతారిణి తన తండ్రి, సోదరుల డైరెక్షన్లోనే ఎక్కువగా పాటలు పాడారు. -
నేను పాటలు పాడాను అంటే వచ్చి గొడవ చేసేవారు ఇళయరాజా గారు
-
నీ పని నువ్వు చూసుకో అని తాను వార్నింగ్ ఇచ్చారు..!
-
నాతో ఎందుకు పాడించరు అని డైరెక్ట్ గా అడిగా
-
ఇళయరాజా పాటలు అన్ని నేనే పాడా కానీ..!
-
బాలు గారు పక్కన ఉండగానే నా మీద సీరియస్ అయ్యాడు
-
20 ఏళ్ల తర్వాత ఇళయరాజా ఎలాంటివారో రివీల్ చేసిన సింగర్
చిన్న చిన్న ఆశ- ఈ ఒక్క పాట చాలు మిన్మిని గుర్తుపెట్టుకోవడానికి. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1992లో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా 'రోజా' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అతనికి మొదటి సినిమా అయినా కూడా సుశీల, జానకి, చిత్ర వంటి సీనియర్లను పక్కనపెట్టి ‘చిన్ని చిన్న ఆశ’ పాటను కొత్త గాయని 'మిన్మిని'ని ఎంచుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకు మిన్మినియే పాడింది. ‘జాబిలిని తాకి ముద్దులిడ ఆశ... వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’... అంటూ సాగిన ఆ పాట ఆ సినిమాకే ఊపిరి పోసింది. కానీ ఆ పాట తర్వాత మిన్మికి మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు. 1991 నుంచి 1994 వరకు పలు సూపర్ హిట్ పాటలు పాడిన తన కెరీర్ ఎందుకు ముగిసిందో తాజాగా మిన్మిని వెల్లడించింది. (ఇదీ చదవండి: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్) రోజా సినిమాలోని పాట పాడక ముందే తను మాస్ట్రో ఇళయరాజా టీమ్లో ప్లేబ్యాక్ సింగర్గా కొనసాగేదట. ఎప్పుడైతే తను ఏఆర్ రెహమాన్ మొదటి సినిమాలో పాట పాడినట్లు ఇళయరాజాకు తెలియగానే వేరేచోట ఎందుకు పాడుతున్నారు? తన దగ్గరే పాడాలని ఇళయ రాజా అన్నట్లుగా గుర్తు చేసుకుంది. దీంతో తాను ఏడ్చానని.. ఇదంతా ఒక రికార్డింగ్ స్టూడియోలో ఉండగానే జరగడంతో అక్కడున్న వారంతా తన ఏడుపును విన్నట్లు చెప్పింది. అప్పుడు సింగర్ మనో తనను ఓదార్చారని తెలిపింది (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి) ఆ సంఘటన తర్వాత పాటలు పాడేందుకు ఇళయ రాజా పిలవలేదని మిన్మిని చెప్పుకొచ్చింది . ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న ఆయన గురించి ఎవరూ నెగెటివ్గా ఆలోచించకూడదనే ఇన్నాళ్లు ఈ విషయాన్ని రివీల్ చేయలేదని వెల్లడించింది. మరోవైపు కెరీర్ పీక్లో ఉన్నప్పుడే ఈ ఒక్క కారణంతో అవకాశాలు కోల్పోయానని మిన్మిని పేర్కొంది..అయితే లక్కీగా 2015లో మళ్లీ ఏఆర్ రెహమాన్తో కమ్బ్యాక్ ఇచ్చినట్లు తెలిపింది. కానీ అప్పటికే తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. -
‘మ్యూజిక్ స్కూల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ (ఫొటోలు)
-
కళాతపస్వికి తెలుగులో నివాళులు అర్పించిన ఇళయరాజా, వీడియో రిలీజ్..
కళాతపస్వి కె విశ్వనాథ్ మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గురువారం రాత్రి అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడాచారు. దీంతో ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలనాటి హీరో, సీనియర్ నటుడు చంద్రమోహన్ ఆయన పార్థివ దేహం వద్ద బోరున విలపించిన దృశ్యం అందరిని కలిచివేసింది. ఇక ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వాపోయారు. చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే.. అలా సినీ పరిశ్రమలోని సీనియర్ హీరోల నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు సోషల్ మీడియాలో కళాతపస్వికి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మ్యూజికల్ మ్యాస్ట్రో, ఎంపీ ఇళయరాజా తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో ఇళయరాజా తెలుగులో మాట్లాడుతూ విశ్వనాథ్కు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో వీడియో పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్ ఫిలిం హిస్టరీలో చాలా ముఖ్యమైన, ప్రధాన స్థానంలో ఉన్న, చాలా ముఖ్యమైన దర్శకుడు కె విశ్వనాథ్ గారు దేవుడు పాదాల వద్దకు వెళ్లారని తెలిసి నాకు చాలా బాధ కలిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని కోరుకుంటున్నా’ అంటూ నివాళులు అర్పించారు. చదవండి: లవ్టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! pic.twitter.com/blfTwMxHWW — Ilaiyaraaja (@ilaiyaraaja) February 3, 2023 -
13 ఏళ్ల తర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తున్న నటుడు, త్వరలో షూటింగ్ పూర్తి
గ్రామీణ కథా చిత్రాలతో 1980లో వరుస విజయాలను అందుకున్న నటుడు రామరాజన్. మక్కళ్ నాయకన్గా ప్రజల మన్ననలను అందుకున్న ఈయన నటించిన అత్యధిక చిత్రాలకు ఇళయరాజానే సంగీతాన్ని అందించారు అనేది గమనార్హం. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటూ వచ్చిన ఈయన 13 ఏళ్ల తర్వాత తాజాగా సామాన్యన్ అనే చిత్రంతో కథానాయకుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. దీన్ని తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ పతాకంపై వి మదియళగన్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు తంబికోట్టై, మరైంది రుందు పార్కుమ్ మర్మం ఎన్నా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్. రాఖేశ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. నటుడు రాధారవి, దర్శకుడు కేఎస్ రవికుమార్, ఎంఎస్ భాస్కర్, శరవణన్ సుబ్బయ్య లియో శివ, నక్ష చరణ్, స్మతి వెంకట్, అపర్ణలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. సామాన్యన్ చిత్ర కథానాయకుడు రామరాజన్, దర్శక,నిర్మాతలు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం సంగీత దర్శకుడు ఇళయరాజాను ఆయన రికార్డింగ్ థియేటర్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, షూటింగ్ తర్వాతే సంగీతాన్ని అందించడానికి మీ వద్దకు వస్తామని చెప్పడంతో ఇళయరాజా ఆశ్చర్యపోయినట్లు నిర్మాత తెలిపారు. -
విందు, వినోదాలకు దూరంగా ఉండే ఇళయరాజా తొలిసారి విందిచ్చారు
సంగీతజ్ఞాని ఇళయరాజా సాధారణంగా విందూ వినోదాలకు దూరంగా ఉంటారు. అలాంటిది అనూహ్యంగా ఆయనే ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య) నిర్మాహకులకు తొలిసారి విందును ఇవ్వడం విశేషం. ఇళయరాజాకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడి పదవిని కట్టబెట్టడం, ఆయన పదవీ ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. ఫెఫ్సీ నిర్వాహకులతో ఇళయరాజా రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇళయరాజా ఫెఫ్సీలో భాగం అయిన 23 శాఖల నిర్వాహకులకు విందునిచ్చారు. చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్, పేరరసు, మనోబాలా తదితరులు పాల్గొన్నారు. -
ఇళయరాజాకు అభినందనల వెల్లువ
ఇళయరాజా.. ఈ పేరు చెబితే సంగీత సరస్వతి మది పులకిస్తుంది. స్వరాలు సగారాలాడుతాయి. దాదాపు 50 వసంతాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న ఈ సంగీత దిగ్గజానికి అరుదైన ఘనత లభించింది. ఆయన్ని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అనేక తరాల సంగీతానికి ఆయన వారధి వంటి వారని, అనుసంధాన కర్తని కొనియాడింది. కాగా మదురై జిల్లా పన్నై పురం అనే కుగ్రామానికి హార్మోని పెట్టె పట్టుకుని చెన్నపట్నానికి వచ్చిన ఇళయరాజా 1976లో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. చదవండి: ఖుష్బూ సుందర్కు కీలక బాధ్యతలు అప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది చిత్రాలకు సంగీతం అందించి ఇసయజ్ఞానిగా కీర్తి పొందారు. కాగా ఈయనకు ఇప్పటికే పద్మవిభూషణ్ వంటి జాతీయస్థాయి అవార్డులను కూడా అందుకున్నారు. తాజాగా రాజ్యసభకు నామినేట్ కావడంతో సినీ, రాజకీయ ప్రముఖలతో పాటు ఇతరులు, అభిమానుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇక సూపర్స్టార్ రజినీకాంత్, సీనియర్ దర్శకుడు భారతీరాజా తదితరులు అభినందించారు. -
రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు
న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకొని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్న భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా మరో అస్త్రం సంధించింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు పంపిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ నుంచి ప్రముఖ అథ్లెట్ పీటీ ఉషా, తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ను పార్లమెంట్ ఎగువసభకు నామినేట్ చేసింది. పెద్దల సభలో అడుగుపెట్టబోతున్న నలుగురు ప్రముఖులకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. సంబంధిత రంగాల్లో వారు అందించిన సేవలను కొనియాడారు. పీటీ ఉషా ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. ఇళయరాజా మధురమైన సంగీతంతో ప్రజలను రంజింపజేశారని గుర్తుచేశారు. భిన్నతరాల ప్రజలు ఆయన సంగీతాన్ని ఆస్వాదించారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, సాంస్కృతిక రంగాల్లో వీరేంద్ర హెగ్గడే అందిస్తున్న సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్కు సృజనాత్మక ప్రపంచంతో దశాబ్దాల అనుబంధం ఉందని, భారతదేశ ఘనమైన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారని ప్రశంసించారు. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన కొద్ది రోజులకే నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేయడం గమనార్హం. పాటల ‘పెద్ద’రాజా ‘పచ్చని చేల పావడ గట్టి...కొండమల్లెలే కొప్పున బెట్టి.. వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని..’వంటి అత్యద్భుత గీతానికి అంతే అద్భుతంగా బాణీలు సమకూర్చి పాటకు అమృతత్వాన్ని సాధించిపెట్టారు ఇళయరాజా. ఇలాంటి పాటలెన్నో ఆయన పాటల పూదోటలో అలా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ పాటలోని ‘పచ్చని చేల’కు ఇళయరాజా జీవితానికి మధ్య సంబంధం ఎంతో బలమైంది. ఇళయరాజాకు పాటపై మక్కువ ఏర్పడింది, ఆయన్ను సంగీతం వైపు అడుగులేయించింది ఈ పచ్చని చేలల్లో రైతులు, కూలీలు పాడే పాటలే. ‘అన్నక్కిళి’తర్వాత బిజీ సంగీత కచేరీల్లో పాల్గొంటూ మరోవైపు పశ్చిమ బెంగాల్కి చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా చేశారు ఇళయరాజా. కన్నడ సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ దగ్గర దాదాపు 200 సినిమాలకు (చాలావరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా చేశారు. ఇక తమిళ చిత్రం ‘అన్నక్కిళి’తో (1976)తో పూర్తిస్థాయి సంగీతదర్శకుడిగా మారారు. ‘అన్నక్కిళి’నిర్మాత పంజు అరుణాచలం రాజాకి ‘ఇళయ’(యంగ్ అని అర్థం) అని చేర్చి ‘ఇళయరాజా’గా మార్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో దాదాపు 1,500 చిత్రాలకు 7 వేల పాటలకు పైగా స్వరపరిచారు ఇళయరాజా. 2010లో భారత ప్రభుత్వం ఇళయరాజాను ‘పద్మభూషణ్‘, 2018లో ‘పద్మ విభూషణ్‘పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వాలు సత్కరించాయి. ‘సాగర సంగమం’, ‘రుద్రవీణ’, తమిళ చిత్రం ‘సింధుభైరవి’, మలయాళ ‘పళసి రాజా’చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు. మధురైలోని పన్నైపురమ్లో జననం 1943 జూన్ 3న తమిళనాడులోని మధురైలో గల పన్నైపురమ్లో రామస్వామి, చిన్నతాయమ్మాళ్ దంపతులకు మూడవ సంతానంగా జ్ఞాన దేశిగన్ (ఇళయరాజా) జన్మించారు. స్కూల్లో చేర్చేటప్పుడు ‘రాసయ్యా’అని మార్చారు. 14వ ఏటనే ఇళయరాజాకి సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. దాంతో సోదరుడు పావలార్ వరదరాజన్ నిర్వహించే సంగీత బృందంతో ఊరూరూ తిరుగుతూ కచేరీలు ఇచ్చేవారు. ఆ సమయంలోనే భారతదేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా తమిళ కవి కన్నదాసన్ రాసిన పాటకు బాణీ కట్టారు. తీవ్ర వేదనతో సాగే ఈ పాట ఎంతోమంది మనసుల్ని కదిలించింది. 1968లో మద్రాసులో ధన్రాజ్ మాస్టర్ వద్ద సంగీతం అభ్యసించారు. ధన్రాజ్ మాస్టర్ రాసయ్యా పేరుని ‘రాజా’గా మార్చారు. రాజ్యసభకు ‘కథ’ల బాహుబలి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్ తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో 1942 మే 27న జన్మించారు. ఆయన పూర్తిపేరు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్. కొవ్వూరు, ఏలూరు, విశాఖపట్ణణంలో చదువుకున్న విజయేంద్ర ప్రసాద్ తన అన్నయ్యతో కలసి విశాఖపట్టణంలో కాంట్రాక్ట్ పనులు చేసేవారు. అక్కడే రాజనందినిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో ఉన్న తన దగ్గరి బంధువు, అన్నయ్య అయిన పాటల రచయిత శివశక్తి దత్తా (సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి) వద్దకు చేరారు. దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద విజయేంద్ర ప్రసాద్ని అసిస్టెంట్ రైటర్గా చేర్పించారు శివశక్తి దత్తా. మూడేళ్లు అసిస్టెంట్ రైటర్గా చేసిన ఆయన శివశక్తి దత్తాతో కలిసి ‘జానకి రాముడు’సినిమాకి తొలిసారి కథ రాశారు. ‘బంగారు కుటుంబం’, ‘బొబ్బిలి సింహం’సినిమాలకు కథలు రాశారు. ‘బొబ్బిలి సింహం’చిత్రం తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలకు కథలు అందించారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’చిత్రాలకు కథలు అందించారు. 1996లో అన్నయ్య శివశక్తి దత్తాతో కలిసి ‘అర్ధాంగి’, ‘శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లీ’చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘రాజన్న’చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నంది అవార్డు అందుకున్నారు. హిందీ ‘బజరంగీ భాయీజాన్’సినిమాకి బెస్ట్ స్టోరీ విభాగంలో ‘ఫిల్మ్ఫేర్’తో పాటు, ‘ది ఐకానిక్ ట్రేడ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ 2015’, ‘సోనీ గిల్డ్ 2016’అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ సతీమణి రాజనందిని 2012 అక్టోబర్ 21న మరణించారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు. ‘‘విజయేంద్రప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేశాయి. రాజ్యసభకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు’’అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవే శ్వాసగా.. లక్షల మందికి ఆరాధ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్గడే కర్ణాటకలోని ప్రఖ్యాత ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా సేవలందిస్తూ సామాజిక సేవా రంగంలోనూ విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన డాక్టర్ వీరేంద్ర హెగ్గడేను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయన 1948 నవంబర్ 25న దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్లో జన్మించారు. తల్లిదండ్రులు రత్నమ్మ, రత్నవర్మ హెగ్గడే. వీరేంద్ర హెగ్గడేకు భార్య హేమావతి హెగ్గడే, కుమార్తె శ్రద్ధ హెగ్గడే ఉన్నారు. విద్యాభ్యాసం అనంతరం కేవలం 20 ఏళ్ల వయసులో 1968 అక్టోబర్ 24న ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా(పాలకుడు) బాధ్యతలు స్వీకరించారు. గత ఐదు దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గ్రామీణాభివృద్ధి, ప్రజల స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. రూరల్ డెవలప్మెంట్, సెల్ఫ్–ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఆర్డీఎస్ఈటీఐ)ని నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నారు. వారికి తగిన శిక్షణ అందిస్తున్నారు. అలాగే కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా శ్రీక్షేత్ర ధర్మస్థల రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద 6 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. 49 లక్షల మందికిపైగా సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా శ్రీధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్టును డాక్టర్ హెగ్గడే నెలకొల్పారు. 25కు పైగా పాఠశాలలు, కళాశాలల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తున్నారు. హెగ్గడేకు ధర్మరత్న, ధర్మభూషణ అనే పేర్లు కూడా ఉన్నాయి. లక్షలాది మందికి ఆరాధ్యుడిగా కొనసాగుతున్నారు. పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం ట్రాక్ అండ్ ఫీల్డ్లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిన అథ్లెట్ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్ గర్ల్’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్ప్రెస్’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ. ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్షిప్లలో ఎదురేలేని స్ప్రింటర్గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్ అయ్యింది. ఇళయరాజాపై అభినందనల వర్షం రాజ్యసభకు వెళ్లబోతున్న సంగీత దిగ్గజం ఇళయరాజాపై అభినందనల వర్షం కురుస్తోంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, సూపర్స్టార్ రజనీకాంత్ అభినందనలు తెలిపారు. అసాధారణ సంగీత కళాకారుడు ఇళయరాజా వివిధ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారని రాజ్భవన్ ట్వీట్ చేసింది. ప్రియమైన మిత్రుడు ఇళయరాజాకు అభినందనలు అని రజనీకాంత్ పేర్కొన్నారు. ఇళయరాజాను ప్రఖ్యాత నటుడు కమల్హాసన్ కూడా అభినందించారు. దేశాన్ని గర్వపడేలా చేశారు: అమిత్ షా ప్రముఖులు పీటీ ఉషా, ఇళయరాజా, డాక్టర్ వీరేంద్ర హెగ్గడే,విజయేంద్ర ప్రసాద్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందనలు తెలియజేశారు. అంకితభావం, నిరంతర శ్రమతో వారు దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఎగువ సభకు వెళ్లబోతున్న వారికి అభినందనలు తెలిపారు. Shri V. Vijayendra Prasad Garu is associated with the creative world for decades. His works showcase India's glorious culture and have made a mark globally. Congratulations to him for being nominated to the Rajya Sabha. — Narendra Modi (@narendramodi) July 6, 2022 Shri Veerendra Heggade Ji is at the forefront of outstanding community service. I have had the opportunity to pray at the Dharmasthala Temple and also witness the great work he is doing in health, education and culture. He will certainly enrich Parliamentary proceedings. pic.twitter.com/tMTk0BD7Vf — Narendra Modi (@narendramodi) July 6, 2022 The creative genius of @ilaiyaraaja Ji has enthralled people across generations. His works beautifully reflect many emotions. What is equally inspiring is his life journey- he rose from a humble background and achieved so much. Glad that he has been nominated to the Rajya Sabha. pic.twitter.com/VH6wedLByC — Narendra Modi (@narendramodi) July 6, 2022 The remarkable PT Usha Ji is an inspiration for every Indian. Her accomplishments in sports are widely known but equally commendable is her work to mentor budding athletes over the last several years. Congratulations to her on being nominated to the Rajya Sabha. @PTUshaOfficial pic.twitter.com/uHkXu52Bgc — Narendra Modi (@narendramodi) July 6, 2022 -
ఏదో ఏదో ఏదో వెతికే నయనం.. పాట విన్నారా?
“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మాయోన్”. ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి 'ఏదో ఏదో ఏదో.. వెతికే నయనం.. చేతికి అందేదాకా ఆగదు పయనం" అను పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'నాకు మాస్ట్రో ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ద్వారా ఆయనను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. అయన అభిమానినైన నేను అయన సంగీత సారధ్యంలో సత్య ప్రకాష్ ధర్మార్, శ్రీనిషా జయశీలన్ పాడిన "ఏదో ఏదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా ఆగదు పయనం" పాటకు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది' అన్నారు. చదవండి: ఆ వార్తలను ఖండించిన సోనాలి బింద్రె, నాకావసరం లేదు.. మిస్ ఇండియా పోటీ నుంచి వైదొలిగిన శివానీ -
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’
‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతం అందించిన 'ఎ బ్యూటిఫుల్ బ్రేకప్'మూవీ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు సిద్ధమైంది. మే 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శించబడుతోంది. 2022 అమెరికన్ రొమాంటిక్-థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన 'ఎ బ్యూటిఫుల్ బ్రేకప్' సినిమా ఇదివరకే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వం వహించారు. క్రిష్ ముద్రగడ, మటిల్డా ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్ళ అనుభవంతో ఈ సినిమాను ఎంతో ఎమోషనల్ గా తెరపైకి తీసుకు వచ్చారు. దర్శకుడిగా అతని చివరి కన్నడ చిత్రం 'వాసు నాన్ పక్కా కమర్షియల్' పెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది. -
రజనీ కాంత్తో ఇళయరాజా భేటీ.. కారణం ?
చెన్నై సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్తో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా భేటీ అయ్యారు. మంగళవారం (మే 24) ఉదయం ఇళయరాజా అనూహ్యంగా స్థానిక పోయెస్ గార్డెన్లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు. ఇద్దరూ చాలా సేపు ము చ్చటించుకున్నారు. అనంతరం ఇళయరాజా తిరిగి బయలుదేరుతుండగా ఏదైనా పనిపై వచ్చారా స్వామి..? అని రజనీకాంత్ అడగగా ఏమీ లేదు జూన్ 2వ తేదీన కోయంబత్తూరులో సంగీత కచేరీ ఉందని, దీనికి సంబంధించి తన స్టూడియోలో రిహార్సల్స్ జరుగుతున్నాయని, ఒక్కడినే వెళుతున్నట్లు చెప్పారు. దీంతో రజనీకాంత్ తానూ వస్తానంటూ కారులో ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోకు వెళ్లారు. అక్కడ కొంచెం సేపు రిహార్సల్స్ను ఎంజాయ్ చేశారు. ఇంతకీ ఇళయరాజా సడన్గా రజనీకాంత్ ఇంటికి ఎందుకు వెళ్లారు? వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేది కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. కాగా రజనీ కాంత్, ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన ఎన్నో పాటలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. చదవండి: 👇 పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు.. 11 నెలలుగా నా ఇంట్లో నా భార్యతో ఉంటున్నాడు: నటుడు -
నేను కూడా ప్రేమించాను: ఇళయరాజా
Ilaiyaraja speech at Kadhal Sei Movie Trailer Launch: తానూ ప్రేమించానని, అయితే అది పలు విధాలుగా ఉంటుందని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఈయన సంగీతాన్ని అందించిన చిత్రం కాదల్ సెయ్. ప్రభాకర్ మూవీస్ పతాకంపై ఘన వినోదన్ నిర్మించిన ఈ చిత్రానికి గణేషన్ దర్శకత్వం వహించారు. సుభాష్, స్నేహ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ సోమవారం టీ. నగర్. పెరియార్ రోడ్లోని ఇళయారాజా స్టూడియోలో జరిగింది. ఇళయరాజా, దర్శకుడు భారతీరాజా, పి. వాసు ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ. .. తానూ ప్రేమించానని, అయితే అది పలు విధాలుగా ఉంటుందన్నారు. కాదల్ సెయి చిత్రాన్ని అందరూ ఆదరించాలన్నారు. -
ఇళయరాజా రాసిన పాటకు కొడుకు యువన్ శంకర్ గానం
చెన్నై సినిమా: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా రాసి బాణీలు కట్టిన పాటను ఆయన తనయుడు, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఆలపించడం విశేషం. ఇళయరాజా సంగీతమందిస్తున్న 1, 417వ చిత్రం 'నినైవెల్లా నీయడా'. ఆదిరాజన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ చిత్రంలో ప్రాజన్, మనీషా యాదవ్ జంటగా నటిస్తున్నారు. లేఖా థియేటర్స్ పతాకంపై రాయల్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఇళయరాజా పాట రాయడం, దానికి ఆయన కుమారుడు, సంగీత దర్శకుడు అయిన యువన్ శంకర్ రాజా పాడటం ప్రత్యేక ఆకర్షణ అని డైరెక్టర్ ఆదిరాజన్ తెలిపారు. తన సినిమాకు ఇళయరాజా సంగీతమందిచాలన్నది తన చిరకాల కోరిక అని వెల్లడించారు. అది ఈ సినిమాతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. -
ఒక్క వీడియోతో రూమర్స్కు చెక్ పెట్టిన ఇళయరాజా
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రూమార్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ సెలబ్రెటీల ఆరోగ్యంపై రకరకాల పుకార్లను సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. కరోనా కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఏ సెలబ్రెటీని ఆకతాయిలు వదలడం లేదు. కొంతమంది సీనియర్ నటీనటుడు తెరపై కనిపించకపోవడంతో వారు ఆనారోగ్యం బారిన పడ్డారంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఇంకా చెప్పాంటే బతికి ఉన్న వారిని సైతం చనిపోయారంటూ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి చేదు అనుభవాన్ని మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఎదుర్కొన్నారు. ఇళయరాజా అంటే పరిచయం అక్కర్లేని పేరు. అంత్యంత ప్రముఖులైన ఆయనపైనే కొందరు పుకార్లు సృష్టించి ఫ్యాన్స్ను ఆందోళనకు గురి చేశారు. గత కొద్ది రోజులుగా ఇళయరాజా ఎక్కువగా బయటకు కనిపించడం లేదు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్ట్లు దర్శనమిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా ఆరోగ్యం విషమించింది! ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.! వెంటిలెటర్పై ఉన్నారని, చికిత్సకు స్పందించడం లేదు! అంటూ సోషల్ మీడియాలో ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు. అయితే వాటినన్నింటిని ఒక్క వీడియోతో చెక్ పెట్టారు మ్యూజిక్ మేస్ట్రో ఇళయారాజా..! ఓ వీడియో షేర్ చేస్తూ తన స్టైల్లో పాట పాడుతూ.. రెట్టింపు ఉత్తాహంతో తన అభిమానులకు న్యూ ఇయర్ విషెష్ తెలిపారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన రిలీజ్ చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, చాలా ఉత్సాహంతో ఉన్నానన్నారు. ఎలాంటి పుకార్లను నమ్మోద్దని, అభిమానులంతా ధైర్యంగా ఉండాలన్నారు. అంతే కాదు ఈ వీడియోతో తన అభిమానులను ఖుషీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్బోర్డుపై ఇళయరాజా..
Ilaiyaraaja Displayed On New York Tmies Square Billboard: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పరిచయం అవసరంలేని పేరు. ఆయన సంగీతం గురించి అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు తెలిసిందే. ఇటీవల న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డుపై ఆయన ముఖ చిత్రంతో ఉన్న బ్యానర్ను ప్రదర్శించారు. స్వరకర్త ఇళయరాజా అధికారిక ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మ్యూజికల్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన స్పూటిఫై ప్రచారంలో భాగంగా ఇలా ప్రదర్శించారు. న్యూయార్క్లో ఇసైజ్ఞాని (మ్యూజికల్ జీనియస్) ఇళయరాజా పోస్టర్ను చూసి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుల్లో ఇళయరాజా ఒకరు. ఇటీవల స్పూటీఫైతో ఆయన జతకట్టి, ప్రచారం నిర్వహిస్తున్నారు. స్పూటీఫైలో ఆయన ప్లేలిస్ట్లను ప్రమోట్ చేయడానికి 3 నిమిషాల నిడివి గల యాడ్ ఫిల్మ్లో కనిపించారు ఇళయరాజా. నవంబర్ 19న టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డుపై ఇళయరాజా బ్యానర్ ప్రదర్శించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫేస్బుక్లో ప్రకటిస్తూ 'ఈ చాలా పవిత్రమైన రోజున న్యూయార్క్లోని బిల్బోర్డ్స్ ఆఫ్ టైమ్స్ స్క్వేర్లో 'రాజా ఆఫ్ మ్యూజిక్', 'రాజా రూల్స్'' అని రాసుకొచ్చారు. ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, ఈ విజయం ఆయన కెరీర్లో ఒక మెట్టుగా అభివర్ణించారు. Our own #Isaignani at #timesquare proud us🙏🏽👍🏽 pic.twitter.com/SEd60IJEFP — venkat prabhu (@vp_offl) November 19, 2021 'ఆయన మనందరి కంటే ముందుంటారు. కుటుంబంతో కలిసి ఉండండి. ఎప్పుడు పెద్దవారు, మొదటివారు' అని కాస్ట్యూమ్ డిజైనర్ వాసుకి భాస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం విదుతాలయి, మాయన్, తుప్పరివాళన్, తమిళరసన్ చిత్రాల్లో సంగీత దర్శకుడిగా చేస్తున్నారు ఇళయరాజా. He is always way ahead from all of us...Put together in the family. Always the first and biggest.Dellighted to see #RAJAAPPA. @ilaiyaraajaoffl at the Times Square billboard. New York city. USA. @Spotify @SpotifyUSA ❤️ pic.twitter.com/gRmrfLOQdB — vasuki bhaskar (@vasukibhaskar) November 19, 2021 -
ఇళయరాజా సంగీతంలో ఉలగమై
ఇళయరాజా సంగీత సారధ్యంలో రూపొందుతున్న చిత్రం "ఉలగమై". '96' చిత్రం ఫేమ్ గౌరీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. వెట్రీ మిత్రన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో జీఎం. సుందర్, ప్రణవ్, అరుణ్మణి, కాందరాజ్, జయంతి మాల, అనిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్వీఎం ప్రొడక్షన్స్ పతాకంపై వి.మహేశ్వరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ రచయిత ఎస్.సముద్రం రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. 1970లో జరిగిన జాతి సమస్యల ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు. -
వాడిపోయిన పువ్వులా పాటలు కనుమరుగైపోతున్నాయి
Ilaiyaraaja: పాట వికసిస్తున్న పువ్వులా ఉండాలని సంగీత జ్ఞాని ఇళయరాజా పేర్కొన్నారు. మనసుకు వయసుతో పనిలేదు అనడానికి బెస్ట్ ఉదాహరణ ఈ మాస్ట్రో. ఇళయరాజా వయసు (78). మనసు మాత్రం 20 ఏళ్ల కుర్రాడిలా సంగీతంలో పరవళ్లు తొక్కుతుంది. శతాధిక చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా నేటికీ బిజీ సంగీత దర్శకుడే. ఈయన ఇటీవల టీ.నగర్లో సొంత రికార్డింగ్ థియేటర్ నిర్మించుకోవడం తెలిసిందే. గురువారం ఉదయం ఆ స్టూడి యోలో మీడియాతో ముచ్చటించారు. ఇళయరాజా సంగీతం అందించిన 16 వయదినిలే చిత్రం విడుదలై 40 వసంతాలను, ముందానై ముడిచ్చి 38 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాయి. ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. దీనిపై స్పందించిన ఆయన ఇళయరాజా పాట ఇప్పుడే వికసిస్తున్న పువ్వులా ఉండాలి. అయితే పాటలు ఒకటి, రెండు రోజుల్లోనే వాడిపోయిన పువ్వులా కనుమరుగైపోతున్నాయి. నేను రూపొందించిన 20 ఏళ్ల నాటి పాటల్ని కూడా ప్రేక్షకులు వినడానికి ఆసక్తి చూపుతున్నారంటే అవి వికసిస్తున్న పువ్వులా నిత్య నూతనంగా ఉండడమే. అదేవిధంగా నా పాటలు కొత్తదనం అనేది ఇకపై కూడా కొనసాగుతుందని ఇళయరాజా పేర్కొన్నారు. -
ఇళయరాజా స్టెప్పేస్తే...
అదేంటీ ఇళయరాజా తన ట్యూన్స్తో హీరో హీరోయిన్లతో స్టెప్పులేయిస్తారు కానీ స్టెప్పులేయడం ఏంటీ? అనుకుంటున్నారా. ఇది ఒకప్పటి సంగతి. ఆ విషయం తెలుసుకోవాలంటే చాలా వెనక్కి వెళ్లాలి. అవి ఇళయరాజా స్కూల్లో చదువుకుంటున్న రోజులు. ప్రస్తుతం ‘మేర్కు తొడర్చి మలై’ చిత్రానికి దర్శకత్వం వహించిన లెనిన్ భారతి తండ్రి, ఇళయరాజా క్లాస్మేట్స్. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఆ విషయం గురించి లెనిన్ భారతి మాట్లాడుతూ – ‘‘అప్పట్లో నెలకోసారి విద్యార్థుల సమావేశం నిర్వహించేవారు. అందులో మా నాన్న, ఇళయరాజాగారు పాల్గొనేవారు. అప్పుడు మా నాన్న పాడితే ఇళయరాజాగారు డ్యాన్స్ చేసేవారు. ఒక్కోసారి ఆయన పాడితే మా నాన్న డ్యాన్స్ చేసేవారు. పెద్దయ్యాక ఎవరి దారిని వారు సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరూ కలవలేదు కూడా. మా నాన్నకి డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యం ఉండేది. తన లక్ష్యం సాధించాక ఇళయరాజాను కలవాలనుకున్నారు. అయితే ఆయన చనిపోయారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన ‘అళగర్ సామి కుదిరై’ అనే సినిమాకి ఇళయరాజాగారు సంగీతదర్శకుడు. ఆ సమయంలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మా నాన్న టాపిక్ వచ్చింది. నేను తన క్లాస్మేట్ కొడుకునని ఇళయరాజాగారికి అప్పుడే తెలిసింది. ముందే ఎందుకు చెప్పలేదు? అన్నారాయన. ‘నేను డైరెక్టర్ అయ్యాక మిమ్మల్ని కలవాలనుకున్నాను’ అన్నాను. నవ్వారాయన. దర్శకుడిగా నా తొలి సినిమా ‘మేర్కు తొడర్చి మలై’కి ఇళయరాజాగారు సంగీతదర్శకుడు కావడం నా అదృష్టం’’ అన్నారు. గత వారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, అవార్డులు గెలుచుకుంది. -
కరుణానిధి కోసం ఇళయరాజా పాట
-
కరుణానిధి కోలుకోవాలని ఇళయరాజా పాట
చెన్నై : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన డీఎంకే అధినేత కరుణానిధి త్వరితగతిన కోలుకోవాలని సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రత్యేకంగా పాటపాడారు. తాను ఎంతగానో అభిమానించే కరుణానిధి క్షేమంగా తిరిగి రావాలని, 'లేచిరా మమ్ముల్ని చూసేందుకు..' అంటూ ఇళయరాజా పాట పాడారు. తమిళనాడు వ్యాప్తంగా ఈ పాట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు అభిమానుల పూజలు, ప్రార్థనలతో ఆళ్వార్ పేటలోని కావేరి ఆస్పత్రి పరిసరాలు మునిగిపోయాయి. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కావేరి ఆస్పత్రికి నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్టాలిన్, కనిమొళిలతో వారంతా భేటీ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కరుణ సంపూర్ణ ఆర్యోగవంతుడిగా మళ్లీ ప్రజా సేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు. ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు నేతలు పేర్కొన్నారు. తమిళనాడు సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు సోమవారం కరుణానిధిని పరామర్శించి, ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందన్నారు. కావేరి ఆస్పత్రికి పరామర్శ నిమిత్తం వచ్చిన వారిలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, మత్స్యశాఖ మంత్రి జయకుమార్ కావేరి, బీజేపీ నేతలు మురళీధరరావు, ఇలగణేషన్, తమిళిసై సౌందరరాజన్, సీపీ రాధాకృష్ణన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కార్యదర్శి డి.రాజ, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తరఫున ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, ఎండీఎంకే నేత వైగో, ద్రవిడ కళగం నేత వీరమణి, రైతు సంఘం నేత టీఆర్ పాండియన్, మదురై ఆధీనం అరుణగిరినాథర్, సినీ నటుడు సత్యరాజ్, తదితరులు ఉన్నారు. కరుణానిధి కోలుకోవాలని ఇళయరాజా పాడిన పాట -
ఇళయరాజాపై చర్యలు తీసుకోండి
తమిళనాడు ,టీ.నగర్: ఏసుక్రీస్తుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగీత దర్శకుడు ఇళయరాజాపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో మాట్లాడిన సంగీత దర్శకుడు ఇళయరాజా హఠాత్తుగా ఏసుక్రీస్తు పునరుత్థానం గురించి వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. ఏసుక్రీస్తు చనిపోయాడు, ఆ తరువాత తిరిగి లేచాడనే విశ్వాసం క్రైస్తవుల్లో ఉందని, అయితే అది వాస్తవం కాదంటూ పరిశోధనలు జరిపి యూట్యూబ్లో వేస్తున్నారంటూ ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అంతేకాకుండా వాస్తవంగా మరణించి తిరిగి లేవడం రమణ మహర్షికే చెందిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు క్రైస్తవుల్లో ఆగ్రహావేశాలు తెప్పించగా క్రైస్తవ సంఘాలు ఆందోళనలు జరిపాయి. ఇలా ఉండగా చెన్నై కమిషనర్ కార్యాలయంలో క్రైస్తవ సంఘాలు ఇళయరాజాపై ఫిర్యాదు చేశాయి. తాము ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని విశ్వసిస్తున్నామని అన్నారు. అందువల్ల ఇళయరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా ఉండగా న్యాయవాది దినేష్ చెన్నై పోలీసు కమిషనర్, కలెక్టర్, ప్రభుత్వ కార్యదర్శి, ఇళయరాజాలకు నోటీసులు పంపారు. దీంతో చెన్నై జిల్లా కలెక్టర్ పోలీసు కమిషనర్కు ఇళయరాజాపై చర్యలు తీసుకోవలసిందిగా సిఫార్సులు చేశారు. -
ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం
-
సైరాపై మరో గుసగుస
సాక్షి, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి గురించి ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ను ఎంపిక చేశారనేది దాని సారాంశం. ముందుగా ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని అధికారికంగా ప్రకటించారు. కానీ, డేట్లు సర్దుబాటు కాకపోవటంతో రెహమాన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇక తర్వాత థమన్ పేరు తెరపైకి వచ్చింది. అటుపై కీరవాణి పేరు వినిపించింది. ఇక ఇప్పుడు క్లాసిక్ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయారాజా పేరు చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం చిరు ఇళయరాజాను కలిశాడన్న ఓ వార్తే. అయితే సైరా చరిత్రకు సంబంధించిన కథ కావటంతో పాటల కన్నా ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్పైనే ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చిరు భావిస్తున్నాడంట. ఈ నేపథ్యంలో కీరవాణి వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉండొచ్చని టాక్. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సైరా.. రెండో షెడ్యూల్కు రెడీ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటిదాకా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో స్పష్టత లేకపోవటం విశేషం. ఏది ఏమైనా ఈ ఊహాగానాలకు త్వరలో నిర్మాత రామ్ చరణ్ పుల్ స్టాప్ పెట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. -
ఇళయరాజాకు పద్మవిభూషణ్
-
ఇళయరాజాకు పద్మవిభూషణ్
ఇతడి పోస్టర్స్ పెట్టుకునేవారు, పాటలు రాసుకునేవారు, పిల్లలకు ఇతని పేరు పెట్టుకునేవారు, ఇతణ్ణి ఒక్కసారి కలిసి ప్రాణం విడవాలనుకునేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు? 1977. మామ మంచి ఊపు మీద ఉన్నాడు. హార్మోనియం అందుకుని నోటి నిండా తాంబూలంతో పాట చేశాడు. అది ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అయ్యింది. కోటి రూపాయల పాట. హిట్. చక్రవర్తి కూడా తక్కువ దూకుడు మీద లేడు. మద్రాసు విజయ గార్డెన్స్లో చేతి మీద చేతి చరుపు వేసి ఒక ట్యూన్ చేశాడు. అది ‘గుడివాడ వెళ్లాను’ అయ్యింది. అదీ మోత మోగిన పాటే. ఆ సమయంలోనే తమిళం నుంచి ఒక సంగీతకారుడు తెలుగులో ఒక లాలిపాట వలే మెల్లగా దోగాడుతూ వచ్చాడు. సుశీలతో, ఏసుదాసుతో పాట చేశాడు. చిన్ని చిన్ని కన్నయ్య... కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేను... నేను మేను మరిచేను... తెర మీద కాగితాలు చించి ఎగరేసే హీరోల పాటల మధ్య ఈ పాటను తెలివైనవాళ్లు గమనించారు. పాటలను గ్రహించేవారు పరిశీలించారు. మెలోడీని ఇష్టపడేవారు ఈ పేరును తమ డైరీల్లో రాసుకున్నారు. ఇళయరాజా! కాని ఈ తమిళుడికి వెంటనే ఇక్కడ ప్రవేశం లభించలేదు. ఇంకో తమిళ రీమేక్ నుంచే అతణ్ణి తెలుగువారు వినాల్సి వచ్చింది. 1978. ‘వయసు పిలిచింది’. ‘ఇలాగే ఇలాగే సరాగ మాడితే’... అందులో శ్రీప్రియ చెప్పినట్టుగానే ఇది ‘లవ్లీ సాంగ్’. కాని మనుషుల దృష్టి మాత్రం ఇందులోని రాత్రి పాట మీద పడింది. కోరిక పాట మీద. తాపం పాట మీద. నిప్పును రగిల్చే పాట మీద. ‘మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరలా నిలిచిందిలే’. ఇప్పుడు నేల క్లాసు శ్రోత కూడా ఆ సంగీత దర్శకుని పేరు తన చేతి మీద బాల్పాయింట్ రీఫిల్తో రాసుకున్నాడు. ఇళయరాజా! అప్పటికి తెలుగు ప్రేక్షకులందరూ కంటి మీద చేతులు మూసుకొని ఈ దర్శకుని పాట వొడ్డు మీద నిలుచుని ఉన్నారు. పాదాలకు ఇసుక తగులుతోంది. కాలువ కావచ్చు. డొంక కావచ్చు. వంక కావచ్చు. ఊట కావచ్చు. దొరువు కావచ్చు. చెరువు కావచ్చు. 1981. ‘సీతాకోక చిలుక’ వచ్చింది. ‘మిన్నెటి సూరీడు వచ్చెను మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మా’.... ‘మాటే మంత్రము మనసే బంధము’... ‘సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే’... అప్పటికి అర్థమైంది. కళ్లు తెరిచారు. ఎదురుగా సముద్రం. పోటెత్తే సముద్రం. పోటు మీద ఉన్న సముద్రం. పల్లవి వెంట చరణాలుగా విరిగి పడుతున్న సముద్రం. ఈసారి మర్చిపోకుండా ఆ సంగీత దర్శకుడి పేరును అందరూ ఛాతీల మీద రాసుకున్నారు. ఇళయరాజా! తెలుగు సినిమా సంగీతానికి ఒక లలిత సంగీత స్వభావం ఉంది. ఆ మాటకొస్తే తమిళ సినీ సంగీతానికి కూడా ఒక సంప్రదాయ లలిత సంగీత స్వభావం ఉంది. ఈ సంగీత దర్శకుడు అది మార్చాడు. ఎలా మార్చాడు? పుట్టి పెరిగిన మారుమూల తమిళపల్లె పణై్ణపురంలో విన్న జానపద గీతాన్ని, సంగీతం నేర్చుకోవడానికి మద్రాసులో అభ్యసించిన పాశ్చాత్య గీతాన్ని కలిపి ఒక ఫ్యూజన్తో మార్చాడు. కీబోర్డుతో వేణువు కలిసింది. రిథమ్ బాక్స్తో వీణ పలికింది. గిటార్తో నాదస్వరం జత కట్టింది. సన్నాయి, ట్రంపెట్ ఒక జోడి. ఇలా కలిపినవాడు ఇంతకుముందు లేడు. అది వీడే. జనం పదే పదే ఆ పేరు తలిచి మురిసిపోయారు. ఇళయరాజా! తెలుగులో టేస్ట్ ఉన్న డైరెక్టర్లకు ఇళయరాజా పట్టాడు. బాపుగారు ‘మంత్రిగారి వియ్యంకుడు’ అన్నారు. ఇతను ‘ఏమనినే చెలి పాడుదును’ అని ఒక పొగమంచు స్పర్శలాంటి యుగళగీతం ఇచ్చాడు. వంశీ ‘సితార’ అన్నాడు. ఇతను ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికే’ ఒక మైనాను పలికించాడు. కాని ఇతడిని కమర్షియల్ సినిమాకు దగ్గర చేసింది మాత్రం కె.ఎస్.రామారావు, చిరంజీవి, ఏ. కోదండరామిరెడ్డి త్రయం. మొదటి సినిమా ‘అభిలాష’. ‘సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది’... ‘బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే’... రాధిక మెరుపు... చిరంజీవి ఒడుపు... ఇళయరాజా నలుపు... నలుపు నారా యణమూర్తే గదా. ఒక వైపు వీళ్ల కాంబినేషన్లోని ‘ఛాలెంజ్’, ‘రాక్షసుడు’, ‘మరణ మృదంగం’ వంటి సినిమాలు వస్తుంటే మరోవైపు వంశీ కాంబినేషన్లో ‘ఆలాపన’ , ‘ప్రేమించు పెళ్లాడు’, ‘లేడిస్ టైలర్’, ‘మహర్షి’, ‘అన్వేషణ’ లాంటి సినిమాలు ఇతని పాటల్ని తెలుగు నేల మీద ఎనిమిది మూలలకీ చేర్చాయి. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు– హిట్. ఈ చైత్రవీణ ఝమ్ఝమ్మని– హిట్. ఇతను ఫాస్ట్గా ట్యూన్ ఇస్తాడు. అయితే ఏంటోయ్? ఫాస్ట్గా రాసే పాటగాడు మన దగ్గర ఉన్నాడుగా. వేటూరి. వీళ్ల కాంబినేషన్ ‘ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది’. కె.విశ్వనాథ్ మూడు ముఖ్యమైన హిట్స్కు ఇళయరాజా ఆలంబనగా నిలిచాడు. ‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’, ‘స్వర్ణకమలం’. కె.రాఘవేంద్రరావు హిట్ కోసం డెస్పరేట్గా ఉన్నప్పుడు హిట్స్ ఇచ్చాడు. ‘ఆఖరి పోరాటం’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. వెంకటేశ్కు ‘బొబ్బిలిరాజా’తో స్టార్డమ్, ‘చంటి’తో క్లాస్ ఇమేజ్ సెటిల్ కావడానికి ఇతడి పాటలే కారణం. బాలకృష్ణ క్లాసిక్ ‘ఆదిత్య 369’లో చేసిన ‘జాణవులే నెరజాణవులే’ కలర్లో బ్లాక్ అండ్ వైట్ రోజులకు తీసుకెళ్లగలిగింది. ఇతను తెలుగు సినిమాల వల్ల మాత్రమే కాదు. గొప్ప గొప్ప తమిళ సినిమాల వల్ల కూడా తెలుగుకు వినిపిస్తూనే ఉన్నాడు. మణిరత్నం, కె.బాలచందర్, ప్రియదర్శన్, ఫాజిల్, సింగీతం శ్రీనివాసరావు... వీళ్లు తమిళంలో చేసిన సినిమాలకు తెలుగు డబ్బింగ్ పాటలను కూడా ప్రేక్షకులు సోనీ 90 కేసెట్లలో దాచుకున్నారు. సంగీతానికి ఉన్మాద స్థాయిలో అభిమానులు ఏర్పడటం పాశ్చాత్య దేశాలలో చూశాం. హిందీలో ఈ ఉన్మాద స్థాయి నౌషాద్, శంకర్–జైకిషన్వంటి వారు చూశారు. దక్షిణాదిన అంతటి ఉన్మాద అభిమానుల బ్యాంక్ను మూటగట్టుకున్నది ఇతడే. ఇతడి పోస్టర్స్ పెట్టుకునేవారు, పాటలు రాసుకునేవారు, పిల్లలకు ఇతని పేరు పెట్టుకునేవారు, ఇతణ్ణి ఒక్కసారి కలిసి ప్రాణం విడవాలనుకునేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు? ఇతని పాట తాకుతుంది. హృదయంతో తాకుతుంది. ఆత్మతో తాకుతుంది. పాట మధ్యలో ఒక వేణువు శకలం... పాట పల్లవిలో ఒక వయొలిన్ రన్... పాట అంచున ఒక తబలా ముక్తాయింపు... ఇవి ఏవో వారిని తాకి అలా స్థిరపడిపోతాయి. ఇతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినడానికి సినిమాలకు వెళ్లినవాళ్లు ఉన్నారు. ఇతని పాటలు వింటూ కారుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగే పిచ్చివాళ్లు నేటికీ ఉన్నారు. తెల్లటి లాల్చీ తెల్లటి పంచె కట్టుకున్న ఈ మనిషి తనలోని ఉన్నదంతా ఆ దేవుడినంతా ఆ తీపిని అంతా ఆ శోకం అంతా ఆ ఉల్లాసం అంతా కోస్తే వచ్చే ఆ దోరజామ సువాసన అంతా దాచుకోకుండా తల్లి తన సంతానానికి పంచినట్టు శ్రోతలను బిడ్డలనుకుని పంచిపెట్టాడు. ఆ హృదయం కోసమే వారు దాసోహమయ్యారు. కాలం మారవచ్చు. అక్కడ ఏ.ఆర్.రెహమాన్, ఇక్కడ కీరవాణి వంటి వారు అతడి స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేసి ఉండవచ్చు. కొత్తకుర్రాళ్లు వచ్చి కొత్త హార్మోనియం మెట్లను పరుస్తుండవచ్చు. కాని– సముద్రం పాటు మీద ఉన్నప్పుడు పడవను ఎందరు దాటించ గలిగినా అది సముద్రం. ‘జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక’... లేస్తుంటుంది. ‘ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా’... లేస్తూనే ఉంటుంది. ప్రభూ... నీకు పద్మవిభూషణ్ అట. ప్రభాత సమయాన నీ చెలియలికట్టపై ఈ పువ్వును ఉంచినప్పుడు నువ్వు దరహాసంతో ఏ కొత్తపాటలోకో నిమగ్నమయ్యి అదే అసలు ప్రాప్తంగా ధన్యుడివవుతావు కదూ. – ఖదీర్ -
ఇళయరాజా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
-
ఇళయరాజాతో భేదాభిప్రాయాలు లేవు
చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజాతో తనకెలాంటి బేధాభిప్రాయాలు లేవని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గాయకుడిగా 50 వసంతాలను పూర్తి చేసుకున్న ఆయన తన గోల్డెన్ జూబ్లీని పురస్కరించుకుని తన సంగీత కళాకారుల బృందంతో కలిసి విదేశాల్లో సంగీత విభావరి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంగీత కచేరిల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలను పాడకూడదని ఇళయరాజా అనూహ్యంగా నిషేధం విధించడం, అందుకు నోటీసులు పంపడం వివాదంగా మారడం, సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారడం తెలిసిందే. అయితే ఎస్పీబీ కూడా ఇకపై ఇళయరాజా పాటలను తాను పాడనని వెల్లడించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక చానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు ఇళయరాజాకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని పేర్కొన్నారు. అయితే ఆయన చర్యలు తనను చాలానే బాధించాయన్నారు. అయినా తన సంగీత కచేరిలకు ఎలాంటి బాధింపు కలగలేదని పేర్కొన్నారు. అదే విధంగా రారా.. పోరా.. అని మాట్లాడుకునేంత స్నేహమే తమదని, అలాంటిది ప్రస్తుత సమస్యను కాలమే తీర్చాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇళయరాజాతో ఫోన్లో మాట్లాడమని కొందరు హితవు పలికారన్నారు. అయితే తనకూ కొంచెం ఆత్మాభిమానం ఉందని బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. -
బాలుకు లీగల్ నోటీస్ పంపిన ఇళయరాజా
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు లీగల్ నోటీసులు పంపారన్న వార్త సంగీత అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుతం సినిమా పాటల పాడటానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించని బాలు.. ఇతర దేశాల్లో మ్యూజిక్ కన్సర్ట్లను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఇతర సంగీత దర్శకులు సారధ్యంలో ఆయన పాడిన పాటలను వేదిక మీద పాడి అభిమానులను అలరిస్తుంటారు. అయితే కొంత కాలంగా తను కంపోజ్ చేసిన పాటల రైట్స్ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న ఇళయరాజా, అంతర్జాతీయ వేదికల మీద తన అనుమతి లేకుండా, తాను కంపోజ్ చేసిన పాటలు పాడటంపై సీరియస్ అయ్యారు. అంతేకాదు కాదు ఇలాంటి ఈవెంట్లను తరుచూ నిర్వహిస్తున్న ఎస్ బి బాలసుబ్రమణ్యంతో పాటు గాయని చిత్ర, ఎస్ పి కుమార్ చరణ్లకు లీగల్ నోటీసుల పంపిచారు. ఇక మీదట తన అనుమతి లేకుండా తన పాటలను ప్రదర్శనలలో ఆలపిస్తే చట్టపరమైన చర్యలు కుంటామని తెలిపారు. తనకు లీగల్ నోటీసులు వచ్చిన విషయాన్ని బాలు ధృవీకరించారు. ఇటీవల టొరంటో, రష్యా, దుబాయ్లలో జరిగిన పలు వేడుకల్లో తాను ఇళయరాజా గీతాలను ఆలపించానని కానీ అమెరికాలో చేసే కన్సర్ట్కు మాత్రమే రాజా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం కావటం లేదన్నారు. అదే సమయంలో తన ట్రూప్ లోని ఇతర గాయకులకు ఇకపై ఇళయారాజా గీతాలను స్టేజ్ పై పర్ఫామ్ చేయవద్దని సూచించినట్టుగా తెలిపారు. -
బాలుకు లీగల్ నోటీస్ పంపిన ఇళయరాజా
-
ఇళయరాజాకు ఘన సత్కారం
నేనెప్పటికీ ఇళయరాజానే అందులో ఏమార్పూ ఉండదు అంటున్నారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజ. ఈ సంగీత మాంత్రికుడిని ఇప్పటికే పలు అవార్డులు వరించాయి. తాజాగా తరైతప్పట్టై చిత్రంతో వెయి చిత్రాలకు సంగీతా న్ని అందించి అసాధారణ రికార్డును సాధించి ఘన సత్కారాన్ని అందుకున్నారు. ప్రఖ్యాత నటుడు అమితాబ్బచ్చన్, ధనుష్, అక్షరహాసన్ జంటగా నటించిన హిందీ చిత్రం షమితాబ్కు సంగీతాన్ని అందించారు. వెయ్యి చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమితాబ్ బచ్చన్ మంగళవారం ముంబయిలో ఇళయరాజాను ఘనంగా సత్కరించారు. షమితాబ్ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఈ అభినందన వేడుకకు వేదికైంది. బుధవారం చెన్నైకి తిరిగి వచ్చిన ఇళయరాజా చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో ముచ్చటిస్తూ తనకు తెలియకుండానే బాలీవుడ్ బిగ్బి ముంబయిలో అభినందన సభ ఏర్పాటు చేశారని తెలిపారు. వేదికపైన తనకంటే ముందే రజనీకాంత్, కమలహాసన్ లాంటి ప్రఖ్యాత నటులు ఆశీస్సులైవున్నారని తెలిపారు. వాళ్లంతా తనను ప్రశంసిస్తూ మాట్లాడడం సంతోషం కలిగించిందన్నారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇళయరాజా ఇలా బదులిచ్చారు. ప్రశ్న: నేటి తరం సంగీత దర్శకులు చాలామంది రాత్రి 11 గంటలకు సంగీతాన్నిఅందిస్తున్నారు. ఇకపై మీరు ఈ తరహా బాణిని అవలంభిస్తారా? జవాబు: నేనెప్పుడూ ఇళయరాజానే. నాలో ఎలాంటి మార్పు ఉండదు. నాకంటూ కొందరు నిర్మాతలు ఉన్నారు. ఇంతకుముందు ఎలాగైతే వేకువజామును నాలుగు లేక ఐదుగంటలకు సంగీతాన్ని మొదలెట్టే వాడినో ఇకపై కూడా తన దినచర్య అలానే కొనసాగుతుంది. -
ఆస్కార్ అవార్డుకు ప్రయత్నించలేదు
ఆస్కార్ అవార్డు కోసం తానెప్పుడూ ప్రయత్నించలేదని సంగీతజ్ఞాని ఇళయరాజా పేర్కొన్నారు. శనివారం ఈ రోడ్లో నెలకొల్పిన గ్రంథాలయ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఇళయరాజా మాట్లాడుతూ తాను సంగీత దర్శకుడవ్వాలని చెన్నైకి బయలుదేరినప్పుడు ఒక ఆర్మోనియా పెట్టెతో వచ్చానని గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పుడున్నవారు అలా రావలసిన అవసరం లేదన్నారు. అంతా కంప్యూటర్మయం అయ్యిందని అన్నారు. ఇప్పుడు పాటకు సొంతంగా ఆలోచించి ట్యూన్ కట్టాల్సిన అవసరం లేదని కంప్యూటర్లో పొందుపరచిన శబ్దాలను తీసుకుని సమకూర్చుకుని ట్యూన్స్ కడితే మీరు తలాడిస్తారని చురకలేశారు. మరో విషయం ఏమిటంటే సినిమా పాటలు రాయడానికి ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లు రచయితలు చెప్పుకుంటున్నారని, నిజానికి ప్రసవ వేదన ఏమిటన్నది కన్నతల్లులకే తెలుసని పాటలురాయడం అనే సులభమైన, సాధారణమైన విషయాన్ని ప్రసవ వేదనతో పోల్చడం సరి కాదని ఇళయరాజా పేర్కొన్నారు. ఈతరం గీత రచయితలు పాటల్లో తన సొంత రచన అధికంగా ఉంటుందని ఈ విషయాన్ని ఈ వేదికపై బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. అయితే ఆ రచయితలెవరన్నది మాత్రం వెల్లడించడం ఇష్టం లేదన్నారు. తన సంగీతాన్ని వింటున్నప్పుడు కలిగే ప్రశాంతత, ఆనందం పుస్తకాల పఠనంలోనూ లభిస్తుందన్నారు. తాను ఆస్కార్ అవార్డుల కోసంప్రయత్నించలేదని తెలిపారు. తన సంగీతానికి గురువులు ప్రేక్షకులేనని అన్నారు. ఏ కాలంలో అయినా సప్త స్వరాలను మీటి సంగీతాన్ని రూపొందించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. వ్యాపార రంగంగా మారడం వలనే తాను సంగీత పాఠశాలను నెలకొల్పలేదని వివరించారు. దేన్నీ విజయంగా భావించరాదన్నారు. అలా భావిస్తే ఒక చట్రంలోకి నెట్టబడుతారని ఇళయరాజా తన మనోభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: ఒక్కటే ఆశ అందుకో శ్వాస అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశా (2) అతడు: చుక్కనే చూశా లెక్కలే వేశా నింగిపై అంగలే వేశా కిందికే దించేశా (2) ఆ: ఒక్కటే ఆశ... అ: అందుకో శ్వాసా... చరణం : 1 ఆ: మెత్తగా ఒళ్లో పెట్టుకో కాళ్లు ఉందిగా అంకపీఠం ఆడపుట్టుకే అందుకోసం అ: గట్టిగా పట్టుకో భక్తిగా అద్దుకో పుచ్చుకో పాదతీర్థం పాదపూజలే అది పాఠం ఆ: చాకిరీ చెయ్యనా బానిసై నీ సేవలే చెయ్యనా పాదుషా అ: దీవెనే తీసుకో బాలికా నీ జీవితం సార్థకం పొమ్మిక ఆ: మొక్కులే తీరి అక్కునే చేరి దక్కెనే సౌభాగ్యం అ: చుక్కనే చూశా లెక్కలే వేశా నింగిపై అంగలే వేశా కిందికే దించేశా ఆ: అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశా ఆ: ఒక్కటే ఆశ... అ: అందుకో శ్వాస... చరణం : 2 ఇద్దరు: తాతారరు తారరు తాతారరు తారూ తాతరరు తారరు తాతారరు తారూ తారా తారారా తారారా తారరారా అ: నచ్చనే నారీ వచ్చెనే కోరీ తెచ్చెనే ప్రేమ సౌఖ్యం సాటిలేనిదీ ఇంతి సఖ్యం ఆ: మెచ్చెనే చేరీ ముచ్చటే తీరీ ఇచ్చెనే ప్రేమరాజ్యం అంతులేనిదే సంతోషం అ: స్వప్నమే సత్యమై వచ్చెనేమో వెచ్చగా సర్వము పంచగా ఆ: స్వర్గమే స్వంతమై దక్కెనేమో అచ్చటా ముచ్చటా తీర్చగా అ: మక్కువే మీరి ముద్దులే కోరి అందెనా ఇంద్రభోగం ॥ చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991) రచన : సిరివెన్నెల సంగీతం : ఇళయరాజా గానం : మనో, కె.ఎస్.చిత్ర నిర్వహణ: నాగేశ్ -
రిలేషణం: మమ్మల్ని అన్లక్కీ బ్యాచ్ అనేవాళ్లు
దక్షిణాది సినిమా సంగీత ప్రపంచంలో మేరునగధీరుడు ఇళయరాజా. సినిమా పాటపై ఆయన సంతకం ప్రత్యేకమైనది. 37ఏళ్లుగా అవిశ్రాంతంగా స్వరాలందిస్తున్న ఇళయరాజా ఈ జనరేషన్కీ ఫేవరెట్ మ్యూజిక్ డెరైక్టరే. ఆయన తమ్ముడైన గంగై అమరన్ మంచి రచయిత, స్వరకర్త, దర్శకుడు. తెలుగులో ‘స్వరకల్పన’ చిత్రానికి సంగీతదర్శకత్వం చేసిన గంగై అమరన్ తన అన్నయ్య గురించి చెప్పిన కబుర్లు... మేం నలుగురు అన్నదమ్ములం. ఇద్దరు అక్కలు. నేను చిన్నవాణ్ణి. పెద్దన్నయ్య పావలర్ వరదరాజన్, రెండో అన్నయ్య ఆర్డీ భాస్కర్, మూడో అన్నయ్య ఇళయరాజా. నేను రాజా అన్నయ్యకన్నా ఐదేళ్లు చిన్న. తమిళనాడు మధురై జిల్లాలోని పణ్ణైపురం మా సొంతఊరు. మా వరదరాజన్ అన్నయ్య కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తి. రాజకీయ సభల్లో ప్రచార గీతాలు ఆలపించేవారు. ఆయన పాటలంటే చాలు జనాలు విపరీతంగా గుమిగూడేవారు. ఆయన ప్రభావంతోనే రాజా అన్నయ్యలో, నాలో సంగీతం పట్ల మక్కువ, మమకారం మొదలయ్యాయి. అప్పట్లో నేను పాటలు రాసేవాణ్ణి. ఆ పాటకు రాజా అన్నయ్య బాణీ కట్టేవారు. వేదికలపై ఆ పాటలు పాడేవాళ్లం. చిన్న వయసులో అందరు అన్నదమ్ములూ ఎలా ఉండేవాళ్లో మేమూ అంతే. కానీ ఆటలు తక్కువ. పాటలతోనే జీవితం సాగింది. ఇక, సినిమాల్లో ప్రయత్నిస్తే బాగుంటుందని భాస్కర్ అన్నయ్య, రాజా అన్నయ్య చెన్నయ్ రెలైక్కారు. నేను మాత్రం మా ఊళ్లోనే ఉండిపోయాను. తర్వాత... నేనూ చెన్నయ్ వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. చెన్నయ్లోని మైలాపూర్లో ఒక అద్దె ఇల్లు తీసుకున్నారు మా అన్నయ్యలు. హోటల్ ఖర్చులు భరించలేని నేపథ్యంలో వాళ్లకి వండిపెట్టడానికి నేను చెన్నయ్ వెళ్లాను. నాకు తెలిసిన వంటలేవో చేసేవాణ్ణి. దాంతో పాటు పాటలు కూడా రాసుకునేవాణ్ణి. ముగ్గురం అవకాశాల కోసం ఎక్కని మెట్టు లేదు. లాభం లేదని నిరుత్సాహపడుతున్న సమయంలో ఓ చాన్స్ వచ్చేది. దానికి మధ్యలోనే బ్రేక్ పడేది. అలాంటివి బోల్డన్ని జరిగాయి. దాంతో మా మీద ‘అన్లక్కీ బ్యాచ్’ అనే ముద్ర వేశారు. పైగా ఎమ్మెస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్లాంటి సంగీతదర్శకులు ఏలుతున్న రోజులు కావడంతో కొత్తవాళ్లని తీసుకోవడానికి నిర్మాతలు పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు. ఇలా మేం ముగ్గురం మద్రాసులో అవకాశాల కోసం కష్టపడుతున్న విషయం తెలుసుకుని మా అమ్మగారు చిన్నత్తాయమ్మాళ్ కూడా వచ్చేశారు. నా చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. అప్పట్నుంచీ తల్లీతండ్రీ అన్నీ తానై మా అమ్మ మమ్మల్ని పెంచింది. ఆత్మవిశ్వాసమే రాజా అన్నయ్య ఆయుధం అనిపిస్తుంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా పట్టించుకునేవారు కాదు. చివరికి ఆయన స్నేహితుడు ఆర్. సెల్వరాజ్ ద్వారా నిర్మాత పంజు అరుణాచలంతో మాకు పరిచయం ఏర్పడింది. ‘అణ్ణక్కిళి’ అనే చిత్రానికి అవకాశం ఇచ్చారు అరుణాచలంగారు. నేను పాటలు రాసిన తర్వాత రాజా అన్నయ్య బాణీలు సమకూర్చేవారు. ఆ సినిమా విజయం సాధించడంతో మా దశ తిరిగింది. ఆ తర్వాత మా విజయవంతమైన ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. పాటలపై మమకారం ఏర్పడటానికి కారణమైన మా అన్నయ్య వరదరాజన్ మా వైభవాన్ని చూడలేదనే కొరత ఉంది. అలాగే మా భాస్కర్ అన్నయ్యని కూడా ఆ దేవుడు త్వరగానే తీసుకెళ్లిపోవడం ఎప్పటికీ బాధగా ఉంటుంది. సంగీత దర్శకుడైన తర్వాత ఒక పద్ధతి ప్రకారం మ్యూజిక్ నేర్చుకుంటే బాగుంటుంది కదా అని రాజా అన్నయ్య శిక్షణ తీసుకున్నారు. నేనెక్కడా సంగీతం నేర్చుకోలేదు. దానికి కారణం మా అన్నయ్య నేర్చుకుంటే నేనూ నేర్చుకున్నట్లే కదా. పాటలు రాయడంతో పాటు 200 సినిమాలకు నేనూ సంగీతం సమకూర్చాను. అన్నయ్య స్థాయికి కాకపోయినా, ఆ అన్నకు తమ్ముడిగా నేనూ ప్రతిభావంతుణ్ణే అనిపించుకోవడం ఆనందంగా ఉంది. ఒక్కోసారి మనవళ్లు, మనవరాళ్ల పేర్లయినా అన్నయ్యకు తెలుసా? అనిపించేది. సంగీతం తప్ప అన్నయ్యకు మరో ప్రపంచం తెలియదు. అయితే ఇప్పుడు ఫర్వాలేదు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మామూలుగా రాజా అన్నయ్య చాలా తక్కువ మాట్లాడతారు. ఎవరి దగ్గర్నుంచీ ప్రశంసలు ఎదురు చూడరు. నిరాడంబరంగా ఉంటారు. నేనేదైనా గొప్పగా చేసినప్పుడు ప్రశంసించరు. ఆయన మౌనమే ప్రశంసలు కింద లెక్క. తప్పు చేస్తే మాత్రం తిడతారు. అందుకే కనీసం తిట్టడం కోసమైనా మనతో మాట్లాడుతున్నారు కదా ఆనందపడిపోతుంటాను. అలా రాజా అన్నయ్య నాకు అక్షింతలు వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ అక్షింతలే నాకు ఆశీర్వాదాలు. - డి.జి. భవాని -
ఆయన బలవంతం మీదే పాటలు ప్రాక్టీస్ చేసేవాణ్ణి
‘‘నేను 20 మంది వరకూ సంగీత దర్శకుల దగ్గర శిష్యరికం చేశాను. అయితే నా జీవితాన్ని మలుపు తిప్పిన గురువులంటే మాత్రం నలుగురి పేరు ప్రధానంగా చెప్పుకోవాలి. వాళ్లల్లో అగ్రతాంబూలం ఇవ్వాల్సింది. రమేశ్ మాస్టారికి. ఆయన అంధుడు. కానీ సంగీత సరస్వతీ పుత్రుడు. ఆయన సమక్షం... ఏదో రాగాల ఖజానాలా అనిపించేది. చిన్నప్పుడే నాలో సంగీతం పట్ల ఓ ఆపేక్షను తీసుకొచ్చింది ఆయనే. కర్ణాటక సంగీతం గురించి, రాగాల గురించి నాకెంతో విశ్లేషించి చెప్పారు. నా శ్రద్ధ, తపన చూసి మిగతా వాళ్ల కన్నా నాతోనే ఎక్కువ ప్రాక్టీస్ చేయించేవారు. మాండలిన్, హార్మోనియంతో రాగాలు వాయిస్తూ పాటలు పాడమనేవారు. నాకేమో పాటలు పాడడం అంతగా ఆసక్తి ఉండేది కాదు. అయినా కూడా ఆయన బలవంతంగా నన్ను పాడుతూ ప్రాక్టీస్ చేయమనేవారు. ఆ ప్రక్రియే ఇప్పుడు నాకు తిండి పెడుతోంది. ఆయన శిక్షణ వల్లనే నేను ట్యూన్స్ పాడగలుగుతున్నాను. అందుకే జీవితాంతం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాను. అయితే బాధ కలిగించే విషయం ఏమంటే - నా ఎదుగుదల చూడకుండానే ఆయన కాల ధర్మం చెందారు. ఇక నా మరో గురువు జాకబ్ జాన్. సీనియర్ మ్యుజీషియన్. ఆయన దగ్గర వెస్ట్రన్, క్లాసికల్ నేర్చుకున్నాను. నా మూడో గురువు మా నాన్నగారైన వైఎన్ శర్మగారు. నా సంగీత ప్రయాణంలో ఆయన స్ఫూర్తి ఎంతో ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఇళయరాజాగారు. ఆయనకు నేను ఏకలవ్య శిష్ణుణ్ణి’’. - మణిశర్మ