breaking news
Football Fans
-
మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు..
కొద్ది రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హాలండ్ – జపాన్ మధ్య ‘ఫుట్బాల్ మ్యాచ్’ జరిగింది. వందలాది జపానీయ అభిమానులు, జపాన్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళి ఆ ఆటను చూచి, అనందించి, తిరిగి వెళ్ళారు. ఆట 2–2 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. అసలు విశేషం ఆట ముగిసిన తరవాత జరిగింది.జపాన్ నుంచి వచ్చిన అభిమానులందరూ కలిసి, స్టేడియంలో వాళ్ళు కూర్చొన్న భాగాన్ని ఊడ్చి, తుడిచి, అద్దంలా శుభ్రం చేసి, పోగయిన చెత్తను సంచీలలో తీసుకువెళ్ళి కుప్పతొట్లలో పోసి వెళ్ళారు. ‘ఎక్కడికయినా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, అక్కడ మా వల్ల పోగయిన చెత్తను మేమే శుభ్రం చేసివెళ్ళటం మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు’ అన్నారట.ఈ చర్యతో వాళ్ళు మనకు మన సనాతన సంప్రదాయం బోధించే రెండు ముఖ్య ధర్మాలను ఆచరించి చూపిన ట్టయింది. మొదటిది ‘ఆత్మవత్ సర్వభూతాని’ – అన్ని ప్రాణులూ మన లాంటివే అన్న ధర్మం. కనక, మన వలన ఇతరులకు కష్టం కలగకూడదు. రెండు, అశుభ్రమైన పరిసరాలలో ఏ పనీ సమర్థంగా, తృప్తికరంగా జరపలేం, కార్యసాధనకు ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతకు శుచి శుభ్రతలు దోహదం చేస్తాయి. లౌకికమైన పనుల విషయంలోనూ, ఆధ్యాత్మిక సాధనల విషయాల్లోనూ అన్ని చోట్లా ఇది వర్తిస్తుంది.యోగ శాస్త్రం చెప్పే యమ, నియమాలలో ప్రప్రథమ నియమం ‘శౌచం’. ‘శౌచం దైవీ గుణం, దాన్ని ఆచరించు; అశౌచం ఆసురీ గుణం, దాన్ని ఆచరించకు’ అని భగవద్గీత బోధిస్తుంది. ముఖ్యంగా పూజా, ధ్యానాది సాధనలలో పరిసరశుద్ధీ, ద్రవ్యశుద్ద్ధీ, శరీరశుద్ధీ మొదలైనవి చిత్తశుద్ధికీ, చిత్త ఏకాగ్రతకూ తోడ్పడతాయి అని పెద్దలు పదే పదే సూచిస్తూ ఉంటారు. జపాను అభిమానులు క్రీడాంగణ శుభ్రత పట్ల చూపిన నిబద్ధతను, ఆస్తిక గణాలు విద్యాలయాలూ, వీధులూ ఇత్యాది బహిరంగ ప్రదేశాలలోనూ, పుణ్యక్షేత్రాలూ, తీర్థాల లాంటి పవిత్ర ప్రదేశాలలోనూ చూపగలిగితే ఫలితాలు మహత్తరంగా ఉంటాయి. – ఎం. మారుతి శాస్త్రి -
ఫిఫా తెచ్చిన తంటా.. ఆ బీర్లకు నోస్టాక్ బోర్డు!
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ నడుస్తోంది. 48 దేశాలు పాల్గొంటున్న ఫిఫాను ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా తిలకిస్తోంది. ఫుట్బాల్ ఆటలో గోల్స్ వర్షంలో తడిసి ముద్దవుతున్న అభిమానులు ఆ సంతోషంలో లెక్కకు మించి కేసులకు కేసుల బీర్లు తాగేస్తున్నారు. స్కాట్లాండ్ 28 ఏళ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు టోర్నీలో హైతీతో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ జట్టు 1-0తో గెలిచింది. అసలే ప్రపంచకప్కు అర్హత సాధించామన్న సంతోషాన్ని ఈ విజయం ఆ దేశ అభిమానుల్లో జోష్ను రెట్టింపు చేసింది. దీంతో స్కాట్లాండ్ అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ముఖ్యంగా పదివేల మంది స్కాట్లాండ్ మద్దతుదారులతో ఏర్పడిన ‘టార్జాన్ ఆర్మీ’ మసాచుసెట్స్ నగరానికి తరలివచ్చింది. విజయం ఇచ్చిన కిక్తో బోస్టన్ వీధుల్లో ఉన్న అనేక బార్లలో ఉన్న ‘బోస్టన్ లాగర్’ బీర్లను తాగేశారు. బోస్టన్ లాగర్ బీర్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం నాలుగు రోజుల్లోనే 4వేల పింట్లు ఖాళీ అయినట్లు తెలిపింది. ఒక దశలో బీర్లకు డిమాండ్ పెరిగిపోవడంతో కంపెనీ అనేక అత్యవసర డెలివరీలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడని వ్యాపారం కేవలం నాలుగు రోజుల్లోనే తాము చూశామని, డిమాండ్కు తగినట్లు సరఫరా చేయడానికి మాకు కష్టమైనప్పటికీ ఆ టార్గెట్ను రీచ్ అయ్యామని బార్ నిర్వాహకుల్లో ఒకరు తెలిపారు. అయితే టార్జాన్ ఆర్మీ దెబ్బకు కొన్ని బార్లలో బోస్టన్ లాగర్ బీర్లకు సంబంధించి నోస్టాక్ బోర్డులు కనిపించడం విశేషం. ఇక టార్జాన్ ఆర్మీ పేరిట బోస్టన్లో అడుగుపెట్టిన స్కాట్లాండ్ అభిమానుల బృందం బ్యాగ్పైప్ గ్రూప్ సహకారంతో నగరంలో ఫ్యాన్ మార్చ్ నిర్వహించి, ఆ తర్వాత బోస్టన్ రెడ్సాక్స్లోని పెన్వై పార్క్కు చేరుకొని అక్కడ స్కాట్లాండ్ థీమ్తో కూడిన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. గ్రూప్-సిలో ఉన్న స్కాట్లాండ్ తమ తర్వాతి మ్యాచ్ను శనివారం మొరాకొతో ఆడనుంది.The Scotland fans are not letting the rain in Boston stop the party ! pic.twitter.com/ZqSXls8gmb— LIMBZ (@LimbzHQ) June 19, 2026The Tartan Army is at Fenway Park tonight! 🏴(via @MLB)pic.twitter.com/qDWiqelBYh— FOX Sports: MLB (@MLBONFOX) June 15, 2026 -
రేపు అర్జెంటీనా మ్యాచ్.. కేరళలో మెస్సీ మేనియా!
ఫిఫా ప్రపంచకప్-2026లో బుధవారం డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ను ఆడనుంది. గ్రూప్-ఐలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్లో అల్జీరియాతో తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రేపు ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. మెస్సీ ఆఖరి ఫిఫా అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతడి ఆట కోసం ప్రపంచం మొత్తం వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. భారత్లో కూడా మెస్సీకి వీరాభిమానులు ఉన్నారు. కేరళలో మెస్సీ అంటే పడిచచ్చిపోయేవాళ్లు లెక్కలేనంత మంది ఉంటారు. అసలే ఫిఫా ప్రపంచకప్, ఆపై డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో అర్జెంటీనా బరిలోకి దిగుతుండడంతో కేరళలో ఫిఫా కళ వచ్చేసింది. ముఖ్యంగా కేరళలోని పుల్లవూర్ గ్రామంలో మెస్సీ మేనియా మాములుగా లేదు. ఆ ఊర్లో ఎక్కడ చూసినా ఫుట్బాల్ ఆటగాళ్ల కటౌట్లే కనిపిస్తాయి. ఇక్కడ మెస్సీ అభిమానులే కాదు రొనాల్డో, నెయ్మర్, ఎంబాపె, సాలా, లామినే యమాల్ వంటి ఆటగాళ్లకు కూడా విపరీతమైన ఆదరణ ఉంది. అక్కడి ఇళ్లకు కూడా ప్రజలు తమకిష్టమైన జట్ల రంగులను పెయింటింగ్ వేసుకోవడం విశేషం. ఇక రేపు అర్జెంటీనా మ్యాచ్ ఉండడంతో ఆ జట్టు అభిమానులు పుల్లవూరు గ్రామంలో ఉన్న నది మధ్యలో ప్లోటింగ్ బోర్డుపై అర్జెంటీనా జట్టు మొత్తాన్ని కటౌట్ల రూపంలో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మొత్తం మీద ఫిఫా ప్రపంచకప్ మేనియా ఇప్పుడు భారత్లో కూడా టాప్ గేర్కు చేరుకున్నట్లయింది. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్ను షూటౌట్లో ఓడించి మూడోసారి ఫిఫా టైటిల్ను కైవసం చేసుకుంది.Frome Viral Kerala #Argentina pic.twitter.com/PLUUUWK9Fc— FIFAHighlightsTV (@Worldcupcatcher) June 13, 2026అసలు సమరం మొదలు..మరో విషయమేంటంటే.. బుధవారం ఒక్కరోజే ముగ్గురు బిగ్స్టార్స్ మ్యాచ్లు ఆడనుండడంతో ఫిఫాలో అసలు సమరం మొదలుకానుంది. బుధవారం తెల్లవారుజామున ఫ్రాన్స్, సెనెగల్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత ఉదయం 6.30 గంటలకు మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా అల్జీరియాతో తలపడనుంది. ఇక అదే రోజు రాత్రి 10.30 గంటలకు పోర్చుగల్ కాంగో రిపబ్లిక్తో తలపడనుంది. ఇలా త్రిమూర్తులు ఒకేరోజు మ్యాచ్ ఆడనుండడంతో అభిమానుల్లో ఎనలేని జోష్ వచ్చింది.చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్! -
'మా టికెట్లు ఇచ్చేయండి'.. అభిమానులకు ఫిఫా అభ్యర్థన!
మరో వారం రోజుల్లో ఫిఫా వరల్డ్కప్కు తెరలేవనుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు కొనసాగనున్న టోర్నీలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్లకు సంబంధించి చాలా టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. అయితే వెబ్సైట్ పొరపాటు వల్ల చిన్న తప్పిదం జరిగిపోయింది. వెబ్సైట్లో తప్పిదం కారణంగా సుమారు 60 మంది అభిమానులు ఉచితంగా టికెట్లు పొందారు. అయితే వీటికి అభిమానులు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో ఫిఫా నిర్వాహకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వెబ్సైట్ లోపం వల్ల ఇలా జరిగిందని నిర్థారణకు వచ్చిన ఫిఫా ఆ 60 టికెట్లను వెనక్కి ఇచ్చేయాలని, వాటి స్థానంలో కొత్త టికెట్లు జారీ చేస్తామని అభిమానులను అభ్యర్థించింది. ఉచితంగా వస్తే వదలకూడదన్న సామెతను ఒంటబట్టించుకున్న అభిమానులు ఫిఫా అభ్యర్థనను పట్టించుకోలేదు. దీంతో ఫిఫా ఉన్నపళంగా ఆ టికెట్లను రద్దు చేసింది. అయితే తమ తప్పిదం వల్లే ఇలాంటి పొరపాటు జరగడంతో అసౌకర్యానికి చింతిస్తున్నామని ఫిఫా తెలిపింది. అయితే టికెట్లు రద్దు చేయాలని ముందు నిర్ణయించినప్పటికీ ఫ్యాన్స్ స్పందించడంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే తమకు వచ్చిన టికెట్లకు ఉన్న ధర మొత్తాన్ని చెల్లిస్తే హ్యాపీగా మ్యాచ్ చూసుకోవచ్చని తెలిపింది. అయితే ప్రపంచకప్ మ్యాచ్లకు సంబంధించి టికెట్లన్నీ అమ్ముడయ్యాయంటూ ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో మూడు నెలల క్రితమే ప్రకటించడం గమనార్హం. ఇక జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా డిపెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగనుంది.చదవండి: బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెటర్.. భారత జట్టులోకి స్వాగతం! -
సాకర్ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్!
మరో రెండు నెలల్లో సాకర్ మహాసంగ్రామం మొదలుకానుంది. జూన్ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్ ప్రారంభం కానుండడంతో టోర్నీకి సంబంధించి పాల్గొనబోయే జట్లు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఇప్పటికే ఫిఫా సమాఖ్య విడుదల చేసింది. అయితే ఫుట్బాల్ ఆటను మైదానంలో వీక్షిస్తే వచ్చే మజానే వేరు. 90 నిమిషాల్లో ముగిసిపోయే మ్యాచ్ చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుం టారు. సాకర్ ఫీవర్ ఉన్నన్నాళ్లు స్టేడియాలన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడం ఖాయం. కానీ 2026 ఫిఫా ప్రపంచకప్కు సంబంధించి టికెట్ల ధరల విషయం మాత్రం ఒక ఆందోళన కలిగిస్తోంది. ఈసారి టికెట్ రేట్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సాధారణ అభిమానులకు మ్యాచ్ వీక్షించడం సాధ్యమయ్యేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది ప్రపంచ కప్ టికెట్ల ధరలను ఫిఫా భారీగా పెంచేసింది. ఇప్పటికే ఉన్న కేటగిరీలకు తోడు కొత్తగా ‘ఫ్రంట్ కేటగిరీ’ పేరుతో మరింత ఖరీదైన టిక్కెట్లను ప్రవేశపెట్టింది. దీంతో మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ అభిమానులకు ఖరీదైన వ్యవహారంగా మారనుంది. జూన్ 12న అమెరికాలోని ఇంగిల్వుడ్లో జరిగే అమెరికా ఆరంభ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముందువరుసలోని ‘ఫ్రంట్ కేటగిరీ’ ఒక టికెట్ ధర 4,105 డాలర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.3.4 లక్షలు . గతంలో ఇదే కేటగిరీ గరిష్ట ధర 2,735 డాలర్లు (సుమారు రూ.2.25 లక్షలు)గా ఉండేది. ఇప్పుడు కొత్త కేటగిరీలతో ధరలు మరింత పెరిగాయి.అదేవిధంగా, ఫీఫా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఫ్రంట్ కేటగిరీ 2’టికెట్ల ధరలు 1,940 నుంచి 2,330 డాలర్ల వరకు ఉన్నాయి. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1.6 లక్షల నుంచి రూ.1.9 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కెనడా ఆరంభ మ్యాచ్కు కూడా ఫ్రంట్ కేటగిరీ ఒక టికెట్ ధర 3,360 (సుమారు రూ.2.8 లక్షలు)గా నిర్ణయించారు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్కు కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఫిలడెల్ఫియాలో జరిగే మ్యాచ్కు టికెట్ ధర 905 డాలర్లు (సుమారు రూ.75,000)గా ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే, టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.న్యూజెర్సీలోని మెట్అఫ్ స్టేడియంలో జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్ గరిష్ట ధర 10,990 డాలర్లుగా నిర్ణయించగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.9 లక్షలకు పైగా ఉంటుంది. డిసెంబర్ లో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లు (సుమారు రూ.7.20 లక్షలు)గా ఉండేది. అదే విధంగా, కేటగిరీ 2 టికెట్లు 5,575 నుంచి 7,380 డాలర్లు (రూ.4.6 లక్షలు – రూ.6.1 లక్షలు), కేటగిరీ 3 టికెట్లు 4,185 నుంచి 5,785 డాలర్లు (రూ.3.5 లక్షలు - రూ.4.8 లక్షలు) వరకు పెరిగాయి. మొత్తం మీద యుద్ధం ప్రభావం, ఆర్థిక అనిశ్చితి ఫిఫా ప్రపంచకప్ టికెట్ ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రీమియం అనుభవం పేరుతో ఫిఫా కొత్త కేటగిరీలను తీసుకువచ్చినప్పటికీ, సాధారణ అభిమానులకు మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడం కష్టతరంగా మారింది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: ‘అడ్డుగోడలా నిలబడితే విజయం ఎలా వస్తుంది?’ -
ఫ్యాన్స్కు షాక్.. ఒక్కో టిక్కెట్ ధర రూ. 10 లక్షలు!
అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఫిఫా ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ ఫుట్బాల్ ప్రపంచకప్లో మొత్తం 48 జట్లు పాల్గొనున్నాయి. కాగా ఈ మెగా ఈవెంట్కు సంబంధించిన టికెట్ ధరలు టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.లాస్ట్-మినిట్ సేల్స్ ఫేజ్ పేరిట టికెట్ల విక్రయాలు బుధవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఫైనల్ మ్యాచ్ టాప్ కేటగిరీ టికెట్ ధరను ఫిఫా ఏకంగా 10,990 డాలర్లకు (సుమారురూ.9.16 లక్షలు) పెంచింది. గత డిసెంబర్లో టోర్నమెంట్ డ్రా సమయంలో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లుగా ఉండేది. మెక్సికో సిటీలో జరిగే ప్రారంభ మ్యాచ్ టికెట్ ధర 2,355 డాలర్ల నుండి 2,985 డాలర్లకు పెరిగింది. కాగా ఫిఫా ఈసారి 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేస్తోంది. అంటే డిమాండ్ను బట్టి టికెట్ ధరలు మారుతూ ఉంటాయి. ఇదే విధానం విమానం టికెట్ల బుకింగ్లో కూడా ఉంటుంది. అయితే ఫిఫా అనుసరిస్తున్న ఈ ధరల విధానంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు."ఫిఫా ప్రపంచకప్-2026 కోసం 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేయడం సరికాదు. ఇది సామాన్య సాకర్ అభిమానులను క్రీడకు దూరం చేస్తుంది" అని 69 మంది డెమొక్రాటిక్ సభ్యులు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినోకు లేఖ రాశారు. ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించిన జట్లు ఇవే?గ్రూప్ ఎ – మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, చెకియాగ్రూప్ బి – కెనడా, బోస్నియా మరియు హెర్జెగోవినా, ఖతార్, స్విట్జర్లాండ్గ్రూప్ సి – బ్రెజిల్, మొరాకో, హైతీ, స్కాట్లాండ్గ్రూప్ డి – యుఎస్ఎ, పరాగ్వే, ఆస్ట్రేలియా, టర్కీగ్రూప్ ఇ – జర్మనీ, కురసావో, ఐవరీ కోస్ట్, ఈక్వెడార్గ్రూప్ ఎఫ్ – నెదర్లాండ్స్, జపాన్, స్వీడన్, ట్యునీషియాగ్రూప్ జి – బెల్జియం, ఈజిప్ట్, ఇరాన్, న్యూజిలాండ్గ్రూప్ హెచ్ – స్పెయిన్, కేప్ వెర్డే, సౌదీ అరేబియా, ఉరుగ్వేగ్రూప్ ఐ – ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్/బొలీవియాగ్రూప్ జె – అర్జెంటీనా, అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్గ్రూప్ కె – పోర్చుగల్, డిఆర్ కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియాగ్రూప్ ఎల్ – ఇంగ్లాండ్, క్రొయేషియా, ఘానా, పనామాచదవండి: IPL 2026: పాపం అర్జున్ టెండూల్కర్.. జట్టు మారినా? -
కోల్కతాలో అలా.. ముంబైలో ఇలా..
ఎవరైనా బాగా పనిచేస్తే ప్రశంసలు దక్కడం సహజం. మీరిక్కడ చూస్తున్న ఫొటో అలాంటి సందర్భంలోదే. ముంబై పోలీసులను ఫుట్బాల్ అభిమానులు మెచ్చుకుంటున్న దృశ్యంలోని ఫొటోలివి. వాంఖడే స్టేడియం వద్ద ఆదివారం అరుదైన దృశ్యాలు కనిపించాయి. వందలాది మంది అభిమానులు పోలీసుల ఎదుట గుమిగూడి చప్పట్లు కొడుతూ.. 'థ్యాంక్యు' అంటూ నినదించారు. అంతమంది తమను పొగుడుతుంటే ముంబై పోలీసులు చిరునవ్వులు చిందిస్తూ చూస్తుండి పోయారు.అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లయోనల్ మెస్సీ (Lionel Messi).. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో సందడి చేశాడు. ఆయనను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేస్తూ మెస్సీ పలకరించడంతో వారంతా ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు. మెస్సీతో పాటు స్టేడియంలో ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి, బాలీవుడ్ హీరోలు అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్ అదనపు ఆకర్షణగా నిలిచారు. వీరందరినీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.చప్పట్లు కొడుతూ.. థ్యాంక్స్కార్యక్రమాలన్నీ సజావుగా సాగడంతో వాంఖడే స్టేడియానికి వచ్చిన అభిమానులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేడియం నుంచి వెళుతూ ముంబై పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని మెచ్చుకున్నారు. ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా (Viral) మారాయి. ఈ వీడియోలు చూసిన వారంతా ముంబై పోలీసులపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబై పోలీసు సిబ్బంది బాగా పనిచేస్తారని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.అర్థమవుతోందా?''శాంతిభద్రతల నిర్వహణ పరంగా ముంబై పోలీసు (Mumbai Police) వ్యవస్థ ఉత్తమమైనది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వారు ప్రతిదీ సజావుగా నిర్వహిస్తార''ని ఓ నెటిజన్ ప్రశంసించారు. "నిస్సందేహంగా ఇది ఉత్తమ పోలీసు విభాగం, ఏడాది పొడవునా వారు ఇంత మంది ప్రజలను దారిలో పెడుతుంటారు. ఇది వారికి మామూలు రోజు లాంటిదేన''ని మరొకరు మెచ్చుకున్నారు. ''గౌరవం హృదయం లోపలి నుండి రావాలి. మీరు వారిని అర్థం చేసుకోవాలి'' అంటూ కోల్కతా పోలీసులను ఉద్దేశించి మరో నెటిజన్ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pratik Pawaskar (@pawaskarpratik)కోల్కతాలో ఏం జరిగింది?శనివారం కోల్కతాలోని సాల్ట్లేక్ సేడియంలో మెస్సీ అభిమానులు (Messi Fans) విధ్వంసం సృష్టించారు. మెస్సీ కోసం ఎంతోగానే ఎదురు చూసిన అభిమానులను నిరాశకు గురిచేయడంతో వారంతా తీవ్రంగా స్పందించారు. తమ ఆరాధ్య ఫుట్బాలర్ పట్టుమని 10 నిమిషాలు కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రశావేశాలకు లోనయ్యారు. వాటర్ బాటిళ్లు, కుర్చీలను మైదానంలోకి విసిరేశారు, ఫ్లెక్సీలు చించేశారు. అభిమానుల వీరంగంతో సాల్ట్లేక్ సేడియం రణరంగంగా మారిపోయింది. అభిమానులను నియంత్రించలేక కోల్కతా పోలీసులు చేతులెత్తేశారు. మరోవైపు ఈవెంట్ నిర్వాహకుడు శరత్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పౌరుల ప్రవర్తన, ఈవెంట్ నిర్వహణ వైఫల్యంపై మెస్సీకి క్షమాపణలు చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాగా, అభిమానులకు టిక్కెట్ డబ్బులు వెనక్కు ఇచ్చేస్తామని నిర్వహకుడు ప్రకటించడం గమనార్హం.చదవండి: మెస్సీ అందుకే ఇండియాలో మ్యాచ్లు ఆడలేదు! -
మెస్సీ వస్తున్నాడని.. హనీమూన్ రద్దు
కోల్కతా: మెస్సీ మేనియాతో ఇండియా ఊగిపోతోంది. అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రాక సందర్భంగా దేశవ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. శనివారం ఉదయం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా చేరుకున్న మెస్సీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అతడు వస్తున్న దారి వెంబడి నిలబడి సందడి చేశారు. అతడు బస చేసి హోటల్ ముందు గుమిగూడారు. ఇక కోల్కతా నగరంలో ఎక్కడ చూసినా మెస్సీ అభిమానుల కోలాహలం కనిపించింది.మధ్యాహ్నం 2 గంటలకు లియోనెల్ మెస్సీ.. (Lionel Messi ) సాల్ట్ లేక్ స్టేడియంలో సందడి చేయనున్నారు. దీంతో ఈ ఉదయం నుంచే అభిమానులు భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మెస్సీని చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ తరలివచ్చారు. నేపాల్ నుంచి కూడా కొంత మంది అభిమానులు కోల్కతా చేరుకోవడం విశేషం. కొత్తగా పైళ్లైన ఓ జంట తమ హనీమూన్ను సైతం వాయిదా వేసుకుని మెస్సీని చూసేందుకు వచ్చింది.సాల్ట్ లేక్ స్టేడియం వద్ద కొత్త జంట ఏఎన్ఐ వార్తా సంస్థలతో మాట్లాడింది. "గత శుక్రవారం నా పెళ్లి జరిగింది. మెస్సీ వస్తున్నాడని తెలిసి హనీమూన్ ప్లాన్ను రద్దు చేసుకున్నాను. మెస్సీ పర్యటనే నాకు ముఖ్యం. నేను 2010 నుంచి అతడిని అనుసరిస్తున్నాన''ని నవవధువు తెలిపారు. ఆమె భర్త కూడా మెస్సీ అభిమాని కావడంతో ఇద్దరు అతడిని చూడటానికి వచ్చారు. ''ఈ మధ్యనే మాకు పెళ్లయింది. మెస్సీ ఇండియా పర్యటన కారణంగా హనీమూన్ రద్దు చేసుకున్నాం. ఎందుకంటే ముందుగా మేము మెస్సీని చూడాలనుకున్నాము. అతడిని చూడటానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. పది పండేన్నేళ్లుగా అతడిని ఫాలో అవుతున్నామ''ని కొత్త పెళ్లి కొడుకు మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. చదవండి: 70 అడుగుల విగ్రహం.. మెస్సీ ఫస్ట్ రియాక్షన్ ఇదే!మెస్సీని చూడటం నా కలమెస్సీని దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూడడం తన చిరకాల స్వప్నమని నేపాల్ (Nepal) నుంచి వచ్చిన అభిమాని చెప్పాడు. ''నేను నేపాల్ నుండి వచ్చాను. మెస్సీని చూడటం నా కలల్లో ఒకటి. మా దేశం తరపున భారతదేశానికి ధన్యవాదాలు. కేవలం మెస్సీని చూడటానికే టిక్కెట్లు కొన్నాను. నన్ను ఇక్కడికి రావడానికి అనుమతించి, నా కలను నిజం చేసిన నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, సోదరుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మెస్సీని చూడటానికి కాలేజీ ఎగ్గొట్టి ఎంతో దూరం నుంచి కోల్కతాకు వచ్చాను. మెస్సీని చూడటానికి అడ్డుపడితే నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాన''ని అన్నాడు. #WATCH | West Bengal | Fans of star footballer Lionel Messi line up outside the Salt Lake stadium in Kolkata for the first leg of his G.O.A.T. Tour India 2025. pic.twitter.com/Fa1POGEje2— ANI (@ANI) December 13, 2025 -
హైదరాబాద్కు మెస్సీ..ఫోటో దిగాలంటే రూ. 10 లక్షలు! (ఫొటోలు)
-
హైదరాబాద్: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫుట్బాల్ సందడి (ఫొటోలు)
-
మెస్సీ అదరగొట్టినా.. తీవ్ర నిరాశలో అభిమానులు!
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరపున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా వచ్చిన మెస్సీ అదనపు సమయంలో వచ్చిన ఫ్రీకిక్ను గోల్గా మలిచి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. ఇది మరువకముందే మరోసారి ఇంటర్ మియామి క్లబ్ తరపున అదరగొట్టాడు. బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) అట్లాంటా యునైటెడ్తో జరిగిన మ్యాచ్లో ఇంటర్ మియామి క్లబ్ 4-0తో ఘన విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో సింగిల్ గోల్తో మెరిసిన మెస్సీ ఈసారి మాత్రం డబుల్ గోల్స్తో పాటు ఒక అసిస్ట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆట ఎనిమిదో నిమిషంలో సెర్జియో బస్క్వెట్స్ నుంచి పాస్ అందుకున్న మెస్సీ బంతిని గోల్పోస్ట్లోకి తరలించి ఇంటర్ మియామి క్లబ్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 22వ నిమిషంలో మరో గోల్తో మెరిసిన మెస్సీ మ్యాచ్లో రెండో గోల్ నమోదు చేశాడు. ఇక ఆట 53వ నిమిషంలో రాబర్ట్ టేలర్కు మెస్సీ అసిస్ట్ అందించగా.. అది గోల్గా వెళ్లడంతో ఇంటర్ మియామి 3-0తో భారీ ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఇక 84వ నిమిషంలో క్రిస్టోఫర్ మెక్వే గోల్ కొట్టడంతో 4-0తో ఇంటర్ మియామి స్పష్టమైన విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ చివర్లో 12 నిమిషాలు ఉందనగా ఇంటర్ మియామి క్లబ్ మెస్సీని వెనక్కి పిలిచింది. మొత్తం గేమ్ ఆడించడానికి రిస్క్ తీసుకోలేమని తెలిపింది. దీంతో మెస్సీ మైదానం నుంచి వెళ్లిపోయే సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. అయితే కేవలం మెస్సీ ఆటను చూడడానికే తాము వచ్చామని.. అతను ఆడకపోతే మేం ఇక్కడ ఉండడం వ్యర్థమంటూ.. మెస్సీ మైదానం వీడగానే చాలా మంది అభిమానులు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది గమనించిన మెస్సీ మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ను ఉద్దేశించి.. ''నాకోసం మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు.. కానీ ఇలా మ్యాచ్ మధ్యలో మీరు వెళ్లిపోవడం నాకు నచ్చలేదు.. ఇలాంటివి వద్దు.. మీ అభిమానానికి థాంక్స్'' అంటూ పేర్కొన్నాడు. من مغادرة الجماهير بعد خروج الأسطورة ميسي🏟️ pic.twitter.com/RdW11m84Iu — Messi Xtra (@M30Xtra) July 26, 2023 That Busquets > Messi link up play 😍 Lionel Messi makes it two goals in two gamespic.twitter.com/MYRNwukH0N — 101 Great Goals (@101greatgoals) July 25, 2023 LIONEL MESSI WITH HIS SECOND GOAL OF THE MATCH FOR INTER MIAMI! Via MLS.pic.twitter.com/itYUdcED4h — Roy Nemer (@RoyNemer) July 26, 2023 చదవండి: FIFA World Cup: ప్రపంచకప్లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా.. Asian Games 2023: హర్మన్పై వేటు.. ఆసియా గేమ్స్లో జట్టును నడిపించేది ఎవరు? -
నిలబడడమే ఆమెకు శాపం.. సంబంధం లేని గొడవ ప్రాణం తీసింది
ఫుట్బాల్ మ్యాచ్ విషాదాన్ని నింపింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక మహిళా అభిమాని అక్కడ జరిగే గొడవతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికి ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. ఈ విషాదకర ఘటన బ్రెజిల్లోని సావో పాలోలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శనివారం బ్రెజిలియన్ ఫుట్బాల్ క్లబ్స్ అయిన పాల్మీరాస్, రైవల్స్ ఫ్లెమింగోల మధ్య అలియాంజ్ పార్క్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు పాల్మీరాస్కు మద్దతుగా గాబ్రిలా అనెల్లి హాజరైంది. కాగా అలియాంజ్ పార్క్ స్టేడియం బయట ఉన్న పాల్మీరాస్ ఫ్యాన్ జోన్కు దగ్గర్లో నిలబడడమే గాబ్రిలా చేసిన పాపం. ఏదో విషయమై ఇరుజట్ల మధ్య అభిమానుల మధ్య గొడవ మొదలైంది. కాసేపటికి రైవల్స్ ఫ్లెమింగో ఫ్యాన్స్ రాళ్లు, గ్లాస్ బాటిల్స్తో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఒక గ్లాస్ బాటిల్ గాబ్రిలా దిశవైపుగా దూసుకొచ్చింది. ఆ గ్లాస్ బాటిల్ నేరుగా గాబ్రిలా మెడ నరాన్ని కట్ చేసుకుంటూ వెళ్లింది. దీంతో అపస్మారక స్థితిలో అక్కడికక్కడే కుప్పకూలింది గాబ్రిలా. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు. కాగా రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం ఆసుపత్రిలో మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక గాబ్రిలా మరణాన్ని ఆమె సోదరుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించడం అందరిని కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాబ్రిలా మృతికి కారణమైన రైవల్స్ ఫ్లెమింగో అభిమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన చర్య ఒకరి ప్రాణం తీస్తుందని ఊహించలేదని.. బాధితురాలి కుటుంబసభ్యులను క్షమాపణ కోరినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పాల్మీరాస్ క్లబ్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అభిమాని మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇక గొడవ పడిన అభిమానులను వేరు చేయడానికి పెప్పర్ స్ప్రే ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ మాత్రం 1-1తో డ్రాగా ముగిసింది. చదవండి: WI Vs IND: జైశ్వాల్ ఆడడం ఖాయమా? రోహిత్ ప్రశ్నకు రహానే స్పందన #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్ను కూడా వదలడం లేదు! -
పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు
ఖతర్ వేదికగా ఫిపా వరల్డ్కప్ ముగిసి దాదాపు పది రోజులు కావొస్తోంది. డిసెంబర్ 18న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా సూపర్స్టార్ లియోనల్ మెస్సీ తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్ను అందించాడు. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మెస్సీకి చివరిదని అంతా భావించారు. అయితే అర్జెంటీనా విజేతగా నిలిచిన తర్వాత మనుసు మార్చుకున్న మెస్సీ కొంతకాలం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే అర్జెంటీనా మూడోసారి ఫిఫా వరల్డ్కప్ నెగ్గడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మెస్సీ సేనకు ఘనస్వాగతం లభించింది. ఒపెన్ టాప్ బస్సులో రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లో తిరగాలని ప్రయత్నించినప్పటికి ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో ఆటగాళ్లను ప్రత్యేక హెలికాప్టర్లో తమ స్వస్థలాలకు తరలించారు. మారడోనా లిగసీని కంటిన్యూ చేస్తూ మళ్లీ 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు కప్ అందించిన మెస్సీ హీరోగా మారిపోయాడు. అయితే పది రోజులయినా అతనిపై మోజు తగ్గలేదునుకుంటా అభిమానులకు. తాజాగా మెస్సీ తన కోడలు 15వ పుట్టినరోజు వేడుకలకని తన హోమ్టౌన్ నుంచి బయలుదేరాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మెస్సీని చుట్టుముట్టారు. దాదాపు అరగంట పాటు మెస్సీ కారును చుట్టుముట్టిన అభిమానులు అతనితో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే మెస్సీ కూడా వారితో దురుసుగా ప్రవర్తించకుండా కూల్గా సర్దిచెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మెస్సీ పారిస్ సెయింట్ జెర్మెన్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారం పీఎస్జీ క్లబ్లో మెస్సీ జాయిన్ అయ్యే అవకాశం ఉందని పీఎస్జీ హెడ్కోచ్ క్రిస్టోప్ గాల్టియర్ పేర్కొన్నాడు. ఫిపా వరల్డ్కప్ ఫైనల్ సందర్భంగా అర్జెంటీనాకు వణికించిన ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె సహా బ్రెజిల్ స్టార్ నెయ్మర్ కూడా పీఎస్జీలో ఉన్నారు. El que anda tranquilo por Rosario es Lionel Messi 😅 NUESTRO CAMPEÓN DEL MUNDO 😍🇦🇷🏆 pic.twitter.com/jJuC2ToeZ1 — TNT Sports Argentina (@TNTSportsAR) December 28, 2022 చదవండి: ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక -
మెస్సీ ధరించిన నల్లకోటు ధర ఎంతంటే?
ఫిఫా వరల్డ్ కప్ ముగిసి వారం కావొస్తున్నా.. ఆ కిక్ నుంచి మాత్రం ఫుట్బాల్ అభిమానులు బయటపడలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అర్జెంటీనా సూపర్స్టార్ లియోనల్ మెస్సీ. జట్టును అన్నీ తానై నడిపించడమే గాక కీలకమైన ఫైనల్లో రెండు గోల్స్ చేసి అర్జెంటీనాను మూడోసారి విశ్వవిజేతగా నిలబెట్టాడు. పనిలో పనిగా ఫిఫా టైటిల్ అందుకోవాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ఆ క్షణం నుంచి మెస్సీ మాయలో పడిపోయిన అభిమానులు అతని జపమే చేస్తున్నారు. ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘనస్వాగతం లభించింది. ఇసుక వేస్తే రాలనంతో జనంతో రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వీధులు నిండిపోయాయి. ముందుకు కదల్లేని పరిస్థితిలో మెస్సీ బృంధాన్ని హెలికాప్టర్ సాయంతో వారి స్వస్థలాలకు తరలించాల్సి వచ్చింది. అలా మెస్సీకి తన స్వస్థలంలోనూ జనం నీరాజనం పట్టారు. ఇక ఫైనల్లో విజయం తర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ నల్లకోటు ధరించి ఫిఫా టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. మెస్సీ ధరించిన నల్లకోటు సెలబ్రేషన్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ కోటు ధర తెలిస్తే షాక్ తినడం గ్యారంటీ. అంతలా ఆ కోటులో ఏముందనుకుంటున్నారా. బంగారు వర్ణంతో తయారు చేయడమే ఆ కోటు స్పెషాలిటీ. ట్రోఫీ అందుకునే ముందు ఖతర్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ మెస్సీకి ఆ నల్లని కోటు తొడిగారు. ఆ నల్లని కోటు ధర అక్షరాలా 10 లక్షల డాలర్లు. మరి అంత విలువైన కోటును మెస్సీకి ఎవరు బహూకరించారో తెలుసా.. ఒమన్కు చెందిన అహ్మద్ అల్ బర్వానీ అనే పార్లమెంట్ సభ్యుడు. ''ఖతర్ సుల్తాన్ తరఫున వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. బంగారం, నలుపు రంగులో ఉన్న అరబిక్ బిష్త్ శౌర్యానికి, తెలివితేటలకు ప్రతీక. అందుకు నీకు 10 లక్షల డాలర్లు ఇస్తున్నాను'' అంటూ అహ్మద్ ట్వీట్ చేశాడు. అరబ్ దేశాల్లో మగవాళ్లు పెళ్లిళ్లు, మతపరమైన పండుగల వేళ అలాంటి కోటు వేసుకుంటారు. ఇక హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్పై విజయం సాధించింది. దాంతో, 32 ఏళ్ల తర్వాత అర్జెంటీనా మళ్లీ వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. 2014 ఫైనల్లో మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా జర్మనీపై ఓడిపోవడంతో కప్ చేజారింది. కానీ ఈ సారి మాత్రం ఆ చాన్స్ను మిస్ చేసుకోని మెస్సీ ఫిఫా టైటిల్ను ఒడిసిపట్టాడు. చదవండి: 'మానసిక వేదనకు గురయ్యా'.. సొంత బోర్డుపై ఆగ్రహం మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా?
ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్కప్ 2022 ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే గ్రూప్ దశతో పాటు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ముగిశాయి. శుక్రవారం నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. అరబ్ గడ్డపై జరుగుతున్న వరల్డ్కప్ను లైవ్లో వీక్షించేందుకు దాదాపు కోటికి పైగా వెళ్లారు. లైవ్ చూడలేని వాళ్లు మాత్రం టీవీల్లో, జియో సినిమాలో, తమకు నచ్చిన ఫ్లాట్ఫాంలో చూస్తూ ఆనందిస్తున్నారు. తాజాగా యూట్యూబ్ మాత్రం ఫిఫా అభిమానులను దారుణంగా మోసం చేసింది. ఫిఫా వరల్డ్కప్ సందర్భంగా గ్రూప్ దశలో జపాన్, జర్మనీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రీప్లేను యూట్యూబ్లో టెలికాస్ట్ చేశారు. రియల్ మ్యాచ్ అనుకొని ఎంజాయ్ చేసిన అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ ట్విస్ట్ ఏంటంటే.. అది రియల్ మ్యాచ్ కాదు ఫేక్ గేమ్ అని. ఫిఫా 23 గేమ్ప్లే(ఆన్లైన్ గేమ్)లో భాగంగా ఒక గేమింగ్ కంపెనీ దీనిని రూపొందించింది. మాములుగా యూట్యూబ్లో మనం ఏదైనా మ్యాచ్ వీక్షిస్తే.. ఒరిజినల్కు, డూప్లికేట్కు తేడా ఇట్టే తెలిసిపోతుంది. కానీ సదరు యూట్యూబ్ చానెల్ మాత్రం మ్యాచ్ రెజల్యూషన్(క్వాలిటీ) తగ్గించి గేమింగ్ను కాస్త రియల్ గేమ్లాగా చూపించారు. దూరం నుంచి చూస్తే మాత్రం అచ్చం రియల్ మ్యాచ్లానే కనిపిస్తోంది. కాస్త దగ్గరి నుంచి పరిశీలిస్తే కానీ అది బొమ్మల గేమ్ అని అర్థమవుతుంది. అంత మాయ చేశారు యూట్యూబ్ నిర్వాహకులు. అయితే నిజంగానే జపాన్, జర్మనీలు ఒకే గ్రూప్లో ఉండడంతో ఎవరికి అనుమానం రాలేదు. చిత్రమైన విషయం ఏంటంటే.. ఫేక్ మ్యాచ్ను ఒరిజినల్ అనుకొని దాదాపు 40వేల మంది వీక్షించారు. ఇక ఫిఫా వరల్డ్కప్లో నాలుగుసార్లు చాంపియన్ అయిన జర్మనీ గ్రూప్ దశలో వెనుదిరగ్గా.. జపాన్ ప్రీక్వార్టర్స్లో ఇంటిబాట పట్టింది. చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్బాలర్ పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం! -
FIFA WC: నువ్వయ్యా అసలు సిసలైన అభిమానివి!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో మ్యాచ్లు రసవత్తరంగా జరుగుతున్నాయి. శనివారం పోలాండ్, సౌదీ అరేబియా మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అంతదాకా తన సొంతజట్టైన సౌదీ అరేబియాకు సపోర్ట్ చేసిన ఒక అభిమాని.. ప్రత్యర్థి జట్టు ఆటగాడు గోల్ కొట్టగానే దెబ్బకు ప్లేట్ ఫిరాయించాడు. అప్పటిదాకా సౌదీ.. సౌదీ అని అరిచిన నోటి నుంచి లెండోవాస్కీ పేరు బయటకు వచ్చింది. అంతేకాదు తాను వేసుకున్న సౌదీ అరేబియా జెర్సీని తీసేసి లోపల వేసుకున్న లెండోవాస్కీ జెర్సీని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు ''నువ్వయ్యా అసలైన అభిమానివి.. దెబ్బకు ప్లేట్ ఫిరాయించావు.. నీలాంటోడు ఉండాల్సిందే'' అంటూ పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్లో పోలాండ్ సౌదీ అరేబియాను 2-0తో ఓడించింది. మ్యాచ్లో పోలాండ్ కెప్టెన్ రాబర్ట్ లెండోవాస్కీ గోల్ నమోదు చేశాడు. కాగా తొలి వరల్డ్కప్ ఆడుతున్న లెండోవాస్కీకి ఇదే తొలి గోల్ కావడం విశేషం. అంతకముందు తొలి అర్థభాగంలో ఆట 39వ నిమిషంలో జిలిన్ స్కీ పోలాండ్కు తొలి గోల్ అందించాడు. మొదటి హాఫ్ అదనపు సమయంలో సౌదీ అరేబియాకు పెనాల్టీ లభించింది. దీంతో కచ్చితంగా గోల్ చేస్తుంది అన్న తరుణంలో పోలాండ్ గోల్ కీపర్ వోజిక్ జెన్సీ రెండుసార్లు అద్బుతంగా అడ్డుకొని సౌదీకి గోల్ రాకుండా చేశాడు. ఇది మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఇక అర్జెంటీనాకు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా ఆటలు పోలాండ్ ముందు సాగలేదు. pic.twitter.com/3Ug8Sl4gaX — Out Of Context Football (@nocontextfooty) November 26, 2022 చదవండి: FIFA WC: నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ ఎక్కడ? 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ -
మెస్సీపై అభిమానం దేశాలను దాటించింది
అభిమానానికి ఒక రేంజ్ ఉంటుంది. అది క్రికెట్ లేదా ఫుట్బాల్ కావొచ్చు. తనకు ఇష్టమైన ఆటగాడు బరిలోకి దిగాడంటే అతని ఆటను ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది అభిమానులు అనుకుంటారు. అందుకోసం ఎంత రిస్క్ అయినా భరిస్తారు. తాజాగా మెస్సీపై ఉన్న వీరాభిమానం ఒక భారతీయ మహిళను ఖతర్లో జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ దాకా తీసుకొచ్చింది. ఆమె ఒక్కతే రాలేదు.. కూడా తన ఐదుగురు పిల్లలను వెంటబెట్టుకొని మహీంద్రా ఎస్యూవీ కారులో ఖతర్కు చేరుకుంది. విషయంలోకి వెళితే.. కేరళకు చెందిన 35 ఏళ్ల నాజీ నౌషీకి మెస్సీకి వీరాభిమాని. మెస్సీకి ఇదే చివరి వరల్డ్కప్ అని అందరూ ఊహించుకుంటున్న వేళ నాజీ ఎలాగైనా మెస్సీ ఆటను దగ్గరి నుంచి చూడాలనుకుంది. అయితే ఆమె ఐదుగురు పిల్లలకు తల్లి. వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. దీంతో తన పిల్లలను వెంటబెట్టుకొని ఎస్యూవీ కారులో తన ప్రయాణం ప్రారంభించింది. ముంబై చేరుకొని అక్కడి నుంచి విమానంలో యూఏఈకి చేరుకుంది. తన ఎస్యూవీ కారును యూఏఈకి షిప్పింగ్ చేసింది. అలా అక్టోబర్ 15న కేరళ నుంచి బయలుదేరిన నౌషీ మొత్తానికి ఖతర్కు చేరుకుంది. అయితే మధ్యలో దుబాయ్లోని ప్రఖ్యాత బూర్జ్ ఖలీఫా చూడడానికి ఎస్యూవీ కారులో వెళ్లిన నౌషీకి ఖలీజ్ టైమ్స్ విలేకరి ఒకరు ఎదురుపడ్డాడు. ఐదుగురు పిల్లలతో కలిసి ఒంటరిగా ప్రయాణం చేయడం గమనించిన సదరు విలేకరి నౌషీ గురించి ఆరా తీశాడు. ఆ ప్రయత్నంలోనే నౌషీ మెస్సీపై ఉన్న అభిమానమే నన్ను ఖతర్ దాకా తీసుకొచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టుకు తొలి మ్యాచ్లో సౌదీ అరేబియా ఊహించని షాక్ ఇచ్చింది. 2-1 తేడాతో అర్జెంటీనాను చిత్తు చేసింది. ఈ ఓటమిపై స్పందించిన నౌషీ.. ఈసారి కచ్చితంగా కప్ అర్జెంటీనాదే.. దురదృష్టవశాత్తూ తొలి మ్యాచ్లో ఓడిపోయాం. కానీ మెక్సికోతో మ్యాచ్లో మెస్సీ సేనదే విజయం. కేవలం మెస్సీ ఆట కోసమే పిల్లలతో కలిసి ఇంతదూరం వచ్చా. తినడానికి సరిపడా సరుకులు బండిలో ఉన్నాయి. ఖతర్ ఫుడ్కు దూరంగా ఉండాలనేది నా ఆలోచన. వీలైనంత వరకు మా వెంట తెచ్చుకున్న ఆహారాన్ని వండుకొని తినడానికి ప్రయత్నిస్తాం అంటూ ముగించింది. ఇది చూసిన కొందరు ఫుట్బాల్ ఫ్యాన్స్.. నీ ఓపికకు సలాం తల్లి.. ఒక ఆటగాడిపై అభిమానంతో అతని ఆటను చూసేందుకు దేశాలను దాటి వెళ్లడం నిజంగా గొప్ప విషయం. నీకోసమైనా మెస్సీ సేన టైటిల్ గెలవాలని బలంగా కోరుకుంటున్నాము అంటూ కామెంట్ చేశారు. Naaji noushi pic.twitter.com/KXieon2wum — Noufaltirur (@NoufalKunnath4) November 21, 2022 -
ఖతర్లో వరల్డ్కప్.. కేరళలో తన్నుకున్న అభిమానులు
భారత్లో ఫుట్బాల్కు పెద్దగా అభిమానులు ఉండరు. బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఫుట్బాల్కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. తాజాగా ఖతార్లో జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ ప్రారంభమైన రోజున కేరళలో పెద్ద సందడి నెలకొంది. సందడి మాట పక్కనబెడితే కేరళలోని కొల్లాం జిల్లాలోని సక్తిఉలంగర గ్రామంలో ఫుట్బాల్ ఫ్యాన్స్ ర్యాలీలు తీశారు. ఈ గ్రామంలో పలువురు బ్రెజిల్ అభిమానులుండగా.. కొందరు అర్జెంటీనాకు మద్దతుగా ఉన్నారు. ఈ ప్రపంచకప్ బ్రెజిలే గెలుస్తుందని కొందరంటే.. లేదు అర్జెంటీనాదే కప్ అని అరుచుకోవడం వివాదానికి దారి తీసింది. ఆ వివాదం కాస్తా కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ర్యాలీకి వచ్చిన వారంతా తమకు అందుబాటులో ఉన్న కర్రలు, పైపులు, ఇనుప రాడ్లు అందుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలాఉండగా ఫ్యాన్స్ కొట్టుకున్న ఈ ఘటనలో ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. A fight between fans of Brazil and Argentina in Kerala! Begaane ke shaadi me...! 🤦🤦🤦 #QatarWorldCup2022 #Brazil #Argentina #Kerala pic.twitter.com/0mUnxO2ajs — Ananth Rupanagudi (@Ananth_IRAS) November 22, 2022 చదవండి: గాయాలు కొత్త కాదు.. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి -
ఫుట్బాల్ మైదానంలో తొక్కిసలాట.. 174 మంది దుర్మరణం
జకర్తా: ఫుట్బాల్ మైదానంలో తొక్కిసలాట జరిగి 174 మంది దుర్మరణం పాలైన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఫుట్బాల్ మ్యాచ్లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. ఓటమి భరించలేక మైదానంలోకి చొచ్చుకొచ్చారు అరెమా జట్టు అభిమానులు. వారిని నిలువరించేందురు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు తలెత్తాయి. అదే తొక్కిసలాటకు దారి తీసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రధాన ద్వారం వైపు పరుగులు పెట్టిన క్రమంలో కిందపడిపోయిన కొందరు ఊపిరాడక మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఇండోనేషియన్ ఫుట్బాల్ అసోసియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘోర దుర్ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. మహిళలు, చిన్నారులు సహా 22 మంది మృతి -
కొంపముంచిన అభిమానం.. 2 వేల మందికి కరోనా!
కరోనా టైంలో జన సమూహారం ప్రమాదకరమనే వైద్య నిపుణులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. అయినా కూడా జనాలు గుమిగూడడం ఆపట్లేదు. ఈ తరుణంలో యూరో ఫుట్బాల్ మ్యాచ్లు.. స్కాట్లాండ్లో భారీగా కరోనా కేసులకు కారణమయ్యాయి. వెర్రి అభిమానంతో వందల మైళ్ల దూరం ప్రయాణించి మరీ.. వైరస్ను అంటించుకున్నారు స్కాట్లాండ్ సాకర్ అభిమానులు. ఎడిన్బర్గ్: ఫుట్బాల్ మీద అభిమానం స్కాట్లాండ్లో భారీగా కరోనా కేసులు పెరగడానికి కారణమయ్యింది. యూరప్ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో.. యూరో ఛాంపియన్షిప్ నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ సాకర్ అభిమానులు వెనక్కి తగ్గట్లేదు. ఇక తమ టీం మ్యాచ్ కోసమని స్కాట్లాండ్ అభిమానులు లండన్కు పెద్ద ఎత్తున్న క్యూ కట్టారు. వందల మైళ్లు రైళ్లలో, విమానాల్లో ప్రయాణించి.. మరీ ఇంగ్లండ్ మ్యాచ్ను చూసి వచ్చారు. ఈ తరుణంలో సుమారు 2 వేల మంది సాకర్ అభిమానులు కరోనా బారిన పడ్డట్లు.. స్కాట్లాండ్ ప్రజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 1,991 మంది కరోనా బారిన పడగా.. అందులో 1,294 మంది కేవలం ఇంగ్లండ్-స్కాట్లాండ్ ఒక్కమ్యాచ్ కోసం వెంబ్లేకి వెళ్లి వచ్చిన వాళ్లుగా అధికారులు ధృవీకరించారు. ఇక మ్యాచ్ల టైంలో స్కాట్లాండ్ గ్లాస్గోలోని హంప్డెన్ స్టేడియం వద్ద జనాలు భారీగా గుమిగూడారు. ఇదే కాదు.. మ్యాచ్ కోసం బార్లు, పబ్ల దగ్గర కూడా జనాలు గుంపులుగా కలియతిరిగారు. పైగా మాస్క్లు లేకుండా తప్పతాగి సంబురాలు చేసుకున్నారు. ఈ తరుణంలోనే కరోనా భారీగా విజృంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇంగ్లండ్-స్కాట్లాండ్ మ్యాచ్ సందర్భంగా స్కాట్లాండ్ మిడ్ఫీల్డర్ బిల్లీ గిల్మౌర్ సైతం వైరస్ బారిన పడగా.. అతనితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న మరో ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్లు సైతం సెల్ఫ్ ఐసోలేషన్కి వెళ్లిపోయారు. చదవండి: చుక్క మత్తులో పోలీసులకు చుక్కలు -
ప్రేక్షకులొచ్చారు...
హో చి మిన్ సిటీ (వియత్నాం): కరోనాతో ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఆటగాళ్లు కనీసం ప్రాక్టీస్ చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ చిన్నా చితకా ఈవెంట్లు జరుగుతున్నప్పటికీ ప్రేక్షకుల్ని అనుమతించేంత ధైర్యం ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. అయితే దేశవాళీ ఫుట్బాల్ లీగ్కు అభిమానులను ఆహ్వానించి వియత్నాం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వి–లీగ్లో భాగంగా అక్కడ శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్లను దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. మైదానానికి తరలి వచ్చిన అభిమానులకు ముందు జాగ్రత్తగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. అయితే వారు మాస్కులు ధరించకపోవడం విశేషం. ప్రేక్షకుల సమక్షంలో ఆడటం సంతోషంగా ఉందని, వారే ఆటకు ప్రత్యేకమని ‘హో చి మిన్’ జట్టు కోచ్ జంగ్ హు– సంగ్ అన్నారు. చైనాతో పొడవైన సరిహద్దు కలిగి ఉన్నప్పటికీ వియత్నాం కరోనాను సమర్థంగా నియంత్రించింది. 10 కోట్ల జనాభా కలిగిన వియత్నాంలో కేవలం 328 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా ఒక్క మరణం కూడా సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. శుక్రవారం మొత్తం మూడు మ్యాచ్లు జరగ్గా... రెండు ‘డ్రా’గా ముగిశాయి. మరో మ్యాచ్లో ఫలితం వచ్చింది. -
భారత జట్టుకు జై కొట్టినందుకు..
యూఏఈలో జరుగుతున్న ఏషియన్ ఫుట్బాల్ కప్లో భాగంగా గురువారం రాత్రి యూఏఈ-భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా 0-2 తో పరాజయం పాలైంది. అయితే, మ్యాచ్కు ముందు భారత ఫుట్బాల్ జట్టు అభిమానులను ఓ దుబాయ్ షేక్ పక్షుల పంజరంలో బంధించాడు. వారితో యూఏఈకి మద్దతు పలుకుతామని బలవంతంగా చెప్పించాడు. ఆ వీడియో వైరల్ కావడంతో చిక్కుల్లో పడ్డాడు. ‘మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటారు?’ అని షేక్ ప్రశ్నించాడు. ఇండియన్ ఫుట్బాల్ టీమ్ ఫ్యాన్స్ మూకుమ్మడిగా.. ‘భారత జట్టుకే మా మద్దతు’ అనగానే.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరంతా యూఏఈ జట్టుకే మద్దతు పలకాలని చేతిలో బెత్తం పట్టుకుని బెదిరించాడు. దాంతో ఫ్యాన్స్ యూఏఈకే మద్దతు పలుకుతామని చెప్పడంతో పంజరం నుంచి విడుదల చేశాడు. ఈ తతంగానికి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూఏఈ అటార్నీ జనరల్ స్పందించారు. వివక్షాపూరితంగా వ్యవహరించి, బెదిరింపులకు పాల్పడినందుకు సదరు షేక్కు అరెస్టు వారెంట్ జారీ చేశారు. విచారణ నిమిత్తం అటెండ్ కావాలని ఆదేశించారు. కాగా, ఈ విషయం అరెస్టు దాకా వెళ్లడంతో సదరు షేక్ మాటమార్చాడు. ‘వీడియోలో చేసిందంతా సరదా కోసమే. పంజరంలో వేసిన వారంతో నా దగ్గర పనిచేసేవారే. గత 20 ఏళ్లుగా వీళ్లు నాకు బాగా తెలుసు. మేమేంతా కలిసిమెలిసి ఉంటాం. ఒకే కంచంలో కలిసి భోజనం కూడా చేస్తాం. అదంతా ఉత్తిదే. నేను వారిని కొట్టలేదు. అసలు నిజంగా వారిని బంధించనేలేదు’ అంటూ మరో వీడియో రిలీజ్ చేశాడు. టీమిండియా అభిమానులు పలు ఆసియా దేశాలకు చెందినవారుగా తెలిసింది. -
మెస్సీ కూడా సచిన్ దారిలోనే..!
కోల్కతా : నగరంలోని సగటు పుట్బాల్ అభిమాని ప్రార్థించే ప్రార్థన ‘మెస్సీ విల్ డూ ఏ టెండూల్కర్’. గతవారం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ ఈ సారీ ప్రపంచకప్ను ముద్దాడాలనే కోరిక బయటపెట్టడంతో ఈ లెజండరీ ప్లెయర్కు మరింత మద్దతు పెరుగుతోంది. ఇక కోల్కతాలోని అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ వ్యవస్థాపకుడు, సెక్రటరీ ఉత్తమ్ సాహా ఆధ్వర్యంలో మెస్సీకి మద్దతుగా ఈ నినాదాన్ని నినదించారు. భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాదిరిగానే లియోనల్ మెస్సీ కూడా తన దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కానీ ఈ లెజండరీ ఆటగాళ్లకు ప్రపంచ కప్ అందని ద్రాక్షలాగే ఉండేది. కాగా, సచిన్ తాను ఆడిన చివరి వన్డే ప్రపంచకప్లో టైటిల్ గెలిచి ఆటకు ఘనంగా వీడ్కోలు పలికాడు. అలాగే మెస్సీ కూడా తాను ఆడే చివరి ప్రపంచకప్ గెలిచి సచిన్ దారిలో నడుస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సచిన్, మెస్సీల జెర్సీ నంబర్ ఒకటే కావడం, సహచర ఆటగాళ్లలో స్పూర్తి నింపడం, జట్టు కఠిన సమయంలో ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు భుజాలపై వేసుకోవడం ఈ ఇద్దరి ఆటగాళ్లకున్న కామన్ పాయింటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక 2014 ఫిఫా ప్రపంచకప్లో అద్భుత ఆట తీరుతో ఫైనల్కి చేరిన అర్జెంటీనా.. అనూహ్యంగా 0-1 తేడాతో జర్మనీ చేతిలో ఓడిపోయింది. రేపు(జూన్ 14న) రష్యా, సౌదీ అరేబియా మధ్య తొలి సమరంతో ఫిఫా ప్రపంచకప్ 2018 టోర్నీ ఆరంభంకానుంది. -
మ్యాచ్ అయ్యాక వీళ్లంతా ఏం చేశారో తెలుసా?
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ కాని, ఫుట్ బాల్ మ్యాచ్ కానీ చూశామా? ఎంజాయ్ చేశామా? వెళ్లామా? అన్నట్టే ఉంటారు ప్రేక్షకులు. స్టేడియంను డస్టు బిన్ లా మార్చేసే తాము వేసే వ్యర్థాల గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ శనివారం షిల్లాంగ్ లో జరిగిన దేశంలోనే అతిపెద్ద పురుషుల ఫుట్ బాల్ టోర్నమెంట్ కు వచ్చిన ప్రేక్షకులు చేసిన స్వచ్ఛమైన పని సోషల్ మీడియా యూజర్ల హృదయాలను కొల్లగొడుతోంది. మిజోరాం ఐజ్వాల్ ఎఫ్సీ తన తొలి మ్యాచ్ ను గెలువగానే, ఆ టీమ్ ఫ్యాన్స్ దాదాపు 23వేల మంది వెంటనే స్టేడియంను క్లీన్ చేయడం ప్రారంభించారు. తమ టీమ్ గెలుపును స్వచ్ఛ్ భారత్ తో సెలబ్రేట్ చేసుకున్నారు. ''మ్యాచ్ అయిపోగానే డస్ట్ నంతా క్లీన్ చేసినందుకు ఐజ్వాల్ ఫుట్ బాల్ ప్యాన్స్ కు ధన్యవాదాలు. మాతో పాటు మిగతవారందరూ మీ దగ్గరనుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది'' అని ఓ ఫ్యాన్ వారి క్లీనింగ్ ను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అతను ఈ మెసేజ్ ను రాస్తున్నంత సేపట్లోనే ఆ ఫోటోగ్రాఫ్ కు 840 షేర్లు, 1800 లైక్స్ వచ్చాయి. అంతేకాక ఈ మెసేజ్, ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇటు ఫేస్ బుక్ మాత్రమే కాక, మరో సామాజిక మాధ్యమం ట్విట్టర్ సైతం ఫుట్ బాల్ ప్యాన్స్ ను పొగడ్తలో ముంచెత్తుతోంది. దీనిపై యువజన వ్యవహారాల, క్రీడా సహాయ మంత్రి విజయ్ గోయల్ కూడా స్పందించారు. '' ఐ-లీగ్ గెలుపు, ఐజ్వాల్ ఎఫ్సీ ప్యాన్స్ షిల్లాంగ్ స్టేడియమంతటిన్నీ క్లీన్ చేయడం నిజంగా మా హృదయాలను గెలుచుకుంది. ఇదే నిజమైన స్వచ్ఛ్ భారత్ కు ఉదాహరణ. అందరూ వీరిని చూసి నుంచి నేర్చుకోవాల్సి ఉంది'' అని ట్వీట్ చేశారు. ఒకే సమయంలో ఒకే స్థలంలో జరిగే మ్యాచ్ లతో స్టేడియంలలో ఎక్కువ ఘన వ్యర్థ్యాలను ఉత్పత్తి అవుతాయి. మ్యాచ్ అయిన తర్వాత స్టేడియమంతా ఓ డస్టు బిన్ లా మారిపోతుంది. 2016 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగే సమయంలో మొత్తం 40వేల మంది ప్రేక్షకులు దీనిలో పాలుపంచుకుంటున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంచనావేసింది. దీంతో ఒక్కో మ్యాచ్ జరినే సమయంలో 10మెట్రిక్ టన్నుల వ్యర్థ్యాలు జనరేట్ అవుతాయని ఆందోళన కూడా వ్యక్తంచేసింది. -
ప్యారిస్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడులు...
-
ఫుట్బాల్ అభిమానులకు గైడ్ ‘కిక్-ఆఫ్’
సాక్షి, న్యూఢిల్లీ: క్రీడా ప్రపంచమంతా ఇప్పుడు బ్రెజిల్వైపే చూస్తోంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మ్యాచ్లు ఫుట్బాల్ అభిమానులను గోల్స్ వర్షంలో తడిపేస్తున్నాయి. రోజుకో రసవత్తర పోరుతో ప్రేక్షకులు ఆనందలోకాల్లో విహరిస్తున్నారు. ఫుట్బాల్ వీరాభిమానుల్లో కొందరికి ఆట ఆడడం అంటే ఇష్టమైతే మరికొందరికి ఆ ఆటలోని ప్రతి అంశాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి ఉంటుంది. ఇలా ప్రపంచ ఫుట్బాల్ చరిత్రతోపాటు ఇండియన్ ఫుట్బాల్ చరిత్ర తెలుసుకోవాలనుకునే వారు మాత్రం ‘ది ఫుట్బాల్ ఫెంటాస్టిక్ ఎసెన్షియల్ గైడ్’ పుస్తకం చదవాల్సిందే. ‘కిక్-ఆఫ్’ పేరిట ప్రముఖ ఫుట్బాల్ నిఫుణుడు, ప్రముఖ వ్యాఖ్యాత నవీ కపాడియా ఈ పుస్తకాన్ని రచించారు. ఫుట్బాల్ వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా తన పుస్తకానికి సంబంధించి రచయిత కపాడియా ‘సాక్షి’తో ఎన్నో అంశాలు పంచుకున్నారు. 1930 నుంచి 2010లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ప్రపంచ ఫుట్బాల్కప్లకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని పొందుపర్చినట్టు తెలిపారు. మొత్తం 19 భాగాల్లో ఆయా కాలాల్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు, ఫుట్బాల్ చరిత్రలో నిలిచిపోయే మధుర ఘట్టాలు, వివాదాలు సహా పలు అంశాలను కూలంక షంగా వివరించారు. అదేవిధంగా భారత్ ఫుట్బాల్కి సంబంధించిన చరిత్రను సైత ం పొందుపరిచారు. నవతరం ఫుట్బాల్ క్రీడాకారుల కోసం ఆటకు సంబంధించి పలు సూచనలు సైతం ఉన్నాయి. ఫుట్బాల్ అభిమానులతోపాటు పోటీపరీక్షలకు సన్నద్ధం అయ్యేవారి కోసం ఫుట్బాల్ ఆటకు సంబంధించి వంద క్విజ్ ప్రశ్నలను సైతం స్థానం కల్పించినట్టు పుస్తక రచయిత నవీ కపాడియా తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో ఈ పుస్తకం పాఠకులకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు.


