-
స్థిరమైన ఆదాయం కోసం మార్గాలు - తెలుసుకోవాల్సిందే!
నేను ఒకేసారి రూ.12 లక్షలను మూడు, నాలుగేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. మెరుగైన రాబడుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? డెట్ ఫండ్లో పెట్టుబడి పెట్టి.. అక్కడి నుంచి సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా మంచి రాబడులు అందుకోవచ్చా? – మయూర్ సంపద సృష్టి మూడు నాలుగేళ్లలో సాధ్యపడుతుందా? ఇది ఆందోళన కలిగించే అంశం. మూడు నుంచి నాలుగేళ్లలో సంపద సృష్టి సాధ్యపడదు. ఈక్విటీలు గణనీయమైన రాబడులను అందిస్తాయి. కానీ వాటికి కూడా 10–15 ఏళ్ల కాల వ్యవధి కావాలి. అంత కాలవ్యవధి మీకు లేకపోతే అప్పుడు సంప్రదాయ ఇన్వెస్టర్గానే ఆలోచించాలి. మూడు నుంచి నాలుగేళ్లలోనే పెట్టుబడిపై చెప్పుకోతగ్గంత రాబడి కావాలని కోరుకునేట్టు అయితే.. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఎక్కువ మొత్తాన్ని డెట్ సాధానాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధి కోసం అంటున్నారు కనుక 12–18 నెలల కాలం పాటు సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎంపిక చేసుకుంటే మొత్తం పెట్టుబడుల్లో సగం కాల వ్యవధి అవుతుంది. దీనికి బదులు మూడు నుంచి నాలుగు నెలల్లోగా సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ద్వారా ఈక్విటీలకు కేటాయించుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం ఉన్న మార్గాలు ఏవి? – నారాయణ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని ఉండాలి. అప్పుడే ఆ మొత్తం నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసర సమయాల్లో పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకునే విధంగా లిక్విడిటీ ఉండాలని కోరుకుంటారు. సీనియర్ సిటిజన్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్ లేదా మరొకటి కావచ్చు. ఏటా ఎంత మొత్తం పెట్టుబడి నుంచి కావాలో స్పష్టతకు రావాలి. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే కనుక ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కు వ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకా అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 30–40% చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలను పరిశీలించాలి. ఎస్సీఎస్ఎస్, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కొంత మొత్తాన్ని అధిక నాణ్య తతో కూడిన డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 30–40% మేర ఉండేలా ఏడాదికోసారి అస్సెట్ (పెట్టుబడులు)రీబ్యాలన్స్ చేసుకోవాలి. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆమె టార్చర్ కోసం పురుషుల క్యూ.. ఎందుకంటే..
మనిషి ఎంత విచిత్రమైన జీవి అంటే ఒక్కొక్కరి భావోద్వేగాలు ఒక్కో విధంగా ఉంటాయి. వాటిని ఎదుటివారు అర్థం చేసుకోలేరు. ఒకరికి నచ్చని అనుభవం మరొకరికి నచ్చవచ్చు. కొందరు పురుషులు తమ భాగస్వామితో మాత్రమే రొమాన్స్ చేయాలని అనుకుంటారు. మరికొందరు రొమాన్స్లో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. అలాంటి తాపత్రయం కలిగిన పురుషులకు కావాల్సినంత టార్చర్ చూపిస్తూ, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తోంది ఇంగ్లండ్ కు చెందిన ఓ అమ్మడు. ఆమె పురుషులపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుంది. వారిని తీవ్రంగా వేధిస్తుంది. ఇందుకోసం వారి నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుంది. సర్రేలోని ఫర్న్హామ్ నివాసి అయిన అరి మక్టాన్స్ పురుషులను కొట్టడం ద్వారా డబ్బు సంపాదిస్తూ వెనకేసుకుంటోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలా డబ్బులిచ్చి కొట్టించుకునేందుకు పురుష పుంగవులు ఆమె ముందు బారులు తీరుతున్నారు. డైలీ మెయిల్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె ఒక డామినేట్రిక్స్ అంటే శృంగార సమయంలో పురుషులను వేధించే మహిళ. ఆమె ఒక గంటకు 17 వేల రూపాయలు సంపాదిస్తుంది. తిట్టడం మొదలుకొని తోలు బెల్టుతో కొట్టడం వరకు.. ఇలా వివిధ పనులు చేయించుకునే మగవారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంది. తాను చాలా మంది వివాహాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడినట్లు ఆ మహిళ తెలిపింది. చాలా మంది పురుషులు తమ భాగస్వామి వ్యక్తం చేసే ప్రేమలో హింస ఉందనుకుంటారని, అందుకే వారు భార్యకు దూరంగా ఉంటారని ఆమె పేర్కొంది. అయితే తాను ప్రేమలోని హింసను వారికి అర్థమయ్యేలా చెప్పి, పలువురి కాపురాలు నిలబెడుతున్నానని ఆమె తెలిపింది. కాగా ఆమె తన 19 సంవత్సరాల వయసు నుంచే ఈ పనిని ప్రారంభించింది. ఆమెకు 25 ఏళ్లు వచ్చేసరికి పూర్తి స్థాయి డామినేట్రిక్స్ గా మారింది. ఆమె ఒక నెలకు దాదాపు 20 మంది పురుషుల డిమాండ్లను నెరవేరుస్తుందని సమాచారం. ఇలా వచ్చేవారితో ఆమె ఎప్పుడూ శారీరక సంబంధాలు పెట్టుకోదు. వారి వింత కోరికలను మాత్రమే నెరవేరుస్తుంది. ఆమె కెరీర్కు మద్దతు పలికే బాయ్ఫ్రెండ్ కూడా ఆమెకు ఉన్నాడు. ఆమె తన పాదాలతో పురుషుల ముఖాన్ని తన్నుతుంటుంది. ఈ తన్నుల కోసం పురుషులు ఆమె దగ్గరికి వస్తుంటారు. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
ఈ టెక్నిక్ పాటిస్తే.. ఈజీగా డబ్బు సంపాదించగలరు!
పొద్దిన లేచిన దగ్గర నుంచి డబ్బు లేకుండా ఒక్క పని కూడా కాదు. దీంతో అందరూ డబ్బు సంపాదించే మార్గాలను తెగ అన్వేషిస్తుంటారు. ఎలా సంపాదించాలి. ఏవిధంగా ఈజీగా సంపాదించగలం అని రకరకాలు ఆలోచించేస్తుంటారు. ఆ క్రమంలో వారికి తెలియకుండానే ఒత్తిడికి గురవ్వడం, నిద్రలేమి తదితర సమస్యల బారిన పడతారు. పోనీ అంతలా ట్రై చేసినా.. సక్సెస్ అయ్యేవారు కొందరే. చాలామంది రీచ్ అవ్వరు. అలాంటివాళ్లు ఈ టెక్నీక్ ఫాలో అయితే ఎక్కువ డబ్బు సంపాదించడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉండగలరు. జపనీస్ వాళ్లు ఈ టెక్నిక్నే ఫాలో అవుతారట. ఇంతకీ ఆ టెక్నిక్ ఏంటంటే.. "అరిగాటో".. అంటే.. జపనీస్ భాషలో "ధన్యవాదాలు" అని అర్థం. ఏంటిది? డబ్బు సంపాదించడానికి "ధన్యవాదాలకు" సంబంధం ఏంటీ అని కొట్టిపడేయొద్దు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా సంతృప్తి అనేది ఉండదు. ఇప్పుడు ఉన్న ట్రెండ్కి.. మనకు, మన కుటుంబ అవసరాలు.. రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. అందుకోసం రెక్కలు ముక్కలు చేసుకుని పడరాని పాట్లు పడతాం. పోనీ అంతలా కష్టపడ్డా.. సంతోషంగా మాత్రం ఉండం. నిరాశ నిస్ప్రుహలకు లోనే మళ్లీ జీరో పొజిషన్కి వచ్చే ప్రమాదం లేకపోలేదు. దీంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా చేజేతులారా తెలియకుండానే నాశనం చేసుకుంటాం. అందువల్ల ముందు పాజిటివ్ దృక్పథాన్ని అనుసరిస్తూ దాన్నే మననం చేస్తే డబ్బులు హాయిగా సంపాదించడమే కాదు, కొత్త కొత్త ఐడియాలు తట్టి మరింత సంపాదించే అవకాశాలు రావచ్చు. ఇంతకీ ధన్యవాదాలు అంటున్నారు.. ఎవ్వరికి చెప్పాలనే కదా!. మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకు? అనే కదా..నిజానికి మనం సంపాదించే డబ్బు రెండు రకాలుగా ఉంటుంది. (1) సంతోషాన్నిచ్చే డబ్బు, (2) ఎలాంటి సంతోషం ఇవ్వని డబ్బు. సంతోషాన్నిచ్చే డబ్బు అంటే.. మీరు ఆనందించే వస్తువులను కొనడానికి ఉపయోగించే డబ్బు లేదా మీరు ప్రేమించే వ్యక్తులకు వినియోగించే డబ్బు అన్నమాట. ఇందులోకి మంచి పనులకు ఆనందంగా ఎంతకొంత కేటాయించేది కూడా వస్తుంది. ఇక్కడ మీరు సంతోషంగా వినియోగిస్తే అది విశ్వంలోకి చేరి మీకు తెలియకుండానే అధిక డబ్బు తిరిగి పొందే అవకాశం వస్తుంది. ఎలాంటి సంతోషం ఇవ్వని డబ్బు.. డబ్బుకి ఎలాంటి విలువ ఇవ్వకుండా ఇష్టానుసారం ఖర్చు చేసేది. నచ్చని ఉద్యోగం చేస్తూ.. సంపాదించేది. బిల్లులు లేదా అప్పులు చెల్లించడం కోసం భారంగా చేసేది. కుటుంబాన్ని చూసుకోవాలి కాబట్టి తప్పక చేసేది. ఇది మీకు తెలియకుండానే డబ్బుపై వ్యతిరేకతను విశ్వంలోకి పంపుతుంది తద్వారా మనఃశాంతి కోల్పోతాం. అది మన ప్రేరణతోనే జరుగుతోందని గమనించం అంతే. మనసతత్వ నిపుణులు కూడా చెప్పేది ఇదే. పాజిటివ్ మైండ్తో ఉంటే దేన్నైనా సునాయాసంగా సాధించగలరని పదే పదే చెబుతుంటారు. అందుకే ముందు మీరు సంపాదించేది ఎంతైనా సరే.. చాలా చిన్న మొత్తం డబ్బైనా వస్తున్నందుకు ధన్యావాదాలు చెప్పుకోండి అంటే ఇక్కడ అర్థం దేవుడిన నమ్మే వాళ్ల అయితే దేవుడికి లేదా ఇంతైనా సంపాదించగలుగుతున్నా అని మీకు మీరు కృతజ్క్షతలు చెప్పుకుని సంతృప్తిగా ఫీలవ్వండి. ఎంత వచ్చినా దాన్ని మీరు కరెక్ట్గా ఖర్చుపెట్టడాన్ని గ్రేట్గా భావించండి. ఆ డబ్బును సరైన రీతిలో ఖర్చు బెట్టి బతకగలుగుతున్నందుకు హ్యపీగా ఫీలవ్వండి. ఆ డబ్బును వినియోగిస్తున్న సంతోషంగానే భావించండి తప్ప ఏదో సంపాదిస్తున్నానే లే అన్నట్లు మీకు మీరుగా మిమ్మిల్ని తక్కువ చేసుకోవద్దు. ఇలా పాజిటివిటిని మీ మనుసు తరంగాల ద్వారా విశ్వంలోకి పంపితే అదే మీకు తిరిగి అధిక డబ్బును ఏదో ఒక రూపంలోనో లేక మంచి ఆలోచనల రూపంలోనో అందిస్తుంది. మంచిగా డబ్బు సంపాదించడమే కాదు అధికంగా కూడా ఆర్జించగలుగుతారు కూడా. అందుకనే పెద్దలు చెప్పేది మీ మీద మీరు నమ్మకంతో చేసే ఏ పనైనా సఫలమే గాని విఫలం కాదని. ఇందులో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించి సర్వత్రా పాజిటివ్ మైండ్ని నింపి మంచి విజయాలు అందుకోండి. మంచైనా చెడైయినా అంతా మన మంచికే అని ఊరికే అనలేదు పెద్దలు. ఇలా భావిస్తే మనం ముందుగా పోగల ధైర్యం లభిస్తుంది. సో ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు ఎంత వచ్చినా మ్యానేజ్ చేసి హాయిగా బతకగలుగుతున్నాం అన్నదే ముఖ్యం. (చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!) -
నెలకు 50 లక్షలు సంపాదిస్తున్న ఆయా..!
-
ఏటా 20 ఈఎల్స్ వాడాల్సిందే!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఏడాదిలో 20 ఎర్న్›్డ లీవులు(ఈఎల్స్–ఆర్జిత సెలవులు) తప్పనిసరిగా వాడుకోవలసి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇకపై వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 30 ఈఎల్లు ఉంటాయి. ఇకపై ఏడాదికి పది ఈఎల్స్ మాత్రమే తర్వాతి సంవత్సరం సెలవుల్లో కలుస్తాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయనుంది. అంటే మిగతా 20 సెలవులను వాడుకోకుంటే వృథా అవుతాయి. ప్రభుత్వ బ్యాంకులు గత ఏడాది చివరి నుంచే ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి. తమ సిబ్బందిని కచ్చితంగా పది రోజులు సెలవుపై పంపుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 3.5 కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల భత్యాల చెల్లింపు కోసం దాదాపు రూ.63,232 కోట్లు కేటాయించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement